రేషన్...పరేషాన్
బీర్కూరు మండలంలో 13 రేషన్ దుకాణాలుండగా ఇందులో గతేడాది బయోమెట్రిక్ యంత్రాలు పనిచేయలేదు. సమీపంలోని గ్రామాల్లో మొదటగా పంపిణీ పూర్తి చేసి.. మిగతా చోట్ల మెల్లిగా ఇస్తూ నెట్టుకొచ్చారు. బాన్సువాడ మండలంలోని
బయోమెట్రిక్ యంత్రాల్లో సాంకేతిక సమస్య
పాత బాన్సువాడలో రేషన్ బియ్యం తీసుకుంటున్న లబ్ధిదారులు
బీర్కూరు మండలంలో 13 రేషన్ దుకాణాలుండగా ఇందులో గతేడాది బయోమెట్రిక్ యంత్రాలు పనిచేయలేదు. సమీపంలోని గ్రామాల్లో మొదటగా పంపిణీ పూర్తి చేసి.. మిగతా చోట్ల మెల్లిగా ఇస్తూ నెట్టుకొచ్చారు. బాన్సువాడ మండలంలోని సంగోజిపేట్లో పనిచేయకపోతే సమీపంలోని కొనాపూర్ నుంచి తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇటీవల బాన్సువాడ పట్టణంలోని రెండు పడక గదుల ఇళ్ల కాలనీ, పాతబాన్సువాడ, కొనపూర్లో యంత్రాలు పనిచేయకపోతే మార్చి ఇచ్చారు. ఇలాంటి పరిస్థితులు చాలా గ్రామాల్లో ఉత్పన్నమవుతున్నాయి. దీంతో రేషన్బియ్యం సకాలంలో అందక లబ్ధిదారులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. జిల్లాలో ప్రస్తుతం 100 యంత్రాలకు వివిధ సమస్యలు ఉండగా వీరి వద్ద 20 మాత్రమే ఉండటంతో ఎక్కడ పంపించి సరిచేయాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికైనా కొత్త యంత్రాలు తీసుకొచ్చి సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది.
న్యూస్టుడే, బాన్సువాడ
ఛౌక ధర దుకాణాల్లో అక్రమాలు నిరోదించేందుకు ప్రభుత్వం బయోమెట్రిక్ అమలు చేస్తోంది. 2017 సెప్టెంబరులో ఈ విధానం ప్రారంభించారు. జిల్లాలో 578 రేషన్ దుకాణాలుండగా అన్నింటికి బయోమెట్రిక్ యంత్రాలు సరఫరా చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఇవి సక్రమంగా పనిచేయకపోవడంతో ప్రజలకు సకాలంలో రేషన్ సరకులు పంపిణీ చేయలేకపోతున్నారు. కొందరు రేషన్ డీలర్లు సమీప గ్రామంలోని యాంత్రాలు తీసుకొచ్చి బియ్యం పంపిణీ చేస్తున్నారు. కొందరు థర్డ్పార్టీ వేలిముద్రలతో త్వరగా పంపిణీకి డీలర్లు ప్రయత్నించారు. ఇది అక్రమాలకు తావిస్తోంది. థర్డ్పార్టీ వేలిముద్రలతో వందల క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మాయం చేసిన సంఘటనలు జిల్లాలోని బాన్సువాడ, బీర్కూరు, ఎల్లారెడ్డి మండలాల్లో గతేడాది చోటు చేసుకున్నాయి. బయోమెట్రిక్ యంత్రాలు పనిచేసేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.
పక్క దారికి ప్రణాళికలు
జిల్లాలో మొత్తం 2,48,000 ఆహారభద్రత కార్డులున్నాయి. సుమారు 2,23,000 మందికి ప్రతినెల 9,026.10 మెట్రిక్టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం అందజేస్తోంది. సాంకేతికతను ఉపయోగించుకొని బయోమెట్రిక్ విధానం తీసుకొచ్చి అక్రమాలను అరికట్టాలని ప్రభుత్వం యోచించినా ఇవి ఆగడం లేదు. కొందరు డీలర్లు అక్రమాలకు తెరలేపుతూనే ఉన్నారు. సర్వర్ సమస్య ఉందని కొందరివి, స్థానికంగా లేనివారివి, వేలిముద్రలు రావడం లేదని ఇలాంటి కొందరి బియ్యాన్ని కాజేస్తున్నట్లు ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన పోర్టబులిటీ విధానాన్ని ఆసరా చేసుకొని ఇతర జిల్లాల రేషన్ బియ్యాన్ని జిల్లాలో కొందరు డీలర్లు కాజేసి ఇప్పటికే జైలు పాలయ్యారు. పేదల బియ్యం పక్కదారి పట్టకుండా అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
నిధులు లేవన్నారు..
శశికాంత్రెడ్డి, ఈపాస్యంత్రం జిల్లా మేనేజర్
ఈపాస్ యంత్రాల సమస్యను జిల్లా అధికారులకు తెలియజేశాం. నిధుల కొరత ఉందని చెప్పారు. చెడిపోయిన యంత్రాలను చాలా వరకు బాగు చేస్తున్నాం. కొందరు డీలర్లు సక్రమంగా ఉపయగించకపోవడంతో సమస్య వస్తోంది. రేషన్ పంపిణీ పూర్తయ్యాక మరోసారి వచ్చే వరకు పక్కన పెడుతున్నారు. రెండు, మూడు రోజులకు ఒకసారి ఛార్జింగ్ పెట్టాలి. లేకపోతే బ్యాటరీ సమస్య వచ్చి చెడిపోతున్నాయి. ప్రస్తుతానికి అన్ని కేంద్రాల్లో బియ్యం పంపిణీ జరుగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలి
[ 26-04-2024]
నరేంద్రమోదీ హయాంలో భాజపా ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావాలని ప్రజలు కోరుతున్నారని భాజపా జహీరాబాద్ పార్లమెంట్ ప్రభారీ పెద్దోళ్ల గంగారెడ్డి అన్నారు. -
భారీ మెజార్టీతో గెలిపించాలి
[ 26-04-2024]
ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు నాగిరెడ్డిపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ షట్కర్ను భారీ మెజారిటీతో గెలిపించాలని సూచించారు. -
అభివృద్ధికి పట్టం కట్టాలి
[ 26-04-2024]
నాగిరెడ్డిపేట మండలంలోని రాఘవపల్లి గ్రామంలో గురువారం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బీబీ పాటిల్ గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. -
అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం
[ 26-04-2024]
గ్రామీణ మండలం మల్లారం అటవీ ప్రాంతం దాటిన తర్వాత కొత్తపేట శివారులో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. -
కుంభకోణాలు.. కుటుంబ పార్టీలను ఓడించండి
[ 26-04-2024]
కుంభకోణాలు చేసి దోచుకున్నవారిని.. కుటుంబ పాలన సాగిస్తున్న పార్టీలను ఓడించాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామీ ఓటర్లను కోరారు. -
మాధ్యమిక విద్య మిథ్య
[ 26-04-2024]
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్లో విద్యార్థుల ఉత్తీర్ణత గణనీయంగా తగ్గింది. ప్రభుత్వం బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో చివరిస్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. -
హామీలు నెరవేర్చాలి : పోచారం శ్రీనివాస్రెడ్డి
[ 26-04-2024]
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. -
పనులు జరగాలి.. వెతలు తీరాలి
[ 26-04-2024]
పలు పాఠశాలల్లోని తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. ఏళ్లుగా మరమ్మతులు చేయకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాసిరకం మాంసం విక్రయాలు!
[ 26-04-2024]
బాన్సువాడ పట్టణంలోని మటన్ మార్కెట్కు ఓ వ్యక్తి గాయపడ్డ మేకను గురువారం తీసుకొచ్చారు. దానిని విక్రయించేందుకు ఓ వ్యాపారి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. -
సొంత గూటికి వడ్డేపల్లి సుభాష్రెడ్డి
[ 26-04-2024]
లోక్సభ సాధారణ ఎన్నికల సమయంలో జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగిసింది. ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేయడంతో నామపత్రాల స్వీకరణ ప్రారంభమైంది. -
తల్లిదండ్రులూ.. పిల్లలపై ఓ కన్నేయండి
[ 26-04-2024]
పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నా.. ప్రమాదంలో మృతిచెందినా వారి తల్లిదండ్రులు జీవితాంతం మానసిక క్షోభ అనుభవిస్తారు. -
గురుకులాలు ఉత్తమం.. ఎయిడెడ్లు అథమం
[ 26-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం వెలువడిన ఇంటర్మీడియెట్ ఫలితాల్లో జిల్లా ఏటేటా తనస్థానాన్ని దిగజార్చుకుంటోంది. అందుకు అనేక కారణాలు దోహదం చేస్తున్నాయి. -
పసుపు బోర్డు పేరుతో పరిహాసం : బాజిరెడ్డి
[ 26-04-2024]
గత లోక్సభ ఎన్నికల్లో అబద్ధపు హామీతో గెలిచిన అర్వింద్ పసుపు బోర్డు పేరుతో రైతులతో పరిహాసమాడుతున్నాడని నిజామాబాద్ పార్లమెంటు భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. -
కాంగ్రెస్తోనే సంక్షేమం : జీవన్రెడ్డి
[ 26-04-2024]
: దేశంలో మొదటిసారిగా అన్నదాతలకు పంట రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని ఆ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి అన్నారు. -
ఓటు పోటెత్తేలా!
[ 26-04-2024]
ఓటు హక్కుతోనే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది. వజ్రాయుధాన్ని సమర్థంగా వినియోగిస్తేనే మంచి భవిష్యత్తు కోసం పనిచేసే నాయకులు ఎన్నికవుతారు. -
జేఈఈ మెయిన్స్లో ఇందూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఆధ్వర్యంలో జనవరిలో మొదటి దశ, ఏప్రిల్లో రెండోదశ ఆన్లైన్లో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్