అమృత్ అందలే
పురపాలక సంఘాల్లో మరో 20 ఏళ్ల వరకు దాహార్తి సమస్య లేకుండా చేయాలన్నది అమృత్ 2.0 ఉద్దేశం. పార్కులు, మురుగునీటి శుద్ధి ప్లాంటు వంటి పనులు ప్రతిపాదించారు. తీరా ఈ ప్రభుత్వంలో పనులు చేస్తే బిల్లులు వస్తాయా?
మౌలిక సదుపాయాలకు ప్రతిపాదించిన రామన్నదొరవలస జగనన్న కాలనీ. ఇక్కడ ఎలాంటి పనులు జరగలేదు
పురపాలక సంఘాల్లో మరో 20 ఏళ్ల వరకు దాహార్తి సమస్య లేకుండా చేయాలన్నది అమృత్ 2.0 ఉద్దేశం. పార్కులు, మురుగునీటి శుద్ధి ప్లాంటు వంటి పనులు ప్రతిపాదించారు. తీరా ఈ ప్రభుత్వంలో పనులు చేస్తే బిల్లులు వస్తాయా? రావా? ఉన్న అనుమానంతో గుత్తేదారులు వెనుకంజ వేస్తున్నారు.
న్యూస్టుడే, బొబ్బిలి, నెల్లిమర్ల
బొబ్బిలి, నెల్లిమర్లలో టెండర్లు పూర్తయినా పనులు ప్రారంభం కాలేదు. బొబ్బిలి పురపాలక సంఘంలో నీటి సరఫరాకు రూ.10.70 కోట్లు, చెరువుల సుందరీకరణకు రూ.1.19 కోట్లు మొత్తం రూ.11.89 కోట్లు కేటాయించగా భూమిపూజ చేసి వదిలేశారు. జగనన్న కాలనీల్లో ఈ నిధులు ఖర్చు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కౌన్సిల్ తీర్మానం చేశారు. పట్టణంలోని రామన్నదొరవలస వద్ద జగనన్న లేఅవుటు-1, 2లో సుమారు రెండు వేల ఇళ్ల నిర్మాణాలకు, ఐటీఐ కాలనీ వద్ద కాలనీలో 400 మందికి పట్టాలు ఇచ్చారు. అక్కడ రిజర్వాయర్లు నిర్మించి ఇంటింటికీ తాగునీటి కుళాయిలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. చెరువుల సుందరీకరణలో భాగంగా భైరవసాగరం గట్టు అభివృద్ధి, విద్యుద్దీకరణ పనులు ప్రతిపాదించారు. భైరవసాగరం చెరువు గట్టును చదును చేసి వదిలేశారు.
ఇంకా డీపీఆర్లో..
విజయనగరం పురపాలక సంఘానికి అమృత్ 2.0లో రూ.66.62 కోట్లు కేటాయించారు. ఇందులో నీటి సరఫరాకు రూ.31.56 కోట్లు, సీవేజ్ మేనేజ్మెంటుకు రూ.28.05 కోట్లు, చెరువుల సుందరీకరణకు రూ.3.51 కోట్లు ఉంది. వీటితో ఇంకా ఎక్కడెక్కడ ఏయే పనులు చేపట్టాలో తెలిపే సమగ్ర నివేదిక (డీపీఆర్) తయారీలోనే ఉన్నారు.
బీ రాజాం పురపాలక సంఘానికి రూ.9.34 కోట్లు కేటాయించారు. ఇందులో తాగునీటి పనులకు రూ.8.40 కోట్లు, చెరువుల సుందరీకరణకు రూ.93 లక్షలు ఖర్చు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంకా నివేదికలు తయారు చేయలేదు.
నెల్లిమర్ల నగర పంచాయతీకి రూ.4.97 కోట్లు కేటాయించారు. ఇందులో తాగునీటి సరఫరా పనులకు రూ.4.48 కోట్లు, చెరువుల సుందరీకరణకు రూ.50 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంది. కొంచవాని చెరువులో తూడు తొలగించి, పనులు సగంలో వదిలేశారు.
గుత్తేదారులకు సూచించాం
బొబ్బిలి, నెల్లిమర్లలో టెండర్లు పూర్తయ్యాయి. ఇక్కడ పనులు చేయాలని గుత్తేదారులకు సూచించాం. కానీ తాత్సారం చేస్తున్నారు. విజయనగరం, రాజాంలో పనులకు సంబంధించి డీపీఆర్లు తయారు చేస్తున్నాం. ఇక్కడ టెండర్లు పిలిచేందుకు చర్యలు చేపట్టాం.
దక్షిణామూర్తి, ఈఈ, ప్రజారోగ్య శాఖ, విజయనగరం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నను మించిన అన‘కొండ’లు
[ 29-04-2024]
మృత్యుదూతగా పేరొందాడు నాటి యమకింకరుడు.. కంకరను బొక్కేసే నాయకులను వెనకుండి నడిపిస్తున్నాడు నేటి యమకంకరుడు జగన్.. ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అదేపనిగా తవ్వకాలు ప్రారంభించిన కొందరు కేటుగాళ్లు ఈ ఐదేళ్ల కాలంలో పెద్దపెద్ద కొండలనే కరిగించేశారు. -
సర్కారు వారి గూడు పుఠాణి
[ 29-04-2024]
ఐదేళ్ల పాలన పూర్తయింది.. అయినా చాలా చోట్ల నిర్మాణాలు పూర్తి చేయలేదు. ఎన్నికల ముందు విజయనగరం, సాలూరులో హడావుడిగా కొన్ని చోట్ల అప్పగించి చేతులు దులుపుకొన్నారు. -
జగన్.. ఈ పాపం నీదే
[ 29-04-2024]
విజయనగరం జిల్లా వంగర, మన్యం జిల్లాలోని బలిజిపేట మండలాల్లో ఉన్న 17 గ్రామాలకు ప్రధాన సాగునీటి వనరును నేను.. దాదాపు 8 వేల ఎకరాలకు పైగా తడివ్వాల్సిన బాధ్యత నాది.. నా ఆయకట్టు పరిధిలో బంగారం పండే పొలాలున్నాయి.. -
రాష్ట్ర భవిష్యత్తు కోసమే కూటమి
[ 29-04-2024]
రాష్ట్ర భవిష్యత్తు కోసమే మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్గజపతిరాజు అన్నారు. ఆదివారం రాత్రి విజయనగరంలోని పుత్సలవీధి, పూల్బాగ్ కాలనీల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. -
ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయాలి
[ 29-04-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయాలని, అదే సమయంలో ప్రైవేటు వైద్యాలయాలను ఆదుకోవాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డా.ఆర్వీ.అశోకన్ అన్నారు. -
ఓటు వినియోగంతో ప్రశ్నించే హక్కు
[ 29-04-2024]
రాబోయే ఎన్నికల్లో ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, అప్పుడే నాయకులను ప్రశ్నించే హక్కు లభిస్తుందని మెప్మా సీఎంఎం సన్యాసిరావు అన్నారు. -
సమన్వయంతో పనిచేయాలి
[ 29-04-2024]
ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి, కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. -
5, 6, 7వ తేదీల్లో పోస్టల్ బ్యాలెట్
[ 29-04-2024]
సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ సిబ్బందికి విధుల కేటాయింపు రెండో విడత ప్రక్రియ ఆదివారం పూర్తి చేశారు. -
గొంతు తడిపే ఆలోచనుందా..?
[ 29-04-2024]
వేసవి ఆరంభంతోనే ఆ 44 గ్రామాల్లో దాహార్తి మొదలవుతుంది. నీటి కోసం కోటి పాట్లు పడాల్సిన పరిస్థితి. తోడుదామంటే బావుండదు.. వెళ్దామంటే బోరు కనిపించదు.. -
తెదేపా విశాఖ ఉత్తర పరిశీలకుడిగా రవిశేఖర్
[ 29-04-2024]
విశాఖ తెదేపా ఉత్తర నియోజకవర్గ పరిశీలకుడిగా సువ్వాడ రవిశేఖర్ను ఆ పార్టీ అధిష్ఠానం ఆదివారం నియమించింది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం పరిశీలకుడిగా ఆయన ఉన్నారు. -
కంకర గుటకాయ స్వాహా
[ 29-04-2024]
కొండలు.. గుట్టలు.. అనే తేడా లేదు.. ఎక్కడ మట్టి కనిపిస్తే అక్కడ తవ్వేస్తాం.. ఎర్రమట్టిని అమ్మేస్తాం.. అడిగితే దౌర్జన్యానికి దిగుతాం.. అన్న రీతిలో నడుస్తోంది గరివిడి, గజపతినగరం నియోజకవర్గాల్లో అక్రమ తవ్వకాల పరిస్థితి. -
ఇళ్లన్నావ్.. రోడ్డున పడేశావ్
[ 29-04-2024]
పేదల సొంతింటి కల నెరవేరుస్తామని ఆశలు పెంచి, హామీలు గుప్పించిన జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత మోసం చేశారు. ఐదేళ్లుగా సొంత గూడులేని వారి గోడును పట్టించుకోకుండా నిర్లక్ష్య వైఖరి అవలంబించారు. -
చంద్రబాబుతోనే సంక్షేమం
[ 29-04-2024]
రాష్ట్రంలో ప్రజల సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమని కూటమి అభ్యర్థి బేబినాయన అన్నారు. రానున్న ఎన్నికల్లో గెలిపించాలని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
కోనసీమ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
-
ఇచ్చింది రూ.50 వేలు.. లాగింది రూ.3.5 లక్షలు
-
ఏపీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని ప్రార్థించా: సినీనటి జయప్రద
-
కడప కార్పొరేటర్లపై వైకాపాకు అనుమానాలు!
-
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
-
రంగంలోకి బైడెన్.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్ అనుమతి