చెరువులు కప్పేస్తూ కట్టడాలు
నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో చెరువులు అన్యాక్రాంతమవుతున్నా.. అడ్డుకునేవారు లేరు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు వెళుస్తున్నా.. అడిగేవారుండరు.
పరిరక్షణ చర్యలు మరిచిన యంత్రాంగం
శిఖంలో విద్యుత్తు స్తంభం (వృత్తంలో)
ఈనాడు, నిజామాబాద్, న్యూస్టుడే, నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో చెరువులు అన్యాక్రాంతమవుతున్నా.. అడ్డుకునేవారు లేరు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు వెళుస్తున్నా.. అడిగేవారుండరు. పురపాలకశాఖ ఏమీ చూడకుండా ఇంటి నంబర్లు జారీ చేస్తోంది. వాటిని అడ్డంపెట్టుకొని విద్యుత్తు కనెక్షన్లు తీసుకుంటున్న పరిస్థితి ఉంటోంది. బఫర్ జోన్ నిబంధనలు, జలవనరులశాఖ నుంచి నిరభ్యంతర పత్రాలు లేకుండానే కానిచ్చేస్తున్నారు. శాఖల మధ్య సమన్వయం లోపం ఆక్రమణలకు బలం చేకూరుస్తోంది.
కబ్జా కోరల్లో
నిజామాబాద్ నగరం నాగారం పరిధి సర్వే నంబరు 2999లోని బొందెం చెరువు కబ్జా కోరల్లో చిక్కుకుంది. ఏడాదిన్నర కిందట జలవనరుల, నీటిపారుదల, రెవెన్యూ అధికారులు చుట్టూ హద్దుగా కందకం తవ్వించినా.. అది పూడుకుపోయింది. రెండు దిక్కులా బండరాళ్ల గుట్ట ఉంది. మిగతా రెండు వైపులా నిర్మాణాలు వెలవడంతో 23.7 ఎకరాల ఈ జలవనరులోకి నీరు చేరే అవకాశమే లేకుండా పోయింది. ఫలితంగా పిచ్చిమొక్కలతో మైదాన ప్రాంతంగా మారింది. ఈ క్రమంలోనే చుట్టుపక్కల నిర్మాణాలు విస్తరించుకుంటూ శిఖంలోకి చొచ్చుకొస్తున్నాయి.
నిబంధనల ఊసేది..?
ఇంటి నిర్మాణాల అనుమతి జారీలో నిబంధనలు పాటించటం లేదు. ఇష్టానుసారం డోర్ నంబర్లు జారీ చేస్తున్నారు. విద్యుత్తుశాఖ పూర్తిస్థాయి అనుమతిలేని నిర్మాణాలకు కనెక్షన్లు జారీ చేస్తోంది. నిజానికి నీటివనరులున్న ప్రాంతాల్లో 9 మీటర్ల దూరం వరకు ఎటువంటి కట్టడాలకు అనుమతివ్వవద్దు. జలవనరులశాఖ నుంచి నిరభ్యంతర పత్రం జత చేయాల్సి ఉంటుంది. అలాంటివి లేకుండానే మున్సిపల్ వారు అనుమతులిస్తుండటంతో అక్రమ నిర్మాణాలకు అంతులేకుండా పోతోంది.
సమన్వయం మాటే లేదు..
బొందెం చెరువు ప్రాంతంలో గతంలో హద్దులు నిర్ణయించి ట్రంచ్ కొట్టించామని దక్షిణ మండలం తహసీల్దారు ప్రసాద్ చెప్పారు. ఇక్కడ చేపట్టే నిర్మాణాలకు మున్సిపల్ వారు నిబంధనలు చూసి అనుమతిలివ్వాలన్నారు. జలవనరులశాఖ నిరభ్యంతర పత్రం తప్పనిసరి అని తెలిపారు. వారే చెరువు పరిరక్షణకు ఫెన్సింగ్ చేయించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నీటిపారుదలశాఖ అధికారి రాజ్యలక్ష్మి స్పందిస్తూ... తాము ఎవరికీ నిరభ్యంతర పత్రాలు ఇవ్వటం లేదని చెప్పారు. నిర్మాణాలు చేపట్టడం, విద్యుత్తు లైన్లు వేయటం అనేది మున్సిపల్, విద్యుత్తుశాఖల వారు నిబంధనలు చూసి ఇవ్వాలని చెప్పుకొచ్చారు.
మరిన్ని ఉదంతాలు..
నిజామాబాద్ శివారులోని రామర్తి చెరువులోకి నిర్మాణాలు వచ్చేశాయి. నిద్ర నుంచి మేల్కొన్న అధికారులు వాటిని ఏమీ చేయలేక.. మిగిలిన భాగాన్నైనా కాపాడేందుకు ఫెÆన్సింగ్ వేయించారు. చెరువు విస్తీర్ణం కుంచించుకుపోవడం వల్ల వర్షాకాలంలో ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరదతో తక్కువ సమయంలోనే నిండిపోయి నిజామాబాద్-బోధన్ రహదారిపైకి నీరు చేరుతోంది. ః భీమ్గల్ పట్టణానికి ఆనుకొని ఉన్న రాధం, మొగిలి చెరువులది ఇదే పరిస్థితి. రాధం 72 ఎకరాల విస్తీర్ణం ఉండగా.. 20 ఎకరాలకు పైగా కబ్జాకు గురైంది. ఇటీవల సర్వే చేయించిన రెవెన్యూ యంత్రాంగం తదుపరి చర్యలను మరిచింది. మొగిలి విస్తీర్ణం కాగితాలకే పరిమితమైంది. సింహభాగం నిర్మాణాలు వెలిశాయి. ః మాక్లూర్ మండలం గుత్ప ప్రాంతంలోని మూడు చెరువులు 100, 60, 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. ఖజానా చెరువులో 20 ఎకరాలు, నడి, పెచ్చెరువుల్లో పదేసి ఎకరాలు కబ్జాకు గురయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా ప్రజా మద్దతు ర్యాలీ
[ 10-05-2024]
కామారెడ్డి జిల్లా కేంద్రంలో భాజపా ప్రజా మద్దతు ర్యాలీని శుక్రవారం నిర్వహించారు. -
వైద్యురాలి నిర్వాకం.. గాల్లో కలిసిపోయిన బాలింత ప్రాణం!
[ 10-05-2024]
వైద్యురాలి నిర్వాకంతో నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఓ ప్రైవేటు ఆస్పత్రికి కాన్పు కోసం వచ్చిన మహిళ అర్ధంతరంగా తనువు చాలించింది.. -
కాంగ్రెస్ తోనే గ్రామాల అభివృద్ధి
[ 10-05-2024]
కాంగ్రెస్ తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కందూరి లింబాద్రి అన్నారు. -
బసవేశ్వర్ మహారాజ్ 891వ జయంతి
[ 10-05-2024]
ఇందూర్ నగరంలో స్థానిక నాందేవాడ శివాజీ చౌక్ వద్ద వీర శైల లింగాయత్ సంఘం దుబ్బ వారి ఆధ్వర్యంలో సంతు బసవేశ్వర్ మహారాజ్ 891వ జయంతిని నిర్వహించారు. -
రక్తం కొరత
[ 10-05-2024]
ఎండలు మండిపోతున్నాయి. కళాశాలలకు సెలవులు. వేసవి తాపానికి దాతలు రక్తం ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. -
పాఠశాలల అభివృద్ధికి రూ.39.38 కోట్లు
[ 10-05-2024]
ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణలో ‘అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ’ల పేరుతో మహిళా సంఘాల సభ్యులను భాగస్వాములను చేసి వారి సహకారంతోనే బడుల్లో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. -
అమలుకాని చలువ పైకప్పు విధానం
[ 10-05-2024]
ఎండలు మండుతున్నాయి. మే మొదటి వారం నుంచి అమాంతంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఇ -
మోదీ ఉంటేనే దేశం సురక్షితం
[ 10-05-2024]
దేశం అభివృద్ధి పథంలో, సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండాలంటే మళ్లీ నరేంద్ర మోదీ ప్రధాని కావాలని తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. -
ప్రతి గౌడ కుటుంబానికి ఐదెకరాలు
[ 10-05-2024]
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో మాట్లాడి ప్రతి గౌడ కుటుంబానికి ఐదెకరాల భూమి ఇప్పించేందుకు కృషి చేస్తామని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీనవన్రెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. -
ఆశీర్వదించండి.. సేవకుడిగా పనిచేస్తా
[ 10-05-2024]
ప్రధాని మోదీ ఇస్తానన్న రూ.15 లక్షలు, రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడా అని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ప్రశ్నించారు. -
ఆ ఓటర్లే కీలకం
[ 10-05-2024]
జహీరాబాద్ లోక్సభ స్థానంలో గెలుపోటములపై మహిళ, యువ ఓటర్లు కీలక భూమిక పోషించనున్నారు. -
వయోవృద్ధులే నయం
[ 10-05-2024]
ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలంటూ అధికారులు ఒక వైపు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. -
ఓటు పిలుస్తోంది.. రారండోయ్
[ 10-05-2024]
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలకు మరో నాలుగు రోజులే ఉంది. -
జీవన్రెడ్డి మాల్కు నోటీసులు
[ 10-05-2024]
ఆర్మూర్లోని ఆర్టీసీ స్థలంలో నిర్మించిన జీవన్రెడ్డి మాల్కు గురువారం ఆర్టీసీ అధికారులు నోటీసులు అందజేశారు. -
నినాదం.. చైతన్యం
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో 100 శాతం పోలింగ్ నమోదయ్యేలా అధికారులు అనేక రకాలుగా ప్రచారం చేస్తున్నారు. -
ప్రతినబూనుతున్నాం.. అమ్మానాన్నకు చెబుతాం
[ 10-05-2024]
అర్హులైన వారంతా తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఓటును ఆయుధంగా మల్చుకోవాలని చిన్నారులు సందేశాన్నిచ్చారు. -
చనిపోవాలనుకుంటున్నానని స్నేహితుడికి కాల్
[ 10-05-2024]
దోమకొండకు చెందిన యువకుడు గోత్రాల విక్రమ్ తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని మిత్రుడికి కాల్ చేశాడు.
తాజా వార్తలు (Latest News)
-
Prabhas: ప్రభాస్ ‘రాజాసాబ్’ మరింత ఆలస్యం.. కారణమిదే!
-
సీఎస్ జవహర్రెడ్డి వివరణపై స్పందించిన ఈసీ
-
కేజ్రీవాల్ విడుదల.. తిహాడ్ జైలు వద్ద ప్రజలకు అభివాదం
-
28 వేల మొబైల్స్ బ్లాక్ చేయండి.. టెల్కోలకు డాట్ ఆదేశం
-
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్
-
ప్రమోషన్స్లో జాన్వీ కపూర్.. స్టైలిష్ డ్రెస్సులో మానుషి చిల్లర్