logo

2.6 కిలోల బంగారం స్వాధీనం

విజయనగరంలోని కన్యకాపరమేశ్వరి కోవెల సమీపంలో ఈనెల 12న అర్ధరాత్రి చేపట్టిన వాహన తనిఖీల్లో భాగంగా ఓ వ్యక్తి నుంచి భారీగా బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నామని సీఐ వెంకటరావు తెలిపారు.

Published : 15 Apr 2024 03:20 IST

ఆభరణాలను పరిశీలిస్తున్న పోలీసులు

విజయనగరం నేరవార్తా విభాగం, న్యూస్‌టుడే: విజయనగరంలోని కన్యకాపరమేశ్వరి కోవెల సమీపంలో ఈనెల 12న అర్ధరాత్రి చేపట్టిన వాహన తనిఖీల్లో భాగంగా ఓ వ్యక్తి నుంచి భారీగా బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నామని సీఐ వెంకటరావు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. విశాఖకు చెందిన ఓ వ్యక్తి విజయనగరంలోని బంగారం దుకాణాలకు  ఆభరణాలు అందించేందుకు వచ్చారు. అయితే ఎలాంటి పత్రాలు లేకపోవడంతో 2.6 కిలోల బంగారం, రూ.17.95 లక్షల నగదును సీజ్‌ చేసినట్లు సీఐ వెల్లడించారు. తదుపరి విచారణ నిమిత్తం జిల్లా అధికారులకు వివరాలు తెలియజేశామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని