వ్యాపారవేత్తలుగా అతివలు
గ్రామీణ మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చేందుకు సెర్ప్ శ్రీకారం చుట్టింది. ఉమ్మడి జిల్లాలో రెండు బ్లాక్లుగా ఎంపిక చేసి కొంతమంది అతివలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది.
స్టార్టప్ విలేజ్ ఎంటర్ప్రెన్యూర్ కార్యక్రమం రూపకల్పన
ఉమ్మడి జిల్లాలో ఎల్లారెడ్డి, బోధన్ బ్లాక్లుగా ఎంపిక
న్యూస్టుడే, బీర్కూర్
కామారెడ్డిలో సీఆర్పీలకు అవగాహన కల్పిస్తున్న జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు
గ్రామీణ మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చేందుకు సెర్ప్ శ్రీకారం చుట్టింది. ఉమ్మడి జిల్లాలో రెండు బ్లాక్లుగా ఎంపిక చేసి కొంతమంది అతివలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఎంపిక ఇలా..
అనుభవం, ఆసక్తి ఉన్న రంగంలో వ్యాపారం చేయడానికి సెర్ప్, స్టార్టప్ విలేజ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ (గ్రామీణ వ్యాపార ప్రారంభం) పేరిట కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. దేశ వ్యాప్తంగా ఈ పథకాన్ని మూడు విడతల్లో వివిధ ప్రాంతాల్లో అమలు చేశారు. నాలుగో విడతగా రాష్ట్రంలో పది జిల్లాలకు చోటు కల్పించారు. కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డి బ్లాక్లో లింగంపేట, ఎల్లారెడ్డి, గాంధారి మండలాలు, నిజామాబాద్ జిల్లాలో బోధన్ బ్లాక్లో ఎడపల్లి, రెంజల్, నవీపేట్, బోధన్ మండలాలను ఎంపిక చేశారు. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ జనాభా అధికంగా ఉంది. పైగా ఉపాధి పని దినాలు ఎక్కువగా నమోదై ఉన్నాయి. బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, సీఐఏఎఫ్ రుణాల వసూళ్లు సక్రమంగా ఉండటంతో ఈ కార్యక్రమానికి ఆ మండలాలను ఎంపిక చేసినట్లు సెర్ప్ అధికారులు పేర్కొంటున్నారు.
ఒక్కో దానికి రూ.5.97 కోట్లు
ఉమ్మడి జిల్లాలో ఎల్లారెడ్డి, బోధన్ బ్లాక్లు ఎంపిక చేశారు. ఒక్కో బ్లాక్కు రానున్న నాలుగేళ్లలో భారీగా నిధులు ఖర్చు చేయనున్నారు. ఒక్కో బ్లాక్కు రూ.5.97 కోట్లు కేటాయించారు. కామారెడ్డి జిల్లాలో లింగంపేట్, నిజామాబాద్ జిల్లాలో బోధన్లో బ్లాక్ రిసోర్స్ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమ నిర్వహణకు బ్లాక్కు ఒక ఏపీఎంను కేటాయించారు. మండలం నుంచి ఐదుగురు సీఆర్పీలను నియమించారు. ఇటీవల రాత పరీక్ష నిర్వహించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 30 మందిని ఎంపిక చేశారు. ఒక్కో సీఆర్పీకి నాలుగు నుంచి ఐదు గ్రామాలు కేటాయిస్తారు. వారికి మొదటి విడత శిక్షణ పూర్తయింది. ఇంకా మూడు విడతల్లో ఇవ్వనున్నారు. వీరికి కేటాయించిన మూడు మండలాల పరిధిలోని గ్రామాల్లో ఇంటింటికి తిరగాలి. కుటీర పరిశ్రమలు నిర్వహిస్తున్న మహిళలను గుర్తించి వారికి ఎంత ఆదాయం వస్తుంది? ఖర్చులు ఎలా ఉన్నాయి? వినియోగదారుల మన్ననలు పొందాలంటే ఏం చేయాలి? తదితర వివరాలను సర్వే చేసి సెర్ప్ అధికారులకు ఇవ్వనున్నారు. అనంతరం ఒక్కో మహిళకు తొలి విడత రూ.10 వేల రుణం అందిస్తారు. తర్వాత అవసరాలకు అనుగుణంగా బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి ద్వారా రుణాలు అందిస్తారు.
జిల్లాకు 2,400 మంది
కామారెడ్డి జిల్లాలో 2,400, నిజామాబాద్లో 2,400 మంది మహిళలను వ్యాపారవేత్తలుగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం కలిపి అతివలకు రుణాలు ఇవ్వనున్నారు. వీలైనంత వరకు స్థానికంగా ఉండే ముడి సరకులు సేకరించి వాటికి విలువ కట్టి మార్కెటింగ్ చేయాలన్నది సెర్ప్ లక్ష్యం.
అర్హులను గుర్తించి రుణాలిస్తాం
- వెంకటమాధవరావు, డీఆర్డీవో, కామారెడ్డి జిల్లా
గ్రామీణ మహిళలకు చేయూతనిచ్చి వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే ఈ పథకం ఉద్దేశం. త్వరలో సీఆర్పీలతో ఇంటింటి సర్వే చేపట్టి అర్హులైన మహిళలను గుర్తించి రుణాలు మంజూరు చేస్తాం. వారు వ్యాపారాలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలి
[ 26-04-2024]
నరేంద్రమోదీ హయాంలో భాజపా ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావాలని ప్రజలు కోరుతున్నారని భాజపా జహీరాబాద్ పార్లమెంట్ ప్రభారీ పెద్దోళ్ల గంగారెడ్డి అన్నారు. -
భారీ మెజార్టీతో గెలిపించాలి
[ 26-04-2024]
ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు నాగిరెడ్డిపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ షట్కర్ను భారీ మెజారిటీతో గెలిపించాలని సూచించారు. -
అభివృద్ధికి పట్టం కట్టాలి
[ 26-04-2024]
నాగిరెడ్డిపేట మండలంలోని రాఘవపల్లి గ్రామంలో గురువారం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బీబీ పాటిల్ గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. -
అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం
[ 26-04-2024]
గ్రామీణ మండలం మల్లారం అటవీ ప్రాంతం దాటిన తర్వాత కొత్తపేట శివారులో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. -
కుంభకోణాలు.. కుటుంబ పార్టీలను ఓడించండి
[ 26-04-2024]
కుంభకోణాలు చేసి దోచుకున్నవారిని.. కుటుంబ పాలన సాగిస్తున్న పార్టీలను ఓడించాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామీ ఓటర్లను కోరారు. -
మాధ్యమిక విద్య మిథ్య
[ 26-04-2024]
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్లో విద్యార్థుల ఉత్తీర్ణత గణనీయంగా తగ్గింది. ప్రభుత్వం బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో చివరిస్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. -
హామీలు నెరవేర్చాలి : పోచారం శ్రీనివాస్రెడ్డి
[ 26-04-2024]
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. -
పనులు జరగాలి.. వెతలు తీరాలి
[ 26-04-2024]
పలు పాఠశాలల్లోని తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. ఏళ్లుగా మరమ్మతులు చేయకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాసిరకం మాంసం విక్రయాలు!
[ 26-04-2024]
బాన్సువాడ పట్టణంలోని మటన్ మార్కెట్కు ఓ వ్యక్తి గాయపడ్డ మేకను గురువారం తీసుకొచ్చారు. దానిని విక్రయించేందుకు ఓ వ్యాపారి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. -
సొంత గూటికి వడ్డేపల్లి సుభాష్రెడ్డి
[ 26-04-2024]
లోక్సభ సాధారణ ఎన్నికల సమయంలో జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగిసింది. ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేయడంతో నామపత్రాల స్వీకరణ ప్రారంభమైంది. -
తల్లిదండ్రులూ.. పిల్లలపై ఓ కన్నేయండి
[ 26-04-2024]
పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నా.. ప్రమాదంలో మృతిచెందినా వారి తల్లిదండ్రులు జీవితాంతం మానసిక క్షోభ అనుభవిస్తారు. -
గురుకులాలు ఉత్తమం.. ఎయిడెడ్లు అథమం
[ 26-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం వెలువడిన ఇంటర్మీడియెట్ ఫలితాల్లో జిల్లా ఏటేటా తనస్థానాన్ని దిగజార్చుకుంటోంది. అందుకు అనేక కారణాలు దోహదం చేస్తున్నాయి. -
పసుపు బోర్డు పేరుతో పరిహాసం : బాజిరెడ్డి
[ 26-04-2024]
గత లోక్సభ ఎన్నికల్లో అబద్ధపు హామీతో గెలిచిన అర్వింద్ పసుపు బోర్డు పేరుతో రైతులతో పరిహాసమాడుతున్నాడని నిజామాబాద్ పార్లమెంటు భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. -
కాంగ్రెస్తోనే సంక్షేమం : జీవన్రెడ్డి
[ 26-04-2024]
: దేశంలో మొదటిసారిగా అన్నదాతలకు పంట రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని ఆ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి అన్నారు. -
ఓటు పోటెత్తేలా!
[ 26-04-2024]
ఓటు హక్కుతోనే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది. వజ్రాయుధాన్ని సమర్థంగా వినియోగిస్తేనే మంచి భవిష్యత్తు కోసం పనిచేసే నాయకులు ఎన్నికవుతారు. -
జేఈఈ మెయిన్స్లో ఇందూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఆధ్వర్యంలో జనవరిలో మొదటి దశ, ఏప్రిల్లో రెండోదశ ఆన్లైన్లో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్