కీలక ఘట్టం.. నామపత్రం స్వీకరణ
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టం ఈనెల 18 నుంచి ప్రారంభం కానున్నది. ఆ రోజు జిల్లాలోని ఏడు అసెంబ్లీ, ఒక లోక్సభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్నది.
అభ్యర్థులు నిబంధనలు తెలుసుకోవాలి
వన్టౌన్, న్యూస్టుడే: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టం ఈనెల 18 నుంచి ప్రారంభం కానున్నది. ఆ రోజు జిల్లాలోని ఏడు అసెంబ్లీ, ఒక లోక్సభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్నది. నామపత్రాల స్వీకరణ అదే రోజు ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో నామపత్రాలు దాఖలు చేసే అభ్యర్థులు కచ్చితంగా కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
- నామపత్రం దాఖలు చేసే అభ్యర్థికి 25 ఏళ్లు నిండి ఉండాలి. ఈసీ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల తరఫున పోటీ చేస్తుంటే ఆయన అభ్యర్థిత్వాన్ని ఒక్కరు బలపరిస్తే సరిపోతుంది. ఆ ఒక్కరు కచ్చితంగా ఓటు నమోదు చేసుకుని ఉండాలి. స్వతంత్ర అభ్యర్థి అయితే కనీసం పది మంది ఓటర్లు బలపర్చాలి.
- శాసనసభకు నామపత్రం దాఖలు చేసే జనరల్ అభ్యర్థి రూ.10వేలు, ఎస్సీ, ఎస్టీలు అయితే రూ.5వేలు డిపాజిట్ చెల్లించాలి. అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో నామపత్రాలు దాఖలు చేయాలి. రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి కనీసం వంద మీటర్ల దూరంలో ర్యాలీలను నిలిపివేయాలి. అభ్యర్థితో పాటు మరో నలుగురిని మాత్రమే కార్యాలయంలోకి అనుమతిస్తారు.
ఎంపీ అభ్యర్థి జనరల్ అయితే రూ.25వేలు, ఎస్సీ, ఎస్టీలైతే రూ.12,500 డిపాజిట్ చెల్లించాలి. ఈసీ గుర్తింపు పొందిన రాజకీయపార్టీల తరఫున పోటీ చేస్తుంటే ఒకరు, స్వతంత్ర అభ్యర్థులైతే పది మంది ఓటర్లు బలపర్చాలి.
ఆన్లైన్లోనూ సమర్పించవచ్చు..
- ఈసారి ఆన్లైన్లో కూడా నామపత్రాలు దాఖలు చేయవచ్చు. వాటిని సువిధ యాప్ ద్వారా సమర్పించవచ్చు. తర్వాత ఆయా పత్రాల కాపీలను ఆర్ఓ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. గుర్తింపు పొందిన రాజకీయపార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఆయా పార్టీలు జారీ చేసే ఎ,బి ఫారాలను అందజేయాలి. నామపత్రం దాఖలు చేసే సమయంలో కాని, ఉప సంహరణ గడువు ముగిసే లోపు కాని ఇవ్వొచ్చు.
- విద్యార్హతలు, నేరచరిత్ర, ఆస్తులు, అప్పులకు సంబంధించిన అఫిడవిట్లు నామపత్రంతో పాటు జత చేయాలి. నేర చరిత్ర కలిగి, కోర్టు కేసులు ఎదుర్కొనే వారు ఆయా వివరాలు, కేసుల సంఖ్యను ప్రస్తావిస్తూ పత్రికల్లో మూడుసార్లు ప్రకటనలు ఇవ్వాలి.
- ఎమ్మెల్యే అభ్యర్థి రూ.40లక్షలు, ఎంపీ అభ్యర్థి రూ.95లక్షల వరకు ఖర్చు చేయడానికి అవకాశం ఉంది. నామపత్రం దాఖలు చేసినప్పటి నుంచి ఎన్నికల ఖర్చును పరిగణనలోకి తీసుకుంటారు. ఈనెల 18 నుంచి 25 వరకు నామపత్రాల స్వీకరణ, 26న పరిశీలన, 29 వరకు ఉపసంహరణలకు గడువు ఉంది.
- విశాఖ లోక్సభ నియోజకవర్గ ఆర్ఓగా కలెక్టర్ మల్లికార్జున వ్యవహరించనున్నారు. కలెక్టరేట్లో ఎంపీ అభ్యర్థుల నుంచి నామపత్రాలు స్వీకరించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మనవడిని కొట్టిందని.. కోడలిని హతమార్చిన మామ
[ 30-04-2024]
కోడలిపై మామ రోకలితో దాడి చేసి హతమార్చిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురంలో చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదంలో ట్రాన్సుపోర్టు వ్యాపారి దుర్మరణం
[ 30-04-2024]
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు పీఎంపాలెం సీఐ వై.రామకృష్ణ తెలిపారు. -
‘కర్కశ జమా’నా!!
[ 30-04-2024]
ఆ వృద్ధులు...కర్రదన్నుగా లేకుంటే నడవలేరు అలా పదడుగులు వేసినా ఆయాసం వచ్చేస్తుంది! చదువురాదు...అక్షరం తెలియదు.. చూపు కనిపించక మరొకరి సాయం తీసుకోవాల్సిందే!! -
పర్యాటక రంగంపై వైకాపా పడగ
[ 30-04-2024]
గమ్య నగరంగా విశాఖకున్న పేరును వైకాపా పాలకులు బంగాళాఖాతంలో కలిపేశారు. జగన్ సర్కారు హయాంలో పర్యాటక రంగం కుదేలైంది. -
అసెంబ్లీ ఎన్నికల బరిలో101 మంది
[ 30-04-2024]
జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల బరిలో 101 మంది నిలిచారు. -
ఎర్రమట్టి దిబ్బలకు గండం
[ 30-04-2024]
విశాఖ నగరం, సమీప ప్రాంతాల్లోని భూములపై కన్నేసిన అధికార వైకాపా నేతల కన్ను భీమిలికి సమీపంలోని భౌగోళిక వారసత్వ ప్రదేశం (జియోహెరిటేజ్ సైట్)గా గుర్తించిన ఎర్రమట్టి దిబ్బలపై పడింది. -
ఏజెంట్ల వివరాలు సమర్పించాలి
[ 30-04-2024]
విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల ఏజెంట్ల వివరాలను మంగళవారం సాయంత్రంలోగా కలెక్టర్ కార్యాలయంలో సమర్పించాలని కలెక్టర్, ఆర్ఓ మల్లికార్జున కోరారు. -
ముస్లింల సమస్యల పరిష్కారానికి కృషి
[ 30-04-2024]
ముస్లిం ఓటర్లు గత ఎన్నికల్లో తనను ఎంతో ప్రోత్సహించారని తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ అన్నారు. -
వలసలతో వైకాపా ఖాళీ: అనిత
[ 30-04-2024]
తెదేపాలోకి వలస వస్తున్న వారితో వైకాపా ఖాళీ అవుతోందని కూటమి ‘పేట’ అభ్యర్థి వంగలపూడి అనిత అన్నారు. -
కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి
[ 30-04-2024]
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. -
పార్టీ కోసం మెట్టు దిగా: పైలా
[ 30-04-2024]
ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి ఓ మెట్టు దిగాల్సి వచ్చిందని తెదేపా నాయకుడు పైలా ప్రసాదరావు పేర్కొన్నారు. -
బ్యాంకాక్ ఏషియా అందాల పోటీల్లో విశాఖ నివాసి మూడు టైటిల్స్ కైవసం
[ 30-04-2024]
బ్యాంకాక్లో జరిగిన ఏషియా అందాల పోటీల్లో విశాఖ నివాసి డాక్టర్ వై.మమతా చౌదరి మూడు టైటిల్స్ కైవసం చేసుకున్నారు. -
విశాఖ లోక్సభ బరిలో 33 మంది అభ్యర్థులు
[ 30-04-2024]
విశాఖ లోక్సభ ఎన్నికల బరిలో 33 మంది అభ్యర్థులు నిలిచారు. 2019 ఎన్నికల్లో కేవలం 14 మంది పోటీ చేశారు. -
ఖాతాల్లో పడకపోతే ఇళ్లకెళ్లి పింఛన్ల పంపిణీ: కలెక్టర్
[ 30-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళికి లోబడి సామాజిక పింఛన్లను పంపిణీ చేస్తామని జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున ఒక ప్రకటనలో తెలిపారు. -
అనకాపల్లి లోక్సభ నుంచి15మంది పోటీ!
[ 30-04-2024]
అనకాపల్లి ఎంపీ స్థానానికి 15 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. -
రైళ్లలో చోరీలకు పాల్పడే ముఠా అరెస్టు
[ 30-04-2024]
రైళ్లలో బంగారు ఆభరణాల చోరీకి పాల్పడుతున్న ముగ్గురు ముఠా సభ్యులను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు.