Vizag: భారత్- ఆసీస్ టీ20.. పెద్దల చేతికి టికెట్లు?!
ఈ నెల 23న భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న టీ20 క్రికెట్ మ్యాచ్కు ఆన్లైన్, ఆఫ్లైన్లో టికెట్ల విక్రయం పూర్తయినప్పటికీ అభిమానుల్లో నిరుత్సాహం నెలకొంది
ఆఫ్లైన్, ఆన్లైన్లో లభించక నిరుత్సాహం
బ్లాక్లో కొనుగోలు చేస్తున్నఅభిమానులు
ఈనాడు, విశాఖపట్నం: ఈ నెల 23న భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న టీ20 క్రికెట్ మ్యాచ్కు ఆన్లైన్, ఆఫ్లైన్లో టికెట్ల విక్రయం పూర్తయినప్పటికీ అభిమానుల్లో నిరుత్సాహం నెలకొంది. ఎక్కువ ధర టికెట్లు కొనాలనుకున్నా లభించలేదు. అధికార పార్టీ నేతల కోసం కావాలనే చాలా టికెట్లు బ్లాక్ చేశారన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఆన్లైన్, ఆఫ్లైన్ టికెట్ల విక్రయాన్ని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) పూర్తి చేసింది. విక్రయానికి మొత్తంగా 22 వేల టికెట్లు ఉంచగా అంత మందికి విక్రయించిందా అన్న అనుమానాలు క్రీడాభిమానులు వ్యక్తం చేస్తున్నారు.
వైకాపా నేతల కోసం: ఈ నెల 15, 16 తేదీల్లో ఏసీఏ ఆన్లైన్లో టికెట్లు విక్రయించింది. ఆ సమయంలో చాలా కొద్ది సమయానికే ‘సోల్డ్ అవుట్’ అని చూపించిందని అభిమానులు వాపోయారు. రూ.6 వేలు, రూ.3 వేల టికెట్లు కొనుగోలు చేద్దామన్నా కనిపించలేదు. చాలా టికెట్లు ముందుగానే బ్లాక్ చేయించారనే ఆరోపణలు వస్తున్నాయి. ఏసీఏ పాలకవర్గ సభ్యులకు అధికార పార్టీ కీలక నేతలతో అతి దగ్గర సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీలోని నేతల నుంచి వచ్చిన ఒత్తిళ్ల మేరకు అందుకు తగినట్లు టికెట్లను ఉంచేశారంటున్నారు. బాక్సు టికెట్లు, ప్రైమ్, ఇతర ఖరీదైన టికెట్లు ప్రత్యేకంగా వైకాపా నేతల కోసం బ్లాక్ చేశారని ఆరోపణలు వస్తున్నాయి.
ఆఫ్లైన్లో శుక్ర, శనివారాల్లో అమ్మినప్పటికీ రెండు, మూడు గంటల్లోనే అయిపోయాయి. వరసల్లో ఉన్న సగం మందికైనా లభించకపోవడంతో నిరుత్సాహంగా వెనుదిరిగారు. మరో వైపు కొందరి చేతుల్లో పదుల సంఖ్యలో టికెట్లు కనిపించడంపై విమర్శలు వస్తున్నాయి.
ప్రైవేటు వ్యక్తులకు పెత్తనం: ఏసీఏతో సంబంధం లేని వ్యక్తులకు నిర్వాహకులు ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఏడాది మార్చిలో జరిగిన టి-20 మ్యాచ్ నిర్వహణకు సంబంధించి ఓ కమిటీలో రాయలసీమకు చెందిన వైకాపా నేత కుమారుడ్ని భాగస్వామ్యం చేశారు. ఈసారి అదే స్థాయిలో పలు కమిటీల్లో అధికార పార్టీతో సంబంధం ఉన్న వ్యక్తులు, రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపార సంస్థలకు చెందిన వారిని తీసుకునే యోచనలో ఉన్నారని సమాచారం. క్రీడాభిమానులను పక్కనపెట్టి ఇతర వ్యక్తులతో నిర్వహణ కొనసాగించడంపై ముందునుంచీ విమర్శలు ఉన్నాయి. ఓ రియల్ ఎస్టేట్ సంస్థను భాగస్వామ్యం చేయడం, ప్రతి కార్యక్రమంలో ప్రాధాన్యం ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సాఫ్ట్‘వేరుకు వైకాపా వైరస్’
[ 06-05-2024]
విశాఖలో పెద్ద సంఖ్యలో ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల నుంచి ఎంతో నైపుణ్యమున్న యువత బయటకు వస్తున్నారు. -
అదీ.. నాయకత్వం!!
[ 06-05-2024]
విశాఖకు ‘హుద్హుద్’ తుపాను చేసిన గాయం చరిత్రలో మరచిపోలేనిది. 2014 అక్టోబరులో విరుచుకుపడిన ఆ ఉపద్రవం ఇప్పటికీ కళ్లముందే కదులుతుంది. -
‘వైకాపా పాలనలో సహజ వనరుల లూఠీ’
[ 06-05-2024]
ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యురాలు బృందాకారాట్ పిలుపునిచ్చారు. ఆదివారం జగదాంబకూడలిలోని పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. -
కోడ్.. ఏమైంది?
[ 06-05-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నా అధికార వైకాపా నాయకులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. -
ప్రలోభాల ‘పోస్టల్ బ్యాలట్’...!
[ 06-05-2024]
పోస్టల్ బ్యాలట్లో వైకాపా నాయకుల ప్రలోభాల పర్వం యథేచ్ఛగా సాగింది. ఏయూ ఆంగ్ల, తెలుగు మాధ్యమ పాఠశాలలో ఆదివారం ఉదయం పోస్టల్ బ్యాలట్ పోలింగ్ ప్రారంభమైంది. -
ప్రలోభాల వల.. చిక్కితే విలవిలే!!
[ 06-05-2024]
వైకాపా అయిదేళ్ల పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందకపోగా మరింత వెనకబడిపోయింది. వాణిజ్య రాజధానిగా చెప్పుకొనే విశాఖ అభివృద్ధికి అన్ని వనరులు ఉన్నా జగన్ కనీసం పట్టించుకోలేదు. -
భోగాపురం ఎయిర్పోర్టుకు ‘అల్లూరి’ పేరు : శ్రీభరత్
[ 06-05-2024]
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత భోగాపురం ఎయిర్పోర్టుకు ‘అల్లూరి’ పేరు పెడతామని విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. -
‘యువతకు నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తాం’
[ 06-05-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి రాగానే వృద్ధులకు రూ.4 వేలు పింఛను అమలు చేయడంతో పాటు యువతకు ప్రతినెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి అందజేస్తామని అనకాపల్లి భాజపా ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ -
అయిదేళ్లలో కాపులకు రూ.15వేల కోట్లు ఖర్చు చేస్తాం
[ 06-05-2024]
కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక కాపులకు ప్రత్యేకంగా రూ.15 వేల కోట్లు ఖర్చు చేసి కాపుల సాధికారత, అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటామని తెదేపా నేత వంగవీటి రాధా ప్రకటించారు. -
ఏప్రిల్లో భారీ రికవరీ
[ 06-05-2024]
విశాఖ కమిషనరేట్ పరిధిలో ఏప్రిల్ నెలలో 68 ఆస్తి చోరీ కేసులు నమోదు కాగా, వాటిలో 49 కేసులను ఛేదించినట్లు జె.సి.పి. ఫకీరప్ప, డి.సి.పి. వెంకటరత్నంలు వెల్లడించారు. -
రైతుకు ఏటా రూ.20వేల పెట్టుబడి సాయం
[ 06-05-2024]
ప్రతి సంవత్సరం వ్యవసాయ పనుల కోసం రైతుకు పెట్టుబడి సాయం కింద కూటమి ప్రభుత్వం రూ.20 వేలు అందిస్తుందని భీమిలి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు. -
కూటమి ప్రభుత్వంలో ఏడాదికి 3 సిలిండర్లు ఉచితం
[ 06-05-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి వచ్చిన తక్షణం మహిళలకు సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు కూటమి(జనసేన) దక్షిణం అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు. -
జిల్లా అభివృద్ధికి పరి‘శ్రమిస్తా’..!
[ 06-05-2024]
‘రాష్ట్రంలో కూటమి గెలుపు ఖాయమైంది. మరికొద్ది రోజుల్లో జగన్ రాక్షస పాలన అంతం కాబోతోంది. ఆర్థికంగా, అభివృద్ధిపరంగా గాడితప్పిన ఈ రాష్ట్రాన్ని ప్రధాని మోదీ నిబద్ధత, చంద్రబాబు సమర్థత, పవన్ కల్యాణ్ చతురతతో పునఃనిర్మాణం చేసుకుంటాం. -
కూటమితో పిల్లలకు బంగారు భవిత
[ 06-05-2024]
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే పిల్లలకు బంగారు భవిష్యత్తు ఉంటుందని జనసేన అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. -
రౌడీగా మారిన బూడికి బుద్ధి చెప్పండి
[ 06-05-2024]
కాపులంతా ఐక్యంగా ఉండి ఎమ్మెల్యే కన్నబాబురాజును చిత్తుగా ఓడించాలని కూటమి అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ కోరారు. -
ఉచిత బస్సు ప్రయాణం: అనిత
[ 06-05-2024]
రాష్ట్రంలో అయిదేళ్లపాటు వైకాపా చేసిన అరాచకాలకు ప్రజలంతా ఈనెల 13న ఓటుతో బుద్ధి చెప్పాలని కూటమి అభ్యర్థి వంగలపూడి అనిత అన్నారు. -
అదిరింది అయ్యన్నా!
[ 06-05-2024]
ఎన్నికల ప్రచారంలో అయ్యన్నపాత్రుడు వినూత్న పంథా ఎంచుకున్నారు. ఆదివారం ఉదయాన్నే ఎన్టీఆర్ మినీ స్టేడియంకు వచ్చిన ఆయన వాకర్స్తో నడుస్తూ వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.