logo

ప్రజాస్వామ్యంలో ఓటే కీలకం

ప్రజాస్వామ్యంలో ఓటే కీలకమని కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్‌ అన్నారు. జిల్లాకేంద్రంలో ప్రభుత్వ డిగ్రీకళాశాలలో మంగళవారం ఓటరు చైతన్య కార్యక్రమం జరిగింది.

Published : 17 Apr 2024 04:19 IST

ప్రతిజ్ఞ చేస్తున్న కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్‌, ప్రిన్సిపల్‌ విజయ్‌కుమార్‌

కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: ప్రజాస్వామ్యంలో ఓటే కీలకమని కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్‌ అన్నారు. జిల్లాకేంద్రంలో ప్రభుత్వ డిగ్రీకళాశాలలో మంగళవారం ఓటరు చైతన్య కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఓటు హక్కు వినియోగంలో యువత తమవంతు పాత్ర పోషించాలన్నారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిజాయతీతో ఓటు వేయాలన్నారు. ఇరుగుపొరుగు వారితోనూ ఓటు వేయించాలన్నారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఆర్డీవో రఘునాథరావు, స్వీప్‌ అధికారి వెంకటేశ్వర్లు, కళాశాల ప్రిన్సిపల్‌ విజయ్‌కుమార్‌, ఆచార్యులు కిష్టయ్య, చంద్రశేఖర్‌, శంకరయ్య తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని