ఉమ్మడి జిల్లలో 8 ఉప ఎన్నికలు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తొమ్మిది శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో కొన్ని నియోజకవర్గాల్లో వివిధ కారణాలతో ఉప ఎన్నికలు జరిగాయి.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తొమ్మిది శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో కొన్ని నియోజకవర్గాల్లో వివిధ కారణాలతో ఉప ఎన్నికలు జరిగాయి. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రెండు సార్లు జరగగా.. బాన్సువాడ, కామారెడ్డి, బోధన్, నిజామాబాద్ అర్బన్, బాల్కొండ, అప్పటి డిచ్పల్లిలో ఒకసారి ఉప ఎన్నిక జరిగింది.
వివరాలు ఇలా..
- 2010లో తెదేపా బాన్సువాడ ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి తెలంగాణ ఉద్యమం సందర్భంగా పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెరాసలో చేరడంతో 2011లో ఉప ఎన్నిక జరిగింది. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీనివాస్గౌడ్పై తెరాస అభ్యర్థి అయిన పోచారం శ్రీనివాస్రెడ్డి గెలుపొందారు.
- కామారెడ్డి తెదేపా ఎమ్మెల్యేగా ఉన్న గంప గోవర్ధన్ తెలంగాణ ఉద్యమ సమయంలో (2012) పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెరాసలో చేరారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. తెరాస తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన గంప గోవర్ధన్ కాంగ్రెస్ అభ్యర్థి యెడ్ల రాజిరెడ్డిపై విజయం సాధించారు.
- తెలంగాణ ఉద్యమంలో (2010) నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే అయిన యెండల లక్ష్మీనారాయణ తన పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. తిరిగి ఆయన అదే పార్టీ నుంచి పోటీ చేశారు. ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన డి.శ్రీనివాస్పై యెండల లక్ష్మీనారాయణ విజయం సాధించారు.
- పార్టీ పిలుపు మేరకు 2008లో ఎల్లారెడ్డి తెరాస ఎమ్మెల్యేగా ఉన్న ఏనుగు రవీందర్రెడ్డి పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి అయిన జనార్దన్గౌడ్ గెలుపొందారు.
- 2009 సాధారణ ఎన్నికల్లో గెలుపొంది ఎల్లారెడ్డి తెరాస ఎమ్మెల్యేగా ఉన్న ఏనుగు రవీందర్రెడ్డి అధిష్ఠానం నిర్ణయంతో 2010లో మరోసారి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో జరిగిన ఉప ఎన్నికలో ఏనుగు రవీందర్రెడ్డి తిరిగి విజయం సాధించారు.
- అధిష్ఠాన నిర్ణయంతో 2008లో డిచ్పల్లి తెరాస ఎమ్మెల్యేగా ఉన్న కేశ్పల్లి గంగారెడ్డి రాజీనామా చేశారు. అనంతరం అదే ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా ఆయన తనయుడు కేశ్పల్లి ఆనంద్రెడ్డి పోటీ చేయగా.. కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ఎ.లలిత విజయం సాధించారు.
- 1962లో బోధన్తో పాటు మరో నియోజకవర్గంలో పోటీ చేసిన రాంభూపాల్రెడ్డి రెండు చోట్ల గెలుపొందారు. ఈయన బోధన్ ఎమ్మెల్యేగా రాజీనామా చేయడంతో 1963లో ఉప ఎన్నిక వచ్చింది. అందులో కేవీరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
- 1981లో బాల్కొండ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న గడ్డం రాజారాం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో బాల్కొండ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది. ఇందులో రాజారాం సతీమణి సుశీలాదేవి గెలుపొందారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పల్లె బాట.. ఓట్ల వేట
[ 28-04-2024]
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మూడు ప్రధాన పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. భారాస, కాంగ్రెస్ కార్నర్ మీటింగ్లతో ప్రజల్లోకి వెళ్తుండగా.. -
ఇంటికే ఓటరు చీటీలు
[ 28-04-2024]
పార్లమెంటు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఒప్పటికే ఓటర్ల తుది జాబితా ప్రకటించారు. పోలింగ్ రోజు అవసరమైన పోల్ చీటీలను ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు. -
ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
[ 28-04-2024]
వచ్చే నెల 13న నిర్వహించే పార్లమెంట్ ఎన్నికల పోలింగ్కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు రిటర్నింగ్ అధికారి, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు స్పష్టం చేశారు. -
‘పదేళ్లలో అభివృద్ధి శూన్యం’
[ 28-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, ఆర్ఎస్ఎస్, ఎన్డీయే కూటమిని ఓడించాలని తెలంగాణ సోషల్ డెమోక్రటిక్ ఫోరం (టీడీఎస్ఎఫ్) రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ వినాయక్రెడ్డి అన్నారు. -
భారాస పేదల పార్టీ
[ 28-04-2024]
భారాస ఎప్పటికీ పేదలకు అండగా ఉంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. -
ఏకకాలంలో రుణమాఫీ
[ 28-04-2024]
రైతుల పంట రుణాలు ఏకకాలంలో మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని నిజామాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి అన్నారు. -
సందేహాలుంటే.. ఫోన్ కొట్టండి
[ 28-04-2024]
మే 13న పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల్లో కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. బయట గోడలపై పోలింగ్ కేంద్రం, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ నంబర్లు వేస్తున్నారు. -
డిజిటల్ లావాదేవీలపై నిఘా
[ 28-04-2024]
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత జాతీయ రహదారిపై ఉన్న ఓ ప్రైవేటు బ్యాంకులో ఓ వినియోగదారుడు ఏప్రిల్ రెండో వారం నుంచి రూ.7 లక్షల మేర లావాదేవీలు జరిపారు. -
ఓటర్లలో ఎక్కువ.. ప్రాతినిధ్యంలో తక్కువ
[ 28-04-2024]
ఓటర్ల సంఖ్యలో అతివలే పురుషుల కంటే ఎక్కువగా ఉంటున్నారు. కానీ, పార్లమెంట్కు ఎంపీలుగా ప్రాతినిధ్యం వహించడంలో మాత్రం వారి సంఖ్య తక్కువగా ఉంటోంది. -
తగ్గుతుందా.. పెరుగుతుందా..?
[ 28-04-2024]
లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలు రూపొందించుకుని ప్రచారం చేస్తున్నాయి. జహీరాబాద్ లోక్సభ పరిధిలో మొదటిసారి త్రిముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో పోలింగ్శాతం ప్రభావంపై ఆయా పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. -
గెలిపిస్తే.. కామారెడ్డికి తాగునీరు తెప్పిస్తా
[ 28-04-2024]
‘గత ఎన్నికల్లో కాంగ్రెస్కు ఉమ్మడి మాచారెడ్డి మండలం భారీ మెజారిటీనిచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లోనూ పార్టీని మరింత ఆశీర్వదించాలి’ అని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ పేర్కొన్నారు. -
‘ఓర్వలేక బిల్లులు ఆపేశారు’
[ 28-04-2024]
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నియోజకవర్గంలో సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక కొన్ని బిల్లులు ఆపేశారని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. మోస్రా, చందూర్, వర్నిల్లో శనివారం రాత్రి ఆయన రోడ్ షో నిర్వహించారు. -
కూలి పెంచితేనే ప్రయోజనం
[ 28-04-2024]
సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు ఏకరూప దుస్తులను వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి ఇచ్చేందుకు విద్యాశాఖ ప్రణాళిక రూపొందించింది. -
నెల రోజుల్లో చక్కెర పరిశ్రమలు తెరిపిస్తా
[ 28-04-2024]
ఎంపీగా మళ్లీ గెలిపిస్తే నెలరోజుల్లోనే చక్కెర పరిశ్రమలు తెరిపిస్తానని నిజామాబాద్ లోక్సభ భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్ అన్నారు. -
అన్నకు నచ్చని తమ్ముడి పెళ్లి
[ 28-04-2024]
వద్దని చెప్పినా వినకుండా తనకు నచ్చని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని తమ్ముడిపై కోపం పెంచుకున్న అన్న..