అప్పటి నుంచే ఖర్చుకు లెక్క..!
ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఉమ్మడి జిల్లాలో ఈ నెల 18వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
రేపటి నుంచి నామపత్రాల స్వీకరణ
రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడుతున్న కలెక్టర్
ఈనాడు-విజయనగరం, న్యూస్టుడే, విజయనగరం అర్బన్, ఉడాకాలనీ: ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఉమ్మడి జిల్లాలో ఈ నెల 18వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల, అదే రోజు నుంచే నామపత్రాలను స్వీకరిస్తారు. 25వ తేదీ వరకు స్వీకరిస్తారు. 26న పరిశీలన, 29న ఉపసంహరణ ఉంటుంది. అభ్యర్థులు నామినేషన్ వేసినప్పటి నుంచి వారి ఖాతాలోనే ఖర్చును లెక్కిస్తారు. జెండా నుంచి భోజనం వరకు వారు చేసే ప్రతి ఖర్చును వారి ఖాతాలో లెక్కగడతారు. ఈ సందర్భంగా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిణి నాగలక్ష్మి మంగళవారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. సమావేశంలో జేసీ కార్తీక్, డీఆర్వో అనిత, పార్టీల ప్రతినిధులు రొంగలి పోతన్న, సోములు, రమేశ్కుమార్, నరసింహరాజు హాజరయ్యారు.
పార్లమెంటు స్థానాలకు కలెక్టరేట్లో..
ఉమ్మడి జిల్లాలోని 11 అసెంబ్లీ, విజయనగరం, అరకు పార్లమెంటరీ నియోజకవర్గాల నామినేషన్లు స్వీకరిస్తారు. ఎంపీ స్థానానికి జిల్లాల కలెక్టరేట్ల్లో దాఖలు చేయాలి. జిల్లాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఎస్.నాగలక్ష్మి, నిశాంత్ కుమార్ వీటిని స్వీకరిస్తారు. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గానికి జేసీ కె.కార్తీక్ తహసీల్దారు కార్యాలయంలో నామపత్రాలు తీసుకుంటారు.
సహాయక కేంద్రాల ఏర్పాటు
కలెక్టరేట్లలో సహాయక కేంద్రాలు ఏర్పాటు చేశారు. అభ్యర్థుల తరఫున వారు కేంద్రంలో సమాచారం తీసుకుని, తప్పొప్పులు సరిచేసు కోవచ్చని డీఆర్వో ఎస్.డి.అనిత తెలిపారు.
గమనించాల్సినవి..
- సెలవు రోజుల్లో మినహా ఉదయం 11.00 నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకు స్వీకరణ.
- అభ్యర్థులు 13 రకాల ధ్రువపత్రాలు సమర్పించాలి.
- అభ్యర్థులు గరిష్ఠంగా నాలుగు సెట్లు, రెండు నియోజకవర్గాల నుంచి మాత్రమే దాఖలు చేయవచ్చు.
- నామినేషన్ దాఖలు చేసిన తర్వాత హార్డ్ కాపీలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేసేందుకు మూడు వాహనాలు, అయిదుగురు వ్యక్తులు (అభ్యర్థితో సహా) రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి అనుమతిస్తారు.
- 100 మీటర్ల తర్వాత వాహనాలకు అనుమతిలేదు.
- ప్రతి నియోజకవర్గంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తారు.
అందుబాటులోకి ప్రత్యేక యాప్
-
నామపత్రాల కోసం ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. పోటీ చేసే అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు, దాఖలు చేసే విధానంపై ఇందులో పొందుపర్చారు. అన్ని పత్రాలను యాప్ ద్వారానే అందజేయాలి. ప్రచారానికి సంబంధించి కార్యక్రమాలు, వాహనాలు, ఇతర వాటికి ఈ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే అనుమతిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నను మించిన అన‘కొండ’లు
[ 29-04-2024]
మృత్యుదూతగా పేరొందాడు నాటి యమకింకరుడు.. కంకరను బొక్కేసే నాయకులను వెనకుండి నడిపిస్తున్నాడు నేటి యమకంకరుడు జగన్.. ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అదేపనిగా తవ్వకాలు ప్రారంభించిన కొందరు కేటుగాళ్లు ఈ ఐదేళ్ల కాలంలో పెద్దపెద్ద కొండలనే కరిగించేశారు. -
సర్కారు వారి గూడు పుఠాణి
[ 29-04-2024]
ఐదేళ్ల పాలన పూర్తయింది.. అయినా చాలా చోట్ల నిర్మాణాలు పూర్తి చేయలేదు. ఎన్నికల ముందు విజయనగరం, సాలూరులో హడావుడిగా కొన్ని చోట్ల అప్పగించి చేతులు దులుపుకొన్నారు. -
జగన్.. ఈ పాపం నీదే
[ 29-04-2024]
విజయనగరం జిల్లా వంగర, మన్యం జిల్లాలోని బలిజిపేట మండలాల్లో ఉన్న 17 గ్రామాలకు ప్రధాన సాగునీటి వనరును నేను.. దాదాపు 8 వేల ఎకరాలకు పైగా తడివ్వాల్సిన బాధ్యత నాది.. నా ఆయకట్టు పరిధిలో బంగారం పండే పొలాలున్నాయి.. -
రాష్ట్ర భవిష్యత్తు కోసమే కూటమి
[ 29-04-2024]
రాష్ట్ర భవిష్యత్తు కోసమే మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్గజపతిరాజు అన్నారు. ఆదివారం రాత్రి విజయనగరంలోని పుత్సలవీధి, పూల్బాగ్ కాలనీల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. -
ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయాలి
[ 29-04-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయాలని, అదే సమయంలో ప్రైవేటు వైద్యాలయాలను ఆదుకోవాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డా.ఆర్వీ.అశోకన్ అన్నారు. -
ఓటు వినియోగంతో ప్రశ్నించే హక్కు
[ 29-04-2024]
రాబోయే ఎన్నికల్లో ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, అప్పుడే నాయకులను ప్రశ్నించే హక్కు లభిస్తుందని మెప్మా సీఎంఎం సన్యాసిరావు అన్నారు. -
సమన్వయంతో పనిచేయాలి
[ 29-04-2024]
ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి, కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. -
5, 6, 7వ తేదీల్లో పోస్టల్ బ్యాలెట్
[ 29-04-2024]
సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ సిబ్బందికి విధుల కేటాయింపు రెండో విడత ప్రక్రియ ఆదివారం పూర్తి చేశారు. -
గొంతు తడిపే ఆలోచనుందా..?
[ 29-04-2024]
వేసవి ఆరంభంతోనే ఆ 44 గ్రామాల్లో దాహార్తి మొదలవుతుంది. నీటి కోసం కోటి పాట్లు పడాల్సిన పరిస్థితి. తోడుదామంటే బావుండదు.. వెళ్దామంటే బోరు కనిపించదు.. -
తెదేపా విశాఖ ఉత్తర పరిశీలకుడిగా రవిశేఖర్
[ 29-04-2024]
విశాఖ తెదేపా ఉత్తర నియోజకవర్గ పరిశీలకుడిగా సువ్వాడ రవిశేఖర్ను ఆ పార్టీ అధిష్ఠానం ఆదివారం నియమించింది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం పరిశీలకుడిగా ఆయన ఉన్నారు. -
కంకర గుటకాయ స్వాహా
[ 29-04-2024]
కొండలు.. గుట్టలు.. అనే తేడా లేదు.. ఎక్కడ మట్టి కనిపిస్తే అక్కడ తవ్వేస్తాం.. ఎర్రమట్టిని అమ్మేస్తాం.. అడిగితే దౌర్జన్యానికి దిగుతాం.. అన్న రీతిలో నడుస్తోంది గరివిడి, గజపతినగరం నియోజకవర్గాల్లో అక్రమ తవ్వకాల పరిస్థితి. -
ఇళ్లన్నావ్.. రోడ్డున పడేశావ్
[ 29-04-2024]
పేదల సొంతింటి కల నెరవేరుస్తామని ఆశలు పెంచి, హామీలు గుప్పించిన జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత మోసం చేశారు. ఐదేళ్లుగా సొంత గూడులేని వారి గోడును పట్టించుకోకుండా నిర్లక్ష్య వైఖరి అవలంబించారు. -
చంద్రబాబుతోనే సంక్షేమం
[ 29-04-2024]
రాష్ట్రంలో ప్రజల సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమని కూటమి అభ్యర్థి బేబినాయన అన్నారు. రానున్న ఎన్నికల్లో గెలిపించాలని కోరారు.