‘ప్రభుత్వ ఉద్యోగుల సొమ్మునే కాజేశారు’
‘రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వారిని కేసుల్లో ఇరికించి, జైళ్లకు పంపించారు. పోరాడాలంటేనే భయపడే పరిస్థితిని తీసుకొచ్చారు’ అని ఏపీజీఈఏ(ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్) రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆర్.సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.
మాట్లాడుతున్న రాష్ట్రాధ్యక్షుడు సూర్యనారాయణ
విజయనగరం ఉడాకాలనీ, న్యూస్టుడే: ‘రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వారిని కేసుల్లో ఇరికించి, జైళ్లకు పంపించారు. పోరాడాలంటేనే భయపడే పరిస్థితిని తీసుకొచ్చారు’ అని ఏపీజీఈఏ(ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్) రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆర్.సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనుదారుల ఐక్యవేదిక సమావేశం ఆదివారం విజయనగరంలోని ఆనందగజపతి ఆడిటోరియంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీపీఎస్ రద్దు చేసి, ఓపీఎస్ తీసుకు రావాలని ఆందోళనలు చేసినా ప్రయోజనం చేకూరలేదన్నారు. కొత్తగా జీపీఎఫ్ చట్టం తీసుకొచ్చారని, రాష్ట్రంలో ఏ చట్టం ఎప్పుడు వస్తోందో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా నడుచుకోవడం లేదని మండిపడ్డారు. జీపీఎఫ్ సొమ్మును అక్రమంగా కాజేసిందని ఆరోపించారు. రూ.483 కోట్ల నిధులు సంబంధిత ఖాతా నుంచి పక్కదారి పట్టినట్లు స్వయంగా కేంద్రమే ప్రకటించిందని గుర్తుచేశారు. ఉద్యోగుల అవసరాలకు దాచుకున్న సొమ్మును ఎలా తీసేస్తారని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులు ప్రైవేటు ఉద్యోగులో, ప్రభుత్వ ఉద్యోగులో తెలియని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. సచివాలయాల వ్యవస్థ లోపభూయిష్టంగా ఉందన్నారు. మెడికల్ రీయంబర్స్మెంట్ పథకానికి సంబంధించి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారులను మోసం చేశారని విమర్శించారు. ఆరోగ్య కార్డులతో ఆసుపత్రులకు వెళితే ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా ఉద్యోగులంతా మేల్కోవాలని పిలుపునిచ్చారు. వారిలో చైతన్యం నింపేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నామని వెల్లడించారు. అందులో భాగంగా విజయనగరంలో తొలి సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో 30 సంఘాలు ఐక్యవేదికగా ఏర్పడి 12 ప్రాధాన్యత అంశాలను లేవనెత్తనున్నామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నను మించిన అన‘కొండ’లు
[ 29-04-2024]
మృత్యుదూతగా పేరొందాడు నాటి యమకింకరుడు.. కంకరను బొక్కేసే నాయకులను వెనకుండి నడిపిస్తున్నాడు నేటి యమకంకరుడు జగన్.. ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అదేపనిగా తవ్వకాలు ప్రారంభించిన కొందరు కేటుగాళ్లు ఈ ఐదేళ్ల కాలంలో పెద్దపెద్ద కొండలనే కరిగించేశారు. -
సర్కారు వారి గూడు పుఠాణి
[ 29-04-2024]
ఐదేళ్ల పాలన పూర్తయింది.. అయినా చాలా చోట్ల నిర్మాణాలు పూర్తి చేయలేదు. ఎన్నికల ముందు విజయనగరం, సాలూరులో హడావుడిగా కొన్ని చోట్ల అప్పగించి చేతులు దులుపుకొన్నారు. -
జగన్.. ఈ పాపం నీదే
[ 29-04-2024]
విజయనగరం జిల్లా వంగర, మన్యం జిల్లాలోని బలిజిపేట మండలాల్లో ఉన్న 17 గ్రామాలకు ప్రధాన సాగునీటి వనరును నేను.. దాదాపు 8 వేల ఎకరాలకు పైగా తడివ్వాల్సిన బాధ్యత నాది.. నా ఆయకట్టు పరిధిలో బంగారం పండే పొలాలున్నాయి.. -
రాష్ట్ర భవిష్యత్తు కోసమే కూటమి
[ 29-04-2024]
రాష్ట్ర భవిష్యత్తు కోసమే మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్గజపతిరాజు అన్నారు. ఆదివారం రాత్రి విజయనగరంలోని పుత్సలవీధి, పూల్బాగ్ కాలనీల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. -
ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయాలి
[ 29-04-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయాలని, అదే సమయంలో ప్రైవేటు వైద్యాలయాలను ఆదుకోవాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డా.ఆర్వీ.అశోకన్ అన్నారు. -
ఓటు వినియోగంతో ప్రశ్నించే హక్కు
[ 29-04-2024]
రాబోయే ఎన్నికల్లో ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, అప్పుడే నాయకులను ప్రశ్నించే హక్కు లభిస్తుందని మెప్మా సీఎంఎం సన్యాసిరావు అన్నారు. -
సమన్వయంతో పనిచేయాలి
[ 29-04-2024]
ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి, కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. -
5, 6, 7వ తేదీల్లో పోస్టల్ బ్యాలెట్
[ 29-04-2024]
సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ సిబ్బందికి విధుల కేటాయింపు రెండో విడత ప్రక్రియ ఆదివారం పూర్తి చేశారు. -
గొంతు తడిపే ఆలోచనుందా..?
[ 29-04-2024]
వేసవి ఆరంభంతోనే ఆ 44 గ్రామాల్లో దాహార్తి మొదలవుతుంది. నీటి కోసం కోటి పాట్లు పడాల్సిన పరిస్థితి. తోడుదామంటే బావుండదు.. వెళ్దామంటే బోరు కనిపించదు.. -
తెదేపా విశాఖ ఉత్తర పరిశీలకుడిగా రవిశేఖర్
[ 29-04-2024]
విశాఖ తెదేపా ఉత్తర నియోజకవర్గ పరిశీలకుడిగా సువ్వాడ రవిశేఖర్ను ఆ పార్టీ అధిష్ఠానం ఆదివారం నియమించింది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం పరిశీలకుడిగా ఆయన ఉన్నారు. -
కంకర గుటకాయ స్వాహా
[ 29-04-2024]
కొండలు.. గుట్టలు.. అనే తేడా లేదు.. ఎక్కడ మట్టి కనిపిస్తే అక్కడ తవ్వేస్తాం.. ఎర్రమట్టిని అమ్మేస్తాం.. అడిగితే దౌర్జన్యానికి దిగుతాం.. అన్న రీతిలో నడుస్తోంది గరివిడి, గజపతినగరం నియోజకవర్గాల్లో అక్రమ తవ్వకాల పరిస్థితి. -
ఇళ్లన్నావ్.. రోడ్డున పడేశావ్
[ 29-04-2024]
పేదల సొంతింటి కల నెరవేరుస్తామని ఆశలు పెంచి, హామీలు గుప్పించిన జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత మోసం చేశారు. ఐదేళ్లుగా సొంత గూడులేని వారి గోడును పట్టించుకోకుండా నిర్లక్ష్య వైఖరి అవలంబించారు. -
చంద్రబాబుతోనే సంక్షేమం
[ 29-04-2024]
రాష్ట్రంలో ప్రజల సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమని కూటమి అభ్యర్థి బేబినాయన అన్నారు. రానున్న ఎన్నికల్లో గెలిపించాలని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’