లక్షణాలున్నా పరీక్షలకు రావట్లే..
కొవిడ్ లక్షణాలున్న చాలామంది పరీక్షలకు రావడం లేదు. సోమవారం 412 మందికి నిర్ధారణ పరీక్షలు చేయగా 80 పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది. నిర్లక్ష్యంగా సంచరిస్తుండటంతోనే కేసులు పెరుగుతున్నాయని వైద్యాధికారులు చెబుతున్నారు.
తాజాగా 80 మందికి పాజిటివ్
న్యూస్టుడే, కామారెడ్డి వైద్యవిభాగం
జిల్లాకేంద్రంలో ఇంటికొచ్చి టీకా ఇస్తున్న వైద్య సిబ్బంది
కొవిడ్ లక్షణాలున్న చాలామంది పరీక్షలకు రావడం లేదు. సోమవారం 412 మందికి నిర్ధారణ పరీక్షలు చేయగా 80 పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది. నిర్లక్ష్యంగా సంచరిస్తుండటంతోనే కేసులు పెరుగుతున్నాయని వైద్యాధికారులు చెబుతున్నారు. జిల్లాకేంద్రంలో, సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువ మంది వైరస్ బారినపడుతున్నారు. మిగతా ప్రాంతాల్లో కొద్దోగొప్పో కొవిడ్ ఆంక్షలు అమలవుతుండగా.. ఇక్కడ ఎలాంటి చర్యలు కనిపించడం లేదు. మహారాష్ట్ర నుంచి బస్సులు, రైళ్లలో వస్తున్నారు. మాస్క్, భౌతికదూరం నిబంధనలు పాటించడం లేదు. గతేడాది పురపాలికల్లో మాస్కులేని వారికి రూ.5.2 లక్షల జరిమానా వేశారు. తాజాగా అలాంటి కఠిన చర్యలేవీ కనిపించడం లేదు.
ఇళ్లలోనే కోలుకుంటున్నారు
ప్రస్తుతం వందలాది మందికి పాజిటివ్ వస్తున్నా ఇళ్లలోనే చికిత్స పొంది కోలుకుంటున్నారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు మూడు రోజులే ఉంటున్నాయని వైద్యాధికారులు చెబుతున్నారు. ఆసుపత్రుల్లో చేరే పరిస్థితులు లేవు. ప్రాణానికి ముప్పేమీ లేదని పేర్కొంటున్నారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తగ్గింది. లక్షణాలు ఉన్నవారు నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
నెగెటివ్ వచ్చినా..
వారం రోజులుగా ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో అత్యధిక పాజిటివ్లు వస్తున్నాయి. తాజాగా జిల్లా ఆసుపత్రిలో 36 మందికి పరీక్షలు చేయగా 23 మందికి కొవిడ్ తేలింది. లక్షణాలుండి ర్యాపిడ్ పరీక్షల్లో నెగెటివ్ వస్తే ఆర్టీపీసీఆర్కు రావాలని వైద్యులు సూచిస్తున్నారు.
కలెక్టరేట్లో కలకలం.. కామారెడ్డి కలెక్టరేట్లో పని చేసే ఆయా శాఖల ఉద్యోగులు, సిబ్బంది 12 మంది కొవిడ్ బారినపడ్డారు. మండలాల్లోని పోలీసు సిబ్బందికి వైరస్ సోకింది. వివిధ ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే అధికారులు, సిబ్బందికి వైరస్ ముప్పు అధికంగా ఉంటుందని వైద్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
6,099 మందికి వ్యాక్సినేషన్.. కామారెడ్డి పట్టణం: జిల్లావ్యాప్తంగా సోమవారం 6,099 మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది. కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో 340, దేవునిపల్లి 126, రాజీవ్నగర్ 152, భిక్కనూరు 319, డోంగ్లీ 129, బాన్సువాడ 153, నిజాంసాగర్ 402, రాజంపేట 126, మత్తమాల 109, పుల్కల్ 110, నస్రుల్లాబాద్ 137, అంకోల్ 106, నెమ్లి 167, భిక్కనూరు-బి 115, దుర్కిలో 101 మందికి వేశారు. ఇప్పటి వరకు 11,60,216 డోసులు పంపిణీ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం
[ 07-05-2024]
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం అని కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. -
ఉత్సాహంగా వేసవి శిబిరం
[ 07-05-2024]
ఎండలను లెక్కచేయకుండా విద్యార్థులు వేసవి శిబిరాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కూచిపూడి, భరత నాట్యం, బృంద చర్చల్లో ఎలా రాణించాలి, నైతిక విలువల పెంపు, కర్రసాము తదితర అంశాల్లో శిక్షణ పొందుతున్నారు. -
కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఉంది: ఇందుప్రియ
[ 07-05-2024]
ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఉందని బల్దియా ఛైర్పర్సన్ ఇందు ప్రియ అన్నారు. -
భాజపాను భారీ మెజార్టీతో గెలిపించాలి
[ 07-05-2024]
ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో వివిధ పార్టీ నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు... -
ఇందూరును గుండెల్లో పెట్టుకుంటా
[ 07-05-2024]
‘‘నేను గులాబీ జెండా ఎత్తిన నాడు.. నిజామాబాద్ నా వెంట నిలిచి జిల్లా పరిషత్తును గెలిపించింది. ఉద్యమాన్ని ఆకాశానికి ఎత్తింది. ఈ విషయాన్ని నేను ప్రాణం ఉన్నంత వరకు మరవను. ఈ ప్రాంతాన్ని గుండెల్లో పెట్టుకుంటాను’’ అని భారాస అధినేత కేసీఆర్ అన్నారు. -
అగ్రనేతలు వస్తున్నారు
[ 07-05-2024]
పోలింగ్ తేదీ సమీపిస్తున్న క్రమంలో రాజకీయపార్టీలు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. -
నేతల నోట.. తీయటి మాట
[ 07-05-2024]
నిజాం సుగర్స్.. ఆసియాలోనే అతిపెద్ద చక్కెర కర్మాగారంగా పాఠ్య పుస్తకాల్లో పారిశ్రామిక గుర్తింపు. తెలంగాణకే తలమానికంగా భౌగోళిక ప్రత్యేకత. -
ఆమె నిర్ణయం.. అభ్యర్థి విజయం
[ 07-05-2024]
ఆకాశంలో సగం.. అన్నింటా మేమున్నామంటూ చాటుతున్న మహిళలు పార్లమెంటు ఎన్నికల్లో కీలకం కానున్నారు. -
ఐదంచెల భద్రతా వ్యవస్థ
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఐదంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు కామారెడ్డి ఎస్పీ సీహెచ్ సింధూశర్మ పేర్కొన్నారు. -
‘యూనిఫాం సివిల్ కోడ్ తెచ్చి తీరుతాం’
[ 07-05-2024]
తాము అధికారంలోకి రాగానే యూనిఫామ్ సివిల్ కోడ్ తప్పక అమలుపరుస్తామని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. -
‘వ్యాపారులకు కొమ్ముకాస్తున్న కేంద్ర ప్రభుత్వం’
[ 07-05-2024]
కేంద్ర ప్రభుత్వం రైతులను విస్మరించి పెట్టుబడిదారులు, వ్యాపారులకు కొమ్ము కాస్తుందని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి ఆరోపించారు. -
ఇటు తనిఖీలు.. అటు దోస్త్ నోటిఫికేషన్
[ 07-05-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ కళాశాలలకు 2024-25 విద్యా సంవత్సరానికి ‘యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు’ ఇచ్చేందుకు తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. -
ఆదాయానికి గండి
[ 07-05-2024]
‘కామారెడ్డిలో పాత జాతీయరహదారిపై ఉన్న ఓ వాణిజ్య భవనం నివాసయోగ్య పన్ను పరిధిలో ఉంది. నిర్మాణాల వైశాల్యం ఎక్కువ ఉన్నా తక్కువ చూపారు. నిర్దేశిత కొలతల ఆధారంగా పన్ను చెల్లించడం లేదు. -
మళ్లీ భగ్గుమన్న భానుడు
[ 07-05-2024]
జిల్లాలో మళ్లీ ఎండ జోరందుకుంది. నిప్పుల కొలిమిలా పరిస్థితి మారుతోంది. -
గడపగడపకు బూత్స్థాయి కమిటీలు
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికలు సమీపించడంతో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇప్పటి వరకు నియోజకవర్గ, మండల కేంద్రాలకే పరిమితమైన ప్రచారం ప్రస్తుతం పల్లెలకు చేరింది. -
‘70 ఏళ్లుగా ఓటేస్తున్నా’
[ 07-05-2024]
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది.. ప్రజలే తమ నాయకుడిని ఎన్నుకుంటారు. -
11న సాయంత్రం 5 గంటలకు ప్రచారం సమాప్తం
[ 07-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోటీ చేసే అభ్యర్థులు ప్రచారం హోరెత్తిస్తున్నారు. -
ఎంపీగా ఓటమి.. ఎమ్మెల్యేగా గెలుపు
[ 07-05-2024]
ఉమ్మడి జిల్లాలో కొంతమంది నాయకులు మొదట లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
పవన్ను గెలిపించండి.. అన్నయ్యగా అండగా ఉంటాడు: చిరంజీవి
-
‘దయచేసి మా దేశానికి రండి’.. భారతీయులను వేడుకుంటున్న మాల్దీవులు
-
రూ.10వేల లంచం కేసును లాగితే.. బయటపడిన నోట్ల గుట్టలు..!
-
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
-
వైఎస్ షర్మిలపై కేసు నమోదు
-
పన్నూ కేసులో అమెరికా ఆశలపై నీళ్లుజల్లిన చెక్ రిపబ్లిక్ కోర్టు..!