ఇసుకాసురులు... నదులను రక్షిస్తారా?
నదులు కనిపిస్తే చాలు.. అధికార పార్టీ నాయకులు ఓ కన్నేస్తారు.. ఎందుకంటారా.. ప్రవాహం తగ్గిన వెంటనే ఇసుక దోచేయడానికి. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే పెద్దఎత్తున తవ్వేశారు కొందరు కేటుగాళ్లు.. అలాంటిది వారు నదులను సంరక్షిస్తారని కేంద్రం నమ్మేసినట్లుంది.
మురుగుశుద్ధికి కేంద్రమిచ్చిన నిధులు నిరుపయోగం
ఐదేళ్లలో వైకాపా చేసింది శూన్యం
చినహరిజనపేట వద్ద నదిలో కలుస్తున్న వ్యర్థాలు, మురుగునీరు
నదులు కనిపిస్తే చాలు.. అధికార పార్టీ నాయకులు ఓ కన్నేస్తారు.. ఎందుకంటారా.. ప్రవాహం తగ్గిన వెంటనే ఇసుక దోచేయడానికి. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే పెద్దఎత్తున తవ్వేశారు కొందరు కేటుగాళ్లు.. అలాంటిది వారు నదులను సంరక్షిస్తారని కేంద్రం నమ్మేసినట్లుంది. మురుగు, వ్యర్థాలు కలవకుండా రూ.కోట్ల మేర నిధులు విడుదల చేసింది. మాటల మూటలే తప్ప.. పనులు చేయడం చేతగాని ఈ ప్రభుత్వం సరే అని చెప్పింది. అరకొరగా ట్యాంకులు పెట్టి, పదే పది రోజులు ప్రక్రియను చేపట్టింది. అంతే.. ఆ తరువాత గాలికొదిలేసింది. ఈ చర్యలను చూసిన సాలూరు పరిధిలోని వేగావతి నది బోరుమంటోంది.
న్యూస్టుడే, సాలూరు
నదులు, చెరువులు కలుషితం కాకుండా చర్యలు చేపట్టాలని కేంద్రం రూ.కోట్ల నిధులు మంజూరు చేసింది. మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని కాలుష్య నియంత్రణ మండలి సైతం ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ వైకాపా అయిదేళ్ల పాలనలో కనీస చర్యలు లేవు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ప్రధానమైన వేగావతి నది మురుగుమయం అవుతోంది. పాచిపెంట, సాలూరు, బొబ్బిలి మండలాల్లో దాదాపు 40 కి.మీలకు పైగా ఇది ప్రవహిస్తోంది. ఒకప్పుడు తీర ప్రాంతాల వారు ఈ నీటినే వినియోగించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. పెద్దఎత్తున వ్యర్థాలు చేరుతున్నాయి. ఒక్క సాలూరు పట్టణంలోనే గుమడాం, రెల్లివీధి, శివాలయం రోడ్డు, గాంధీనగర్, నెయ్యిలవీధి, చినహరిజనపేట, కర్రివీధి, మజ్జులపేట ప్రాంతాల్లో మురుగునీరు నేరుగా కలిసిపోతోంది. వ్యర్థజలాలు కలవకుండా ఔట్లెట్ కాలువ నిర్మించాల్సి ఉంది. ఐదేళ్లలో అదీ లేదు. గతంలో సగం వరకు నిర్మించిన కాలువ కూడా పూడికతో నిండిపోయింది.
మురుగునీటి శుద్ధి కోసం గతంలో గాంధీనగర్ వద్ద ఏర్పాటు చేసిన రసాయన ట్యాంకులివి. నిర్వహణ లేక పది రోజులకే తొలగించారు
ప్రతిపానలకే పరిమితం..
మురుగునీరు నదిలో కలవకుండా చర్యలు చేపట్టి, ఆ నీటిని శుద్ధి చేసే కేంద్రం ఏర్పాటుకు కేంద్రం సుమారు రూ.5 కోట్ల నిధులు వెచ్చించేందుకు ముందుకొచ్చింది. ఇందులో భాగంగా ప్రభావిత ప్రాంతాలను గుర్తించారు. ఔట్లెట్ కాలువ, శుద్ధి కేంద్రం నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. ఈమేరకు రూ.1.50 కోట్ల నిధులు విడుదలయ్యాయి. స్థలం అందుబాటులో లేకపోవడంతో శుద్ధి కేంద్రం ఏర్పాటు ప్రక్రియ ప్రతిపాదనలకే పరిమితం చేశారు. ఈ నేపథ్యంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మండిపడింది. ఆ చర్యలను తప్పించుకునేందుకు మొక్కుబడిగా తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. రెండు రసాయన ట్యాంకులు, నిరంతర పర్యవేక్షణకు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. పదిరోజుల్లోనే అవన్నీ మాయమయ్యాయి.
రసాయనాలు సైతం..
సాలూరు పట్టణంలో లారీ మోటారు పరిశ్రమకు చెందిన వేలాది మందితో పాటు బంగారు, వెండి, ఇత్తడి పనులు చేసే కార్మికులున్నారు. వాహనాలకు మరమ్మతులు చేసిన తరువాత వచ్చే ఆయిల్, ఆభరణాల తయారీ, శుభ్రతకు వినియోగించే రసాయనాలు కూడా నదిలో చేరుతున్నాయి. సాలూరు, బొబ్బిలి పట్టణాల ప్రజలకు నిత్యం అందించాల్సిన 7 ఎంఎల్డీ నీటికి ఇదే దిక్కు. ప్రస్తుతం పూర్తిస్థాయిలో అందడం లేదు. శుభ్రతకే సగం మేర ఖర్చవుతోంది. బొబ్బిలి పట్టణ ప్రజలకు తాగునీరు అందించే భోజరాజపురం నీటి సరఫరా కేంద్రానికి కూడా ఈ నది నీరే దిక్కు. జలాలు కలుషితం కావడంతో గతంలో శివరాంపురం, పారన్నవలస, రొంపల్లి గ్రామాల్లో ప్రజలు అనారోగ్యానికి గురయ్యారు.
సాలూరులో వేగావతి వంతెన కింద దుస్థితి..
చర్యలు చేపడుతున్నాం..
‘శుద్ధి కేంద్రం ఏర్పాటుకు స్థల పరిశీలన జరుగుతోంది. అవసరమైతే కొనుగోలుకు చర్యలు తీసుకుంటాం. నిధులు సైతం ఉన్నాయి. నదిలోకి కాలువల నీరు చేరకుండా చూస్తున్నాం.’ అని పురపాలిక ఏఈ సూరినాయుడు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నను మించిన అన‘కొండ’లు
[ 29-04-2024]
మృత్యుదూతగా పేరొందాడు నాటి యమకింకరుడు.. కంకరను బొక్కేసే నాయకులను వెనకుండి నడిపిస్తున్నాడు నేటి యమకంకరుడు జగన్.. ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అదేపనిగా తవ్వకాలు ప్రారంభించిన కొందరు కేటుగాళ్లు ఈ ఐదేళ్ల కాలంలో పెద్దపెద్ద కొండలనే కరిగించేశారు. -
సర్కారు వారి గూడు పుఠాణి
[ 29-04-2024]
ఐదేళ్ల పాలన పూర్తయింది.. అయినా చాలా చోట్ల నిర్మాణాలు పూర్తి చేయలేదు. ఎన్నికల ముందు విజయనగరం, సాలూరులో హడావుడిగా కొన్ని చోట్ల అప్పగించి చేతులు దులుపుకొన్నారు. -
జగన్.. ఈ పాపం నీదే
[ 29-04-2024]
విజయనగరం జిల్లా వంగర, మన్యం జిల్లాలోని బలిజిపేట మండలాల్లో ఉన్న 17 గ్రామాలకు ప్రధాన సాగునీటి వనరును నేను.. దాదాపు 8 వేల ఎకరాలకు పైగా తడివ్వాల్సిన బాధ్యత నాది.. నా ఆయకట్టు పరిధిలో బంగారం పండే పొలాలున్నాయి.. -
రాష్ట్ర భవిష్యత్తు కోసమే కూటమి
[ 29-04-2024]
రాష్ట్ర భవిష్యత్తు కోసమే మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్గజపతిరాజు అన్నారు. ఆదివారం రాత్రి విజయనగరంలోని పుత్సలవీధి, పూల్బాగ్ కాలనీల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. -
ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయాలి
[ 29-04-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయాలని, అదే సమయంలో ప్రైవేటు వైద్యాలయాలను ఆదుకోవాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డా.ఆర్వీ.అశోకన్ అన్నారు. -
ఓటు వినియోగంతో ప్రశ్నించే హక్కు
[ 29-04-2024]
రాబోయే ఎన్నికల్లో ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, అప్పుడే నాయకులను ప్రశ్నించే హక్కు లభిస్తుందని మెప్మా సీఎంఎం సన్యాసిరావు అన్నారు. -
సమన్వయంతో పనిచేయాలి
[ 29-04-2024]
ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి, కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. -
5, 6, 7వ తేదీల్లో పోస్టల్ బ్యాలెట్
[ 29-04-2024]
సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ సిబ్బందికి విధుల కేటాయింపు రెండో విడత ప్రక్రియ ఆదివారం పూర్తి చేశారు. -
గొంతు తడిపే ఆలోచనుందా..?
[ 29-04-2024]
వేసవి ఆరంభంతోనే ఆ 44 గ్రామాల్లో దాహార్తి మొదలవుతుంది. నీటి కోసం కోటి పాట్లు పడాల్సిన పరిస్థితి. తోడుదామంటే బావుండదు.. వెళ్దామంటే బోరు కనిపించదు.. -
తెదేపా విశాఖ ఉత్తర పరిశీలకుడిగా రవిశేఖర్
[ 29-04-2024]
విశాఖ తెదేపా ఉత్తర నియోజకవర్గ పరిశీలకుడిగా సువ్వాడ రవిశేఖర్ను ఆ పార్టీ అధిష్ఠానం ఆదివారం నియమించింది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం పరిశీలకుడిగా ఆయన ఉన్నారు. -
కంకర గుటకాయ స్వాహా
[ 29-04-2024]
కొండలు.. గుట్టలు.. అనే తేడా లేదు.. ఎక్కడ మట్టి కనిపిస్తే అక్కడ తవ్వేస్తాం.. ఎర్రమట్టిని అమ్మేస్తాం.. అడిగితే దౌర్జన్యానికి దిగుతాం.. అన్న రీతిలో నడుస్తోంది గరివిడి, గజపతినగరం నియోజకవర్గాల్లో అక్రమ తవ్వకాల పరిస్థితి. -
ఇళ్లన్నావ్.. రోడ్డున పడేశావ్
[ 29-04-2024]
పేదల సొంతింటి కల నెరవేరుస్తామని ఆశలు పెంచి, హామీలు గుప్పించిన జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత మోసం చేశారు. ఐదేళ్లుగా సొంత గూడులేని వారి గోడును పట్టించుకోకుండా నిర్లక్ష్య వైఖరి అవలంబించారు. -
చంద్రబాబుతోనే సంక్షేమం
[ 29-04-2024]
రాష్ట్రంలో ప్రజల సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమని కూటమి అభ్యర్థి బేబినాయన అన్నారు. రానున్న ఎన్నికల్లో గెలిపించాలని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు