18న నోటిఫికేషన్, నామినేషన్ల స్వీకరణ: కలెక్టర్
లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 18న నోటిఫికేషన్ జారీచేయడంతో పాటు అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన తెలిపారు.
మాట్లాడుతున్న కలెక్టర్ దాసరి హరిచందన, చిత్రంలో ఎస్పీ చందనా దీప్తి, తదితరులు
నల్గొండ సంక్షేమం, న్యూస్టుడే: లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 18న నోటిఫికేషన్ జారీచేయడంతో పాటు అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన తెలిపారు. కలెక్టరేట్లో మంగళవారం ఎస్పీ చందనా దీప్తితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కలెక్టరేట్లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తామని చెప్పారు. పోటీచేసే అభ్యర్థులు ఫారం 2ఏ లో అన్ని వివరాలు పూరించి నామినేషన్ దాఖలు చేయాలన్నారు. ఒక అభ్యర్థి గరిష్ఠంగా నాలుగు సెట్ల వరకు నామినేషన్ పత్రాలు దాఖలు చేయవచ్చని తెలిపారు. పోటీచేయాలనుకునే జనరల్ అభ్యర్థులు రూ.25వేలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు రూ.12,500 సెక్యూరిటీ డిపాజిట్ సమర్పించాలని చెప్పారు. గుర్తింపు పొందిన రాజకీయపార్టీల అభ్యర్థులను ఒకరు ప్రతిపాదిస్తే సరిపోతుందని, గుర్తింపు పొందని రాజకీయపార్టీలు, స్వతంత్ర అభ్యర్థులను పది మంది ప్రతిపాదించాల్సి ఉంటుందని తెలిపారు. నామినేషన్తో పాటు ఫారం 26 ద్వారా అఫిడవిట్ దాఖలు చేయాలని, అందులో విద్యార్హతలు, కేసులు తదితర అంశాలు తప్పనిసరిగా పొందుపరచాలని స్పష్టం చేశారు. 25 ఏళ్ల వయసు కలిగి భారతీయుడై ఉండాలని, ఏదైనా నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉండాలని అన్నారు. సంబంధిత రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువపత్రం తీసుకురావాలని వివరించారు. నామినేషన్ వేసే కంటే ముందే ఏదేని జాతీయ బ్యాంకులో ఖాతా తెరవాలని సూచించారు. సెలవు దినాల్లో నామినేషన్ల స్వీకరణ ఉండదని చెప్పారు.
17,22521 మంది ఓటర్లు..
నల్గొండ లోక్సభ నియోజకవర్గంలో 2061 పోలింగ్ స్టేషన్లలో 17,22,521 మంది ఓటర్లు ఉన్నారని, వీరిలో 18-19 ఏళ్ల వయసు గ్రూపు వాళ్లు 60,116 మంది ఉండగా, 85 ఏళ్లు నిండిన సీనియర్ సిటిజన్స్ 9587 మంది, పీడబ్ల్యూడీ ఓటర్లు 33865 మంది, 736 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారని తెలిపారు.
రూ. 9.18 కోట్లు సీజ్: ఎస్పీ
ఎస్పీ చందన దీప్తి మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో రూ.9.18 కోట్లు విలువగల నగదు, మద్యం, ఆభరణాలు సీజ్ చేశామని చెప్పారు. 184 కేసుల్లో నగదు ఆభరణాలు వంటివి సీజ్ చేశామని తెలిపారు. ఏ చిన్న అనుమానం వచ్చినా తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. స్పెషల్ కలెక్టర్ నటరాజ్, మీడియా నోడల్ అధికారి కోటేశ్వరరావు, కేంద్ర ప్రభుత్వ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ కోటేశ్వరరావు, సమాచారశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
నల్గొండ సంక్షేమం: నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు నియమించిన సిబ్బంది జాగ్రత్తగా విధులు నిర్వహించాలని దాసరి హరిచందన ఆదేశించారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు నియమించిన అధికారులు, సిబ్బందితో మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పొరపాట్లకు తావులేకుండా పూర్తిచేయాలన్నారు. పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రత్యేకించి హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రతి రోజు ఎన్నికల సంఘానికి పంపించే నివేదికలు జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కంట్రోల్రూం, ఎన్నికల అనుమతులను ఇచ్చే సువిధ విభాగం, ఎన్నికల వ్యయనిర్వహణకు ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ విభాగాలను తనిఖీ చేసి పనితీరును పరిశీలించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, డీఆర్వో రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కారు.. కసరత్తు
[ 30-04-2024]
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి నైరాశ్యంలో ఉన్న పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కల్పించడం, ఉమ్మడి నల్గొండలోని నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాల్లో సత్తా చాటేలా ప్రతిపక్ష భారాస వ్యూహరచన చేస్తోంది. -
ముందస్తుకు మస్తు స్పందన
[ 30-04-2024]
పట్టణాల్లో ముందస్తు ఆస్తి పన్ను చెల్లింపులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అడ్వాన్స్గా ఆస్తి పన్ను చెల్లిస్తే ఐదు శాతం రాయితీ ప్రభుత్వం కల్పించడంతో ఇంటి యజమానులు ముందుకొచ్చి చెల్లిస్తున్నారు. -
తేలిన బరి..!
[ 30-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలోని నల్గొండ, భువనగిరి స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఎంత మంది అనేది తేలింది. -
పోటెత్తాలి.. పౌరుడా..!
[ 30-04-2024]
మిత్రులతో కబుర్లు చెబుతూ గంటల సమయాన్ని వృథా చేస్తుంటాం. మనకు సంబంధం లేని, ఎలాంటి ఉపయోగం లేని ఇతరుల విషయాల్లో కలగజేసుకుని మరీ వివరాలను ఆరా తీస్తుంటాం. -
కార్మికులకు కలిసొచ్చే కాలమే..!
[ 30-04-2024]
‘మూఢం’ వచ్చేసింది.. పెళ్లిళ్లు, పేరంటాళ్లు, శుభకార్యాలకు అంతరాయం ఏర్పడింది. గ్రహాల స్థితి సరిగా లేని సమయాన్ని ‘మూఢం’గా పండితులు పరిగణిస్తారు. -
ఒకేసారి గెలిచిన ఇద్దరు యోధులు
[ 30-04-2024]
1991లో నిర్వహించిన లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. నల్గొండ, మిర్యాలగూడ నియోజకవర్గాల నుంచి తెలంగాణ సాయుధ పోరాట యోధులు బొమ్మగాని ధర్మభిక్షం, భీమిరెడ్డి నర్సింహారెడ్డిలు ఎంపీలుగా ఎన్నికయ్యారు. -
పోలింగ్ నమోదుపై బెంగ
[ 30-04-2024]
లోక్సభ ఎన్నికల్లో నమోదయ్యే పోలింగ్ శాతంపై అభ్యర్థుల విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంది. -
ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం!
[ 30-04-2024]
ఓటర్లకు అసెంబ్లీ ఎన్నికలపై ఉన్న ఆసక్తి లోక్సభ ఎన్నికలకు వచ్చే సరికి సడలిపోతోంది. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లోని ఓటర్లు, ముఖ్యంగా యువత ఓటు వేసేందుకు ముందుకు రాకపోవడం ఆందోళన కలిగించే అంశం. -
కొల్లూరులో వీరగత్తె విగ్రహం గుర్తింపు
[ 30-04-2024]
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొల్లూరు గ్రామ శివారులోని పాటిగడ్డ శివాలయం, వైష్ణవ ఆలయాల మధ్య అరుదైన, అపురూపమైన వీరగత్తె విగ్రహాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కుండె గణేష్ గుర్తించారు. -
గ్యాస్ కట్టర్తో ఏటీఎంలో చోరీకి యత్నం
[ 30-04-2024]
గ్యాస్ కట్టర్ సహాయంతో ఏటీఎంలో ఉన్న నగదును చోరీ చేసే క్రమంలో నిప్పు రవ్వలు రాజుకొని రూ.8.20 లక్షల నగదు దగ్ధమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
తొందర ఉందా.. అయితే అక్కడికి వెళ్లండి..!
[ 30-04-2024]
స్కానింగ్ చేయాలా.. తొందర ఉందా.. పక్కనే ప్రైవేట్ ల్యాబ్ ఉంది.. అక్కడికి వెళ్లండి.. అంటూ భువనగిరిలోని జిల్లా కేంద్ర ఆసుపత్రికి స్కానింగ్ కోసం వచ్చిన గర్భిణులకు చెబుతూ డబ్బులు దండుకుంటున్నాడు ఓ ఉద్యోగి. -
ఎన్నికల ఖర్చు తప్పనిసరిగా నమోదు చేయాలి
[ 30-04-2024]
అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చు తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హన్మంత్ కె.జెండగే తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల జనరల్ అబ్జర్వర్ రాబర్ట్సింగ్ క్షేత్రమయుమ్, -
సర్కారు బడి.. గురుకుల ఒడి
[ 30-04-2024]
ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల.. గురుకుల ప్రవేశాలకు చిరునామాగా మారింది. ఇక్కడ చదివే ప్రతి పది మంది చిన్నారుల్లో ఒక్కరికి కచ్చితంగా గురుకుల పాఠశాలలో ప్రవేశం లభిస్తోంది. -
మతిస్థిమితం లేని బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు
[ 30-04-2024]
మతిస్థిమితం లేని బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడికి న్యాయస్థానం ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.25,000 జరిమానా విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ 60వేల ఓట్లు ఎవరివి?.. పాతబస్తీలో ఆచూకీ దొరకని ఓటర్లు
-
అన్నా క్షమించు... ఈ లోకంలో బతకలేకున్నా
-
ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొస్తాం: కర్ణాటక హోంమంత్రి
-
‘కాల్చి పడేస్తా.. ఎవడొస్తాడో రమ్మను’.. సస్పెండైన ఓ ఎస్సై వీరంగం
-
మనవడిని కొట్టిందని.. కోడలిని హతమార్చిన మామ
-
పవన్ రోడ్షో.. 6 గంటలు.. 40 కి.మీ.