logo

అవకాశవాదులకు గుణపాఠం చెప్పాలి: జూలకంటి

భువనగిరి లోక్‌సభ స్థానంలో పార్టీలు ఫిరాయించే అవకాశవాదులు, ధన బలంతో గెలవాలనుకునే వారికి ప్రజలు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి కోరారు.

Published : 18 Apr 2024 03:04 IST

నకిరేకల్‌, న్యూస్‌టుడే: భువనగిరి లోక్‌సభ స్థానంలో పార్టీలు ఫిరాయించే అవకాశవాదులు, ధన బలంతో గెలవాలనుకునే వారికి ప్రజలు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి కోరారు. స్థానిక ఎన్‌ఆర్‌ భవన్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మూడున్నర దశాబ్దాలుగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేస్తున్న  భువనగిరి సీపీఎం అభ్యర్థి ఎండీ. జహంగీర్‌ను లోక్‌సభకు పంపాలన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ గతంలో జరిగిన తప్పులను దిద్దుకోకుండా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. శుక్రవారం తమ పార్టీ అభ్యర్థి జహంగీర్‌ నామినేషన్‌ కార్యక్రమానికి పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరవుతున్నారని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తుమ్మల వీరారెడ్డి, జిల్లా కార్యదర్శి సుధాకర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు ప్రమీల, చినవెంకులు, వెంకట్‌గౌడ్‌, వెంకటేశ్వర్లు, కృష్ణ, తాజేశ్వర్‌, లూర్దుమారయ్య, నాగమణి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని