ఇళ్లివ్వకుండానే వడ్డీలు.. వాయిదాలు
పట్టణ పేదల కోసం నిర్మించిన టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు ఇంకా అందుబాటులోకి రాలేదు, బ్యాంకుల నుంచి రుణాలు చెల్లించాలంటూ నోటీసులు మాత్రం అందుతున్నాయి.
టిడ్కో లబ్ధిదారులపై ఒత్తిళ్లు
నర్సీపట్నం పరిధిలో నిర్మించిన టిడ్కో ఇళ్లు
ఈనాడు డిజిటల్, అనకాపల్లి, న్యూస్టుడే నర్సీపట్నం అర్బన్: పట్టణ పేదల కోసం నిర్మించిన టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు ఇంకా అందుబాటులోకి రాలేదు, బ్యాంకుల నుంచి రుణాలు చెల్లించాలంటూ నోటీసులు మాత్రం అందుతున్నాయి. చేతిలో ఇంటి పట్టాలు పెట్టినా కాలనీల్లో కనీస మౌలిక సదుపాయలు కల్పించకపోవడంతో సొంతింటి గుమ్మంలో అప్పుడే అడుగుపెట్టే పరిస్థితి లేదు. ఈలోపు ఇళ్ల కోసం తీసుకున్న రుణాలకు సంబంధించి వాయిదాలు చెల్లించాలంటూ బ్యాంకుల ఒత్తిళ్లు ఓవైపు.. అప్పుచేసి కట్టిన వాటా సొమ్ముపై పెరుగుతున్న వడ్డీల భారం లబ్ధిదారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.
కాలయాపన.. వడ్డీల భారం..
అనకాపల్లితో పాటు నర్సీపట్నం, ఎలమంచిలి పురపాలక సంఘాల పరిధిలో 6,184 ఇళ్లను మూడు కేటగిరీలలో నిర్మించారు. అందులో 300 చ.అ విస్తీర్ణం ఇళ్లకు బ్యాంకుల నుంచి రుణాలు అవసరం లేదు.. లబ్ధిదారుడు రూపాయి చెల్లిస్తేచాలు. 365 చ.అ ఫ్లాట్కు లబ్ధిదారులు తమ వాటాగా రూ.25 వేలు చెల్లిస్తే బ్యాంకు నుంచి రూ.3.15 లక్షలు రుణం అందిస్తుంది. 430 చ.అ ఫ్లాట్కు రూ.50 వేలు చెల్లిస్తే బ్యాంకు రూ.3.65 లక్షలు రుణం ఇస్తుంది. టిడ్కో లబ్ధిదారులకు ఉమ్మడి జిల్లాలో 12 బ్యాంకులు రుణాలిస్తున్నాయి. ఇప్పటి వరకు 80 శాతం మందికి రుణాలు అందజేసినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. వీరి పేరిట రిజిస్ట్రేషన్లు పూర్తయినా నివాస యోగానికి మరికొన్నాళ్లు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. కాలనీల్లో తాగునీరు, మరుగునీటి పారుదల వ్యవస్థల నిర్మాణం జరగలేదు. అంతర్గత రోడ్లు పూర్తికాలేదు. అవన్నీ జరిగిన వరకు ఇంటిలో దిగడానికి అవకాశం లేదు. అప్పటి వరకు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీల భారం భరించాల్సిందే. పట్టణ పేదలపై ఇది మరింత ఆర్థిక భారంగా మారుతోంది. సకాలంలో ఇళ్లు చేతికి అందిఉంటే ఈ భారం తగ్గేదని లబ్ధిదారులంటున్నారు.
రుణ మంజూరు వివరాలిలా..
* అనకాపల్లి సత్యనారాయణపురం మెగా లేఅవుట్లో 365 చ.అ, 430 చ.అ ఇళ్లు కలిపి 448 నిర్మించారు. వాటిలో 110 ఇళ్లు లబ్ధిదారుల పేరిట రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. మిగతా వారికి ఈనెలలో రిజిస్ట్రేషన్లు చేయబోతున్నారు.
* నర్సీపట్నంలో 1,440 మంది లబ్దిదారులకు గాను ఇప్పటి వరకు 600 మందికి రూ.16.16 కోట్ల మేర రుణాలు ఇప్పించారు. వీరిలో కొందరికి బ్యాంకులు వాయిదాలైనా చెల్లించండి.. వడ్డీలైనా కట్టండని నోటీసులు జారీచేశాయి.
* ఎలమంచిలిలో 432 ఇళ్లకు గాను 336 లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేశారు. వారిలో కొంతమందికి ఫోన్లు చేసి నెలవారీ వాయిదాలు చెల్లించాలి బ్యాంకర్లు ఒత్తిడి తెస్తున్నారు.
ఇంటిలో దిగకుండానే..
-శీరంరెడ్డి కుమారి లక్ష్మి, కొత్తవీధి, నర్సీపట్నం
కొత్తవీధి ఆర్అండ్బీ బంగ్లా రోడ్డుపక్క రేకుల షెడ్డు వేసుకుని ఇద్దరు ఆడపిల్లలు పదిహేనేళ్లుగా జీవిస్తున్నాం. టిడ్కో ఇల్లు అందివస్తే అందులోకి వెళ్లిపోదామనుకుంటున్నాం. ఇంతలోనే బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలకు వాయిదాలు కట్టమంటున్నారు. ఇల్లు ఇంకా ఇవ్వకుండా ఎలా వాయిదాలు కట్టగలం?
రెండుసార్లు బ్యాంకు వడ్డీ కట్టా
-సామల రత్నం, లింగాపురం, నర్సీపట్నం
టిడ్కో ఇంటి కోసం బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలకు వడ్డీ కట్టమంటే రెండుసార్లు చెల్లించాను. ఇల్లు ఇవ్వకపోవడంతో బ్యాంకుకు వడ్డీ కట్టడం మానేశా. ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. నా భర్త అనారోగ్యంతో బాధపడుతున్నారు. అద్దె ఇంట్లో ఇబ్బంది పడాల్సివస్తోంది. ఇల్లు అందజేస్తే ఇబ్బందులు తీరతాయని ఆశపడుతున్నాం.
ఒకేసారి భారం కాకూడదని..
- సరోజిని, మెప్మా పీడీ
బ్యాంకులకు వాయిదాలు అప్పుడే చెల్లించనవసరం లేదు. రుణానికి నెలవారీ వడ్డీ పడుతుంది. ఆ మొత్తం ఏ నెలకు ఆ నెల కట్టేసుకుంటే మంచిది. ఒకేసారి ఎక్కువ భారం పడే అవకాశం ఉంటుంది. అందుకే రెండు మూడు నెలలకైనా ఒకసారి వడ్డీ చెల్లించుకుంటే ఉంటే మంచిది. ఇలా అయితే వాయిదాలు చెల్లించే నాటికి వడ్డీ భారం తొలగిపోతుంది. ఆ మేరకు లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జైలుకు పోతానన్న భయంతో జగన్ లండన్కు: సీఎం రమేశ్
[ 10-05-2024]
ముఖ్యమంత్రి జగన్ ఘోరంగా ఓడిపోతారని తెలిసి, జైలుకు పోతారన్న భయంతో లండన్కు వెళ్లిపోతున్నారని అనకాపల్లి భాజపా ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ అన్నారు. -
అందరూ ఓటేస్తేనే.. ఐదేళ్ల అరాచక పాలన అంతం
[ 10-05-2024]
ఈనెల 13న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుని, 95 శాతం పోలింగ్ నమోదు చేయాలని తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు ఓటర్లకు పిలుపునిచ్చారు. -
పోలింగ్ బృందాల తరలింపునకు.. 800 వాహనాలు
[ 10-05-2024]
పోలింగ్ బృందాలను ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానం నుంచి తరలించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు ప్రారంభించింది. ఈనెల 11వ తేదీ సాయంత్రం 6గంటలతో ప్రచార ఘట్టం పరిసమాప్తం కానుంది. -
అసంపూర్తిగా ముగిసిన చర్చలు
[ 10-05-2024]
అదానీ గంగవరం పోర్టు కార్మికులతో యాజమాన్యం జరిపిన మలి దఫా చర్చలు గురువారం అసంపూర్తిగా ముగిశాయని పోర్టు యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. -
ఉప్పెనలా రండి.. ఓటెత్తండి..!
[ 10-05-2024]
పోస్టల్ బ్యాలట్ ఓట్ల కోసం ప్రభుత్వ ఉద్యోగులు పోటెత్తారు. మండే ఎండ మాడ్చేస్తున్నా తగ్గలేదు. గంటల కొద్దీ నిరీక్షించి ఓటు వేశారు. -
జగన్.. ఏంటీ కనికట్టు!!
[ 10-05-2024]
వైకాపా ప్రభుత్వం జగనన్న కాలనీలను శాటిలైట్ సిటీలుగా అభివృద్ధి చేస్తామని గొప్పలు చెప్పింది. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అధ్వానంగా ఉంది. ఆ కాలనీల్లో నిర్మించిన ఇళ్లు పిచ్చుక గూళ్లను తలపిస్తున్నాయి. -
ఓటు వివరాలు ముందే తెలుసుకోండిలా!
[ 10-05-2024]
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ఈనెల 13న జిల్లాలోని ఒక లోక్సభ, ఏడు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. -
ఉద్యోగం వచ్చేంత వరకు రూ. 3 వేల నిరుద్యోగ భృతి
[ 10-05-2024]
పెందుర్తి నియోజకవర్గం కూటమి అభ్యర్థి పంచకర్ల రమేశ్బాబుకు సబ్బవరం మండలం ప్రజలు గురువారం బ్రహ్మరథం పట్టారు. నారపాడు, నల్లరేగులపాలెం, బల్జిపాలెం, బాటజంగాలపాలెం, గణపతినగర్, అసకపల్లి, ఎరుకునాయుడుపాలెం, పైడివాడ అగ్రహారం గ్రామాల్లో సుడిగాలి ప్రచారం నిర్వహించారు. -
వైఎస్సార్ బీమా.. ఏదీ ధీమా..
[ 10-05-2024]
కుటుంబ పెద్దను కోల్పోయి పుట్టెడు దుంఖంలో ఉన్న బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో వైకాపా ప్రభుత్వంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. -
కేంద్రం సహకారంతో జిల్లా అభివృద్ధి: సీఎం రమేశ్
[ 10-05-2024]
కేంద్రంలో ప్రధానిగా మోదీ, రాష్ట్రంలో సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టడం ఖాయమని, వారిద్దరి సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పేర్కొన్నారు. -
దళితులకు అన్యాయం చేసిన వైకాపాను ఓడించాలి
[ 10-05-2024]
దళితులకు అన్యాయం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని రాష్ట్రవ్యాప్తంగా దళితసేన, ప్రజాసంఘాలతో కలసి మే 13న జరిగే ఎన్నికల్లో ఓడిస్తామని రాష్ట్ర మాలమహానాడు అధ్యక్షుడు పాల్తేటి పెంటారావు పేర్కొన్నారు. -
పోస్టల్ బ్యాలెట్ కేంద్రంలో గందరగోళం
[ 10-05-2024]
ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అందకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అనకాపల్లి గవరపాలెం బాలుర ఉన్నత పాఠశాలలోని పోస్టల్ బ్యాలెట్ కేంద్రంలో చివరి రోజు చాలా మంది ఉద్యోగులు భారీగా ఓటు వేయడానికి తరలివచ్చారు. -
మున్సిపల్ ఉన్నతాధికారిపై ఈడీ కేసు నమోదు
[ 10-05-2024]
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో విధులు నిర్వహించిన ఉన్నతాధికారి, ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) (హైదరాబాద్) ఒక ప్రకటనలో తెలిపింది. -
మాజీ కౌన్సిలర్ దంపతుల ఓట్లు గల్లంతు..
[ 10-05-2024]
జీవీఎంసీ 82వ వార్డు శ్రీరామనగర్ కాలనీలో ఉంటున్న మాజీ కౌన్సిలర్ యర్రంశెట్టి లక్ష్మి పేరు ఓటర్ల జాబితాలో కనిపించలేదు. -
నిర్మాణాలు కుంగదీశావ్.. బతుకులు కూల్చేశావ్!
[ 10-05-2024]
భవన నిర్మాణ రంగం ఉపాధికి పెద్ద దిక్కు. లక్షలాది మంది కార్మికులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. -
స్మార్ట్ బాదుడుకు రంగం ‘సిద్ధం’!
[ 10-05-2024]
‘దేశంలో నాలాగా సంక్షేమ పథకాలు అమలుచేసే ముఖ్యమంత్రి ఎవ్వరూ ఉండరు. బటన్లు నొక్కుతున్నాను.. నే..రుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు పడతా ఉన్నాయి.’ -
అసత్యాల సారథి.. ఏదీ వారధి?
[ 10-05-2024]
ఐదేళ్లలో జనం కష్టాలు అన్నీ తీర్చేశామని.. తమ పాలనలో జరిగిందంతా మంచేనని చెబుతున్నారు ముఖ్యమంత్రి జగన్.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న
-
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా
-
‘పాక్ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
-
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
-
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం