అమ్మపైనే అక్కసు
ప్రజలకు సంక్షేమ పాలన అందించేందుకు తెదేపా ప్రభుత్వం అమలు చేసిన పథకాలను భ్రష్టు పట్టించడమే ధ్యేయంగా జగన్మోహన్రెడ్డి పాలన సాగించారు. గత ప్రభుత్వంపై కక్ష సాధించేందుకు వసతి గృహాలను నిర్లక్ష్యం చేసి గిరిశిఖర గ్రామాల్లోని కాబోయే అమ్మకు అందే సేవలపైనే వేటు వేశారు.
గర్భిణుల వసతిగృహాల నిర్వహణపై నిర్లక్ష్యం
ప్రజలకు సంక్షేమ పాలన అందించేందుకు తెదేపా ప్రభుత్వం అమలు చేసిన పథకాలను భ్రష్టు పట్టించడమే ధ్యేయంగా జగన్మోహన్రెడ్డి పాలన సాగించారు. గత ప్రభుత్వంపై కక్ష సాధించేందుకు వసతి గృహాలను నిర్లక్ష్యం చేసి గిరిశిఖర గ్రామాల్లోని కాబోయే అమ్మకు అందే సేవలపైనే వేటు వేశారు.
సాలూరు, గుమ్మలక్ష్మీపురం, న్యూస్టుడే
దేశంలోనే తొలిసారిగా 2018లో తెదేపా హయాంలో గిరిశిఖర గ్రామాల్లో గర్భిణులకు అత్యున్నత సేవలు అందించేందుకు ఓ వసతి గృహాన్ని సాలూరు పట్టణంలో ఏర్పాటు చేశారు. సత్ఫలితాలు రావడంతో గుమ్మలక్ష్మీపురంలో మరొకటి నెలకొల్పారు. ఏడు నెలల నిండిన ప్రతి గర్భిణినీ ఇక్కడ చేర్పించి ఫుడ్ బకెట్ పేరుతో పాలు, గుడ్లు, పండ్లు, మిఠాయి, ఖర్జూరం, శనగ చిక్కీలు, రాగిజావ అందించేవారు. రోజూ వైద్య పరీక్షలు, రక్తహీనత, బీపీ, షుగర్ పరీక్షలు చేసి కంటికి రెప్పలా కాపాడేవారు. మన్యంలో మాతృ మరణాలను తగ్గించారు. ఇక్కడ సేవలను అప్పటో రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్, ముఖ్యమంత్రి, నీతి ఆయోగ్ కమిటీ సభ్యులు ప్రశంసించి జాతీయ పురస్కారం అందజేశారు. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లోనూ వీటిని ఏర్పాటు చేయాలని 2019లో అప్పటి గవర్నర్ అధికారులకు సూచనలు సైతం చేశారు.
తెదేపా హయాంలో..
మన్యంలో కొండలపైకి వెళ్లేందుకు రోడ్లు లేకపోవడంతో గర్భిణులు అత్యవసర సమయాల్లో ఆసుపత్రికి చేరుకునేందుకు డోలీలే దిక్కయ్యేవి. చాలా మందికి పోషకాహారం అందక రక్తహీనతతో బాధపడేవారు. ఇలాంటి సమస్యలతో గర్భిణులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలూ ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని తెదేపా హయాంలో గర్భిణుల వసతి గృహాలు ఏర్పాటు చేశారు. వైద్యం, పోషకాహారంతో పాటు యోగా చేయిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిపారు.
గతంలో వసతి గృహంలో బోరు, విద్యుత్తు మోటారు పాడవడంతో రెండు రోజుల పాటు నీటి సరఫరా జరగలేదు. దీనిపై ఎవరూ స్పందించకపోవడంతో గర్భిణులే సమస్యను పరిష్కరించాలని ఆందోళనకు దిగారు. దీంతో అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించారు.
ఈ ప్రభుత్వంలో..
వైకాపా అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారిపోయింది. వసతి గృహాల్లో సేవలు అరకొరగా మార్చేశారు. గతంలో అంబులెన్సులు వెళ్లలేని గ్రామాలకు కల్పించిన ఫీడర్ అంబులెన్సు సేవలు కనిపించడం లేదు. పోషకాహారం తగ్గించేశారు. చివరికి గర్భిణులే ఆరుబయట నీరు కాచుకుంటున్నారంటే వైకాపా పాలకులు పరిస్థితిని ఎంత దిగజార్చారో అర్థం చేసుకోవచ్చు.
ఇంధనానికీ డబ్బుల్లేవు..
ప్రస్తుత వైకాపా పాలనలో గర్భిణులను ఆసుపత్రులకు తీసుకెళ్లే అత్యవసర వాహనాలకు ఇంధనం కూడా అందించలేని గడ్డు పరిస్థితి నెలకొంది. మార్గమధ్యలో వాహనం నిలిచి నిండు చూలాలు నడిరోడ్డుపై నడిచిన ఘటనలూ జరిగాయి. అంబులెన్సు సేవలకు అంతరాయం కలగడంతో ఆటోలపై ఆసుపత్రికి చేరిన దుస్థితి ఎదురైంది. చలికాలంలో కట్టెల పొయ్యిపై స్వయంగా నీరు కాచుకోవడం, బకెట్లతో నీరు మోసుకోవడం మొదలైన ఘటనలతో ఇక్కడ చేరేందుకు గర్భిణులు సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు.
వసతి గృహంలో గ్రీజర్లు పనిచేయకపోవడంతో చలికాలంలో ఆరుబయట చెట్ల కింద నీరు కాస్తున్న గర్భిణులు (పాతచిత్రం)
జీతాలు ఇవ్వడం లేదు..
వసతి గృహంలో గర్భిణులకు సేవలు అందించే ఏఎన్ఎంలు, వైటీసీ సిబ్బందికి ఈ ప్రభుత్వం సక్రమంగా జీతాలు చెల్లించకపోవడంతో సేవలు తగ్గాయి. రాత్రి వేళల్లో గర్భిణికి ప్రసవ నొప్పులు వస్తే 108 వాహనంపై ఆధారపడాల్సిన దుస్థితి. సాలూరులో సోలార్ విద్యుత్తు పలకలు ఏర్పాటు చేసినా వినియోగంలో లేవు. రెండు చోట్లా జనరేటర్లు లేకపోవడంతో విద్యుత్తు అంతరాయం ఏర్పడితే చీకటి కష్టాలు తప్పడం లేదు. వైటీసీలు విద్యుత్తు ఛార్జీలు చెల్లించకపోవడంతో పలుమార్లు అధికారులు సరఫరా ఆపేసిన సందర్భాలు నెలకొన్నాయి.
అవగాహన ఏదీ.. గతంలో గర్భిణుల వద్దకు వైద్య సిబ్బంది వెళ్లి అవగాహన కల్పించి వసతి గృహానికి తీసుకువచ్చేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి పెద్దగా లేదు.
వైద్యుల లేమి.. వైద్య పరీక్షలు చేసేందుకు తెదేపా పాలనలో ప్రత్యేకంగా వైద్యులను నియమించి, రోజూ పరీక్షలు చేసేవారు. అత్యవసర వైద్యం కావాల్సిన వారిని అంబులెన్స్లో ఆసుపత్రికి చేర్చేవారు. ఈ ప్రభుత్వం వచ్చాక ప్రత్యేక వైద్యులు కానరావడం లేదు. చిన్న చిన్న సమస్యలకే ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు.
కానరాని పోషకాహారం.. గతంలో మూడు పూటలా పోషకాహారం అందించేవారు. ఫుడ్ బకెట్ పథకంతో ఖర్జూరం, చిక్కీలు, నువ్వుల ఉండలు, మందులు ఇచ్చేవారు. ప్రస్తుతం అంగన్వాడీల నుంచి సరకులు వసతి గృహానికి రావడం లేదు. పాలు సరఫరా సక్రమంగా జరగడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నను మించిన అన‘కొండ’లు
[ 29-04-2024]
మృత్యుదూతగా పేరొందాడు నాటి యమకింకరుడు.. కంకరను బొక్కేసే నాయకులను వెనకుండి నడిపిస్తున్నాడు నేటి యమకంకరుడు జగన్.. ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అదేపనిగా తవ్వకాలు ప్రారంభించిన కొందరు కేటుగాళ్లు ఈ ఐదేళ్ల కాలంలో పెద్దపెద్ద కొండలనే కరిగించేశారు. -
సర్కారు వారి గూడు పుఠాణి
[ 29-04-2024]
ఐదేళ్ల పాలన పూర్తయింది.. అయినా చాలా చోట్ల నిర్మాణాలు పూర్తి చేయలేదు. ఎన్నికల ముందు విజయనగరం, సాలూరులో హడావుడిగా కొన్ని చోట్ల అప్పగించి చేతులు దులుపుకొన్నారు. -
జగన్.. ఈ పాపం నీదే
[ 29-04-2024]
విజయనగరం జిల్లా వంగర, మన్యం జిల్లాలోని బలిజిపేట మండలాల్లో ఉన్న 17 గ్రామాలకు ప్రధాన సాగునీటి వనరును నేను.. దాదాపు 8 వేల ఎకరాలకు పైగా తడివ్వాల్సిన బాధ్యత నాది.. నా ఆయకట్టు పరిధిలో బంగారం పండే పొలాలున్నాయి.. -
రాష్ట్ర భవిష్యత్తు కోసమే కూటమి
[ 29-04-2024]
రాష్ట్ర భవిష్యత్తు కోసమే మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్గజపతిరాజు అన్నారు. ఆదివారం రాత్రి విజయనగరంలోని పుత్సలవీధి, పూల్బాగ్ కాలనీల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. -
ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయాలి
[ 29-04-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయాలని, అదే సమయంలో ప్రైవేటు వైద్యాలయాలను ఆదుకోవాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డా.ఆర్వీ.అశోకన్ అన్నారు. -
ఓటు వినియోగంతో ప్రశ్నించే హక్కు
[ 29-04-2024]
రాబోయే ఎన్నికల్లో ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, అప్పుడే నాయకులను ప్రశ్నించే హక్కు లభిస్తుందని మెప్మా సీఎంఎం సన్యాసిరావు అన్నారు. -
సమన్వయంతో పనిచేయాలి
[ 29-04-2024]
ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి, కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. -
5, 6, 7వ తేదీల్లో పోస్టల్ బ్యాలెట్
[ 29-04-2024]
సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ సిబ్బందికి విధుల కేటాయింపు రెండో విడత ప్రక్రియ ఆదివారం పూర్తి చేశారు. -
గొంతు తడిపే ఆలోచనుందా..?
[ 29-04-2024]
వేసవి ఆరంభంతోనే ఆ 44 గ్రామాల్లో దాహార్తి మొదలవుతుంది. నీటి కోసం కోటి పాట్లు పడాల్సిన పరిస్థితి. తోడుదామంటే బావుండదు.. వెళ్దామంటే బోరు కనిపించదు.. -
తెదేపా విశాఖ ఉత్తర పరిశీలకుడిగా రవిశేఖర్
[ 29-04-2024]
విశాఖ తెదేపా ఉత్తర నియోజకవర్గ పరిశీలకుడిగా సువ్వాడ రవిశేఖర్ను ఆ పార్టీ అధిష్ఠానం ఆదివారం నియమించింది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం పరిశీలకుడిగా ఆయన ఉన్నారు. -
కంకర గుటకాయ స్వాహా
[ 29-04-2024]
కొండలు.. గుట్టలు.. అనే తేడా లేదు.. ఎక్కడ మట్టి కనిపిస్తే అక్కడ తవ్వేస్తాం.. ఎర్రమట్టిని అమ్మేస్తాం.. అడిగితే దౌర్జన్యానికి దిగుతాం.. అన్న రీతిలో నడుస్తోంది గరివిడి, గజపతినగరం నియోజకవర్గాల్లో అక్రమ తవ్వకాల పరిస్థితి. -
ఇళ్లన్నావ్.. రోడ్డున పడేశావ్
[ 29-04-2024]
పేదల సొంతింటి కల నెరవేరుస్తామని ఆశలు పెంచి, హామీలు గుప్పించిన జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత మోసం చేశారు. ఐదేళ్లుగా సొంత గూడులేని వారి గోడును పట్టించుకోకుండా నిర్లక్ష్య వైఖరి అవలంబించారు. -
చంద్రబాబుతోనే సంక్షేమం
[ 29-04-2024]
రాష్ట్రంలో ప్రజల సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమని కూటమి అభ్యర్థి బేబినాయన అన్నారు. రానున్న ఎన్నికల్లో గెలిపించాలని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’