అందరి సహకారంతో అభివృద్ధి పథంలో!!
జిల్లా సమగ్ర అభివృద్ధికి అందరి సహకారంతో కృషి చేస్తున్నట్లు కలెక్టర్ ఎ.మల్లికార్జున వెల్లడించారు. సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేస్తూ పేదరిక నిర్మూలనకు పాటుపడుతున్నట్లు పేర్కొన్నారు.
‘గణతంత్ర’ వేడుకల్లో కలెక్టర్ మల్లికార్జున
న్యూస్టుడే, వన్టౌన్
జిల్లా సమగ్ర అభివృద్ధికి అందరి సహకారంతో కృషి చేస్తున్నట్లు కలెక్టర్ ఎ.మల్లికార్జున వెల్లడించారు. సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేస్తూ పేదరిక నిర్మూలనకు పాటుపడుతున్నట్లు పేర్కొన్నారు.
గణతంత్ర వేడుకలను గురువారం ఉదయం పోలీసు కవాతు మైదానంలో నిర్వహించగా... కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం చేశారు. అనంతరం పోలీసు దళాల ప్రదర్శనను సందర్శించి వారి నుంచి గౌరవ వందనం స్వీకరించారు. త్రివర్ణ శోభిత బెలూన్లను గాలిలోకి వదిలారు.
జిల్లాలో చేపట్టిన, చేయబోయే అభివృద్ధి అంశాలను వివరిస్తూ.. గ్రామీణాభివృద్ధి, సాంఘిక సంక్షేమంతో పాటు సంక్షేమశాఖల ద్వారా అల్పాదాయ వర్గాల కోసం చేస్తున్న కార్యక్రమాలను వెల్లడించారు. ‘విమ్స్లో రూ.20 కోట్లతో సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం. కేజీహెచ్తో సహా పలు ఆసుపత్రుల్లో నాడు-నేడు కింద రూ.950 కోట్లతో పనులు చేపట్టనున్నాం.
* స్త్రీశిశు సంక్షేమం, పాఠశాల విద్యాశాఖ, వ్యవసాయ, పశుసంవర్ధకశాఖలతో పాటు ఉద్యాన, మత్స్యశాఖల పరిధిలో పురోగతి సాధిస్తున్నాం. భీమునిపట్నం మండల పరిధిలో రూ.25 కోట్ల ఖర్చుతో జెట్టీ నిర్మిస్తాం.
* రూ.152 కోట్లతో చేపలరేవు నవీకరణ పనులు చేపట్టాం. రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో రూ.10.30 కోట్లతో 11 పనులు చేపడుతున్నాం.
* పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో రూ.17కోట్లతో గ్రామ సచివాలయ భవనాలు, రూ.12 కోట్లతో రైతు భరోసా కేంద్రాల భవనాలు నిర్మిస్తున్నాం.
* గృహనిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో రూ.251 కోట్లతో ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నాం. జిల్లా వ్యాప్తంగా లక్ష గృహాల నిర్మాణాలను చేపట్టాం.
* ఈపీడీసీఏల్ ఆధ్వర్యంలో 950 జగనన్న కాలనీల్లో రూ.108 కోట్లతో విద్యుత్తు సదుపాయం కల్పిస్తున్నాం. భూగర్భ విద్యుత్తు కేబులు పనులు చురుగ్గా సాగుతున్నాయి. రూ.482 కోట్ల మేర పనులు పూర్తి చేశాం. ఏక గవాక్ష విధానంలో 500 పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేశాం. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా మార్చి 3,4 తేదీల్లో సదస్సు నిర్వహిస్తున్నాం. పర్యాటకశాఖలో లగ్జరీ రిసార్ట్స్, హోటళ్ల అభివృద్ధికి 32 స్థలాలను గుర్తించాం. 40 ఎకరాల్లో రిసార్ట్సు నిర్మాణానికి ఒబెరాయ్ గ్రూపు ముందుకు వచ్చింది. వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో రూ.150కోట్లతో 73 జగనన్న కాలనీల్లో 1,47,130 ప్లాట్లను అభివృద్ధి చేస్తున్నాం. కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తయిన తర్వాత భారీగా నిధులు వెచ్చించి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.
* మధ్యతరగతి ప్రజల కోసం 3,300 ప్లాట్లను, రైతుల కోసం 50 లేఅవుట్లను అభివృద్ధి చేస్తున్నాం. మౌలిక వసతుల కల్పనకు రూ.200కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఆరు నెలల్లో ఈ పనులు పూర్తి అవుతాయి. మాస్టర్ప్లాన్ రహదారుల నిమిత్తం రూ.97 కోట్లు ఖర్చు చేస్తున్నాం. జీవీఎంసీ పరిధిలో రూ.91 కోట్లతో చేపట్టిన 585 పనులు వేగంగా సాగుతున్నాయి. 15వ ఆర్థిక సంఘం విడుదల చేసిన రూ.101కోట్లతో 60 పనులకు అనుమతులు మంజూరు చేశాం. ‘ఆకర్షణీయ’ పథకంలో చేపట్టిన పనుల్లో సగం పూర్తయ్యాయి. స్వచ్ఛసర్వేక్షన్-22లో జీవీఎంసీకి 5స్టారు రేటింగ్ లభించింది. సాగర తీర స్వచ్ఛత కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతున్నాం’ అని వివరించారు. జిల్లా అభివృద్ధికి సహకరిస్తున్న ప్రజా ప్రతినిధులు, శాఖల అధికారులకు అభినందనలు తెలిపారు.
* నగర పోలీసు కమిషనర్ సీహెచ్.శ్రీకాంత్, జేసీ విశ్వనాథన్, జీవీఎంసీ కమిషనర్ రాజాబాబు, డీసీపీ సుమిత్, ఎమ్మెల్సీలు పీవీఏన్ మాధవ్, వరుదు కల్యాణి, వి.ఎం.ఆర్.డి.ఎ.ఛైర్పర్సన్ అక్కరమాని విజయనిర్మల, డీఆర్వో శ్రీనివాసమూర్తి, ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు డాక్టర్ ఎస్.వి.ఆదినారాయణ, డాక్టర్ కూటికుప్పల సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన వారి దగ్గరకు వెళ్లి కలెక్టర్ పలు అంశాలపై మాట్లాడారు.
పోలీసుల కవాతు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ రాజకీయ నియంత
[ 26-04-2024]
జగన్ రాజకీయ నియంత అని సినీనటుడు పృథ్వీరాజ్ అన్నారు. గురువారం అనకాపల్లి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణతో కలిసి గాంధీనగరం, అంజయ్య కాలనీల్లో, రాత్రి కొత్తూరులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
జగన్ ప్యాలెస్కు కోట్లు.. పర్యటకానికి తూట్లు
[ 26-04-2024]
రిషికొండలో జగన్ ప్యాలెస్ నిర్మాణం కోసం పర్యటక శాఖ రూ. వందల కోట్లు కుమ్మరించింది. ఇదే శాఖ రాష్ట్ర పర్యటక రాజధానిగా ఉన్న అరకులోయ, పరిసర ప్రాంతాల కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. -
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
[ 26-04-2024]
రాజకీయాలకు దూరంగా తటస్థంగా ఉన్న చిరంజీవిని విమర్శిస్తే ఆయన అభిమానులు చూస్తూ ఊరుకోరని అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్ వైకాపా నాయకులను హెచ్చరించారు. -
వైకాపా ర్యాలీలో కార్యకర్తల ఘర్షణ
[ 26-04-2024]
తురువోలు సమీపంలో గురువారం సాయంత్రం వైకాపా కార్యకర్తలు నడిరోడ్డుపై ఘర్షణ పడ్డారు. ఒకరినొకరు కొట్టుకోవడంతో రోడ్డున పోయే వారు భయాందోళనకు గురయ్యారు. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
[ 26-04-2024]
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
రాష్ట్రాభివృద్ధే కూటమి ధ్యేయం
[ 26-04-2024]
నర్సీపట్నం తొమ్మిదో వార్డులో మాజీ మంత్రి అయ్యన్న సతీమణి, తెదేపా కౌన్సిలర్ చింతకాయల పద్మావతి, కోడళ్లు సువర్ణ, దివ్య, జనసేన కౌన్సిలర్ అద్దేపల్లి సౌజన్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
పేట వైకాపాకు భారీ షాక్
[ 26-04-2024]
వైకాపాకు భారీ షాక్ తగిలింది. పాయకరావుపేట, నక్కపల్లి మండలానికి చెందిన అనేక మంది గురువారం తెదేపాలో చేరారు. ఇప్పటికే పాయకరావుపేట మండలం పాల్తేరు, పాల్మన్పేట తదితర గ్రామాల నుంచి పెద్దఎత్తున వైకాపా నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తెదేపాలో చేరిన విషయం తెల్సిందే. -
ఎంపీకి 25.. అసెంబ్లీకి 148 నామినేషన్లు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 148 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. -
సీఎం నోరు తెరిస్తే అబద్ధాలే!
[ 26-04-2024]
ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసగించడంలో జగన్కు మించిన నాయకుడు దేశంలోనే లేరని జనసేన అసెంబ్లీ అభ్యర్థి సుందరపు విజయ్కుమార్ ఆరోపించారు. -
చెప్పింది ఘనం.. చేసింది శూన్యం
[ 26-04-2024]
రాష్ట్రంలో సులువైన పారిశ్రామిక విధానం ఉంది. పరిశ్రమల స్థాపనకు, వ్యాపార ప్రతిపాదనలతో వచ్చేవారికి అనువైన వాతావరణం కల్పించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. -
ఏడునియోజకవర్గాలకు 147 మంది నామపత్రాల దాఖలు
[ 26-04-2024]
నామపత్రాల స్వీకరణకు చివరి రోజైన గురువారం అసెంబ్లీ నియోజకవర్గాలకు భారీగా నామపత్రాలు దాఖలయ్యాయి. -
ఉక్కులో విద్యుత్తు ఛార్జీల పెంపు తగదు : సిటూ
[ 26-04-2024]
ఉక్కునగరంలో నివాసం ఉండే కార్మికులపై విద్యుత్తు ఛార్జీల భారం పెంచేలా యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సిటూ నాయకులు డిమాండ్ చేశారు. -
ఐదేళ్లూ మాటలే.. జనంతో ఆటలే!!
[ 26-04-2024]
రోడ్లు విస్తరణ, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టకుండా ముక్కుపిండి నగరవాసుల నుంచి పన్నులు వసూళ్లు చేశారు. జి-20 పుణ్యమా అని వచ్చిన నిధులను సైతం నాణ్యత లేకుండా సుందరీకరణ పనుల పేరుతో ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారు. -
పదో తరగతి ఫీజు 30లోగా చెల్లించాలి
[ 26-04-2024]
ఇటీవల విడుదల అయిన పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు ఏప్రిల్ 30వ తేదీలోపు ఫీజు చెల్లించుకోవచ్చని డీఈఓ ఎల్.చంద్రకళ తెలిపారు. -
న్యాయ కళాశాల విద్యార్థికి గాయాలు
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ న్యాయ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు నాలుగో పట్టణ పోలీస్ కానిస్టేబుల్పై నగర పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. -
తెలంగాణ ఇంటర్ ఫలితాలలో 983 మార్కులు
[ 26-04-2024]
తెలంగాణ ఇంటర్మీడియట ఫలితాలలో విశాఖకు చెందిన పూజారి సిద్విని 983 మార్కులు(హెచ్జీపీ) సాధించింది. ఆమె తండ్రి పూజారి రఘుప్రసాద్ ద్వారకా బస్స్టేషన్లో ఆర్టీసీ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. -
ప్రధాన దారులు.. నరకానికి నకళ్లు..
[ 26-04-2024]
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు అని ప్రచారం చేసుకుంటున్న వైకాపా ప్రభుత్వం ఆ సిద్ధాంతాన్ని క్షేత్ర స్థాయిలో అమలు చేయడంలో ఘోరంగా విఫలమైంది. జగన్ పాలనలో రాష్ట్రంలోని రోడ్లన్నీ అథోగతి పాలయ్యాయన్నది వాస్తవం. -
పారిశ్రామిక ప్రాంతాలు.. నిర్లక్ష్యానికి నిదర్శనాలు
[ 26-04-2024]
వైకాపా ముఖ్యమంత్రి జగన్ పాలనలో పారిశ్రామిక పురోగతి పూర్తిగా చతికిలపడింది. కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్నవి మూతపడే పరిస్థితి నెలకొంది. -
మట్టి తవ్వకందారులకు వైకాపా అండదండలు..
[ 26-04-2024]
చెరువులు, కొండల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్న అక్రమదారులకు వైకాపా ప్రజాప్రతినిధులు పుష్కలంగా అండదండలు అందిస్తున్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
దొడ్డిదారి బదిలీలకు రాచమార్గం
[ 26-04-2024]
‘మా ప్రభుత్వంలో అంతా పారదర్శకమే. ఎక్కడా లంచాలు లేవు.. అవినీతికి తావులేదు. సుపరిపాలన అంటే మాదే’ అని సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ గొంతుచించుకుంటూ ఉంటారు. -
బాబు వస్తేనే యువతకు జాబు
[ 26-04-2024]
విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ను గెలిపించాలని శ్రీభరత్ సతీమణి తేజస్విని కోరారు. -
ఎవరు ఆ ఇద్దరు?
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇద్దరు వ్యక్తులు అనధికారికంగా ఉద్యోగాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వీరికి ఏయూ వేతనాలు చెల్లిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్