ఓ వారం... అధ్యయనానికో వరం
దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడంలో గాంధీజీ పోషించిన పాత్ర ఎప్పటికీ మరువలేనిది. అందుకు అనుసరించిన విధానాలేమిటన్న అంశంపై చాలా మందికి అవగాహన లేదు. దేశ వాసులు ఆయన వెంట నడవడానికి... ఆయన్ను అంతగా ఆదరించడానికి...
మహాత్ముని ప్రత్యేకత తెలిపే కోర్సులు
ఈనాడు, విశాఖపట్నం: దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడంలో గాంధీజీ పోషించిన పాత్ర ఎప్పటికీ మరువలేనిది. అందుకు అనుసరించిన విధానాలేమిటన్న అంశంపై చాలా మందికి అవగాహన లేదు. దేశ వాసులు ఆయన వెంట నడవడానికి... ఆయన్ను అంతగా ఆదరించడానికి...మహానాయకుడిగా నేటికీ ప్రపంచ వ్యాప్తంగా స్ఫూర్తిగా నిలవటానికి కారణమేమిటన్నది ప్రస్తుత తరానికి తెలిసింది చాలా స్వల్పం. ఈ నేపథ్యంలో ఏయూలో 2006లో ‘గాంధీ అధ్యయన కేంద్రం’ (గాంధియన్ స్టడీస్ సెంటర్) అని ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ప్రారంభించారు. ఒక్కో కోర్సు రోజుకు రెండు గంటల చొప్పున వారం రోజులపాటు ఉంటుంది. తరగతులు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు జరుగుతుంటాయి. ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ నేపథ్యంలో గాంధీ చూపిన బాటను మరింత స్పష్టం చేసే ఈ కేంద్రం గురించి తెలుసుకుందామా.
1,800 పుస్తకాలతో..
* కోర్సు పూర్తిచేసిన వారికి ఆంధ్రవిశ్వవిద్యాలయ చిహ్నంతో పత్రం లభిస్తుంది.
* గాంధీజీ గురించి సమగ్ర అవగాహన కల్పించడానికి వీలుగా ఏకంగా 1800 పుస్తకాలను విభాగంలో అందుబాటు ఉంచారు.
* గాంధీజీ నేతృత్వంలోని ఉద్యమాలకు సంబంధించిన అపురూప ఛాయాచిత్రాల విభాగం ఆకట్టుకుంటుంది. బీ విభాగంలో సుమారు 60 మంది కూర్చోవచ్చు.
* ‘గాంధియన్ కమ్యూనికేషన్’, ‘గాంధియన్ థాట్’ అంశాలపై ప్రస్తుతం కోర్సులు నిర్వహిస్తున్నారు.
* వారం రోజులపాటు కొనసాగే కోర్సుల్లో భాగంగా చెప్పే అంశాలు విద్యార్థులను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని నిర్వాహకులు చెబుతున్నారు.
* గాంధీజీ కొల్లాయి దుస్తుల్లోనే దేశవ్యాప్తంగా ఎందుకు తిరిగారు? ఉద్యమంలో భాగంగా పలు ప్రాంతాలకు నడుచుకుంటూనే ఎందుకు వెళ్లేవారు? అతి సాధారణ జీవితాన్ని మాత్రమే ఎందుకు గడిపేవారు? తదితర విషయాలన్నింటిపై అవగాహన కల్పిస్తారు.
అధ్యయన కేంద్రంలో ఉంచిన పుస్తకాలు
* ఏయూలో గాంధీ అధ్యయన విభాగం ప్రారంభమైన సంవత్సరం: 2006
* నిర్వహిస్తున్న కోర్సులు: రెండు
* ఫీజు : ఉచితం
* వ్యవధి: వారం రోజులు
* అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య: బ్యాచ్కు 60
ఆలోచనా ధోరణి తప్పకుండా మారుతుంది
గాంధీజీ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. దేశంలోని అత్యంత నిరుపేదలు సైతం తనకు అండగా ఉండాలన్న ఉద్దేశంతో సౌఖ్యాలన్నీ త్యజించి కేవలం కొల్లాయి వస్త్రాలే ఆయన ధరించేవారు. అప్పట్లో ఉన్న తీవ్రమైన పేదరిక పరిస్థితుల నేపథ్యంలో చాలా మంది పురుషులు కూడా వస్త్రాలను కూడా అరకొరగానే కట్టుకునేవారు. దీంతో గాంధీజీ కూడా ఆ తరహా జీవన విధానాన్నే ఆచరించారు. తన ప్రతి చర్యా ప్రజలకు స్ఫూర్తిగా నిలవాలన్న లక్ష్యం ఆయనలో అడుగడుగునా కనిపించేది. అహింసా మార్గంలోనే పోరాడాలని బోధిస్తూ... ఆ మార్గంలోనే చివరకు స్వాతంత్య్రం దక్కటానికి కారణమయ్యారు. ఇతరులకు చెప్పే ఏ అంశమైనా ముందుగా తాను ఆచరించి చూపించి ఆదర్శంగా నిలిచారు. ఈ కోర్సులు చేయడానికి యువత ముందుకు వస్తే వారి ఆలోచనా ధోరణి, వ్యక్తిత్వంలో ఆశాజనక మార్పులు వస్తాయని కచ్చితంగా చెప్పవచ్చు.
- ఆచార్య చల్లా రామకృష్ణ, డైరెక్టర్, గాంధియన్ స్టడీస్ విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ యువతకు.. లక్ష ఉద్యోగాలు
[ 08-05-2024]
‘వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయింది. యువతకు ఉపాధి లేకుండా పోయింది. కొత్త పరిశ్రమలు రాకపోగా.. ఉన్నవి కూడా మూతపడ్డాయి. డిగ్రీలతో బయటకొస్తున్న యువతకు తగిన ఉద్యోగాలు లేవు. -
జగన్కు పల్లకీ మోత.. గిరిజనులకు డోలీమోత
[ 08-05-2024]
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం మూలపేట పంచాయతీ కుంబర్ల గ్రామానికి చెందిన కొర్రా రోజా నిండు గర్భిణి. కొద్దినెలల కిందట పురిటినొప్పులతో బాధపడుతున్న ఆమెను స్ట్రెక్చర్పై డౌనూరు ఆరోగ్య కేంద్రానికి వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. -
నిషేధమన్నావు.. నిషాలో ముంచావు!
[ 08-05-2024]
మాటతప్పను.. మడమ తిప్పను అన్న జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్య నిషేధాన్ని పక్కనపెట్టేశారు. అనకాపల్లి జిల్లాలో 151 మద్యం దుకాణాలను ఏర్పాటుచేసి వాటి ద్వారా ఏటా అమ్మకాలు పెంచుకుంటూ పోయారు. -
అంతు చూసేలా.. అన్యాయం చేసేలా..!!
[ 08-05-2024]
ఉద్యమాలపై పూర్తి నిరంకుశ వైఖరి ప్రదర్శించారు. ఉపాధ్యాయులు, స్టీల్ప్లాంట్, సమగ్రశిక్ష, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు.. ఇలా అందరినీ అణచివేసేందుకు ప్రయత్నించారు. ‘నా అక్కచెల్లెమ్మలు’ అంటూ ప్రేమ నటించే జగన్.. -
రేవులో తేలిన జగన్ హామీలు..!
[ 08-05-2024]
తూర్పు తీరంలో విశాఖ చేపలరేవు అతి పెద్దది. వేలాది మంది మత్స్యకారులు, బోటు ఆపరేటర్లు దీనిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వీరికి కష్టాలు మొదలయ్యాయి. -
కూటమిని గెలిపిస్తే నెలకు రూ.4 వేల పింఛను
[ 08-05-2024]
కూటమి అభ్యర్థులను గెలిపిస్తే పింఛను నెలకు రూ. 4 వేలు అందిస్తారని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని జనసేన పార్టీ ఉత్తరాంధ్రా జిల్లాల ముఖ్యవ్యవహారాల ప్రతినిధి సుందరపు సతీష్కుమార్ అన్నారు. -
మచ్చలేని నాయకుడు నరేంద్రమోదీ: జీవీఎల్
[ 08-05-2024]
సుదీర్ఘ రాజకీయ జీవితంలో నరేంద్రమోదీ మచ్చలేని నాయకుడిగా నిలిచారని భాజపా నేత జీవీఎల్ నరసింహారావు అన్నారు. లాసన్స్బేకాలనీ భాజపా కార్యాలయంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. -
గాజువాకలో జగన్ ప్రచార సభ
[ 08-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సాయంత్రం గాజువాక కూడలిలో నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సభ పేలవంగా సాగింది. -
వైకాపాను గద్దె దించేందుకు జనం ఎదురుచూపు
[ 08-05-2024]
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్మారక ప్రాంతాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా అభివృద్ధి చేస్తానని అనకాపల్లి పార్లమెంట్ భాజపా అభ్యర్థి సీఎం రమేశ్ హామీ ఇచ్చారు. -
అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్
[ 08-05-2024]
జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వందశాతం వెబ్కాస్టింగ్ నిర్వహిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రవి పేర్కొన్నారు. కలెక్టరేట్లో మంగళవారం పార్టీల ఏజెంట్లతో సమావేశం నిర్వహించారు. -
కూటమికి స్వతంత్ర అభ్యర్థి శిరీష మద్దతు
[ 08-05-2024]
విశాఖ ఉత్తరం, తూర్పు నియోజకవర్గాల నుంచి గాజుగ్లాసు గుర్తుపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న వడ్డి శిరీష కూటమి అభ్యర్థులకు తన మద్దతు ప్రకటించారు. మంగళవారం మధ్యాహ్నం తెదేపా కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. -
ఇలాక్కూడా చెబుతారా?!
[ 08-05-2024]
గాజువాకలో మంగళవారం నిర్వహించిన సిద్ధం సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రసంగం విని జనం అవాక్కయ్యారు. వివిధ అంశాలపై జగన్ చెప్పిన విషయాలకు, వాస్తవాలకు పొంతన లేకపోవడంతో ఇలాక్కూడా చెబుతారా అని ఆశ్చర్యపోయారు. -
‘వైకాపా కార్యాలయంగా ఏయూ’
[ 08-05-2024]
‘ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికార పార్టీ వైకాపా కార్యాలయంగా మారిపోయింది. ఉపకులపతి ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి, నిబంధనలకు విరుద్ధంగా నియమితులైన రిజిస్ట్రార్ జేమ్స్ స్టీఫెన్ వర్సిటీని వైకాపా సేవలో తరింపచేస్తున్నారు.