కదిలేనా.. కలగా మిగిలేనా!
పూడిమడకలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం ప్రజాభిప్రాయ సేకరణకే పరిమితమైంది. స్థల పరిశీలన, ప్రజాభిప్రాయ సేకరణ జరిగి రెండేళ్లు దాటిపోయినా పనుల్లో కదలిక కనిపించడం లేదు.
పూడిమడక ఫిషింగ్ హార్బర్ ప్రజాభిప్రాయ సేకరణకే పరిమితం
అచ్యుతాపురం, న్యూస్టుడే
ఫిషింగ్ హార్బర్ ప్రతిపాదిత స్థలం ఇదే
పూడిమడకలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం ప్రజాభిప్రాయ సేకరణకే పరిమితమైంది. స్థల పరిశీలన, ప్రజాభిప్రాయ సేకరణ జరిగి రెండేళ్లు దాటిపోయినా పనుల్లో కదలిక కనిపించడం లేదు. దీని నిర్మాణం జరుగుతుందని సీఎం జగన్ ప్రచారం చేసుకోవడం తప్ప పనుల్లో అంగుళమైనా ముందుకెళ్లలేదు. విశాఖహార్బర్ తరవాత ఎక్కువ చేపలవేట సాగించే పూడిమడకలో మినీ హార్బర్ నిర్మాణానికి మత్స్యకారులకు ఎదురుచూపులు తప్పడం లేదు.
తీరం నుంచి ప్రమాదకరంగా వేటకు వెళ్తున్న మత్స్యకారులు
పూడిమడక.. ఈ పేరు చెబితే రాష్ట్రంలో తెలియని మత్స్యకారుడు ఉండడు. 20 వేల జనాభాతో రాష్ట్రంలోనే అతిపెద్ద మత్స్యకార గ్రామం. 600 బోట్లతో రోజూ ఇక్కడ చేపలవేట సాగిస్తారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ గ్రామంలో ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు సర్వే నంబర్ 139లో ప్రాజెక్టుకు అవసరమైన 37 ఎకరాల భూమిని గుర్తించింది. 2020 డిసెంబరు 31న ప్రజాభిప్రాయ సేకరణ వేలాది మంది మత్స్యకారుల సమక్షంలో అర్భాటంగా పూర్తిచేయించింది. ప్రజాభిప్రాయ సేకరణతో మమ అనిపించకుండా టెండర్లు ఆహ్వానించి పనులు ప్రారంభించాలని అప్పట్లో మత్స్యకారులు కోరారు. హార్బర్ లేకపోవడంతో కాకినాడ, విశాఖపట్నం, తమిళనాడు, ఒడిశా, మచిలీపట్నం వంటి ప్రాంతాలకు వలస వెళ్లిపోవాల్సి వస్తుందని వీరంతా ఆవేదన వ్యక్తం చేశారు.
హార్బర్ స్థలాన్ని పరిశీలిస్తున్న అప్పటి ఉమ్మడి విశాఖ జేసీ వేణుగోపాల్రెడ్డి
పరిపాలన అనుమతితో సరి
పూడిమడకలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి అవసరమైన అధ్యయనాలు పూర్తికావడంతో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. గత తెదేపా ప్రభుత్వం పర్యటకంగా అభివృద్ధి చేయడానికి గుర్తించిన ప్రదేశాన్నే వైకాపా ప్రభుత్వం మినీ ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి గుర్తించడంతో పర్యాటక ప్రాజెక్ట్ పక్కకుపోయింది. పర్యాటక ప్రాజెక్ట్పోయినా మినీ ఫిషింగ్ హార్బర్ వస్తుందని మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేసినా పనుల్లో మాత్రం రెండేళ్లగా కదలికలేదు. నిర్మాణానికి రూ.350కోట్లు మంజూరుచేస్తూ పరిపాలన అనుమతి అందించిన రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణానికి టెండర్లు పిలవకపోవడంతో పనులు ప్రారంభంకాలేదు.
సీఎం రాష్ట్రస్థాయిలో ప్రచారం చేసుకున్నారు
మేరుగు బాపునాయుడు, మత్స్యకార నాయకుడు, పూడిమడక
పూడిమడకలో హార్బర్ నిర్మాణ పనులు చేపట్టకపోగా ఇక్కడ పనులు జరుగుతున్నాయని సీఎం జగన్ భావనపాడు పోర్టు శంకుస్థాపన రోజు ప్రచారం చేసుకున్నారు. రాష్ట్రంలో మత్స్యకారులను ఆయన తప్పుదోవపట్టించారు. తీరం కోతకు గురికావడం, ముంచుకొస్తున్న తుపాన్లు, వేట సాగకపోవడం ఇలా మత్స్యకారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పనులు వెంటనే ప్రారంభించి మత్స్యకారులను ఆదుకోవాలి.
ఏపీఎంఐడీసీఎల్కు స్థలాన్నిఅప్పగించాం
లక్ష్మణరావు, డీడీ, మత్స్యశాఖ, అనకాపల్లి జిల్లా
పూడిమడకలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి అవసరమైన అన్ని రకాలైన చర్యలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. నిర్మాణానికి అన్ని అనుకూలంగా ఉన్నాయని నివేదికలు ప్రభుత్వానికి అందించాం. రాష్ట్రంలో మొదటి దశలో కొన్ని ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నారు. రెండవ దశలో బురగట్లపాలెం, బియ్యపుతిప్ప, వాడరేవు, కొత్తపట్నంతోపాటు పూడిమడకలో నిర్మించే ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే టెండర్లు పూర్తిఅయ్యాయి. పూడిమడకలో గుర్తించిన స్థలాన్ని ఏపీ మారిటైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎండీసీఎల్)కు అప్పగించాం. వీరు ద్వారా టెండర్ సంస్థకు స్థలాన్ని అందిస్తారు. 5 ఫిషింగ్ హార్బర్లు డిజైన్ దశలో ఉన్నట్లు సమాచారం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డబ్బన్నావ్.. డబ్బాకొట్టుకున్నావ్!!
[ 29-04-2024]
‘మా పాలనలో అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ముందడుగు వేశాం. 14 రోజుల పాటు పండగ వాతావరణంలో చేయూత పంపిణీ జరుగుతుంది. ప్రతి ఇంట్లో మహిళలను లక్షాధికారులుగా మార్చాం.’ -
అభివృద్ధికి పెద్దపీట వేస్తా: అనిత
[ 29-04-2024]
తనను గెలిపిస్తే నియోజకవర్గంలో అభివృద్ధికి పెద్దపీట వేస్తానని తెదేపా అభ్యర్థి వంగలపూడి అనిత పేర్కొన్నారు. పట్టణంలోని నాగరాజుపేట, ముస్లిం వీధి తదితర ప్రాంతాల్లో ఆదివారం ఇంటింటి ప్రచారం చేపట్టారు. -
ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
[ 29-04-2024]
32మంది బలిదానంతో ఏర్పాటైన విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామని కాంగ్రెస్ పార్టీ (ఇండియా కూటమి) విశాఖ పార్లమెంటు అభ్యర్థి పులుసు సత్యనారాయణరెడ్డి (సత్యారెడ్డి) పేర్కొన్నారు. -
బ్యాంకు ఖాతాలున్న పింఛనుదారులెందరు?
[ 29-04-2024]
దివ్యాంగులు, ఒంటరి మహిళల బ్యాంకు ఖాతాలకు సామాజిక పింఛన్ల నగదు జమ చేసేందుకు యంత్రాంగం చర్యలు చేపట్టింది. బ్యాంకు ఖాతాలు లేకపోతే వారి ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేయనున్నారు. -
కూటమితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం: గంటా
[ 29-04-2024]
కూటమితోనే రాష్ట్రానికి పూర్వ వైభవం వస్తుందని భీమిలి కూటమి అభ్యర్థి, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. కుసులవాడ, గిడిజాల, దబ్బంద, తర్లువాడ, పందలపాక, చందక, గొట్టిపల్లి గ్రామాల్లో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
సర్వం.. ప్రలోభాల పర్వం
[ 29-04-2024]
‘డబ్బు పంపిణీ చేయాలంటే కూపన్లు.. మద్యం సరఫరా చేయడానికి టోకెన్లు.. చివరికి ప్రచారంలో వెంట తిప్పుకోవడానికి పెట్రోలు కూపన్లు’ ఇలా ఓటర్లకు ఎర వేసేందుకు వైకాపా నేతలు పలువురు కూపన్ల రాజకీయానికి తెర తీశారు. -
పలు రైళ్ల రద్దు.. కొన్నింటి గమ్యాల కుదింపు
[ 29-04-2024]
కొరాపుట్-రాయగడ సెక్షన్లో భద్రతాపరమైన పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్నింటి గమ్యాలు కుదించినట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
భక్తులను మరిచి.. నేతలకు ఎర్రతివాచీ
[ 29-04-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో దేవాలయాల నిర్వహణ అగమ్యగోచరంగా మారింది. ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలుషితం చేసింది. కొన్నింటిని రాజకీయాలకు నెలవుగా మార్చేసింది. ట్రస్టు బోర్డుల నియామకాలను ఇష్టానుసారంగా చేపట్టారు. -
భారీ నిర్మాణాలకు అడ్డగోలుగా.. మంచినీటి సరఫరా
[ 29-04-2024]
విశాఖ నగరవాసుల దాహార్తి తీర్చడంలో జీవీఎంసీ యంత్రాంగం విఫలమైందని, ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ సంస్థలు హెచ్చరికలు జారీ చేస్తున్నా యంత్రాంగం ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేయకపోవడం దారుణమని తెదేపా, జనసేన, భాజపా నాయకులు విమర్శించారు. -
డప్పు కొట్టారు.. డబ్బు మరిచారు..
[ 29-04-2024]
రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సామాజిక వర్గాలకు చెందిన మహిళల సామాజిక సాధికారతే లక్ష్యంగా వైకాపా ప్రభుత్వం వైఎస్ఆర్ చేయూత పథకాన్ని తీసుకొచ్చింది. -
కూటమి పాలనతోనే రాష్ట్రంలో అభివృద్ధి
[ 29-04-2024]
కూటమి ప్రభుత్వం పాలనతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని అనకాపల్లి పార్లమెంటు కూటమి(భాజపా) అభ్యర్థి సీఎం రమేశ్ పేర్కొన్నారు. -
మూసేయడంలో తగ్గేదేలే!
[ 29-04-2024]
నాలుగు మూడు చేశాం.. మూడు రెండు చేశాం.. రెండు ఒకటి చేశాం.. రేపో, మాపో ఆ ఒక్కటీ లేకుండా చేస్తాం. -
అవ్వా తాతలకు అప్పుడే ధీమా
[ 29-04-2024]
తెదేపా హయాంలో తెలుపు రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకుని పింఛన్లు మంజూరు చేసేవారు. ఒకసారి లబ్ధిదారునిగా నమోదయ్యాక మధ్యలో తొలగించేవారు కాదు. -
సీఏం జగన్ మోసానికి రెండేళ్లు
[ 29-04-2024]
‘పరవాడ ఫార్మాసిటీ కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామాన్ని వారం, పదిరోజుల్లో తరలించి న్యాయం చేస్తాం. అందుకు అవసరమైన రూ.58 కోట్ల మొత్తాన్ని విడుదల చేసి సురక్షిత ప్రాంతానికి తరలిస్తాం’ అని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి 28 ఏప్రిల్ 2022న సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ప్రకటించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని ప్రార్థించా: సినీనటి జయప్రద
-
కడప కార్పొరేటర్లపై వైకాపాకు అనుమానాలు!
-
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
-
రంగంలోకి బైడెన్.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్ అనుమతి
-
యూపీఎస్సీ ఫలితాల్లో టీ మాస్టర్ కుమారుడి సత్తా
-
డబ్బన్నావ్.. డబ్బాకొట్టుకున్నావ్!!