పరీక్షిస్తే పన్నీరు .. లేదంటే కన్నీరు !
సకల జీవకోటికి నీరే ప్రాణాధారం. అది శుద్ధంగా ఉండేలా నిరంతరం అప్రమత్తంగా ఉన్నప్పుడే ఆరోగ్య పరిరక్షణ సాధ్యం. పౌరులు తాగుతున్నది శుద్ధ జలమో.. కాదో తెలుసుకోవడానికి ప్రతి సచివాలయానికి జాతీయ జల్ మిషన్ కార్యక్రమంలో భాగంగా మల్టీ పారామీటర్ వాటర్ క్వాలిటీ ఫీల్డ్ టెస్ట్కిట్లు సరఫరా చేశారు.
సచివాలయాల్లో నిరుపయోగంగా టెస్టు కిట్లు
సకల జీవకోటికి నీరే ప్రాణాధారం. అది శుద్ధంగా ఉండేలా నిరంతరం అప్రమత్తంగా ఉన్నప్పుడే ఆరోగ్య పరిరక్షణ సాధ్యం. పౌరులు తాగుతున్నది శుద్ధ జలమో.. కాదో తెలుసుకోవడానికి ప్రతి సచివాలయానికి జాతీయ జల్ మిషన్ కార్యక్రమంలో భాగంగా మల్టీ పారామీటర్ వాటర్ క్వాలిటీ ఫీల్డ్ టెస్ట్కిట్లు సరఫరా చేశారు. ఏటా వర్షాకాలం ముందు, తర్వాత ఇంజినీరింగ్ సహాయకులు నీటి నమూనాలను పరీక్షించాలి. తాగేందుకు వినియోగిస్తున్న నీరు సురక్షితమైనదేనని భరోసా ఇవ్వాలి. పరీక్షల్లో సహకరించేందుకు వార్డు సభ్యుడు, ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎం, వాలంటీరు, పొదుపు సంఘం సభ్యురాలికి శిక్షణ ఇచ్చారు. రుతుపవనాలు ప్రవేశించి వర్షాలు పడుతున్నా పరీక్షల ప్రక్రియ అంతంతమాత్రంగానే సాగుతోంది. మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్షలు జరుగుతున్నాయా, లేదా అన్నది ఉన్నతాధికారులు పర్యవేక్షించడం లేదు.
మూడు నెలల కిందట గొలుగొండ మండలం పీఎన్డీ పాలెంలో ఓ బోరు నీటిని పరీక్షించినప్పుడు ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. గతంలో ఈ ఛాయలు లేవు. కొత్తగా సమస్య ఉత్పన్నమైంది. క్షేత్రస్థాయి పరీక్షలో గుర్తించి నర్సీపట్నంలోని ప్రయోగశాలకు విశ్లేషణకు పంపినప్పుడు రూఢీ జరిగింది. దీంతో అక్కడి ప్రజలకు సురక్షిత తాగునీరు అందేలా ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేశారు. తాగునీటి పరీక్షల్లో అప్రమత్తంగా ఉండాలనేందుకు ఈ ఉదంతమే నిదర్శనం. వచ్చే ఏడాది జూన్ వరకు ఉపయోగపడేలా కిట్లు అన్ని సచివాలయాల్లో అందుబాటులో ఉన్నాయి. సమస్య ఉందని ఫిర్యాదు వచ్చినప్పుడే ఎక్కువగా స్పందిస్తున్నారు తప్ప మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్షలు చేయడం లేదు. ఇంజినీరింగ్ సహాయకులు కొన్ని సచివాలయాలకు ఇన్ఛార్జులుగా వ్యవహరిస్తున్నారు. గ్రామాల సంఖ్య ఎక్కువగా ఉండటం, ఇచ్చిన కిట్ 40 నుంచి 50 సార్లు మాత్రమే పరీక్ష చేయడానికి వీలుండటంతో చాలామంది పరీక్షించడం లేదు. గ్రామాల్లో నెలల తరబడి పరీక్షలే చేయడం లేదని పలువురు సర్పంచులు పేర్కొనడం గమనార్హం. ఎక్కడైనా తాగునీరు కలుషితమై వ్యాధులు ప్రబలినప్పుడు మాత్రమే వైద్య ఆరోగ్య శాఖ ఎంఎల్హెచ్వోలు పరీక్షలు చేయించేలా చూస్తున్నారు.
ఆర్వో ప్లాంట్లపై పర్యవేక్షణ ఏదీ?
ఇటీవల కాలంలో అన్ని చోట్లా ఆర్వో ప్లాంట్లు ఏర్పాటయ్యాయి. నర్సీపట్నం పురపాలక సంఘం పరిధిలో 35 వరకు ఈ ప్లాంట్లు ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో చాలామంది మున్సిపాల్టీ సరఫరా చేసే నీటిని ఇతర అవసరాలకు వాడుతూ, ఆర్వో ప్లాంట్ల నుంచి తాగునీటిని కొనుగోలు చేస్తున్నారు. అన్ని ప్లాంట్లు సరఫరా చేస్తున్న నీరు శుద్ధ జలమేనా, సురక్షితమేనా అన్నది అధికారులు పరీక్షించడం లేదు. ఈ ప్లాంట్ ఏర్పాటుకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్సు అనుమతి తప్పనిసరి. ఒకటి, రెండుచోట్ల తప్పించి ఎవరూ అనుమతి తీసుకోకుండానే వీటిని నిర్వహిస్తున్నారు. ఫుడ్ సేప్టీ అధికారులు కొద్దిరోజుల కిందట నర్సీపట్నంలో ఒక యూనిట్కి నోటీసు ఇచ్చారు. శుద్ధజలంలో నిర్ణీత మోతాదులో ఖనిజాలు లేకపోతే వ్యాధులొచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
నీటి నాణ్యత ప్రమాణాలు
పీహెచ్ 6.5 శాతం నుంచి 8.5 శాతం మించితే పొట్టలో మ్యూకస్ పొరకు హాని జరుగుతుంది.
డిసాల్యుడు సాలిడ్స్ 500 మి.గ్రా. నుంచి 2000 మి.గ్రా. దాటితే అన్నాశయంలో నొప్పితోపాటు కురుపులొచ్చే అవకాశం ఉంది.
భారత్వం (హార్డ్నెస్) 300 నుంచి 600 దాటినా, కాల్షియం 75 మి.గ్రా. నుంచి 200 మి.గ్రా. దాటినా ఆ నీరు ఇంటి అవసరాలకు పనికిరాదు.
ఫ్లోరైడ్ ఒక మిల్లీ గ్రాము నుంచి 1.5 మి.గ్రా. దాటితే పళ్లు పసుపు రంగులో మారి గార పడతాయి. ఎముకలు గుల్లబారుతాయి.
అల్యూమినియం 0.03 మి.గ్రా. నుంచి 0.2 మి.గ్రా. దాటితే మనో దౌర్భల్యంతో కూడిన ఒక విధమైన ఉన్మాదం, చిత్త వైకల్యం వంటివి ఎదురవుతాయి.
జాగ్రత్తలు మరవొద్దు
నీరు నురగతో వస్తుంటే వాడకూడదు. క్లోరిన్ వాసన వచ్చిన తర్వాత పరిశుభ్రంగా ఉన్నట్లు భావించినప్పుడే పట్టుకోవాలి.
కుళాయి నీటిని పట్టిన తర్వాత కొంతసేపు వినియోగించకుండా పక్కన పెడితే బురద వంటి వ్యర్థాలు ఉంటే అడుక్కు చేరుతాయి. తేరిన నీటిని వాడుకోచ్ఛు
కాచి చల్లార్చి, వడబోసిన నీటిని తాగడం సురక్షితం. నీళ్లు తాగిన తర్వాత వాంతులు, విరేచనాలు అయితే వైద్యులను సంప్రదించాలి. కలుషిత నీటిలో ఈ-కోలి బ్యాక్టీరియా ఉండొచ్ఛు
వినియోగదారులు ఆర్వో ప్లాంట్లలో నీటిని శుద్ధి చేసే విధానాన్ని పరిశీలించాలి. పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే తీసుకోకపోవడమే మేలు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ రాజకీయ నియంత
[ 26-04-2024]
జగన్ రాజకీయ నియంత అని సినీనటుడు పృథ్వీరాజ్ అన్నారు. గురువారం అనకాపల్లి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణతో కలిసి గాంధీనగరం, అంజయ్య కాలనీల్లో, రాత్రి కొత్తూరులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
జగన్ ప్యాలెస్కు కోట్లు.. పర్యటకానికి తూట్లు
[ 26-04-2024]
రిషికొండలో జగన్ ప్యాలెస్ నిర్మాణం కోసం పర్యటక శాఖ రూ. వందల కోట్లు కుమ్మరించింది. ఇదే శాఖ రాష్ట్ర పర్యటక రాజధానిగా ఉన్న అరకులోయ, పరిసర ప్రాంతాల కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. -
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
[ 26-04-2024]
రాజకీయాలకు దూరంగా తటస్థంగా ఉన్న చిరంజీవిని విమర్శిస్తే ఆయన అభిమానులు చూస్తూ ఊరుకోరని అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్ వైకాపా నాయకులను హెచ్చరించారు. -
వైకాపా ర్యాలీలో కార్యకర్తల ఘర్షణ
[ 26-04-2024]
తురువోలు సమీపంలో గురువారం సాయంత్రం వైకాపా కార్యకర్తలు నడిరోడ్డుపై ఘర్షణ పడ్డారు. ఒకరినొకరు కొట్టుకోవడంతో రోడ్డున పోయే వారు భయాందోళనకు గురయ్యారు. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
[ 26-04-2024]
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
రాష్ట్రాభివృద్ధే కూటమి ధ్యేయం
[ 26-04-2024]
నర్సీపట్నం తొమ్మిదో వార్డులో మాజీ మంత్రి అయ్యన్న సతీమణి, తెదేపా కౌన్సిలర్ చింతకాయల పద్మావతి, కోడళ్లు సువర్ణ, దివ్య, జనసేన కౌన్సిలర్ అద్దేపల్లి సౌజన్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
పేట వైకాపాకు భారీ షాక్
[ 26-04-2024]
వైకాపాకు భారీ షాక్ తగిలింది. పాయకరావుపేట, నక్కపల్లి మండలానికి చెందిన అనేక మంది గురువారం తెదేపాలో చేరారు. ఇప్పటికే పాయకరావుపేట మండలం పాల్తేరు, పాల్మన్పేట తదితర గ్రామాల నుంచి పెద్దఎత్తున వైకాపా నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తెదేపాలో చేరిన విషయం తెల్సిందే. -
ఎంపీకి 25.. అసెంబ్లీకి 148 నామినేషన్లు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 148 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. -
సీఎం నోరు తెరిస్తే అబద్ధాలే!
[ 26-04-2024]
ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసగించడంలో జగన్కు మించిన నాయకుడు దేశంలోనే లేరని జనసేన అసెంబ్లీ అభ్యర్థి సుందరపు విజయ్కుమార్ ఆరోపించారు. -
చెప్పింది ఘనం.. చేసింది శూన్యం
[ 26-04-2024]
రాష్ట్రంలో సులువైన పారిశ్రామిక విధానం ఉంది. పరిశ్రమల స్థాపనకు, వ్యాపార ప్రతిపాదనలతో వచ్చేవారికి అనువైన వాతావరణం కల్పించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. -
ఏడునియోజకవర్గాలకు 147 మంది నామపత్రాల దాఖలు
[ 26-04-2024]
నామపత్రాల స్వీకరణకు చివరి రోజైన గురువారం అసెంబ్లీ నియోజకవర్గాలకు భారీగా నామపత్రాలు దాఖలయ్యాయి. -
ఉక్కులో విద్యుత్తు ఛార్జీల పెంపు తగదు : సిటూ
[ 26-04-2024]
ఉక్కునగరంలో నివాసం ఉండే కార్మికులపై విద్యుత్తు ఛార్జీల భారం పెంచేలా యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సిటూ నాయకులు డిమాండ్ చేశారు. -
ఐదేళ్లూ మాటలే.. జనంతో ఆటలే!!
[ 26-04-2024]
రోడ్లు విస్తరణ, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టకుండా ముక్కుపిండి నగరవాసుల నుంచి పన్నులు వసూళ్లు చేశారు. జి-20 పుణ్యమా అని వచ్చిన నిధులను సైతం నాణ్యత లేకుండా సుందరీకరణ పనుల పేరుతో ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారు. -
పదో తరగతి ఫీజు 30లోగా చెల్లించాలి
[ 26-04-2024]
ఇటీవల విడుదల అయిన పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు ఏప్రిల్ 30వ తేదీలోపు ఫీజు చెల్లించుకోవచ్చని డీఈఓ ఎల్.చంద్రకళ తెలిపారు. -
న్యాయ కళాశాల విద్యార్థికి గాయాలు
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ న్యాయ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు నాలుగో పట్టణ పోలీస్ కానిస్టేబుల్పై నగర పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. -
తెలంగాణ ఇంటర్ ఫలితాలలో 983 మార్కులు
[ 26-04-2024]
తెలంగాణ ఇంటర్మీడియట ఫలితాలలో విశాఖకు చెందిన పూజారి సిద్విని 983 మార్కులు(హెచ్జీపీ) సాధించింది. ఆమె తండ్రి పూజారి రఘుప్రసాద్ ద్వారకా బస్స్టేషన్లో ఆర్టీసీ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. -
ప్రధాన దారులు.. నరకానికి నకళ్లు..
[ 26-04-2024]
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు అని ప్రచారం చేసుకుంటున్న వైకాపా ప్రభుత్వం ఆ సిద్ధాంతాన్ని క్షేత్ర స్థాయిలో అమలు చేయడంలో ఘోరంగా విఫలమైంది. జగన్ పాలనలో రాష్ట్రంలోని రోడ్లన్నీ అథోగతి పాలయ్యాయన్నది వాస్తవం. -
పారిశ్రామిక ప్రాంతాలు.. నిర్లక్ష్యానికి నిదర్శనాలు
[ 26-04-2024]
వైకాపా ముఖ్యమంత్రి జగన్ పాలనలో పారిశ్రామిక పురోగతి పూర్తిగా చతికిలపడింది. కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్నవి మూతపడే పరిస్థితి నెలకొంది. -
మట్టి తవ్వకందారులకు వైకాపా అండదండలు..
[ 26-04-2024]
చెరువులు, కొండల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్న అక్రమదారులకు వైకాపా ప్రజాప్రతినిధులు పుష్కలంగా అండదండలు అందిస్తున్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
దొడ్డిదారి బదిలీలకు రాచమార్గం
[ 26-04-2024]
‘మా ప్రభుత్వంలో అంతా పారదర్శకమే. ఎక్కడా లంచాలు లేవు.. అవినీతికి తావులేదు. సుపరిపాలన అంటే మాదే’ అని సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ గొంతుచించుకుంటూ ఉంటారు. -
బాబు వస్తేనే యువతకు జాబు
[ 26-04-2024]
విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ను గెలిపించాలని శ్రీభరత్ సతీమణి తేజస్విని కోరారు. -
ఎవరు ఆ ఇద్దరు?
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇద్దరు వ్యక్తులు అనధికారికంగా ఉద్యోగాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వీరికి ఏయూ వేతనాలు చెల్లిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా