Crime News: చిన్న వివాదం.. మిగిల్చింది విషాదం
పట్టణంలోని ఉమ్మలాడ రోడ్డులో నివాసముంటున్న మెట్ట అనూష (24) సోమవారం సాయంత్రం తన కుమార్తెలు సుదీక్ష (5), గీతాన్వితకు (ఏడాదిన్నర) చున్నీతో మెడ బిగించి చంపి, అనంతరం ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తేల్చారు.
ఒక చిన్న సంఘటన, క్షణికావేశం.. కలగలసి ఓ పచ్చటి కుటుంబాన్ని కన్నీటి జ్ఞాపకంగా మార్చేశాయి. తన మూలంగా వేరేవాళ్ల కుటుంబాల్లో కలతలు రేగాయన్న మనోవేదన కన్నబిడ్డలను కడతేర్చి తానూ ఆత్మహత్య చేసుకునే దాకా తీసుకెళ్లింది.
అనకాపల్లి పట్టణంలో సోమవారం రాత్రి ఇద్దరు కుమార్తెలతో సహా వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించగా కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
న్యూస్టుడే, అనకాపల్లి పట్టణం: పట్టణంలోని ఉమ్మలాడ రోడ్డులో నివాసముంటున్న మెట్ట అనూష (24) సోమవారం సాయంత్రం తన కుమార్తెలు సుదీక్ష (5), గీతాన్వితకు (ఏడాదిన్నర) చున్నీతో మెడ బిగించి చంపి, అనంతరం ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తేల్చారు. ఈ అఘాయిత్యానికి పాల్పడే ముందు అనూష రాసిన ఉత్తరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం మృతదేహాలకు ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. చిన్న కారణానికి పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడటం కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.
శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం మెట్టపేటకు చెందిన జనార్దనరావుతో అనూషకు 2016 ఆగస్టు 19న వివాహమైంది. అనూష.. జనార్దనరావుకు అక్క కూతురు. తొలుత వీరు హైదరాబాద్లో ఉండేవారు. కొన్ని నెలల క్రితం కశింకోటకు వచ్చారు. ఇటీవల అచ్యుతాపురంలోని ప్రైవేటు కంపెనీలో జనార్దనరావుకు ఉద్యోగం వచ్చింది. దీంతో ఆరునెలల క్రితం ఉమ్మలాడ రోడ్డులో నూతనంగా నిర్మించిన ఇంట్లోకి వీరు అద్దెకు వచ్చారు. ఇంటి యజమానితో ఇటీవల ఓ వివాదం తలెత్తింది. దీంతో అనూష తీవ్ర మనస్తాపానికి గురైంది. క్షణికావేశంలో తన జీవితాన్ని ముగించాలని నిర్ణయం తీసుకుంది.
* తన భార్య మరణం వెనుక ఇంటి యజమాని డి.భాస్కరరావు ప్రమేయం ఉందని జనార్దనరావు పోలీసుల వద్ద అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పట్టణ పోలీస్స్టేషన్ సీఐ భాస్కరరావు తెలిపారు.
* పలాసలో ఉంటున్న మీనాక్షి, సంజీవరావులకు ఇద్దరు కుమార్తెలు. వారి పెద్దకుమార్తె అనూష. చిన్న కుమార్తె గౌతమి బీఈడీ చేస్తున్నారు. మీనాక్షి చిన్నతమ్ముడు జనార్దనరావుకు అనూషను ఇచ్చి వివాహం చేశారు. తన కుమార్తెను బాగానే చూసుకునేవాడని, వారి కుటుంబంలో ఎలాంటి మనస్పర్ధలూ లేవని కుటుంబ సభ్యులు చెప్పినట్లు తహసీల్దార్ శ్రీనివాసరావు తెలిపారు.
‘నన్ను క్షమించండి.. ఒక విషయంలో అనవసరంగా తలదూర్చాను. అన్నయ్యపై చెప్పిన మాటలు వారి కుటుంబంలో వివాదానికి దారితీశాయి. ఇది నన్ను బాగా కలిచివేస్తోంది. నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. నేను లేకుంటే వారి జీవితం కుక్కలు చింపిన విస్తరి అవుతుంది. అందుకే వారిని చంపి నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను’ అంటూ అనూష రాసిన ఉత్తరాన్ని పోలీసులు గుర్తించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనం ఆస్తులు.. జగన్ గుప్పిట్లోకి!!
[ 05-05-2024]
సరిహద్దు రాళ్లపై జగన్ బొమ్మేస్తే... ఇదెక్కడి చోద్యమనుకున్నారు పట్టాదారు పాసుపుస్తకాలపై సీఎం చిత్రం ముద్రిస్తే... తిట్టుకుంటూనే తీసుకున్నారు! రీ సర్వే చేసి కొలతలు వేస్తే... అన్నీ తప్పులేనని తల బాదుకున్నారు! ఇవన్నీ.. -
ప్రధాని సభకు భారీగా జనసమీకరణ
[ 05-05-2024]
అనకాపల్లిలో ఈనెల 6న జరగనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభకు విశాఖ నుంచి భారీగా జన సమీకరణ చేయాలని తెదేపా, భాజపా, జనసేన నాయకులు నిర్ణయించారు. -
ఒక్కో విద్యార్థికి రూ.15వేలు ఇస్తాం.. : పల్లా
[ 05-05-2024]
తెదేపా కూటమి ప్రభుత్వంలో బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామని గాజువాక తెదేపా అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఆయన 68వ వార్డు మింది గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. -
ఆటల ప్రాజెక్టు.. అటకెక్కించిన జగన్..!
[ 05-05-2024]
‘గమ్య నగరి’గా పేరుగాంచిన విశాఖలో భారీ సమీకృత క్రీడల ప్రాంగణం (ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్) నిర్మించాలని గత తెదేపా ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు ప్రతిపాదనలూ సిద్ధం చేసింది. -
ఐటీనా.. అదెక్కడుంది..!
[ 05-05-2024]
యువతకు అత్యధిక ఉద్యోగాలు కల్పించే ఐటీ రంగం జగన్ పాలనలో కుదేలైంది. చంద్రబాబు హయాంలో విశాఖలోని ఐటీ హిల్స్పై నెలకొల్పిన సంస్థలు ప్రస్తుతం ఎన్ని ఉన్నాయో తెలియని పరిస్థితి. -
బాలుడి ప్రతిభకు గుర్తింపు
[ 05-05-2024]
ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో శ్రీప్రకాష్ విద్యార్థి బి.రియాన్ష్కు స్థానం దక్కింది. యూకేజీ చదువుతున్న రియాన్ష్ ఆన్లైన్ ద్వారా జరిగిన ఎంపికలో 9 సెకన్లలో దక్షిణ అమెరికా ఖండంలోని 13 దేశాల జెండాలను గుర్తించాడు. -
ఈ కార్డులుంటే ఓటెయ్యొచ్చు
[ 05-05-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మే 13న జరిగే పోలింగ్లో 11 రకాల గుర్తింపు కార్డులతో ఓటు హక్కు వినియోగించుకోవచ్చని డీఆర్వో బి.దయానిధి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
ప్రజాస్వామ్యం ‘బూడి’దైంది!
[ 05-05-2024]
ఎన్నికల్లో ప్రచారం చేసుకునే భాజపా నేతల హక్కును హరించడమే కాకుండా బావమరిది, కన్న కొడుకుపై ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు దౌర్జన్యానికి దిగారు. -
ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలి
[ 05-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 6న సాయంత్రం నిర్వహించనున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభను విజయవంతం చేయాలని అనకాపల్లి పార్లమెంట్ భాజపా అభ్యర్థి సీఎం రమేశ్ కోరారు. -
‘భూయాజమాన్య హక్కు చట్టాన్ని రద్దు చేస్తాం’
[ 05-05-2024]
తెదేపా అధికారంలోకి రాగానే భూయాజమాన్య హక్కు చట్టాన్ని రద్దు చేస్తామని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు హామీ ఇచ్చారు. బలిఘట్టం గాంధీబొమ్మ సెంటర్లో శనివారం రాత్రి ప్రచార సభలో ప్రసంగిస్తూ.. -
సీఎం రమేశ్ గెలుపుతో పారిశ్రామిక వృద్ధి
[ 05-05-2024]
అనకాపల్లి ఎంపీగా సీఎం రమేశ్ గెలుపుతో పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధి చెందుతుందని సినీ నిర్మాత నట్టి కుమార్ పేర్కొన్నారు. చోడవరంలో శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. -
అరాచక పాలనపై పోరాడే సమయమిది
[ 05-05-2024]
రాష్ట్రంలో అభివృద్ధి కావాలో, అరాచకం కావాలో ప్రజలే తేల్చుకోవాలని తెదేపా పొలిట్బ్యారో సభ్యుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఎలమంచిలిలో కూటమి అభ్యర్థి సుందరపు విజయ్కుమార్కు మద్దతుగా శనివారం ఎన్నికల ప్రచార సభలో బాలయ్య పాల్గొని ప్రసంగించారు. -
కూటమి గెలుపుతోనే భవన నిర్మాణ కార్మికులకు మేలు
[ 05-05-2024]
కూటమి ప్రభుత్వం కొలువుదీరితే భవన నిర్మాణ కార్మికులకు మంచి రోజులు వస్తామని కూటమి అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేశ్ అన్నారు. అనకాపల్లి సర్వకామదాంబ పార్కు వద్ద శనివారం భవన నిర్మాణ కార్మికులతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
కూటమి బలం చాటుదాం
[ 05-05-2024]
-
డాక్టర్ జగన్మోసంరెడ్డి
[ 05-05-2024]
అర్థ రూపాయి ఖర్చుపెట్టి రూ. 500తో ప్రచారం చేసుకుంటారు జగన్. వైద్య, ఆరోగ్య శాఖలో నాడు-నేడు, ఫ్యామిలీ ఫిజీషియన్, ఆరోగ్య సురక్ష అంటూ ప్రచార ఆర్భాటం చేసుకున్నారే తప్ప వాటితో రోగులకు మేలు జరిగిందే లేదు. -
జగన్ పాలనలో పరిశ్రమలు పోయాయ్
[ 05-05-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాలనలో ఒక్క పరిశ్రమ రాలేదని, ఉన్నవి పోయాయని సినీ హీరో నారా రోహిత్ ఆరోపించారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్.. సీఈఓ రియాక్షన్ ఇదే..
-
‘భారతీయుల వల్లే అమెరికా టెక్ ఇండస్ట్రీ మనుగడ’
-
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
-
ఎన్టీఆర్కు అర్జున్పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
-
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
-
మృణాల్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్కు 1400 గంటలు