విశాఖ తీరంలో.. విధ్వంసం
విశాఖలోని కొన్ని ప్రాంతాల్లో తీర ప్రాంత అందాలు చెదిరిపోతున్నాయి. భారీ యంత్రాలతో ఇసుకదిబ్బలను తొలగించేస్తున్నారు. ప్రకృతి విధ్వంసం జరుగుతున్నా ఆపలేరా అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సుందరీకరణ పేరుతో జీవావరణంపై వేటు
పర్యావరణవేత్తల ఆందోళన
ఈనాడు, విశాఖపట్నం, న్యూస్టుడే, ఎంవీపీ కాలనీ
విశాఖలోని కొన్ని ప్రాంతాల్లో తీర ప్రాంత అందాలు చెదిరిపోతున్నాయి. భారీ యంత్రాలతో ఇసుకదిబ్బలను తొలగించేస్తున్నారు. ప్రకృతి విధ్వంసం జరుగుతున్నా ఆపలేరా అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
త్వరలో విశాఖలో జీ-20 సన్నాహక, పెట్టుబడుల సదస్సులు జరగనున్నాయి. దీంతో సుందరీకరణ పేరుతో జీవీఎంసీ యంత్రాంగం రంగంలోకి దిగింది. తీరంలోని కొన్ని ప్రాంతాలను సిద్ధం చేసే క్రమంలో ఈ పనులు చేస్తున్నారు. అయితే పూర్తి వివరాలు అధికారికంగా ఎవరూ వెల్లడించటం లేదు. మరో వైపు... సహజవాతావరణం దెబ్బతినేలా సాగుతున్న పనులపై ఆందోళన వ్యక్తం అవుతోంది.
అలా తవ్వేస్తూ..
నగరంలోని అప్పూఘర్ ప్రాంతంలోని తీరంలో గురువారం కొన్ని పనులు చేపట్టారు. అక్కడ తీరాన్ని చదును చేశారు. స్థానికులు వెళ్లి ప్రశ్నించినా కొనసాగించారు. అలలకు అతి సమీపంలోని ఇసుక తిన్నెలను యంత్రాలతో చదును చేశారు. బీచ్ అంతటినీ రెండు, మూడు అడుగుల లోతున తవ్వి కొత్తగా కనిపించేలా మార్చారు. ఇసుక తిన్నెలపై ఉండే తీగ జాతి మొక్కలను పూర్తిగా తొలగించారు. అక్కడున్న గడ్డి మొక్కలు, పొదలను వేళ్లతో సహా పెకలించారు. శ్మశానవాటికకు సమీపంలోనూ ఈ పనులు జరగడంతో కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజల మనోభావాలు దెబ్బతినేలా, సమాధులకు సమీపంలో ఇలా చేయడాన్ని తప్పుపడుతున్నారు.
బీచ్లో యంత్రంతో పనులు చేస్తూ..
నిబంధనలు విస్మరించి: తీర ప్రాంత క్రమబద్ధీకరణ జోన్ (సీఆర్జెడ్) నిబంధనల ప్రకారం తీరంలో ఇసుక తిన్నెలు, ఆటుపోటుల మధ్య ఉన్న స్థలాన్ని యథాతథంగా ఉంచాలి. అక్కడ ఎటువంటి మార్పులు, చేర్పులు చేయకూడదు. ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా సాగుతోంది. ఇసుక ఎగరకుండా ఇసుక తిన్నెల మీద పెరుగుతున్న తీగజాతి మొక్కలు, పొదలను తొలగిస్తే సముద్ర తీర జీవాలకు ముప్పు ఏర్పడుతుందని పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ‘పొదల కింద చాలా జీవావరణం ఉంటుంది. ఇసుక కింద నుంచి ఉండే మొక్కల వేళ్ల వ్యవస్థ జీవావరణ వ్యవస్థతో ముడిపడి ఉంటుంది. ఆ వేళ్లపై పలు జీవులు ఆధారపడి ఉంటాయి. గాలులకు ఇసుక ఎగిరిపోకుండా, ఆటుపోట్ల సమయంలో ఇసుక సముద్రంలోకి కొట్టుకుపోకుండా ఆ వేళ్లు రక్షణగా నిలుస్తాయి. తీరాన్ని ధ్వంసం చేస్తే... గుడ్లు పెట్టేందుకు వచ్చే తాబేళ్ల ఉనికికే ముప్పు కలుగుతుంది. ఇసుక తిన్నెలు సహజంగా ఏర్పడాలంటే ఎన్నో ఏళ్లు పడుతుంది. అలాంటి వాటిని ఒక్క వేటు ధ్వంసం చేస్తున్నారు’ అని పలువురు పర్యావరణ ప్రియులు వాపోతున్నారు.
సమాధులకు సమీపంలో పనులు చేశాక ఇలా..
అనుమతి లేకుండా: సుందరీకరణ పనుల నిమిత్తం మూడు రోజుల కిందట సాగర్నగర్ బీచ్లో అటవీశాఖకు చెందిన స్థలంలో పనులు చేపట్టారు. దీనిపై అటవీ శాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తీర ప్రాంత రక్షణ స్థలం కావడంతో తప్పనిసరిగా అనుమతులు ఉండాలని చెప్పడంతో అక్కడ పనుల ప్రతిపాదనను విరమించుకున్నట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ బ్యాండేజీ సంగతి డాక్టర్లు చూసుకుంటారు: మంత్రి బొత్స
[ 26-04-2024]
విమర్శలు చేసేటప్పుడు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సంయమనం పాటించాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. -
జగన్ రాజకీయ నియంత
[ 26-04-2024]
జగన్ రాజకీయ నియంత అని సినీనటుడు పృథ్వీరాజ్ అన్నారు. గురువారం అనకాపల్లి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణతో కలిసి గాంధీనగరం, అంజయ్య కాలనీల్లో, రాత్రి కొత్తూరులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
జగన్ ప్యాలెస్కు కోట్లు.. పర్యటకానికి తూట్లు
[ 26-04-2024]
రిషికొండలో జగన్ ప్యాలెస్ నిర్మాణం కోసం పర్యటక శాఖ రూ. వందల కోట్లు కుమ్మరించింది. ఇదే శాఖ రాష్ట్ర పర్యటక రాజధానిగా ఉన్న అరకులోయ, పరిసర ప్రాంతాల కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. -
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
[ 26-04-2024]
రాజకీయాలకు దూరంగా తటస్థంగా ఉన్న చిరంజీవిని విమర్శిస్తే ఆయన అభిమానులు చూస్తూ ఊరుకోరని అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్ వైకాపా నాయకులను హెచ్చరించారు. -
వైకాపా ర్యాలీలో కార్యకర్తల ఘర్షణ
[ 26-04-2024]
తురువోలు సమీపంలో గురువారం సాయంత్రం వైకాపా కార్యకర్తలు నడిరోడ్డుపై ఘర్షణ పడ్డారు. ఒకరినొకరు కొట్టుకోవడంతో రోడ్డున పోయే వారు భయాందోళనకు గురయ్యారు. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
[ 26-04-2024]
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
రాష్ట్రాభివృద్ధే కూటమి ధ్యేయం
[ 26-04-2024]
నర్సీపట్నం తొమ్మిదో వార్డులో మాజీ మంత్రి అయ్యన్న సతీమణి, తెదేపా కౌన్సిలర్ చింతకాయల పద్మావతి, కోడళ్లు సువర్ణ, దివ్య, జనసేన కౌన్సిలర్ అద్దేపల్లి సౌజన్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
పేట వైకాపాకు భారీ షాక్
[ 26-04-2024]
వైకాపాకు భారీ షాక్ తగిలింది. పాయకరావుపేట, నక్కపల్లి మండలానికి చెందిన అనేక మంది గురువారం తెదేపాలో చేరారు. ఇప్పటికే పాయకరావుపేట మండలం పాల్తేరు, పాల్మన్పేట తదితర గ్రామాల నుంచి పెద్దఎత్తున వైకాపా నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తెదేపాలో చేరిన విషయం తెల్సిందే. -
ఎంపీకి 25.. అసెంబ్లీకి 148 నామినేషన్లు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 148 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. -
సీఎం నోరు తెరిస్తే అబద్ధాలే!
[ 26-04-2024]
ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసగించడంలో జగన్కు మించిన నాయకుడు దేశంలోనే లేరని జనసేన అసెంబ్లీ అభ్యర్థి సుందరపు విజయ్కుమార్ ఆరోపించారు. -
చెప్పింది ఘనం.. చేసింది శూన్యం
[ 26-04-2024]
రాష్ట్రంలో సులువైన పారిశ్రామిక విధానం ఉంది. పరిశ్రమల స్థాపనకు, వ్యాపార ప్రతిపాదనలతో వచ్చేవారికి అనువైన వాతావరణం కల్పించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. -
ఏడునియోజకవర్గాలకు 147 మంది నామపత్రాల దాఖలు
[ 26-04-2024]
నామపత్రాల స్వీకరణకు చివరి రోజైన గురువారం అసెంబ్లీ నియోజకవర్గాలకు భారీగా నామపత్రాలు దాఖలయ్యాయి. -
ఉక్కులో విద్యుత్తు ఛార్జీల పెంపు తగదు : సిటూ
[ 26-04-2024]
ఉక్కునగరంలో నివాసం ఉండే కార్మికులపై విద్యుత్తు ఛార్జీల భారం పెంచేలా యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సిటూ నాయకులు డిమాండ్ చేశారు. -
ఐదేళ్లూ మాటలే.. జనంతో ఆటలే!!
[ 26-04-2024]
రోడ్లు విస్తరణ, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టకుండా ముక్కుపిండి నగరవాసుల నుంచి పన్నులు వసూళ్లు చేశారు. జి-20 పుణ్యమా అని వచ్చిన నిధులను సైతం నాణ్యత లేకుండా సుందరీకరణ పనుల పేరుతో ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారు. -
పదో తరగతి ఫీజు 30లోగా చెల్లించాలి
[ 26-04-2024]
ఇటీవల విడుదల అయిన పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు ఏప్రిల్ 30వ తేదీలోపు ఫీజు చెల్లించుకోవచ్చని డీఈఓ ఎల్.చంద్రకళ తెలిపారు. -
న్యాయ కళాశాల విద్యార్థికి గాయాలు
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ న్యాయ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు నాలుగో పట్టణ పోలీస్ కానిస్టేబుల్పై నగర పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. -
తెలంగాణ ఇంటర్ ఫలితాలలో 983 మార్కులు
[ 26-04-2024]
తెలంగాణ ఇంటర్మీడియట ఫలితాలలో విశాఖకు చెందిన పూజారి సిద్విని 983 మార్కులు(హెచ్జీపీ) సాధించింది. ఆమె తండ్రి పూజారి రఘుప్రసాద్ ద్వారకా బస్స్టేషన్లో ఆర్టీసీ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. -
ప్రధాన దారులు.. నరకానికి నకళ్లు..
[ 26-04-2024]
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు అని ప్రచారం చేసుకుంటున్న వైకాపా ప్రభుత్వం ఆ సిద్ధాంతాన్ని క్షేత్ర స్థాయిలో అమలు చేయడంలో ఘోరంగా విఫలమైంది. జగన్ పాలనలో రాష్ట్రంలోని రోడ్లన్నీ అథోగతి పాలయ్యాయన్నది వాస్తవం. -
పారిశ్రామిక ప్రాంతాలు.. నిర్లక్ష్యానికి నిదర్శనాలు
[ 26-04-2024]
వైకాపా ముఖ్యమంత్రి జగన్ పాలనలో పారిశ్రామిక పురోగతి పూర్తిగా చతికిలపడింది. కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్నవి మూతపడే పరిస్థితి నెలకొంది. -
మట్టి తవ్వకందారులకు వైకాపా అండదండలు..
[ 26-04-2024]
చెరువులు, కొండల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్న అక్రమదారులకు వైకాపా ప్రజాప్రతినిధులు పుష్కలంగా అండదండలు అందిస్తున్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
దొడ్డిదారి బదిలీలకు రాచమార్గం
[ 26-04-2024]
‘మా ప్రభుత్వంలో అంతా పారదర్శకమే. ఎక్కడా లంచాలు లేవు.. అవినీతికి తావులేదు. సుపరిపాలన అంటే మాదే’ అని సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ గొంతుచించుకుంటూ ఉంటారు. -
బాబు వస్తేనే యువతకు జాబు
[ 26-04-2024]
విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ను గెలిపించాలని శ్రీభరత్ సతీమణి తేజస్విని కోరారు. -
ఎవరు ఆ ఇద్దరు?
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇద్దరు వ్యక్తులు అనధికారికంగా ఉద్యోగాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వీరికి ఏయూ వేతనాలు చెల్లిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు