నైపుణ్యం నేర్పక.. కొలువు దక్కక
ప్రస్తుత పోటీ ప్రపంచంలో నైపుణ్యాల ఆధారంగానే ఉద్యోగాలు వస్తాయి. అది సర్కారుదైనా.. ప్రైవేటైనా.. ప్రస్తుతం కార్పొరేట్ సంస్థలు రూ.లక్షల వేతన ప్యాకేజీలు ఇస్తున్నాయి.
తెవివిలో విద్యార్థులకు శిక్షణ కరవు
ప్రాంగణ నియామకాలపైనా నిర్లక్ష్యం
న్యూస్టుడే, తెవివి క్యాంపస్
ప్రస్తుత పోటీ ప్రపంచంలో నైపుణ్యాల ఆధారంగానే ఉద్యోగాలు వస్తాయి. అది సర్కారుదైనా.. ప్రైవేటైనా.. ప్రస్తుతం కార్పొరేట్ సంస్థలు రూ.లక్షల వేతన ప్యాకేజీలు ఇస్తున్నాయి. వీటిని అందుకోవాలంటే.. విద్యార్థులు ఉన్నతవిద్య అభ్యసించే సమయంలోనే ఆయా విద్యాసంస్థలు మంచి నైపుణ్య శిక్షణ ఇచ్చి, ఔత్సాహికులుగా తీర్చిదిద్ది కొలువులకు సిద్ధం చేయాల్సి ఉంటుంది.
తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసుకుని బయటికి వెళ్తున్నవారి సంఖ్య ఏటా వందల్లో ఉంటోంది. వీరిలో ఉపాధి పొందుతున్న వారు పదుల్లోనే ఉండటం ఆందోళనకరం. సరైన నైపుణ్య శిక్షణ ఇవ్వకపోవడం, ప్రాంగణ నియామకాలు చేపట్టక పోవడమే ఇందుకు ప్రధాన కారణం.
శ్రద్ధ చూపరే.. గత నెలలో ఉస్మానియా భారీ ఉద్యోగ మేళా నిర్వహించింది. నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ తాజాగా చేపడుతోంది. తెవివిలో మాత్రం అయిదేళ్లుగా నిర్వహించిన దాఖలాలు లేవు. అడపాదడపా కెమిస్ట్రీ, ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ విభాగాల్లో వివిధ కంపెనీలు, మాస్ కమ్యూనికేషన్లో పత్రిక, టీవీ ఛానళ్ల సంస్థలు చేపడుతున్నాయి. మిగతా విభాగాల్లో ఉద్యోగ మేళాల ఊసే కనిపించడం లేదు. స్థానికంగా స్కిల్ డెవలప్మెంట్, కెరీర్ గైడెన్స్ విభాగం ఉంటున్నప్పటికీ సంబంధిత అధికారులు శ్రద్ధ చూపకపోవడం విమర్శలకు తావిస్తోంది.
న్యాక్లో ప్రాధాన్యం.. ప్రతిష్ఠాత్మక ‘న్యాక్’ గుర్తింపునకు ప్లేస్మెంట్స్ అంశం దోహదపడుతుంది. న్యాక్ బృందం వచ్చినప్పుడు ఏడాదిలో ఎన్నిసార్లు ఉద్యోగ మేళాలు చేపట్టారు? ఎంత మంది విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించారు? అని గత మూడేళ్ల వివరాలు పరిశీలిస్తుంది. తెవివికి మెరుగైన గ్రేడింగ్కు ప్రయత్నిస్తున్న తరుణంలో నైపుణ్య శిక్షణ, ప్లేస్మెంట్స్ నిర్వహణపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉంది.
కంపెనీలతో మాట్లాడుతున్నాం
- ఆచార్య రవీందర్, తెవివి వీసీ
కంపెనీలు ఎక్కువగా కెమిస్ట్రీలో అడుగుతున్నాయి. ఇక్కడేమో విద్యార్థులు దొరకడం లేదు. విప్రో ప్రతినిధులు 10 వేల మంది అవసరముందన్నారు. వర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల విద్యార్థులకు విప్రోతో ప్రాంగణ నియామకాలు ఏర్పాటు చేస్తాం.
పోటీపడే అవకాశం
- అరుణ్, ఎంసీఏ
కోర్సు చివర్లో ఉద్యోగం వస్తే కుటుంబానికి చేదోడుగా నిలిచినవారమవుతాం. యూనివర్సిటీలో చేరేందుకు విద్యార్థులు పోటీపడే అవకాశం ఉంటుంది.
అధ్యాపకులు లేరు
- శివకుమార్, ఐఎంబీఏ, తృతీయ ఏడాది(తెవివి)
వర్సిటీలో స్కిల్ డెవలప్మెంట్ నేర్పించే అధ్యాపకులు లేక చాలా నష్టపోతున్నాం. క్యాంపస్ ఇంటర్వ్యూలతో విజ్ఞానం, అనుభవం వస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలి
[ 26-04-2024]
నరేంద్రమోదీ హయాంలో భాజపా ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావాలని ప్రజలు కోరుతున్నారని భాజపా జహీరాబాద్ పార్లమెంట్ ప్రభారీ పెద్దోళ్ల గంగారెడ్డి అన్నారు. -
భారీ మెజార్టీతో గెలిపించాలి
[ 26-04-2024]
ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు నాగిరెడ్డిపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ షట్కర్ను భారీ మెజారిటీతో గెలిపించాలని సూచించారు. -
అభివృద్ధికి పట్టం కట్టాలి
[ 26-04-2024]
నాగిరెడ్డిపేట మండలంలోని రాఘవపల్లి గ్రామంలో గురువారం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బీబీ పాటిల్ గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. -
అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం
[ 26-04-2024]
గ్రామీణ మండలం మల్లారం అటవీ ప్రాంతం దాటిన తర్వాత కొత్తపేట శివారులో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. -
కుంభకోణాలు.. కుటుంబ పార్టీలను ఓడించండి
[ 26-04-2024]
కుంభకోణాలు చేసి దోచుకున్నవారిని.. కుటుంబ పాలన సాగిస్తున్న పార్టీలను ఓడించాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామీ ఓటర్లను కోరారు. -
మాధ్యమిక విద్య మిథ్య
[ 26-04-2024]
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్లో విద్యార్థుల ఉత్తీర్ణత గణనీయంగా తగ్గింది. ప్రభుత్వం బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో చివరిస్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. -
హామీలు నెరవేర్చాలి : పోచారం శ్రీనివాస్రెడ్డి
[ 26-04-2024]
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. -
పనులు జరగాలి.. వెతలు తీరాలి
[ 26-04-2024]
పలు పాఠశాలల్లోని తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. ఏళ్లుగా మరమ్మతులు చేయకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాసిరకం మాంసం విక్రయాలు!
[ 26-04-2024]
బాన్సువాడ పట్టణంలోని మటన్ మార్కెట్కు ఓ వ్యక్తి గాయపడ్డ మేకను గురువారం తీసుకొచ్చారు. దానిని విక్రయించేందుకు ఓ వ్యాపారి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. -
సొంత గూటికి వడ్డేపల్లి సుభాష్రెడ్డి
[ 26-04-2024]
లోక్సభ సాధారణ ఎన్నికల సమయంలో జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగిసింది. ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేయడంతో నామపత్రాల స్వీకరణ ప్రారంభమైంది. -
తల్లిదండ్రులూ.. పిల్లలపై ఓ కన్నేయండి
[ 26-04-2024]
పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నా.. ప్రమాదంలో మృతిచెందినా వారి తల్లిదండ్రులు జీవితాంతం మానసిక క్షోభ అనుభవిస్తారు. -
గురుకులాలు ఉత్తమం.. ఎయిడెడ్లు అథమం
[ 26-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం వెలువడిన ఇంటర్మీడియెట్ ఫలితాల్లో జిల్లా ఏటేటా తనస్థానాన్ని దిగజార్చుకుంటోంది. అందుకు అనేక కారణాలు దోహదం చేస్తున్నాయి. -
పసుపు బోర్డు పేరుతో పరిహాసం : బాజిరెడ్డి
[ 26-04-2024]
గత లోక్సభ ఎన్నికల్లో అబద్ధపు హామీతో గెలిచిన అర్వింద్ పసుపు బోర్డు పేరుతో రైతులతో పరిహాసమాడుతున్నాడని నిజామాబాద్ పార్లమెంటు భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. -
కాంగ్రెస్తోనే సంక్షేమం : జీవన్రెడ్డి
[ 26-04-2024]
: దేశంలో మొదటిసారిగా అన్నదాతలకు పంట రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని ఆ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి అన్నారు. -
ఓటు పోటెత్తేలా!
[ 26-04-2024]
ఓటు హక్కుతోనే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది. వజ్రాయుధాన్ని సమర్థంగా వినియోగిస్తేనే మంచి భవిష్యత్తు కోసం పనిచేసే నాయకులు ఎన్నికవుతారు. -
జేఈఈ మెయిన్స్లో ఇందూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఆధ్వర్యంలో జనవరిలో మొదటి దశ, ఏప్రిల్లో రెండోదశ ఆన్లైన్లో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్