తుస్.. ఫిష్
తక్కువ ధరకే తాజా.. చెరువులు, సముద్రంలో పెరిగే నాణ్యమైన చేపలను విక్రయిస్తామని భారీ ఎత్తున ప్రచారం చేసి ఏర్పాటు చేసిన ఫిష్ ఆంధ్ర అవుట్లెట్లు జిల్లాలో మూలకు చేరాయి.
మూలకు చేరిన యూనిట్లు
యువత దరిచేరని ఉపాధి
మాంసం దుకాణాలుగా.. సాలూరు మండలం జీగిరాం, మామిడిపల్లి, బాగువలసలో ఫిష్ ఆంధ్ర కేంద్రాలు ప్రారంభించారు. జీగిరాంలో నడుస్తుండగా మిగిలిన చోట్ల కోడిమాంసం విక్రయ దుకాణాలుగా మారాయి.
న్యూస్టుడే, సాలూరు గ్రామీణం
పార్వతీపురం, పట్టణం, పాచిపెంట, సీతంపేట, న్యూస్టుడే: తక్కువ ధరకే తాజా.. చెరువులు, సముద్రంలో పెరిగే నాణ్యమైన చేపలను విక్రయిస్తామని భారీ ఎత్తున ప్రచారం చేసి ఏర్పాటు చేసిన ఫిష్ ఆంధ్ర అవుట్లెట్లు జిల్లాలో మూలకు చేరాయి. యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ప్రారంభించిన ఈ పథకం ఏమైందో తెలియని పరిస్థితి. చేపలు కొందామని కేంద్రాలకు వెళ్లే వారికి ఖాళీ బోర్డులు, కోడి మాంసం, కిరాణా సరకులు తప్ప ఏమీ దొరకని దుస్థితి.
మన్యం జిల్లాలో 74 మినీ యూనిట్ల ఏర్పాటుకు రూ.41.31 లక్షలు విడుదల చేశారు. వీటిలో స్పోక్స్ పేరుతో నాలుగు అంచెల్లో పథకాలకు రూపకల్పన చేశారు. రూ.10 లక్షలు, రూ.20 లక్షలు, రూ.50 లక్షలు, రూ.కోటి వ్యయంతో ఆక్వా హబ్ల ఏర్పాటుకు నిర్ణయించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన మినీ కేంద్రాల్లో ఒకటి రెండు తప్ప మిగిలిన వాటిలో చాలా వరకు మూతపడ్డాయి. కొన్ని చోట్ల మాంసం, కిరాణా సరకులు విక్రయిస్తున్నారు. వీటితో ఉపాధి పొందుతున్న యువత సంఖ్య పదిలోపే ఉంది.
గిట్టుబాటు కాక..
సీతంపేటలో మూడు మంజూరు కాగా రెండు ప్రారంభమ్యాయి. కానీ ఒక్కటే అప్పుడప్పుడు తెరుస్తున్నారు. ఇక్కడ చేపలు చనిపోకుండా అవసరమైన ఆక్సిజన్ యూనిట్ ఇవ్వలేదు. శాఖాపరంగా చేపల సరఫరా లేదు. దగ్గరలో చెరువులు లేక ఇతర ప్రాంతాల నుంచి అధిక ఖర్చుతో తీసుకొచ్చి విక్రయించాల్సిన పరిస్థితి. దీంతో గిట్టుబాటు కావడం లేదని మత్స్యకారుల వాదన.
ఇదీ పరిస్థితి
పాలకొండ నియోజకవర్గంలో రూ.కోటి వ్యయంతో ఆక్వా హబ్ను మంజూరు చేశారు. ఇక్కడ ఏర్పాటుకు స్థలం లేక దీనికి బదులు శ్రీకాకుళం జిల్లా హిరమండలంలో మంజూరైన హబ్ను ఏర్పాటు చేసే పనిలో యంత్రాంగం ఉంది. రూ.50 లక్షల వ్యయంతో లాంజ్ ఏర్పాటు చేయాల్సి ఉంది.
తగినన్ని లేక..
పాచిపెంట మండలం పాచిపెంట, కేసలి, కోడికాళ్లవలస, మాతుమూరు, పాంచాలి, సాలూరు మండలం మామిడిపల్లి, బాగువలసలో మినీ అవుట్లెట్లు ఉన్నాయి. పాచిపెంట మండలంలోని కొన్నిచోట్ల నిర్వాహకులు సొంతంగా షెడ్లు నిర్మించుకున్నారు. పాచిపెంటలో పూర్తిగా మూతపడింది. మిగిలిన చోట్ల అదే పరిస్థితి. మామిడిపల్లి, బాగువలసలో మాంసం విక్రయాలు జరుగుతున్నాయి. తమకు చేపలు పంపిణీ చేస్తే తప్ప కేంద్రాలు నిర్వహించలేమని లబ్ధిదారులు చెబుతున్నారు. మత్స్యశాఖ తగినన్ని చేపలను సరఫరా చేయడం లేదని చెబుతున్నారు.
కిరాణా సరకులు..
గుమ్మలక్ష్మీపురంలో రూ.20 లక్షలతో సూపర్ ఫిష్ ఆంధ్ర యూనిట్ నెలకొల్పారు. ఇక్కడ నిరంతరం చేపలు విక్రయించేందుకు సిద్ధంగా ఉండాలి. కానీ అనుకున్న స్థాయిలో వ్యాపారం లేదు. దీంతో వినియోగదారులను ఆకర్షించేందుకు కిరాణా సామగ్రి విక్రయిస్తున్నారు.
న్యూస్టుడే, గుమ్మలక్ష్మీపురం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నను మించిన అన‘కొండ’లు
[ 29-04-2024]
మృత్యుదూతగా పేరొందాడు నాటి యమకింకరుడు.. కంకరను బొక్కేసే నాయకులను వెనకుండి నడిపిస్తున్నాడు నేటి యమకంకరుడు జగన్.. ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అదేపనిగా తవ్వకాలు ప్రారంభించిన కొందరు కేటుగాళ్లు ఈ ఐదేళ్ల కాలంలో పెద్దపెద్ద కొండలనే కరిగించేశారు. -
సర్కారు వారి గూడు పుఠాణి
[ 29-04-2024]
ఐదేళ్ల పాలన పూర్తయింది.. అయినా చాలా చోట్ల నిర్మాణాలు పూర్తి చేయలేదు. ఎన్నికల ముందు విజయనగరం, సాలూరులో హడావుడిగా కొన్ని చోట్ల అప్పగించి చేతులు దులుపుకొన్నారు. -
జగన్.. ఈ పాపం నీదే
[ 29-04-2024]
విజయనగరం జిల్లా వంగర, మన్యం జిల్లాలోని బలిజిపేట మండలాల్లో ఉన్న 17 గ్రామాలకు ప్రధాన సాగునీటి వనరును నేను.. దాదాపు 8 వేల ఎకరాలకు పైగా తడివ్వాల్సిన బాధ్యత నాది.. నా ఆయకట్టు పరిధిలో బంగారం పండే పొలాలున్నాయి.. -
రాష్ట్ర భవిష్యత్తు కోసమే కూటమి
[ 29-04-2024]
రాష్ట్ర భవిష్యత్తు కోసమే మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్గజపతిరాజు అన్నారు. ఆదివారం రాత్రి విజయనగరంలోని పుత్సలవీధి, పూల్బాగ్ కాలనీల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. -
ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయాలి
[ 29-04-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయాలని, అదే సమయంలో ప్రైవేటు వైద్యాలయాలను ఆదుకోవాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డా.ఆర్వీ.అశోకన్ అన్నారు. -
ఓటు వినియోగంతో ప్రశ్నించే హక్కు
[ 29-04-2024]
రాబోయే ఎన్నికల్లో ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, అప్పుడే నాయకులను ప్రశ్నించే హక్కు లభిస్తుందని మెప్మా సీఎంఎం సన్యాసిరావు అన్నారు. -
సమన్వయంతో పనిచేయాలి
[ 29-04-2024]
ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి, కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. -
5, 6, 7వ తేదీల్లో పోస్టల్ బ్యాలెట్
[ 29-04-2024]
సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ సిబ్బందికి విధుల కేటాయింపు రెండో విడత ప్రక్రియ ఆదివారం పూర్తి చేశారు. -
గొంతు తడిపే ఆలోచనుందా..?
[ 29-04-2024]
వేసవి ఆరంభంతోనే ఆ 44 గ్రామాల్లో దాహార్తి మొదలవుతుంది. నీటి కోసం కోటి పాట్లు పడాల్సిన పరిస్థితి. తోడుదామంటే బావుండదు.. వెళ్దామంటే బోరు కనిపించదు.. -
తెదేపా విశాఖ ఉత్తర పరిశీలకుడిగా రవిశేఖర్
[ 29-04-2024]
విశాఖ తెదేపా ఉత్తర నియోజకవర్గ పరిశీలకుడిగా సువ్వాడ రవిశేఖర్ను ఆ పార్టీ అధిష్ఠానం ఆదివారం నియమించింది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం పరిశీలకుడిగా ఆయన ఉన్నారు. -
కంకర గుటకాయ స్వాహా
[ 29-04-2024]
కొండలు.. గుట్టలు.. అనే తేడా లేదు.. ఎక్కడ మట్టి కనిపిస్తే అక్కడ తవ్వేస్తాం.. ఎర్రమట్టిని అమ్మేస్తాం.. అడిగితే దౌర్జన్యానికి దిగుతాం.. అన్న రీతిలో నడుస్తోంది గరివిడి, గజపతినగరం నియోజకవర్గాల్లో అక్రమ తవ్వకాల పరిస్థితి. -
ఇళ్లన్నావ్.. రోడ్డున పడేశావ్
[ 29-04-2024]
పేదల సొంతింటి కల నెరవేరుస్తామని ఆశలు పెంచి, హామీలు గుప్పించిన జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత మోసం చేశారు. ఐదేళ్లుగా సొంత గూడులేని వారి గోడును పట్టించుకోకుండా నిర్లక్ష్య వైఖరి అవలంబించారు. -
చంద్రబాబుతోనే సంక్షేమం
[ 29-04-2024]
రాష్ట్రంలో ప్రజల సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమని కూటమి అభ్యర్థి బేబినాయన అన్నారు. రానున్న ఎన్నికల్లో గెలిపించాలని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’