ఈసీ చెప్పినా వినరే
వాలంటీర్లను రాజకీయాలకు, ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసినా, వైకాపా మాత్రం వారిని వదలడం లేదు.
వాలంటీర్లతో ఇష్టారాజ్యంగా పనులు
పాచిపెంటలో రాజీనామా పత్రాలతో వాలంటీర్లు
పార్వతీపురం, న్యూస్టుడే: వాలంటీర్లను రాజకీయాలకు, ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసినా, వైకాపా మాత్రం వారిని వదలడం లేదు. ఎన్నికల్లో ప్రచార కార్యక్రమం, ఓటర్లను తమకు అనుకూలంగా మలచుకొనే బాధ్యత వారి నెత్తిన వేసి లబ్ధి పొందాలని ప్రయత్నిస్తోంది. ఆదివారం పార్వతీపురం శాసనసభ్యుడు వాలంటీర్లను ఇంటికి పిలిచి, వారితో సమావేశం నిర్వహించి దిశానిర్ధేశం చేశారని తెదేపా బట్టబయలు చేసింది. శనివారం ఎమ్మెల్యే జోగారావు విడుదల చేసినట్లు ప్రచారమైన చరవాణి సందేశంలో ఇప్పటి వరకు ప్రభుత్వ పథకాల లబ్ధి పొందిన వారిని కలిసి వైకాపాకే ఓటు వేసేలా వారందరినీ కోరాలని వాలంటీర్లను కోరిన విషయం విదితమే.
వలస ఓటర్ల బాధ్యత వారిదే
వైకాపా ప్రచారాల్లోనూ వాలంటీర్లు చురుకుగా పాల్గొంటున్నారు. వారిని అభ్యర్థుల ప్రైవేటు సైన్యంగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. వారి పరిధిలో ఉన్న 50 ఇళ్లలో ఉన్న ఓటరు జాబితాను తీసుకొని ఎవరు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటారో తెలుసుకోవాలని హుకుం జారీ చేశారు. అలాగే వలస ఓటర్లను గుర్తించి, వారు ఎక్కడ ఉన్నారు. ఏ పనిచేస్తున్నారు. రాకపోకలకు ఖర్చులు ఎంతవుతాయి? పని స్థలంలో వారి సంపాదన ఎంత వంటి విషయాలను కూడా తెలుసుకొని తమకు తెలియజేయాలని కొందరికి ఆ బాధ్యత అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. వారిని ఎన్నికల సమయానికి నియోజకవర్గానికి రప్పించే దిశగా ఏర్పాట్లు చేయాలని, వాలంటీర్లను, నాయకులు సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.
అవసరాలు తెలుసుకుంటే...
వాలంటీర్లు తమ పరిధిలోని 50 ఇళ్లలో ఎవరి అవసరాలు ఏమిటో తెలుసుకోవాలని వైకాపా నేతలు చెబుతున్నారు. ఆ మేరకు సమాచారాన్ని పార్టీ నాయకులకు చేరవేయడం వరకే వారి పని. వాటిని తీర్చే బాధ్యత స్థానిక నాయకులే చూసుకుంటారని చెబుతున్నారు. అలాగే వృద్దులు, దివ్యాంగులను కలిసి వారంతా పార్టీకే ఓట్లు వేసేలా సమాయత్తం చేసే పని కూడా వాలంటీర్లకే అప్పగించారు. చాలా మంది తమ పనిని గుట్టుచప్పుడు కాకుండా పూర్తిచేసినా, నేరుగా బీఎల్వోలు దిగి దరఖాస్తులు స్వీకరిస్తుండడంతో కొంత వరకు వీరి ప్రయత్నానికి గండి పడినట్లయ్యింది.
దివ్యాంగుల ఓట్ల వేటతో మొదలు
పార్వతీపురం నియోజకవర్గంలో దివ్యాంగుల ఓట్లను కొల్లగొట్టేందుకు వాలంటీర్లను రంగంలోకి దించి, వారిని బలిచేసే ప్రక్రియను ప్రారంభించారు. పెదబొండపల్లిలో ఫారం 12డి కోసం ఇద్దరు దివ్యాంగుల నుంచి సంతకాలు తీసుకున్న వాలంటీర్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దివ్యాంగులు, వయోవృద్ధులైన ఓటర్లను కలుసుకునే బాధ్యత కూడా వాలంటీర్లకే అప్పగించి, వారి ఓట్లను కొల్లగొట్టాలని ఆ పార్టీ నాయకులే బహిరంగ సభల్లో చెబుతున్నారు.
రాజీనామా చేయకున్నా..
వాలంటీర్లు పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో వారిపై నిఘా పెరిగింది. ఈ నేపథ్యంలో కొందరు రాజీనామా చేసి పార్టీ పనికి రావాలని పెద్దలే పిలుపునిచ్చారు. దీనికి స్పందించిన వారి సంఖ్య జిల్లాలో తక్కువగానే ఉంది. భారీగా ఉండగా, పదుల సంఖ్యలోనే రాజీనామాలు ఇచ్చారు. ఇవ్వని వారిని పిలిపించి, బాధ్యతలు నిర్వహిస్తూనే ఎన్నికల్లో ఎలాంటి బాధ్యత తీసుకోవాలో? తెలిపేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు వాలంటీర్లకు రెండు నెలల వేతనాన్ని చెల్లించారనే ప్రచారం ఉంది. దీంతో పాటు ఎన్నికల నిర్వహణకు కూడా వారి దగ్గర కొంత మొత్తాన్ని సిద్ధంగా ఉంచినట్లు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నను మించిన అన‘కొండ’లు
[ 29-04-2024]
మృత్యుదూతగా పేరొందాడు నాటి యమకింకరుడు.. కంకరను బొక్కేసే నాయకులను వెనకుండి నడిపిస్తున్నాడు నేటి యమకంకరుడు జగన్.. ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అదేపనిగా తవ్వకాలు ప్రారంభించిన కొందరు కేటుగాళ్లు ఈ ఐదేళ్ల కాలంలో పెద్దపెద్ద కొండలనే కరిగించేశారు. -
సర్కారు వారి గూడు పుఠాణి
[ 29-04-2024]
ఐదేళ్ల పాలన పూర్తయింది.. అయినా చాలా చోట్ల నిర్మాణాలు పూర్తి చేయలేదు. ఎన్నికల ముందు విజయనగరం, సాలూరులో హడావుడిగా కొన్ని చోట్ల అప్పగించి చేతులు దులుపుకొన్నారు. -
జగన్.. ఈ పాపం నీదే
[ 29-04-2024]
విజయనగరం జిల్లా వంగర, మన్యం జిల్లాలోని బలిజిపేట మండలాల్లో ఉన్న 17 గ్రామాలకు ప్రధాన సాగునీటి వనరును నేను.. దాదాపు 8 వేల ఎకరాలకు పైగా తడివ్వాల్సిన బాధ్యత నాది.. నా ఆయకట్టు పరిధిలో బంగారం పండే పొలాలున్నాయి.. -
రాష్ట్ర భవిష్యత్తు కోసమే కూటమి
[ 29-04-2024]
రాష్ట్ర భవిష్యత్తు కోసమే మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్గజపతిరాజు అన్నారు. ఆదివారం రాత్రి విజయనగరంలోని పుత్సలవీధి, పూల్బాగ్ కాలనీల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. -
ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయాలి
[ 29-04-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయాలని, అదే సమయంలో ప్రైవేటు వైద్యాలయాలను ఆదుకోవాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డా.ఆర్వీ.అశోకన్ అన్నారు. -
ఓటు వినియోగంతో ప్రశ్నించే హక్కు
[ 29-04-2024]
రాబోయే ఎన్నికల్లో ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, అప్పుడే నాయకులను ప్రశ్నించే హక్కు లభిస్తుందని మెప్మా సీఎంఎం సన్యాసిరావు అన్నారు. -
సమన్వయంతో పనిచేయాలి
[ 29-04-2024]
ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి, కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. -
5, 6, 7వ తేదీల్లో పోస్టల్ బ్యాలెట్
[ 29-04-2024]
సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ సిబ్బందికి విధుల కేటాయింపు రెండో విడత ప్రక్రియ ఆదివారం పూర్తి చేశారు. -
గొంతు తడిపే ఆలోచనుందా..?
[ 29-04-2024]
వేసవి ఆరంభంతోనే ఆ 44 గ్రామాల్లో దాహార్తి మొదలవుతుంది. నీటి కోసం కోటి పాట్లు పడాల్సిన పరిస్థితి. తోడుదామంటే బావుండదు.. వెళ్దామంటే బోరు కనిపించదు.. -
తెదేపా విశాఖ ఉత్తర పరిశీలకుడిగా రవిశేఖర్
[ 29-04-2024]
విశాఖ తెదేపా ఉత్తర నియోజకవర్గ పరిశీలకుడిగా సువ్వాడ రవిశేఖర్ను ఆ పార్టీ అధిష్ఠానం ఆదివారం నియమించింది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం పరిశీలకుడిగా ఆయన ఉన్నారు. -
కంకర గుటకాయ స్వాహా
[ 29-04-2024]
కొండలు.. గుట్టలు.. అనే తేడా లేదు.. ఎక్కడ మట్టి కనిపిస్తే అక్కడ తవ్వేస్తాం.. ఎర్రమట్టిని అమ్మేస్తాం.. అడిగితే దౌర్జన్యానికి దిగుతాం.. అన్న రీతిలో నడుస్తోంది గరివిడి, గజపతినగరం నియోజకవర్గాల్లో అక్రమ తవ్వకాల పరిస్థితి. -
ఇళ్లన్నావ్.. రోడ్డున పడేశావ్
[ 29-04-2024]
పేదల సొంతింటి కల నెరవేరుస్తామని ఆశలు పెంచి, హామీలు గుప్పించిన జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత మోసం చేశారు. ఐదేళ్లుగా సొంత గూడులేని వారి గోడును పట్టించుకోకుండా నిర్లక్ష్య వైఖరి అవలంబించారు. -
చంద్రబాబుతోనే సంక్షేమం
[ 29-04-2024]
రాష్ట్రంలో ప్రజల సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమని కూటమి అభ్యర్థి బేబినాయన అన్నారు. రానున్న ఎన్నికల్లో గెలిపించాలని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు