‘పోలవరం ఎత్తు తగ్గిస్తే ఉత్తరాంధ్రకు తీవ్ర నష్టం’
పోలవరం ప్రాజెక్టు డ్యాం ఎత్తు 41.15 మీటర్లకు తగ్గిస్తే ఉత్తరాంధ్రకు తీరని అన్యాయం జరుగుతుందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు.
మాట్లాడుతున్న సత్యనారాయణమూర్తి, వేదికపై తెదేపా జిల్లా అధ్యక్షుడు బుద్ధ, సీపీఐ నాయకులు
అనకాపల్లి, న్యూస్టుడే: పోలవరం ప్రాజెక్టు డ్యాం ఎత్తు 41.15 మీటర్లకు తగ్గిస్తే ఉత్తరాంధ్రకు తీరని అన్యాయం జరుగుతుందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. అనకాపల్లి రోటరీ హాలులో మంగళవారం సీపీఐ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు సాధనపై నిర్వహించిన ఉత్తరాంధ్ర సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తొలివిడతలో 41.15 ఎత్తుకు నిర్మిస్తామని, రెండో విడత 45.72 మీటర్లకు పెంచుతామని చెబుతోందని, కేంద్ర ప్రభుత్వం ఈ మాట చెప్పడం లేదన్నారు. జాతీయ ప్రాజెక్టు అయినందున కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. సుజల స్రవంతి సాకారమైతే ఉత్తరాంధ్రలోని 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. తెదేపా జిల్లా అధ్యక్షులు బుద్ధ నాగజగదీశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో ప్రతి వారం పోలవరంపై సమీక్షించేవారని, జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తూతూమంత్రంగా ఏడాదికోసారి సమీక్షిస్తున్నారని తెలిపారు. వైకాపా ప్రభుత్వం రైతులకు తీరని అన్యాయం చేస్తోందని విమర్శించారు. తెదేపా హయాంలో అనకాపల్లిలో ఏర్పాటు చేసిన ఉద్యాన పరిశోధన స్థానాన్ని ఇక్కడి నుంచి తరలించిన విషయం గుర్తుచేశారు. సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లోకనాథం మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని అదానికి అప్పచెబుతున్నారని దుయ్యబట్టారు. సదస్సుకు సీపీఐ జిల్లా కార్యదర్శి వెంకటరమణ అధ్యక్షత వహించారు. సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి లోకేష్, వై.ఎన్.భద్రం, మాధవరావు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు విశాఖలో చంద్రబాబు సభ
[ 09-05-2024]
ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు తెదేపా అధినేత చంద్రబాబునాయుడు గురువారం విశాఖ రానున్నారు. -
ప్రతిపక్షం కంట్లో అధి‘కారం’!!
[ 09-05-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక విశాఖలో చేసిన అభివృద్ధి శూన్యం. మరి.. అయిదేళ్లు ఏం చేసిందనేది పరిశీలిస్తే.. ప్రశ్నించిన వారిపై దాడులకు తెగబడటం, విపక్ష నేతల ఆస్తులను ధ్వంసం చేయడం. -
అప్పన్న నిజరూప దర్శనం రేపు
[ 09-05-2024]
అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని సింహాద్రి అప్పన్న స్వామి నిజరూప దర్శనం వేడుక చందనోత్సవం సింహగిరిపై శుక్రవారం వైభవోపేతంగా జరగనుంది. -
పాలిసెట్లో శశి విద్యార్థి ప్రతిభ
[ 09-05-2024]
ఏపీ పాలిసెట్-24 ఫలితాల్లో సంగివలస శశి విద్యార్థి శీలం శ్రీరామ్ భవదీప్ 120/120 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి ప్రథమ ర్యాంకు సాధించాడు. -
పాలిసెట్లో అదరగొట్టిన విశాఖ బాలిక
[ 09-05-2024]
జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలని, ఆశించిన లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదలతో పోతుల జ్ఞానహర్షిత పాలిసెట్లో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించి సత్తా చాటింది. -
బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం : శ్రీభరత్
[ 09-05-2024]
తెదేపా కూటమి ప్రభుత్వంలో బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామని, గవర సామాజిక వర్గానికి పెద్దపీట వేసిన ఘనత తెదేపాకే దక్కుతుందని విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ అన్నారు. -
సైబర్ పరిశోధన ప్రయోగశాల ప్రారంభం
[ 09-05-2024]
విశాఖ పోర్టు ట్రస్టు సీఎస్ఆర్ నిధులతో పోలీసు కమిషనరేట్లో ఏర్పాటు చేసిన సైబర్ పరిశోధన ప్రయోగశాల(సైబర్ ఇన్వెస్టిగేషన్ ల్యాబ్)ను పోరు ట్రస్టు ఛైర్మన్ డాక్టర్ అంగముత్తు బుధవారం ప్రారంభించారు. -
‘బడికెళ్లే విద్యార్థికి ఏటా రూ.15 వేలు ఇస్తాం’
[ 09-05-2024]
తెదేపా కూటమి ప్రభుత్వంలో బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏటా రూ.15 వేలు ఇస్తామని విశాఖ పశ్చిమం తెదేపా అభ్యర్థి గణబాబు, విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ అన్నారు. -
కూటమి అభ్యర్థుల గెలుపునకు సైనికుల్లా పనిచేయాలి: నమిత
[ 09-05-2024]
కూటమి అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని భాజపా నాయకురాలు, నటి నమిత పిలుపునిచ్చారు. -
ఉచితమే అనుకుంటే.. ఉపద్రవం తప్పదు..
[ 09-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రలోభాల పర్వానికి తెరలేపుతున్నారు పార్టీల అభ్యర్థులు. మన రాష్ట్రంలో పాటు గోవా, తదితర రాష్ట్రాల్లో తయారు చేసిన నాసిరకం, కల్తీ మద్యాన్ని ఇచ్చి ఓటర్లకు ఎర వేసేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఉద్యోగుల ఓట్లు ఏకపక్షమే: సీఎం రమేశ్
[ 09-05-2024]
పోస్టల్ బ్యాలెట్లో ఉద్యోగుల వేస్తున్న ఓట్లు ఏక పక్షమేనని అనకాపల్లి పార్లమెంటు కూటమి(భాజపా) అభ్యర్థి సీఎం రమేశ్ స్పష్టం చేశారు. పెందుర్తి మండల పరిషత్ కార్యాలయం వద్ద జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. -
స్థానికులకే ఉపాధి కల్పిస్తాం: సీఎం రమేశ్
[ 09-05-2024]
కొండకర్ల ఆవను పర్యటక కేంద్రంగా అభివృద్ధి చేయడంతోపాటు మత్స్యకార యువతకు ఉపాధి కల్పిస్తామని అనకాపల్లి భాజపా ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ హామీ ఇచ్చారు. -
పులకేశీ.. విపక్షాలపై ఎంత కసి?
[ 09-05-2024]
వైకాపా సర్కారు కొలువుదీరింది మొదలు విపక్ష నేతలే లక్ష్యంగా కక్షసాధింపు చర్యలకు దిగింది. ప్రభుత్వ విధానాల్లో లోపాలు ఎత్తిచూపినా.. అధికార పార్టీ నేతల అక్రమాలపై గొంతెత్తినా.. సర్కారు అవినీతిపై ప్రశ్నించినా.. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినా కేసులు, అరెస్టులతో వేధింపులకు గురిచేశారు. సామాన్యుల నుంచి ఉద్యోగులు, విపక్ష నేతల వరకు అంతా ఈ అయిదేళ్లలో జగన్ నిరంకుశత్వ బాధితులే. -
పోస్టల్ బ్యాలెట్లో కొరవడిన ముందుచూపు
[ 09-05-2024]
జిల్లావ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ విధానంలో ఎన్నికల ప్రక్రియ రాత్రి 9 గంటల వరకు కొనసాగింది. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో ఫెసిలిటేషన్ కేంద్రాలు కిక్కిరిసిపోయాయి. -
ఇచ్చేదేం లేదు.. అంతా పట్టుకుపోవడమే!
[ 09-05-2024]
నోటి ముందు కూడు లాగేయడం జగన్ ప్రభుత్వానికి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు. రైతులకు ఉపయోగపడేలా కొత్తగా పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిందిపోయి ఉన్నవాటిని తరలించేశారు. -
ఎన్నికల్లో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ సేవలు
[ 09-05-2024]
పోలింగ్ సమయంలో పీఓ, ఏపీఓ, ఓపీఓలు పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వర్తిస్తుంటారు. బయట బీఎల్వోలు, భద్రతా సిబ్బంది తదితరులుంటారు. కేంద్రాల వద్దకు వచ్చే ఓటర్లలో ప్రత్యేకమైన సాయం కావల్సినవారు ఉంటారు. -
రావికమతంలో జూనియర్ కళాశాల ఏర్పాటుకు కృషి
[ 09-05-2024]
తెదేపా, భాజపా, జనసేన కూటమి అధికారంలోకి రాగానే రావికమతంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేసి, పీహెచ్సీని 30 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ హామీ ఇచ్చారు. -
వైకాపాలో గ్రూపుల గోల?
[ 09-05-2024]
తూర్పు నియోజకవర్గంలోని 18వ వార్డు వైకాపా ఇన్ఛార్జి మార్పు వ్యవహారం ఆ పార్టీలో కలకలం రేపుతోంది. వార్డు పరిధిలో గ్రూపుల గోలతో నాయకులు, కార్యకర్తలు సతమతమవుతున్నారు. -
నీలాద్రి గుమ్మం నుంచే నిజరూప దర్శనం
[ 09-05-2024]
సింహాద్రి అప్పన్న చందనోత్సవానికి పక్కాగా ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ మల్లికార్జున వెల్లడించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లో నగర పోలీసు కమిషనర్ రవిశంకర్తో కలిసి ఉత్సవానికి చేసిన ఏర్పాట్లను వివరించారు.
తాజా వార్తలు (Latest News)
-
వచ్చినప్పుడు ఒక మాట వెళ్లాక టాటా.. జగన్ మాటలు నీటి మూటలు
-
నేడు మన ‘నీడ’ మనకు కనిపించదు!
-
రూ.7 వేలకోట్ల రుణానికి ప్రయత్నాలు.. పోలింగ్ ముందురోజు పంపకాలకు సన్నాహాలు
-
జగన్ ఇష్టారాజ్యం చట్టం.. ఆస్తి కాపాడుకోవడం కష్టం
-
ప్రియురాలితో ఫోన్లో మాట్లాడుతూ ఆత్మహత్య
-
వైకాపా మార్క్ ’పీనల్ కోడ్’: పులకేశీ.. విపక్షాలపై ఎంత కసి?