Telangana News: పెళ్లి భోజనం పెట్టలేదని కుటుంబం సామాజిక బహిష్కరణ
ఏడాది క్రితం జరిగిన వివాహానికి సంబంధించి భోజనాలు పెట్టలేదని ఓ కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేసిన ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంటలో......
మద్దికుంట(రామారెడ్డి), న్యూస్టుడే: ఏడాది క్రితం జరిగిన వివాహానికి సంబంధించి భోజనాలు పెట్టలేదని ఓ కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేసిన ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంటలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబసభ్యులు యెల్ది పోశయ్య, కొడుకు మహిపాల్, కోడలు రేణుక ఆదివారం తమ ఇంటికి తాళం వేసుకొని నిరసన తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. పోశయ్య కుమార్తె ఏడాది క్రితం వివాహం చేసుకుని వెళ్లిపోయారు. అప్పటి నుంచి తమకు భోజనాలు పెట్టాలని కులపెద్దలు అడుగుతున్నారు. దుబాయ్ వెళ్లిన కొడుకు మహిపాల్ నెల రోజుల క్రితం ఇంటికి రావడంతో ఇప్పుడైనా పెట్టాల్సిందేనని పట్టుబట్టారు. వారు అంగీకరించకపోవడంతో ఏడాదిపాటు శుభ, అశుభ కార్యాలకు పిలవకుండా ఇటీవల బహిష్కరించారు. వెళితే రూ.10 వేలు జరిమానా విధిస్తామని హుకుం జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ అవమానాలు భరించే కన్నా ఆత్మహత్యే మేలని కన్నీరుమున్నీరవుతున్నారు. సర్పంచి రాంరెడ్డిని ‘న్యూస్టుడే’ వివరణ కోరగా కుల పెద్దలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. బాధితుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై భువనేశ్వర్రావు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీతోనే దేశాభివృద్ధి సాధ్యం
[ 05-05-2024]
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా భాజపా మండలంలో ప్రచారం ఉద్ధృతం చేసింది. -
కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం
[ 05-05-2024]
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో తాండూరు, అక్కంపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు ర్యాలీ నిర్వహించారు. -
పోలింగ్ శాతం పెంచేందుకు కృషి చేయాలి
[ 05-05-2024]
ఓటింగ్ శాతం పెంపునకు అధికారులు కృషి చేయాలని జైరాబాద్ పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు గోపాల్ జి తివారి అన్నారు. -
పార్టీ నిర్ణయాలకు కార్యకర్తలు కట్టుబడి ఉండాలి
[ 05-05-2024]
పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కార్యకర్తలు కట్టుబడి పనిచేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్ అన్నారు. -
ఏ సామాజిక వర్గం ఎటు వైపో..!
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. జహీరాబాద్ స్థానంలో 19 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక్కడ ప్రధాన పార్టీలకు చెందిన ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలిచారు. -
వేధింపుల కట్టడికి అంతర్గత కమిటీలు
[ 05-05-2024]
పురపాలక కార్యాలయాల్లో, పని ప్రదేశంలో లైంగిక వేధింపులను నియంత్రించడానికి అంతర్గత కమిటీల ఏర్పాటుకు ఆ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇందూరు భగభగ
[ 05-05-2024]
ఇందూరులో భానుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. మే ఆరంభంలోనే ఎండ ప్రచండమైంది. జిల్లాలో మూడు ప్రాంతాలు రెడ్ జోన్లోకి వెళ్లాయి. -
శతశాతంతో శెభాష్ అనిపించారు
[ 05-05-2024]
ఇటీవల విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో జంగంపల్లి మహాత్మా జ్యోతిబా ఫులే పాఠశాలకు చెందిన పది మంది విద్యార్థులు 10 జీపీఏతో సత్తా చాటారు. -
పల్లెలపైనే పార్టీల ఆశలు
[ 05-05-2024]
జహీరాబాద్ లోక్సభ స్థానంలో పాగావేసేందుకు భారాస, కాంగ్రెస్, భాజపా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ప్రత్యర్థి పార్టీల ప్రచారసరళిని గమనిస్తూ ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ప్రచారం సాగిస్తున్నాయి. -
దోస్త్కు వేళాయె..!
[ 05-05-2024]
డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరం ప్రవేశాలకు దోస్త్(డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) నోటిఫికేషన్ విడుదలైంది. సోమవారం నుంచి తొలి విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. -
బిల్లులు ఇవ్వకుంటే ధర్నా చేస్తా
[ 05-05-2024]
పెండింగ్లో ఉన్న రెండు పడకగదుల ఇళ్ల బిల్లులు రూ.26 కోట్లు ఇవ్వకుంటే కుటుంబ సభ్యులతో కలిసి ఎన్నికల తర్వాత కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తానని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. -
‘జిల్లాను రద్దు చేస్తే ఊరుకునేది లేదు’
[ 05-05-2024]
కొత్తగా ఏర్పాటైన కామారెడ్డి జిల్లాను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రద్దు చేస్తే ఊరుకునేది లేదని మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ హెచ్చరించారు. -
‘370 సీట్లతో భాజపా మూడోసారి అధికారంలోకి’
[ 05-05-2024]
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 370 సీట్లతో మూడోసారి కేంద్రంలో భాజపా అధికారం చేపట్టనుందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. -
పోలీసుల అదుపులో నిందితులు..!
[ 05-05-2024]
భిక్కనూరు పోలీస్స్టేషన్ పరిధిలో నిషేధిత మత్తు పదార్థాలు తరలిస్తున్న నలుగురు నిందితులను ప్రత్యేక పోలీసు బృందం శనివారం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
పట్టపగలే దొంగలు పడ్డారు
[ 05-05-2024]
నాలుగో ఠాణా పరిధిలో పట్టపగలే చోరీ కలకలం రేపింది. అరగంట వ్యవధిలోనే ఇల్లు గుల్లచేశారు. వివరాల్లోకి వెళ్తే వినాయక్నగర్ తుల్జా భవానీ మందిరం సమీపంలో మధుసూదన్ తన కుటుంబ సభ్యులతో శనివారం మధ్యాహ్నం 12.10 గంటలకు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. -
పరీక్ష రుసుము చెల్లింపునకు అవకాశం
[ 05-05-2024]
డా బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో 2017 విద్యా సంవత్సరానికి ముందు డిగ్రీలో ప్రవేశం పొందిన, పునఃప్రవేశం పొందిన విద్యార్థులు బ్యాక్లాగ్ పరీక్ష రుసుము కట్టుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు గిరిరాజ్ కళాశాల ప్రిన్సిపల్ రామ్మోహన్రెడ్డి, అధ్యయన కేంద్రం ప్రాంతీయ సమన్వయకర్త రంజిత శనివారం ప్రకటనలో తెలిపారు. అపరాధ రుసుము రూ.200తో ఈ నెల 6 వరకు, రూ.500తో 13 వరకు అవకాశం ఉందన్నారు
తాజా వార్తలు (Latest News)
-
చెన్నైకి మరో షాక్.. గాయం కారణంగా స్వదేశానికి పతిరన
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారిన ట్రెండ్.. ఎన్నికల వేళా ఐపీఓల సందడి!
-
రోజా కామెంట్స్పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
-
వందల మంది ‘రేవణ్ణ’ బాధితులకు.. ప్రభుత్వం ఆర్థిక సహాయం!
-
బైక్ పార్కింగ్ విషయంలో గొడవ.. తమ్ముడిని చంపిన అన్న