Balineni: మీ ఇష్టం.. నాకేం నష్టం!
ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి వైకాపా అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఉండాల్సిందేనంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పటి వరకు పట్టుబట్టారు.
మాగుంటకు స్థానంపై తగ్గిన బాలినేని
ఎవరికీ పట్టకపోతే నాకెందుకుని వ్యాఖ్య
అధిష్ఠానంతో ఘర్షణ పడాలా అంటూ నిర్వేదం
శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసులురెడ్డి
ఒంగోలు నేరవిభాగం, న్యూస్టుడే: ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి వైకాపా అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఉండాల్సిందేనంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పటి వరకు పట్టుబట్టారు. ఆయనతో కలిసే ఎన్నికల బరిలోకి దిగుతానంటూ పదే పదే ప్రకటించారు. ఆ మేరకు అధిష్ఠానంపై అలకబూనారు కూడాను. మాగుంటకు ఒంగోలు కేటాయించకపోతే సీఎంతోనైనా తాను చర్చించేది లేదని తేల్చి చెప్పారు. ఇకపై తనకు ఫోన్ కూడా చేయొద్దంటూ భీష్మించారు. నిన్నటి వరకు మొండికేసిన బాలినేని చివరికి మెత్తబడ్డారు. తనయుడు ప్రణీత్రెడ్డి, వియ్యంకుడు కుండా భాస్కర్రెడ్డితో మంగళవారం రాత్రి సుదీర్ఘంగా చర్చించిన అనంతరం మనస్సు మార్చుకున్నారు. ఈ మార్పు వెనుక వైకాపా తన మార్కు రాజకీయం నడిపినట్లు చర్చ సాగుతోంది.
తన దారి తాను చూసుకుంటానంటూ...: మాగుంట ఉండాల్సిందేనంటూ బాలినేని పట్టుబట్టారు. అధిష్ఠానం మాత్రం బాలినేని ఉండాలని, అదే సమయంలో మాగుంటను పక్కనపెట్టి తీరాల్సిందేనని ఎత్తులు వేసింది. ఈ క్రమంలో ఒంగోలులో ఇళ్లపట్టాలకు నిధులు కేటాయించింది. అయినప్పటికీ బాలినేని మాత్రం మాగుంట జపం మానలేదు. ఆయన కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. నేరుగా ఇంటికి వెళ్లి గంటల తరబడి చర్చించారు. ఇళ్ల స్థలాలకు నిధులు కేటాయించిన తర్వాత కూడా ఇలా వ్యవహరించడం వైకాపా పెద్దలకు మింగుడు పడలేదు. పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తగా ఉన్న విజయసాయిరెడ్డి ఈ పరిస్థితిని చక్కదిద్దలేకున్నారని భావించింది. అనూహ్యంగా చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పేరును తెర పైకి తెచ్చింది. దీంతో బాలినేని మరింత అసహనానికి గురయ్యారు. మాగుంటకు స్థానం కేటాయించకపోతే తన దారి తాను చూసుకుంటానని చెప్పేశారు.
వ్యూహం మార్చి.. అటు నుంచి కథ నడిపి..!: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో భేటీ తర్వాత కూడా మెత్తపడలేదు. జగన్ కుటుంబానికి బంధువు కావడం.. సీఎంకు అత్యంత సన్నిహితులు అనుకున్న కొందరు నేతలు ఇప్పటికే పార్టీని వీడటం.. బాలినేని కూడా ఇలాగే వ్యవహరిస్తే అది వైకాపాకు కచ్చితంగా నష్టం కలిగించే అంశమే అవుతుంది. దీంతో అధిష్ఠానం వ్యూహం మార్చి ఆఖరి అస్త్రాన్ని బయటకు తీసింది. బాలినేని వియ్యంకుడు కుండా భాస్కర్రెడ్డి వైపు నుంచి కథ నడిపింది. ఆయనతో మాట్లాడిన పార్టీ పెద్దలు.. మైనింగ్, అటవీ భూములు, భూ ఆక్రమణల ఆరోపణలు, ఇతరత్రా అంశాలను ఏకరవు పెట్టినట్లు సమాచారం. ఆ తర్వాత మీ ఇష్టం.. అంటూ హెచ్చరించినట్లు తెలిసింది.
బెడిసి కొట్టిన అలక మంత్రం...: ఇప్పటి వరకు పలు విషయాల్లో అధిష్ఠానంపై బాలినేని అలకబూనారు. మంత్రివర్గం నుంచి ఉద్వాసన, ప్రాంతీయ సమన్వయకర్త బాధ్యతల్లో ప్రకాశం జిల్లాను తొలగించడం, మార్కాపురంలో ప్రొటోకాల్ వివాదం, ఒంగోలు భూ కుంభకోణంలో విచారణ సక్రమంగా చేయడం లేదంటూ వ్యక్తిగత అంగరక్షకులను వెనక్కి పంపటం వంటివి ఇందులో కొన్ని. తాజాగా ఇటు మాగుంట, అటు ఇళ్ల స్థలాలకు నిధుల కోసం అదే రాగం ఎంచుకున్నారు. ఆయన్ను శాంతింపజేయడానికి అధిష్ఠానం ప్రతిసారీ ఒక మెట్టు దిగుతూనే ఉంది. మాగుంట విషయంలో మాత్రం బెడిసి కొట్టింది. వ్యతిరేక సంకేతాలు అందడంతో తన తనయుడు ప్రణీత్రెడ్డి, వియ్యంకుడితో బాలినేని సుదీర్ఘంగా భేటీ అయ్యారు. లాభనష్టాలను బేరీజు వేసుకున్నారు. అంతరంగీకులతోనూ అర్ధరాత్రి వరకు సమాలోచనలు సాగించారు. అధిష్ఠానంతో ఘర్షణ పడితే ఇబ్బందులు తప్పవనే అభిప్రాయానికి వచ్చి మాగుంట విషయంలో మెత్తబడినట్లు ప్రచారం. చివరికి ఒంగోలు ఎంపీ టికెట్ ఎవరికిచ్చేది మీ ఇష్టమని.. తనకొచ్చిన నష్టమేమీ లేదని.. జిల్లాలో ఇతరులెవరికీ పట్టకుంటే తనకెందుకంటూ వ్యాఖ్యానించారు. అధిష్ఠానంతో తాను మాత్రమే ఘర్షణ పడాలా అంటూ నిర్వేదం వ్యక్తం చేశారు.
దిల్లీ సూచన మేరకే చెక్..!: ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి రాజకీయాల్లో అజాతశత్రువుగా పేరుంది. అటువంటి వ్యక్తిని వైకాపా ఎందుకంత తీవ్రంగా వ్యతిరేకిస్తుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దిల్లీ నుంచి కటువుగా అందిన ఆదేశాల మేరకే ఆయన్ను పక్కనపెట్టినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా భాజపా హవా నడుస్తోంది. రాజధాని దిల్లీ, పక్కనే ఉన్న పంజాబ్లో అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని ఆమ్ ఆద్మీ(ఆప్) పార్టీ భాజపాను ఢీకొడుతోంది. తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఉత్తరాదికి విస్తరించేందుకు మాగుంట.. ఆప్కు పంజాబ్ ఎన్నికల్లో ఆర్థికంగా సహకరించారనేది భాజపా అనుమానం. దిల్లీ మద్యం కుంభకోణంలో దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్టయ్యారు. మాగుంట తనయుడు రాఘవ్రెడ్డిని కూడా అరెస్టు చేశారు. ఆరునెలల పాటు ఆయన జైల్లోనే ఉండాల్సి వచ్చింది. ఈ కేసులో అప్రూవర్గా మారినప్పటికీ భాజపా అధిష్ఠానం పంజాబ్ పరాభవాన్ని మరిచిపోలేదని.. రాష్ట్రంలో వైకాపాతో తనకున్న సాన్నిహిత్యాన్ని అడ్డుపెట్టుకుని మాగుంటకు రాజకీయంగా చెక్ పెడుతున్నట్లు ప్రచారం.
హుటాహుటిన హైదరాబాద్కు...: బాలినేని శ్రీనివాసరెడ్డి బుధవారం రాత్రి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. విజయవాడ నుంచి ఉదయం ఒంగోలు వచ్చిన ఆయన రోజంతా అసహనం, అసంతృప్తిగానే కనిపించారు. జిల్లా వైకాపా రాజకీయాల బాధ్యతలను అధిష్ఠానం చెవిరెడ్డి భాస్కర్రెడ్డికి అప్పగించింది. ఇళ్లపట్టాల స్థల సేకరణకు సంబంధించి బుధవారం సాయంత్రం వరకు కూడా నిధులు జమ కాలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరి వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నం పెట్టే చదువులకు ఆన్నం పెట్టే చదువులకు అన్నే ఓ చెద
[ 29-04-2024]
వైకాపా ప్రభుత్వం.. పేదలూ బడుగు బలహీన వర్గాల పిల్లలెక్కువగా చదువుకునే ప్రభుత్వ బడుల ఉసురు తీసింది. ప్రపంచ స్థాయి విద్య, టోఫెల్, బైజూస్ అంటూ జగన్ ఊదరగొట్టారు. పాఠశాలల రూపురేఖలను మార్చేస్తున్నానంటూ -
గద్దెనెక్కి గొప్పలు.. గోతులతోనే ముగింపు
[ 29-04-2024]
తాళ్లూరు, దర్శి, ముండ్లమూరు, చీమకుర్తి ప్రాంతాలకు ప్రస్తుతం మద్దిపాడు మండలంలోని ఉపకేంద్రం నుంచి విద్యుత్తు సరఫరా అవుతోంది. దీంతో తరచూ అవాంతరాలు తలెత్తుతూ సమస్యలు ఎదురవుతున్నాయి. -
3న జిల్లాకు జనసేనాని
[ 29-04-2024]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మే 3న జిల్లాలో పర్యటించనున్నారు. ఆ రోజున గిద్దలూరు, దర్శి, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించనున్న ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. -
తెదేపా అధినేత పర్యటన వాయిదా
[ 29-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మే 3, 4 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు. -
69,918 మందికి ఇళ్ల వద్దే పింఛను
[ 29-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నియమావళి దృష్ట్యా వైకాపా కార్యకర్తలుగా భావిస్తున్న గ్రామ, వార్డు వాలంటీర్లను సామాజిక పింఛన్ల పంపిణీ బాధ్యత నుంచి ఈసీ తప్పించింది. -
జనం ‘చెవి’లో ప్రలోభాల పువ్వులు
[ 29-04-2024]
రాజకీయ బదిలీపై రాయలసీమ నుంచి నుంచి అధిష్ఠానం ఆ నేతను జిల్లాకు బలవంతంగా పంపింది. వస్తూనే ఏకంగా జిల్లా పోలీసు బాస్నే వెంట తెచ్చుకున్నారు. -
ఐపీఎల్ అంటూ కోతలు.. రోడ్ల మీదే ఆటలు
[ 29-04-2024]
ముఖ్యమంత్రి మైదానంలోకి దిగగానే ఆయనలోని క్రికెటర్ బయటకొస్తాడు.. స్టాన్స్ ఎలా తీసుకోవాలి..ఫుట్వర్క్ ఎలా ఉండాలి..డ్రైవ్ ఎలా కొట్టాలంటూ తోటి మంత్రులతో ఆటలాడుకుంటారు. -
వైకాపాకు ఓట్లేయాలని చర్చిలో ప్రసంగం
[ 29-04-2024]
ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలనే లక్ష్యంతో వైకాపా నాయకులు ఎన్ని అడ్డదారులైనా తొక్కడానికి వెనుకాడడం లేదు. కొండపి మండలంలో ఆదివారం రాత్రి జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనం. -
జిల్లాలో సైకిల్ జోరు
[ 29-04-2024]
ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెదేపాలో చేరికలు జోరందుకున్నాయి. వైకాపాకు చెందిన పలువురు నేతలు, అభిమానులు సైకిలెక్కుతున్నారు. -
తగాదా అడ్డుకోబోతే కడతేర్చారు
[ 29-04-2024]
సోదరి కుటుంబంలో తగాదాను అడ్డుకోబోయిన తమ్ముడు కత్తిపోట్లకు గురై మృతిచెందాడు. దర్శి మండలం రాజంపల్లిలో ఆదివారం ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. -
వైకాపా పాలనకు చరమగీతం పాడాలి
[ 29-04-2024]
బీసీల సంక్షేమానికి తెదేపా కట్టుబడి ఉందని మాజీ ఎమ్మెల్యే, గిద్దలూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి ముత్తుముల అశోక్రెడ్డి పేర్కొన్నారు. -
అత్యవసరంపై.. అంతులేని నిర్లక్ష్యం
[ 29-04-2024]
అర్థవీడుకు అత్యవసర సేవలు దూరమాయ్యాయి. ఏళ్ల కాలంగా ఉన్న ఒక్క అత్యవసర వాహనం అర్థవీడుకు పరిమితమైంది. లోయ గ్రామీణులకు అత్యవసర వైద్యం అందాలన్న..
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!