సాగర్లో పూడిక.. తొలగించాలిక
ఉమ్మడి జిల్లా వరదాయిని నిజాంసాగర్లో పూడిక పేరుకుపోయింది. ప్రస్తుతం 17 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్నట్లు అధికారులు చెబుతున్నా.. ఆ స్థాయిలో నీరు లేదు.
ఈనాడు, కామారెడ్డి: ఉమ్మడి జిల్లా వరదాయిని నిజాంసాగర్లో పూడిక పేరుకుపోయింది. ప్రస్తుతం 17 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్నట్లు అధికారులు చెబుతున్నా.. ఆ స్థాయిలో నీరు లేదు. నిర్మాణ సమయంలో 29.70 టీఎంసీలు, ఆయకట్టు 2.75 లక్షల ఎకరాలు ఉండగా కాలక్రమేణా పూడిక చేరడంతో సామర్థ్యం తగ్గింది. పూడిక తొలగించేందుకు చేస్తున్న కార్యాచరణపై కథనం.
ప్రభుత్వానికి ప్రతిపాదన
రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారుల బృందం ఇటీవల రాజస్థాన్లోని బీసల్పుర్ జలాశయంలోని పూడిక తొలగించేందుకు ప్రయోగాత్మకంగా చేపట్టిన ప్రక్రియ పరిశీలించింది. ప్రైవేటు గుత్తేదారు ఆధ్వర్యంలో 25 ఏళ్ల కాలపరిమితితో అక్కడ పూడిక తొలగిస్తున్నారు. ఇదే మాదిరిగా నిజాంసాగర్తో పాటు రాష్ట్రంలో మరో ఐదు ప్రాజెక్టుల్లో పూడిక తొలగించేందుకు కార్యాచరణ రూపొందించారు. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచి ఆమోదముద్ర వేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కానరాని వరద కుంటల నిర్మాణం
1965లో పూడిక పేరుకుపోయి నీటి నిల్వ సామర్థ్యం 11.2 టీఎంసీలకు పడిపోయింది. 1974-78 మధ్య కాలంలో గేట్లు ఎత్తు పెంచి అదనంగా మరో 20 వరద గేట్ల నిర్మాణం పూర్తిచేసి 17.9 టీఎంసీలు నిల్వ ఉండేలా ఆధునీకరించారు. నిబంధనల ప్రకారం ప్రాజెక్టులోకి వరద వచ్చే ప్రాంతాల్లో కుంటల నిర్మాణం చేపట్టి పూడిక పేరుకుపోకుండా చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం అలాంటి ఏర్పాట్లు లేవు. ఎగువ భాగంలో ఆశించిన వర్షాలు కురవకపోవడంతో వరద దిగువకు రాని పరిస్థితి. పోచారం, సింగూర్ జలాశయాలు నిండిన సమయంలో వదిలిన వరద కారణంగానే పూడిక వస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.
ఆయకట్టుకు జీవం
నిజాంసాగర్ కింద 2.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్నారు. పూడిక తొలగిస్తే వానాకాలంలోనే నిండి రెండు సీజన్లకు సరిపడా సాగునీరు సరఫరా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయకట్టు ప్రాంత ప్రజాప్రతినిధులు పూడిక తొలగించే ప్రతిపాదనలకు ఆమోదముద్ర పడేలా చూడాల్సిన అవసరం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇందూరులోనే పసుపు బోర్డు..
[ 06-05-2024]
కేంద్రం పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందని.. ఎంపీ ధర్మపురి అర్వింద్ కృషి వల్లే ఇది సాధ్యమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఏళ్లుగా ఇక్కడి రైతుల డిమాండ్గా ఉన్న బోర్డును సాధించటం కోసం మోదీ వెంటపడి సాధించారన్నారు. -
దారి పొడవునా గులాబీ దండు!
[ 06-05-2024]
భారాస అధినేత బస్సు యాత్రతో గులాబీ దండులో జోష్ నెలకొంది. కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో కొనసాగిన యాత్రకు అపూర్వ స్పందన లభించింది. వీణవంక నుంచి జగిత్యాల వరకు దారి పొడువునా జనాలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. -
ఆదిలోనే ఆశాభంగం
[ 06-05-2024]
నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ను నమ్ముకొని వచ్చే ఆమ్చూర్ రైతులకు ఈ సారి ఆశాభంగం తప్పడం లేదు. గతేడాది ఊరించిన ధరలు ఈసారి అడియాసలయ్యాయి. ఇప్పుడిప్పుడే పంట యార్డుకు వస్తోంది. క్వింటా ధర సగటున రూ.20 వేలకు చేరుకోవడం లేదు. -
భారాస అధినేత కేసీఆర్ ప్రచారం నేడు
[ 06-05-2024]
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా భారాస వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ సోమవారం నిజామాబాద్ జిల్లాకు వస్తున్నట్లు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి వెల్లడించారు. -
ఎవరి ధీమా వారిదే..!
[ 06-05-2024]
పోలింగ్కు గడువు సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో వేగం పెంచాయి. రాజకీయ పార్టీల నేతలు బూత్స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి ఓటర్ల చెంతకు వెళ్తున్నారు. లోక్సభ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుండగా.. కామారెడ్డిపై భారాస, కాంగ్రెస్, భాజపా ప్రత్యేక దృష్టి సారించి ప్రచారం సాగిస్తున్న తీరు ఆసక్తిని రేకెత్తిస్తోంది. -
లెక్క తప్పారు..!
[ 06-05-2024]
ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ఆయా సబ్జెక్టుల్లో 1303 మంది విద్యార్థులు అనుత్తీర్ణులయ్యారు. 11,926 మంది పరీక్షలు రాయగా 11,057 ఉత్తీర్ణులయ్యారు. 92.71 శాతం ఫలితాలు నమోదయ్యాయి. -
తుది అంకానికి ఎన్నికల ప్రక్రియ
[ 06-05-2024]
జహీరాబాద్ లోక్సభ ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరింది. మూడు జిల్లాల అధికారులు అహర్నిశలుగా శ్రమిస్తుండడంతో ఏర్పాట్లు చకచకా పూర్తవుతున్నాయి. లోక్సభ పరిధిలో ఈ నెల 13వ తేదీన నిర్వహించే పోలింగ్ ప్రక్రియ కోసం ఓటర్లకు చీటీల పంపిణీ కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. -
సార్వత్రిక సమరం.. యువోత్సాహం
[ 06-05-2024]
ఓటు.. రాజ్యాంగం కల్పించిన హక్కు. పద్దెనిమిదేళ్లు నిండిన వారంతా పొందవచ్చు. ఎన్నికల్లో నచ్చిన వ్యక్తిని ఎన్నుకోవచ్చు. చట్టసభలకు పంపవచ్చు. సమర్థ పాలనకు పట్టం కట్టవచ్చు. ఈ విషయమై యువతీయువకుల్లో చైతన్యం పెరిగింది. -
ప్రమాదంలో పౌర హక్కులు
[ 06-05-2024]
దేశంలో పదేళ్లుగా పౌర హక్కులు ప్రమాదంలో పడ్డాయని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ పేర్కొన్నారు. ఆదివారం ప్రెస్క్లబ్లో మువ్వా నాగేశ్వరరావు సంస్మరణ సభ నిర్వహించారు. -
మత్తు పదార్థం పట్టివేత.. నలుగురి అరెస్టు
[ 06-05-2024]
నిషేధిత మత్తు పదార్థం అల్ఫ్రాజోలం సరఫరా చేస్తున్న నలుగురిని భిక్కనూరు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఆదివారం భిక్కనూరు సీఐ సంపత్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం పెద్దమల్లారెడ్డి శివారులో కారులో అక్రమంగా మత్తు పదార్థాలు తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు మాటువేసి ముగ్గురిని పట్టుకున్నారు. -
తగ్గని భానుడి ప్రతాపం
[ 06-05-2024]
జిల్లాలో భానుడి ప్రతాపం కొనసాగుతోంది. వరుసగా పగటిపూట ఎండలు దంచికొడుతున్నాయి. ఆదివారం గరిష్ఠంగా నిజామాబాద్ ఉత్తరంలో 46.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇందూరు నగరం రెడ్జోన్లోకి వెళ్లింది. ఇక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రత సైతం రికార్డు స్థాయిలో 36.1 డిగ్రీలు ఉండటం గమనార్హం. -
‘నాకు మద్దతివ్వండి’
[ 06-05-2024]
జహీరాబాద్ లోక్సభ భారాస అభ్యర్థి గాలి అనిల్కుమార్ను బాన్సువాడలో ఆదివారం మున్నూరుకాపు సంఘం నాయకులు కలిశారు. అనిల్కుమార్ మాట్లాడుతూ తాను మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందినవాడినని, ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరారు. -
‘పథకాలే భాజపాను గెలిపిస్తాయి’
[ 06-05-2024]
జహీరాబాద్ పార్లమెంట్లో భాజపా గెలుపు ఖాయమని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. మాచారెడ్డి, పల్వంచ మండలాల్లో భాజపా కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. -
‘కాంగ్రెస్తోనే ప్రజా సంక్షేమం’
[ 06-05-2024]
ఖేడ్ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన భారాస నాయకులు, కార్యకర్తలు ఆదివారం ఖేడ్లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. మనూరు మండలం తిమ్మాపూర్కు చెందిన తాజా మాజీ ఉప సర్పంచి నర్సింహులు ముదిరాజ్, శంకర్నాయక్ తండాకు చెందిన మాజీ సర్పంచి కిషన్నాయక్తో పాటు పలువురు హస్తం గూటికి చేరారు. -
అటవీ ప్రాంతంలో కాలిన మృతదేహం లభ్యం
[ 06-05-2024]
రూరల్ ఠాణా పరిధి మల్లారం అటవీ ప్రాంతంలో కాలిన మృతదేహం లభ్యమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ ఠాణాలో కొన్ని రోజుల కింద గంగయ్య(40) అనే వ్యక్తి అదృశ్యమైనట్లు కేసు నమోదు అయ్యింది.