logo

ఉప ముఖ్యమంత్రి హోదాలో ఏం చేశారు?

ఉప ముఖ్యమంత్రి హోదాలో రాజన్నదొర ఉండి సొంత మండలానికి, గ్రామానికి ఏం చేశారని తెదేపా ఉమ్మడి అభ్యర్థి జి.సంధ్యారాణి ప్రశ్నించారు.

Published : 15 Apr 2024 03:42 IST

మాట్లాడుతున్న సంధ్యారాణి

మక్కువ, న్యూస్‌టుడే: ఉప ముఖ్యమంత్రి హోదాలో రాజన్నదొర ఉండి సొంత మండలానికి, గ్రామానికి ఏం చేశారని తెదేపా ఉమ్మడి అభ్యర్థి జి.సంధ్యారాణి ప్రశ్నించారు. ఆదివారం మక్కువలోని ఓ ఆయిల్‌పాం తోటలో మండలాధ్యక్షుడు గుళ్ల వేణుగోపాలనాయుడు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార సమన్వయ సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ రాజన్నదొర సొంత పంచాయతీలోని కోదుపెద్దవలసలో పాఠశాల లేక రేకుల షెడ్డులో తరగతులు నిర్వహిస్తున్నారని, మక్కువ మండలానికి వచ్చే మార్గాలు ఏ ఒక్కటైనా బాగున్నాయా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గులకరాయి వేసుకుని కుట్లు వేయించుకున్నారని ఆరోపించారు. మండల ఆడపడుచుగా తనను గెలిపించాలని కన్నీటి పర్యంతమయ్యారు. మాజీ ఎమ్మెల్యే ఆర్‌పీ.భంజ్‌దేవ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనను అంతమొందించాలన్నారు. జనసేన నియోజకవర్గ సమన్వయకర్త జి.రిషివర్ధన్‌ మాట్లాడుతూ.. రాజన్నదొర సొంత మండలానికి కనీసం రోడ్డు కూడా వేయించుకోలేని అసమర్థ పాలన అందించారని మండిపడ్డారు. నాయకులు ఎం.ప్రసాదనాయుడు, బి.గౌరీశంకరరావు పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని