జగనన్న ‘నయా మోసం’
‘ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన ఆరు నెలల్లో వడ్డీతో సహా డబ్బులు చెల్లించి బాధితులకు న్యాయం చేస్తా.’
అగ్రిగోల్డ్ బాధితుల ఎదురుచూపులు
‘ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన ఆరు నెలల్లో వడ్డీతో సహా డబ్బులు చెల్లించి బాధితులకు న్యాయం చేస్తా.’
అగ్రిగోల్డ్ బాధితులకు ఎన్నికల ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ.
హామీ ఇవ్వడంతో ప్రభుత్వం వైపు ఎంతో ఆశగా అయిదేళ్లు ఎదురుచూశాం. అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగి వినతులు అందజేశాం. చివరకు వైద్య ఖర్చులు, పిల్లల వివాహాలు ఇతరత్రా ఖర్చులకు డబ్బులు లేక అప్పుల పాలయ్యాం.. కొందరు ఆర్థిక, మానసిక ఒత్తిళ్లతో ఆత్మహత్యలకు, అసహజ మరణాలకు గురయ్యారు. వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
బాధితులు న్యూస్టుడే, విజయనగరం అర్బన్
ఉమ్మడి జిల్లాలో 1.50 లక్షల మందికి పైగా అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు. 2020, 2021లో రెండు విడతలుగా రూ.10 వేలు, రూ.20 వేలు లోపు మొత్తాలు 1,20,225 మందికి రూ.102.83 కోట్లు చెల్లించినట్లు అప్పట్లో అధికారులు వెల్లడించారు. వడ్డీ కాకుండా కేవలం లబ్ధిదారులు కట్టిన మొత్తాన్ని మాత్రమే చెల్లించారు. రెండో విడతగా ఇచ్చిన రూ.20 వేల మొత్తాలు కొందరికి అందని పరిస్థితి ఉంది. రూ.20 వేల పైబడిన మొత్తాల డిపాజిట్ల ఊసే లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని బాధితులు వాపోతున్నారు. ఒక వ్యక్తికి ఒకే బాండు మేరకే చెల్లింపులు చేశారు. దీంతో రెండు, మూడు బాండ్లు ఉన్న వారు నష్టపోయారు. రూ.5 లక్షలు, రూ.10 లక్షలు, రూ.20 లక్షల మొత్తాలు డిపాజిట్లు చేసిన వారికి రూ.10 వేలు మాత్రమే వచ్చాయి. ప్రస్తుతం వీరంతా సాయం కోసం ఎదురు చూస్తున్నారు.
కలెక్టరేట్కు వచ్చిన బాధితులు (పాత చిత్రం)
తెదేపా హయాంలో న్యాయస్థానంలో ఉన్న ఆస్తులు అమ్మి ఇచ్చారు. ప్రతిపక్ష నేత హోదాలో ఇచ్చిన మాట మేరకు జగన్ న్యాయం చేయలేదు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు పరిహారం లేదు. సంస్థ ఆస్తులు స్వాధీనం చేసుకుని సత్వరమే డిపాజిట్లు ఇప్పించాలి.
- పి.కామేశ్వరరావు, అధ్యక్షుడు, అగ్రిగోల్డ్ కస్టమర్, ఏజెంట్స్ సంక్షేమ సంఘం, ఉమ్మడి విజయనగరం జిల్లా
స్పందనలో వినతులు
బాధితులు తమకు న్యాయం చేయాలని ఏళ్లుగా మొరపెట్టుకుంటున్నారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వారంతా పలుమార్లు కలెక్టరేట్లో స్పందనలో అధికారులకు ఫిర్యాదు చేశారు. వైద్య ఖర్చులు, పిల్లల వివాహాలు, కుటుంబ అవసరాలకు డబ్బుల్లేక అప్పులు చేశామని పేర్కొన్నారు. డబ్బులు రాక ఉమ్మడి జిల్లాలో పది మంది వరకు సహజ మరణంతో పాటు ఆత్మహత్య చేసుకున్నట్లు బాధితుల సంఘం నాయకులు చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు నిస్సహాయులుగా మారి ప్రభుత్వ ఓదార్పు కోసం ఎదురుచూస్తున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో ఇచ్చిన మాట మేరకు మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని కోరుతున్నారు.
నేను, నా భార్య కలిపి రూ.5 లక్షల డిపాజిట్లు వేశాం. నేటికీ అతీగతి లేదు. రూ.10 వేల బాండుకు మాత్రమే డబ్బులు వచ్చాయి. రూ.50 వేలు, రూ.లక్ష బాండ్లకు నేటికీ డబ్బులు ఇవ్వలేదు. రూ.20 వేల లోపు మొత్తాలు ఇచ్చినప్పుడు నాకు రాలేదు.
పి.సింహాచలం, బుడతనాపల్లి
ఒకటికి మించి బాండ్లు కలిగిన వారికి డబ్బులు పడలేదు. రూ.5 లక్షలు డిపాజిట్లు వేశాను. రూ.10 వేల చొప్పున రెండు సార్లు పడ్డాయి. రూ.20 వేల డిపాజిట్ల చెల్లింపు సమయంలో రాలేదు.
పి.అప్పలనర్సింహులు, గంట్యాడ
రూ.17 లక్షలు.. వచ్చింది రూ.10 వేలు
రూ.17 లక్షలు డిపాజిట్ వేశాను. ఇప్పటి వరకు రూ.10 వేలు వచ్చింది. నా వయసు 65 సంవత్సరాలు. ఆరోగ్యం బాగోలేదు. చికిత్సకు అవసరమైన డబ్బుల్లేక అక్కడక్కడ అప్పులు చేసుకుని బైపాస్ సర్జరీ చేయించుకున్నాను. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా. అగ్రిగోల్డ్ ఆస్తులు స్వాధీనం చేసుకుని బాధితులకు న్యాయం చేయాలి.
కె.ఆనందరావు, విజయనగరం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నను మించిన అన‘కొండ’లు
[ 29-04-2024]
మృత్యుదూతగా పేరొందాడు నాటి యమకింకరుడు.. కంకరను బొక్కేసే నాయకులను వెనకుండి నడిపిస్తున్నాడు నేటి యమకంకరుడు జగన్.. ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అదేపనిగా తవ్వకాలు ప్రారంభించిన కొందరు కేటుగాళ్లు ఈ ఐదేళ్ల కాలంలో పెద్దపెద్ద కొండలనే కరిగించేశారు. -
సర్కారు వారి గూడు పుఠాణి
[ 29-04-2024]
ఐదేళ్ల పాలన పూర్తయింది.. అయినా చాలా చోట్ల నిర్మాణాలు పూర్తి చేయలేదు. ఎన్నికల ముందు విజయనగరం, సాలూరులో హడావుడిగా కొన్ని చోట్ల అప్పగించి చేతులు దులుపుకొన్నారు. -
జగన్.. ఈ పాపం నీదే
[ 29-04-2024]
విజయనగరం జిల్లా వంగర, మన్యం జిల్లాలోని బలిజిపేట మండలాల్లో ఉన్న 17 గ్రామాలకు ప్రధాన సాగునీటి వనరును నేను.. దాదాపు 8 వేల ఎకరాలకు పైగా తడివ్వాల్సిన బాధ్యత నాది.. నా ఆయకట్టు పరిధిలో బంగారం పండే పొలాలున్నాయి.. -
రాష్ట్ర భవిష్యత్తు కోసమే కూటమి
[ 29-04-2024]
రాష్ట్ర భవిష్యత్తు కోసమే మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్గజపతిరాజు అన్నారు. ఆదివారం రాత్రి విజయనగరంలోని పుత్సలవీధి, పూల్బాగ్ కాలనీల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. -
ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయాలి
[ 29-04-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయాలని, అదే సమయంలో ప్రైవేటు వైద్యాలయాలను ఆదుకోవాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డా.ఆర్వీ.అశోకన్ అన్నారు. -
ఓటు వినియోగంతో ప్రశ్నించే హక్కు
[ 29-04-2024]
రాబోయే ఎన్నికల్లో ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, అప్పుడే నాయకులను ప్రశ్నించే హక్కు లభిస్తుందని మెప్మా సీఎంఎం సన్యాసిరావు అన్నారు. -
సమన్వయంతో పనిచేయాలి
[ 29-04-2024]
ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి, కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. -
5, 6, 7వ తేదీల్లో పోస్టల్ బ్యాలెట్
[ 29-04-2024]
సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ సిబ్బందికి విధుల కేటాయింపు రెండో విడత ప్రక్రియ ఆదివారం పూర్తి చేశారు. -
గొంతు తడిపే ఆలోచనుందా..?
[ 29-04-2024]
వేసవి ఆరంభంతోనే ఆ 44 గ్రామాల్లో దాహార్తి మొదలవుతుంది. నీటి కోసం కోటి పాట్లు పడాల్సిన పరిస్థితి. తోడుదామంటే బావుండదు.. వెళ్దామంటే బోరు కనిపించదు.. -
తెదేపా విశాఖ ఉత్తర పరిశీలకుడిగా రవిశేఖర్
[ 29-04-2024]
విశాఖ తెదేపా ఉత్తర నియోజకవర్గ పరిశీలకుడిగా సువ్వాడ రవిశేఖర్ను ఆ పార్టీ అధిష్ఠానం ఆదివారం నియమించింది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం పరిశీలకుడిగా ఆయన ఉన్నారు. -
కంకర గుటకాయ స్వాహా
[ 29-04-2024]
కొండలు.. గుట్టలు.. అనే తేడా లేదు.. ఎక్కడ మట్టి కనిపిస్తే అక్కడ తవ్వేస్తాం.. ఎర్రమట్టిని అమ్మేస్తాం.. అడిగితే దౌర్జన్యానికి దిగుతాం.. అన్న రీతిలో నడుస్తోంది గరివిడి, గజపతినగరం నియోజకవర్గాల్లో అక్రమ తవ్వకాల పరిస్థితి. -
ఇళ్లన్నావ్.. రోడ్డున పడేశావ్
[ 29-04-2024]
పేదల సొంతింటి కల నెరవేరుస్తామని ఆశలు పెంచి, హామీలు గుప్పించిన జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత మోసం చేశారు. ఐదేళ్లుగా సొంత గూడులేని వారి గోడును పట్టించుకోకుండా నిర్లక్ష్య వైఖరి అవలంబించారు. -
చంద్రబాబుతోనే సంక్షేమం
[ 29-04-2024]
రాష్ట్రంలో ప్రజల సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమని కూటమి అభ్యర్థి బేబినాయన అన్నారు. రానున్న ఎన్నికల్లో గెలిపించాలని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’