‘వ్యాపారవేత్తల సమస్యలు పరిష్కరించండి’
రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎం.ఎస్.ఎం.ఇ.లు) చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాయని... వ్యాపారవేత్తలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని... వారి సమస్యలు పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఎం.ఎస్.ఎం.ఇ. జాతీయ బోర్డు సభ్యుడు విష్ణుకుమార్రాజు పేర్కొన్నారు.
ఎ.ఎస్.ఎన్.మెగామాల్ నిర్మాణాన్ని ప్రారంభిస్తున్న మంత్రి అమర్నాథ్. చిత్రంలో సృజన, మాల్ అధినేతలు
ఈనాడు, విశాఖపట్నం: రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎం.ఎస్.ఎం.ఇ.లు) చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాయని... వ్యాపారవేత్తలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని... వారి సమస్యలు పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఎం.ఎస్.ఎం.ఇ. జాతీయ బోర్డు సభ్యుడు విష్ణుకుమార్రాజు పేర్కొన్నారు. సోమవారం విశాఖలోని బాలల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ‘అంతర్జాతీయ ఎం.ఎస్.ఎం.ఇ. దినోత్సవం’ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఉద్యమ్ పత్రం కోసం ప్రస్తుతం రూ.50 వేలు చెల్లించాల్సి వస్తోందని, గతంలో రూ.వెయ్యి మాత్రమే ఖర్చయ్యేదని పేర్కొన్నారు. ఎం.ఎస్.ఎం.ఇ. ఎస్.సి./ఎస్.టి. హబ్ను విశాఖలో ఏర్పాటుచేయాలని డిమాండు చేశారు. పరిశ్రమల నుంచి వసూలు చేసే విద్యుత్తు ఛార్జీలు, విధించే పన్నులు ఎక్కువగా ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ పి.వి.ఎన్.మాధవ్ మాట్లాడుతూ పరిశ్రమలు ఏర్పాటుచేసే వారిని ప్రోత్సహించాలన్నారు. ఒడిశాలో ఒక పరిశ్రమ ఏర్పాటుచేయడానికి భూమిని కేటాయించాలని ఓ పారిశ్రామికవేత్త దరఖాస్తు చేసుకుంటే గంజాం జిల్లా కలెక్టర్ స్వయంగా ఫోన్ చేసి తాను కారు పంపిస్తానని... భూమిని చూసుకోవడానికి రమ్మని పిలిచారని తెలిసి ఆశ్చర్యపోయానని తెలిపారు. అలాంటి పరిస్థితి ఇక్కడా రావాలన్నారు. రాష్ట్ర పరిశ్రమలశాఖ సంచాలకురాలు సృజన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎం.ఎస్.ఎం.ఇ.ల సమస్యలను పరిష్కరించడానికి వీలుగా యూనిట్ల వారీగా అధ్యయనం చేస్తామని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ జిల్లాలోని పరిశ్రమలకు రూ.64కోట్ల ప్రోత్సాహకాలు(ఇన్సెంటివ్స్) ఇవ్వడానికి సిఫార్సులు పంపామన్నారు. నూతన పరిశ్రమల కోసం మొత్తం 1005 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. నూతన కార్యక్రమంలో భాగంగా విజయవంతంగా కొనసాగుతున్న అంకురసంస్థల ప్రతినిధులు వారు చేపట్టిన కార్యకలాపాలను వివరించారు. కార్యక్రమంలో భాగంగా సుమారు రూ.400కోట్ల వ్యయంతో ఎ.పి.ఐ.ఐ.సి. ఐలా ప్రాంగణంలో నిర్మించబోతున్న ఎ.ఎస్.ఎన్.మెగా మాల్ నిర్మాణాన్ని మంత్రి అమర్నాథ్ లాంఛనంగా ప్రారంభించారు. మాల్ నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభంకాగా... ఆ సంస్థ 1500 మందికి ఉద్యోగాలు కల్పించనుందని నిర్వాహకులు వివరించారు.
పరిశ్రమలశాఖ మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ:
ప్రతి రాష్ట్రానికి ఒక ప్రముఖ నగరం ఉన్నట్లే... ఆంధ్రప్రదేశ్కు విశాఖ నగరం కాకుండా మరే ఇతర ప్రముఖ నగరం ఉందని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటుపరం కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విశాఖలోని ఆటోనగర్ యథావిధిగా కొనసాగుతుందని... కొత్త యూనిట్లు పెట్టాలనుకున్న వారు అనకాపల్లిలో ఏర్పాటు చేసుకోవచ్చని వెల్లడించారు. విశాఖ కలెక్టర్ సూచన మేరకు విశాఖలో రెండు పారిశ్రామికవాడలు ఏర్పాటుచేస్తామని, అందుకు అవసరమైన భూమిని సిద్ధం చేయాలని సూచించారు. ఎం.ఎస్.ఎం.ఇ.లపై ఈనెల 30వ తేదీన ప్రధానితో సమావేశం ఉందని, అందులోనూ కొన్ని సమస్యల ప్రస్తావిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో ఎ.పి.ఎం.ఎస్.ఎం.ఇ. అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ వంకా రవీంద్రనాథ్, ఎం.ఎస్.ఎం.ఇ. అభివృద్ధి సంస్థ ఉప సంచాలకుడు జి.వి.ఆర్.నాయుడు, ఎమ్మెల్సీ పి.వి.ఎన్.మాధవ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున, ఎ.పి.ఎం.ఎస్.ఎం.ఇ. అభివృద్ధి కార్పొరేషన్ సంచాలకులు నదియా, శారద తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు విశాఖలో చంద్రబాబు సభ
[ 09-05-2024]
ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు తెదేపా అధినేత చంద్రబాబునాయుడు గురువారం విశాఖ రానున్నారు. -
ప్రతిపక్షం కంట్లో అధి‘కారం’!!
[ 09-05-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక విశాఖలో చేసిన అభివృద్ధి శూన్యం. మరి.. అయిదేళ్లు ఏం చేసిందనేది పరిశీలిస్తే.. ప్రశ్నించిన వారిపై దాడులకు తెగబడటం, విపక్ష నేతల ఆస్తులను ధ్వంసం చేయడం. -
అప్పన్న నిజరూప దర్శనం రేపు
[ 09-05-2024]
అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని సింహాద్రి అప్పన్న స్వామి నిజరూప దర్శనం వేడుక చందనోత్సవం సింహగిరిపై శుక్రవారం వైభవోపేతంగా జరగనుంది. -
పాలిసెట్లో శశి విద్యార్థి ప్రతిభ
[ 09-05-2024]
ఏపీ పాలిసెట్-24 ఫలితాల్లో సంగివలస శశి విద్యార్థి శీలం శ్రీరామ్ భవదీప్ 120/120 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి ప్రథమ ర్యాంకు సాధించాడు. -
పాలిసెట్లో అదరగొట్టిన విశాఖ బాలిక
[ 09-05-2024]
జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలని, ఆశించిన లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదలతో పోతుల జ్ఞానహర్షిత పాలిసెట్లో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించి సత్తా చాటింది. -
బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం : శ్రీభరత్
[ 09-05-2024]
తెదేపా కూటమి ప్రభుత్వంలో బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామని, గవర సామాజిక వర్గానికి పెద్దపీట వేసిన ఘనత తెదేపాకే దక్కుతుందని విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ అన్నారు. -
సైబర్ పరిశోధన ప్రయోగశాల ప్రారంభం
[ 09-05-2024]
విశాఖ పోర్టు ట్రస్టు సీఎస్ఆర్ నిధులతో పోలీసు కమిషనరేట్లో ఏర్పాటు చేసిన సైబర్ పరిశోధన ప్రయోగశాల(సైబర్ ఇన్వెస్టిగేషన్ ల్యాబ్)ను పోరు ట్రస్టు ఛైర్మన్ డాక్టర్ అంగముత్తు బుధవారం ప్రారంభించారు. -
‘బడికెళ్లే విద్యార్థికి ఏటా రూ.15 వేలు ఇస్తాం’
[ 09-05-2024]
తెదేపా కూటమి ప్రభుత్వంలో బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏటా రూ.15 వేలు ఇస్తామని విశాఖ పశ్చిమం తెదేపా అభ్యర్థి గణబాబు, విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ అన్నారు. -
కూటమి అభ్యర్థుల గెలుపునకు సైనికుల్లా పనిచేయాలి: నమిత
[ 09-05-2024]
కూటమి అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని భాజపా నాయకురాలు, నటి నమిత పిలుపునిచ్చారు. -
ఉచితమే అనుకుంటే.. ఉపద్రవం తప్పదు..
[ 09-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రలోభాల పర్వానికి తెరలేపుతున్నారు పార్టీల అభ్యర్థులు. మన రాష్ట్రంలో పాటు గోవా, తదితర రాష్ట్రాల్లో తయారు చేసిన నాసిరకం, కల్తీ మద్యాన్ని ఇచ్చి ఓటర్లకు ఎర వేసేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఉద్యోగుల ఓట్లు ఏకపక్షమే: సీఎం రమేశ్
[ 09-05-2024]
పోస్టల్ బ్యాలెట్లో ఉద్యోగుల వేస్తున్న ఓట్లు ఏక పక్షమేనని అనకాపల్లి పార్లమెంటు కూటమి(భాజపా) అభ్యర్థి సీఎం రమేశ్ స్పష్టం చేశారు. పెందుర్తి మండల పరిషత్ కార్యాలయం వద్ద జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. -
స్థానికులకే ఉపాధి కల్పిస్తాం: సీఎం రమేశ్
[ 09-05-2024]
కొండకర్ల ఆవను పర్యటక కేంద్రంగా అభివృద్ధి చేయడంతోపాటు మత్స్యకార యువతకు ఉపాధి కల్పిస్తామని అనకాపల్లి భాజపా ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ హామీ ఇచ్చారు. -
పులకేశీ.. విపక్షాలపై ఎంత కసి?
[ 09-05-2024]
వైకాపా సర్కారు కొలువుదీరింది మొదలు విపక్ష నేతలే లక్ష్యంగా కక్షసాధింపు చర్యలకు దిగింది. ప్రభుత్వ విధానాల్లో లోపాలు ఎత్తిచూపినా.. అధికార పార్టీ నేతల అక్రమాలపై గొంతెత్తినా.. సర్కారు అవినీతిపై ప్రశ్నించినా.. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినా కేసులు, అరెస్టులతో వేధింపులకు గురిచేశారు. సామాన్యుల నుంచి ఉద్యోగులు, విపక్ష నేతల వరకు అంతా ఈ అయిదేళ్లలో జగన్ నిరంకుశత్వ బాధితులే. -
పోస్టల్ బ్యాలెట్లో కొరవడిన ముందుచూపు
[ 09-05-2024]
జిల్లావ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ విధానంలో ఎన్నికల ప్రక్రియ రాత్రి 9 గంటల వరకు కొనసాగింది. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో ఫెసిలిటేషన్ కేంద్రాలు కిక్కిరిసిపోయాయి. -
ఇచ్చేదేం లేదు.. అంతా పట్టుకుపోవడమే!
[ 09-05-2024]
నోటి ముందు కూడు లాగేయడం జగన్ ప్రభుత్వానికి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు. రైతులకు ఉపయోగపడేలా కొత్తగా పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిందిపోయి ఉన్నవాటిని తరలించేశారు. -
ఎన్నికల్లో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ సేవలు
[ 09-05-2024]
పోలింగ్ సమయంలో పీఓ, ఏపీఓ, ఓపీఓలు పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వర్తిస్తుంటారు. బయట బీఎల్వోలు, భద్రతా సిబ్బంది తదితరులుంటారు. కేంద్రాల వద్దకు వచ్చే ఓటర్లలో ప్రత్యేకమైన సాయం కావల్సినవారు ఉంటారు. -
రావికమతంలో జూనియర్ కళాశాల ఏర్పాటుకు కృషి
[ 09-05-2024]
తెదేపా, భాజపా, జనసేన కూటమి అధికారంలోకి రాగానే రావికమతంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేసి, పీహెచ్సీని 30 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ హామీ ఇచ్చారు. -
వైకాపాలో గ్రూపుల గోల?
[ 09-05-2024]
తూర్పు నియోజకవర్గంలోని 18వ వార్డు వైకాపా ఇన్ఛార్జి మార్పు వ్యవహారం ఆ పార్టీలో కలకలం రేపుతోంది. వార్డు పరిధిలో గ్రూపుల గోలతో నాయకులు, కార్యకర్తలు సతమతమవుతున్నారు. -
నీలాద్రి గుమ్మం నుంచే నిజరూప దర్శనం
[ 09-05-2024]
సింహాద్రి అప్పన్న చందనోత్సవానికి పక్కాగా ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ మల్లికార్జున వెల్లడించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లో నగర పోలీసు కమిషనర్ రవిశంకర్తో కలిసి ఉత్సవానికి చేసిన ఏర్పాట్లను వివరించారు.
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్