logo

తెదేపా బలోపేతానికి కృషి చేస్తాం

తెదేపా అధినేత చంద్రబాబు నాయకత్వాన్ని బలపరుస్తూ నియోజకవర్గంలో భారీగా చేరికలు జరుగుతున్నాయి.

Published : 15 Apr 2024 12:48 IST

పార్వతీపురం టౌన్‌ : తెదేపా అధినేత చంద్రబాబు నాయకత్వాన్ని బలపరుస్తూ నియోజకవర్గంలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన మజ్జిసాయి దత్త ఆధ్వర్యంలో 200 కుటుంబాలు వైకాపాను వీడి తెదేపాలో చేరాయి.  పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి , కూటమి అభ్యర్థి విజయ్ చంద్ర వారికి కండువాలు కప్పి  పార్టీలోకి ఆహ్వానించారు.  రానున్న ఎన్నికల్లో  పార్టీ బలోపేతానికి, కూటమి అభ్యర్థి విజయానికి తమవంతు కృషి చేస్తామని నాయకులు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని