గురుకులాల్లో గందరగోళం!
భువనగిరిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల
భువనగిరి పట్టణం, న్యూస్టుడే: సాంఘిక సంక్షేమ గురుకులాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో 28 గురుకులాలు, ఐదు డిగ్రీ కళాశాలలు పనిచేస్తున్నాయి. ఆయా పాఠశాలలు, కళాశాలల్లో వేలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిచేందుకు, వారి సంక్షేమానికి ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేసి సదుపాయాలు కల్పిస్తున్నప్పటికి సంబంధిత ఉద్యోగులు విధుల్లో నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. బోధన, బోధనేతర సిబ్బంది మధ్య సమన్వయ లోపంతో పలు సందర్భాల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటున్నప్పటికి వెలుగులోకి రావడం లేదు. భువనగిరి గురుకులంలో చోటుచేసుకున్న విద్యార్థుల అస్వస్థత ఘటన రెండు రోజుల తర్వాత వెలుగులోకి రావడం గమనార్హం. సిబ్బంది సమన్వయలోపం, నిర్లక్ష్యంతోనే భువనగిరి గురుకుల పాఠశాల విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు ప్రాథమికంగా విచారణలో తేలడంతో ప్రిన్సిపల్ శ్రీరాముల శ్రీనివాస్ను సంస్థ కార్యదర్శి సీతాలక్ష్మి సస్పెండ్ చేయడం పైఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. సంబంధిత ఉద్యోగుల నిర్లక్ష్యం కారణంగానే భువనగిరి గురుకుల పాఠశాలలోని విద్యార్థి ప్రశాంత్ మరణంతో పాటు, మరో 29 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడం జరిగింది.
నిర్వహణ లోపాలు ఇలా..
యాదాద్రి భువనగిరిలో ఏడు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. బీబీనగర్లో ఆర్మీ ఫోర్సెస్ డిగ్రీ కళాశాల ఉంది. పాఠశాల, కళాశాలల ఏర్పాటుకు జిల్లాలో వసతి లభించని కారణంగా పొరుగు జిల్లాలోని జగద్గిరిగుట్టలో ఒక పాఠశాలను, శామీర్పేటలో డిగ్రీ కళాశాలను, ఘట్కేసర్ పరిసరాల్లో మరో కళాశాలను నిర్వహిస్తున్నారు. - ప్రతి ఏటా పాఠశాలల్లోని ఐదు నుంచి పదో తరగతి వరకు 640 మంది విద్యార్థులు, ఇంటర్మీడియట్లో మరో 240 మందికి పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. డిగ్రీ కళాశాలల్లో కోర్సుల వారీగా ప్రవేశాలు కల్పిస్తున్నారు. నల్గొండ జిల్లాలో 12 పాఠశాలల్లో 7010 మంది విద్యార్థులు, ఒక డిగ్రీ కళాశాలలో 710 మంది విద్యార్థులు, సూర్యాపేట జిల్లాలోని ఎనిమిది పాఠశాలు, ఒక డిగ్రీ కళాశాలలో 5007 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.
వారం రోజుల పాటు మెనూ ఇలా...
ఉదయం: పాలు, బూస్ట్
ఉదయం: రోజు ఏదో ఒక అల్పాహారం
మధ్యాహ్నం: రైస్, కర్రీ, సాంబర్, పెరుగు
సాయంత్రం: స్నాక్స్ లేదా పండ్లు
రాత్రి: రైస్, కర్రీ, సాంబర్, పెరుగు
మాంసాహారం: వారంలో మూడు రోజులు చికెన్, ఒక రోజు మటన్తో భోజనం.
అత్యధిక గురుకులాల్లో డార్మిటరీలు, వంటశాలలు, పరిసరాల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. విద్యార్థులకు సీజనల్ వ్యాధులతో పాటు ఇతర సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. మెనూ ప్రకారం భోజనం అందించే ప్రక్రియ అంతంతగానే కొనసాగుతోంది. టెండర్లు దక్కించుకున్న కూరగాయలు, పాలు, వంట సరకులు, మాంసాహారం సరఫరాదారులు ఎవరికి వారుగా నెలనెలా సరఫరా చేస్తున్నారు. దీనిపై పర్యవేక్షణ కొరవడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
భోజనం తయారీకి క్యాటరింగ్ గుత్తేదారును ప్రభుత్వం నియమించింది. కేర్ టేకర్ నుంచి సరకులు తీసుకుని నిత్యం గుత్తేదారు భోజనం తయారు చేసి విద్యార్థులకు వడ్డిస్తుండటం గమనార్హం. కేర్ టేకర్ కింది ఉద్యోగికి బాధ్యతలు అప్పగిస్తుండటం, నెలకోసారి కేర్ టేకర్ను మారుస్తుండటం, హౌస్ కీపింగ్ కమిటీ, మెస్ కమిటీల మధ్య సమన్వయలోపం, విధుల పట్ల నిర్లక్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
వండిన భోజనం బాధ్యులు రుచి చూడకపోవడంతో ఆహారంలో నాణ్యత లోపిస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థులపై రోజువారి పర్యవేక్షణ లోపించింది. బయటి ఆహార పదార్థాలు తీసుకుని భుజించడం గమనార్హం. వీరిపై ప్రిన్సిపల్, ఆర్సీవో అధికారులు పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుండటం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కారు.. కసరత్తు
[ 30-04-2024]
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి నైరాశ్యంలో ఉన్న పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కల్పించడం, ఉమ్మడి నల్గొండలోని నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాల్లో సత్తా చాటేలా ప్రతిపక్ష భారాస వ్యూహరచన చేస్తోంది. -
ముందస్తుకు మస్తు స్పందన
[ 30-04-2024]
పట్టణాల్లో ముందస్తు ఆస్తి పన్ను చెల్లింపులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అడ్వాన్స్గా ఆస్తి పన్ను చెల్లిస్తే ఐదు శాతం రాయితీ ప్రభుత్వం కల్పించడంతో ఇంటి యజమానులు ముందుకొచ్చి చెల్లిస్తున్నారు. -
తేలిన బరి..!
[ 30-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలోని నల్గొండ, భువనగిరి స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఎంత మంది అనేది తేలింది. -
పోటెత్తాలి.. పౌరుడా..!
[ 30-04-2024]
మిత్రులతో కబుర్లు చెబుతూ గంటల సమయాన్ని వృథా చేస్తుంటాం. మనకు సంబంధం లేని, ఎలాంటి ఉపయోగం లేని ఇతరుల విషయాల్లో కలగజేసుకుని మరీ వివరాలను ఆరా తీస్తుంటాం. -
కార్మికులకు కలిసొచ్చే కాలమే..!
[ 30-04-2024]
‘మూఢం’ వచ్చేసింది.. పెళ్లిళ్లు, పేరంటాళ్లు, శుభకార్యాలకు అంతరాయం ఏర్పడింది. గ్రహాల స్థితి సరిగా లేని సమయాన్ని ‘మూఢం’గా పండితులు పరిగణిస్తారు. -
ఒకేసారి గెలిచిన ఇద్దరు యోధులు
[ 30-04-2024]
1991లో నిర్వహించిన లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. నల్గొండ, మిర్యాలగూడ నియోజకవర్గాల నుంచి తెలంగాణ సాయుధ పోరాట యోధులు బొమ్మగాని ధర్మభిక్షం, భీమిరెడ్డి నర్సింహారెడ్డిలు ఎంపీలుగా ఎన్నికయ్యారు. -
పోలింగ్ నమోదుపై బెంగ
[ 30-04-2024]
లోక్సభ ఎన్నికల్లో నమోదయ్యే పోలింగ్ శాతంపై అభ్యర్థుల విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంది. -
ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం!
[ 30-04-2024]
ఓటర్లకు అసెంబ్లీ ఎన్నికలపై ఉన్న ఆసక్తి లోక్సభ ఎన్నికలకు వచ్చే సరికి సడలిపోతోంది. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లోని ఓటర్లు, ముఖ్యంగా యువత ఓటు వేసేందుకు ముందుకు రాకపోవడం ఆందోళన కలిగించే అంశం. -
కొల్లూరులో వీరగత్తె విగ్రహం గుర్తింపు
[ 30-04-2024]
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొల్లూరు గ్రామ శివారులోని పాటిగడ్డ శివాలయం, వైష్ణవ ఆలయాల మధ్య అరుదైన, అపురూపమైన వీరగత్తె విగ్రహాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కుండె గణేష్ గుర్తించారు. -
గ్యాస్ కట్టర్తో ఏటీఎంలో చోరీకి యత్నం
[ 30-04-2024]
గ్యాస్ కట్టర్ సహాయంతో ఏటీఎంలో ఉన్న నగదును చోరీ చేసే క్రమంలో నిప్పు రవ్వలు రాజుకొని రూ.8.20 లక్షల నగదు దగ్ధమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
తొందర ఉందా.. అయితే అక్కడికి వెళ్లండి..!
[ 30-04-2024]
స్కానింగ్ చేయాలా.. తొందర ఉందా.. పక్కనే ప్రైవేట్ ల్యాబ్ ఉంది.. అక్కడికి వెళ్లండి.. అంటూ భువనగిరిలోని జిల్లా కేంద్ర ఆసుపత్రికి స్కానింగ్ కోసం వచ్చిన గర్భిణులకు చెబుతూ డబ్బులు దండుకుంటున్నాడు ఓ ఉద్యోగి. -
ఎన్నికల ఖర్చు తప్పనిసరిగా నమోదు చేయాలి
[ 30-04-2024]
అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చు తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హన్మంత్ కె.జెండగే తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల జనరల్ అబ్జర్వర్ రాబర్ట్సింగ్ క్షేత్రమయుమ్, -
సర్కారు బడి.. గురుకుల ఒడి
[ 30-04-2024]
ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల.. గురుకుల ప్రవేశాలకు చిరునామాగా మారింది. ఇక్కడ చదివే ప్రతి పది మంది చిన్నారుల్లో ఒక్కరికి కచ్చితంగా గురుకుల పాఠశాలలో ప్రవేశం లభిస్తోంది. -
మతిస్థిమితం లేని బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు
[ 30-04-2024]
మతిస్థిమితం లేని బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడికి న్యాయస్థానం ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.25,000 జరిమానా విధించింది.