icon icon icon
icon icon icon

Nara Lokesh: జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో యువతకు జగన్‌ మోసం: నారా లోకేశ్‌

ఉత్తరాంధ్రను దోచుకున్న వైకాపా నేతలు కాస్త కూడా అభివృద్ధి చేయలేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 07 May 2024 21:28 IST

విజయనగరం: ఉత్తరాంధ్రను దోచుకున్న వైకాపా నేతలు కాస్త కూడా అభివృద్ధి చేయలేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో యువతను జగన్‌ మోసం చేశారని ధ్వజమెత్తారు. విజయనగరంలో నిర్వహించిన యువగళం సభలో ఆయన ప్రసంగించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన యువతతో ముఖాముఖి నిర్వహించారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తామన్నారు. మెగా డీఎస్సీతో పాటు పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్మీలో ఉత్తరాంధ్రకు చెందిన వారు ఎక్కువగా ఉంటారని, యువత కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కూటమి ప్రభుత్వం రాగానే పోలీస్‌ శాఖలో రిక్రూట్‌మెంట్‌ చేపడతామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img