ఆరోగ్య వేషం.. ఇది కాదా మోసం!!
లంకెలపాలెం యూపీహెచ్సీలో వారానికి నాలుగు రోజులు ప్రత్యేక వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారని బోర్డు ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం చర్మ వ్యాధులకు సంబంధించిన ఓపీ చూడాల్సి ఉండగా.. వైద్యురాలు సెలవులో ఉన్నారు.
నిపుణులైన వైద్యులొస్తారని ప్రభుత్వ ప్రచారం
సాధారణ చికిత్సకే యూపీహెచ్సీలు పరిమితం
పేద రోగులకు తప్పని ఇక్కట్లు
-ఈనాడు డిజిటల్, విశాఖపట్నం
1.లంకెలపాలెం యూపీహెచ్సీలో వారానికి నాలుగు రోజులు ప్రత్యేక వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారని బోర్డు ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం చర్మ వ్యాధులకు సంబంధించిన ఓపీ చూడాల్సి ఉండగా.. వైద్యురాలు సెలవులో ఉన్నారు.
2. నరసింహనగర్-1 (అక్కయ్యపాలెం) యూపీహెచ్సీలో సోమ, బుధ, శుక్రవారాల్లో మాత్రమే వైద్య నిపుణులు వస్తున్నారని సిబ్బంది చెబుతున్నారు. వారిలో స్త్రీ వ్యాధులు, చిన్నపిల్లలు, ఎముకల వ్యాధుల నిపుణులున్నారు. ఈ కేంద్రం క్లస్టర్-2 పరిధిలో ఉన్నప్పుడు చర్మవ్యాధులు, జనరల్ మెడిసన్ నిపుణులూ వచ్చేవారు. మూడు నెలల క్రితం దీన్ని క్లస్టర్-6కు మార్చడంతో ముగ్గురు నిపుణులనే కేటాయించారు.
3. ఎన్జీజీవోస్ కాలనీ (అక్కయ్యపాలెం)లోని యూపీహెచ్సీ ఇరుకు భవనంలోనే నడుస్తోంది. ఇక్కడ సోమ, బుధ, శుక్ర, శనివారాల్లో స్పెషలిస్టులు రావాలి. జనరల్ మెడిసన్, ఆర్థోపెడిక్, గైనకాలజిస్టులు మూడు నెలల క్రితం ఉద్యోగాలకు రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఈ కేంద్రానికి సంబంధిత నిపుణులను కేటాయించలేదు. దీంతో ఇక్కడికి వచ్చే రోగులను సమీప కేంద్రాలకు, కేజీహెచ్కు వెళ్లాలని సిబ్బంది సూచిస్తున్నారు.
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్భాటంగా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను (యూపీహెచ్సీ)ను ఏర్పాటు చేసింది. వాటిలో ప్రజలందరికీ నాణ్యమైన వైద్యమందిస్తున్నామని సీఎం జగన్, వైకాపా నాయకులు గొప్పలు చెప్పారు. ప్రతి రోజు ప్రత్యేక వైద్య నిపుణులు వస్తారని, కార్పొరేట్ తరహా వైద్యమందుతుందని ఊదరగొట్టారు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే.. సాధారణ వ్యాధులకే చికిత్స చేస్తున్నారు. కొన్ని కేంద్రాల్లో వైద్యాధికారి తప్ప నిపుణులెవరూ రావడం లేదు. మరికొన్ని కేంద్రాలకు గతంలో నిపుణులు వచ్చేవారు. సురక్ష శిబిరాలు ప్రారంభించిన తర్వాత వారంతా ఆయా శిబిరాలకే పరిమితమవుతున్నారు. ఏదైనా అవసరమై సాయంత్రం 5 గంటల తర్వాత కేంద్రాలకు వెళ్తే.. తలుపులన్నీ మూసి ఉంటాయి. కొన్ని కేంద్రాల్లో మధ్యాహ్నం తర్వాత సిబ్బంది కూడా అందుబాటులో ఉండరు. దీంతో రోగులను కేజీహెచ్ లేదా ప్రైవేటు ఆసుపత్రులకు తీసుకెళ్లాల్సిందే. ఈ మాత్రానికి అంతగా ప్రచారం చేసుకోవడం దేనికని రోగులు ప్రశ్నిస్తున్నారు.
ప్రైవేటు ఆసుపత్రుల బాట: యూపీహెచ్సీల్లో వైద్యులు, సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిలో నియమించారు. వైద్య నిపుణులు వారంలో 16 కేంద్రాలకు వెళ్లి చికిత్స అందించాలి. ఆయా కేంద్రాల్లో వారు 2 నుంచి 3 గంటలే అందుబాటులో ఉంటున్నారు. వీరికి యూపీహెచ్సీలతోపాటు సురక్ష శిబిరాల్లోనూ బాధ్యతలు కేటాయించారు. దీంతో కొందరు వైద్యులు కేంద్రాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపట్లేదు. బాధ్యతలు పెరగడంతో పలువురు రాజీనామా చేశారు. వారి స్థానాల్లో ఇప్పటికీ సంబంధింత నిపుణులను నియమించలేదు. దీంతో కేంద్రాల్లో రక్తపోటు, మధుమేహం, దగ్గు, జ్వరం వంటి సాధారణ వ్యాధులకే చికిత్స చేస్తున్నారు. ఇతర సమస్యలతో వచ్చేవారిని సమీప కేంద్రాలకు రిఫర్ చేస్తున్నారు. దీంతో చాలా మంది రోగులు ప్రైవేటు ఆసుపత్రుల బాట పడుతున్నారు.
ఇరుకు గదుల్లోనే: జిల్లా పరిధిలో మొత్తం 63 యూపీహెచ్సీలు ఉన్నాయి. 36 కేంద్రాలకు నూతన భవనాలు నిర్మించారు. మిగిలిన వాటిని ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు (మ్యాక్) నిర్వహించిన భవనాల్లో ఏర్పాటుచేశారు. పాత భవనాలకు మెరుగులద్ది, ఇరుకు గదుల్లోనే నిర్వహిస్తున్నారు. సిబ్బంది కూర్చోవడానికి అనువైన వసతుల్లేవు. గదులు ఖాళీ లేకపోవడంతో పరికరాలు, ఔషధాలు నిల్వ చేసేందుకూ అవస్థలు ఎదురవుతున్నాయి. మరోవైపు కేంద్రాలకు నిపుణుల రాకపై స్థానికులకు అవగాహన లేదు. ఏ సమస్యకు ఎప్పుడు రావాలో, సంబంధిత వైద్యులు ఎప్పుడొస్తారో తెలియక ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. వైద్యుడు, సిబ్బంది ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉండాలి. పలు చోట్ల వారికి నచ్చిన సమయంలో వచ్చి, వెళ్తున్నారనే ఆరోపణలున్నాయి. వీరిపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ సరిగా లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మనవడిని కొట్టిందని.. కోడలిని హతమార్చిన మామ
[ 30-04-2024]
కోడలిపై మామ రోకలితో దాడి చేసి హతమార్చిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురంలో చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదంలో ట్రాన్సుపోర్టు వ్యాపారి దుర్మరణం
[ 30-04-2024]
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు పీఎంపాలెం సీఐ వై.రామకృష్ణ తెలిపారు. -
‘కర్కశ జమా’నా!!
[ 30-04-2024]
ఆ వృద్ధులు...కర్రదన్నుగా లేకుంటే నడవలేరు అలా పదడుగులు వేసినా ఆయాసం వచ్చేస్తుంది! చదువురాదు...అక్షరం తెలియదు.. చూపు కనిపించక మరొకరి సాయం తీసుకోవాల్సిందే!! -
పర్యాటక రంగంపై వైకాపా పడగ
[ 30-04-2024]
గమ్య నగరంగా విశాఖకున్న పేరును వైకాపా పాలకులు బంగాళాఖాతంలో కలిపేశారు. జగన్ సర్కారు హయాంలో పర్యాటక రంగం కుదేలైంది. -
అసెంబ్లీ ఎన్నికల బరిలో101 మంది
[ 30-04-2024]
జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల బరిలో 101 మంది నిలిచారు. -
ఎర్రమట్టి దిబ్బలకు గండం
[ 30-04-2024]
విశాఖ నగరం, సమీప ప్రాంతాల్లోని భూములపై కన్నేసిన అధికార వైకాపా నేతల కన్ను భీమిలికి సమీపంలోని భౌగోళిక వారసత్వ ప్రదేశం (జియోహెరిటేజ్ సైట్)గా గుర్తించిన ఎర్రమట్టి దిబ్బలపై పడింది. -
ఏజెంట్ల వివరాలు సమర్పించాలి
[ 30-04-2024]
విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల ఏజెంట్ల వివరాలను మంగళవారం సాయంత్రంలోగా కలెక్టర్ కార్యాలయంలో సమర్పించాలని కలెక్టర్, ఆర్ఓ మల్లికార్జున కోరారు. -
ముస్లింల సమస్యల పరిష్కారానికి కృషి
[ 30-04-2024]
ముస్లిం ఓటర్లు గత ఎన్నికల్లో తనను ఎంతో ప్రోత్సహించారని తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ అన్నారు. -
వలసలతో వైకాపా ఖాళీ: అనిత
[ 30-04-2024]
తెదేపాలోకి వలస వస్తున్న వారితో వైకాపా ఖాళీ అవుతోందని కూటమి ‘పేట’ అభ్యర్థి వంగలపూడి అనిత అన్నారు. -
కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి
[ 30-04-2024]
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. -
పార్టీ కోసం మెట్టు దిగా: పైలా
[ 30-04-2024]
ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి ఓ మెట్టు దిగాల్సి వచ్చిందని తెదేపా నాయకుడు పైలా ప్రసాదరావు పేర్కొన్నారు. -
బ్యాంకాక్ ఏషియా అందాల పోటీల్లో విశాఖ నివాసి మూడు టైటిల్స్ కైవసం
[ 30-04-2024]
బ్యాంకాక్లో జరిగిన ఏషియా అందాల పోటీల్లో విశాఖ నివాసి డాక్టర్ వై.మమతా చౌదరి మూడు టైటిల్స్ కైవసం చేసుకున్నారు. -
విశాఖ లోక్సభ బరిలో 33 మంది అభ్యర్థులు
[ 30-04-2024]
విశాఖ లోక్సభ ఎన్నికల బరిలో 33 మంది అభ్యర్థులు నిలిచారు. 2019 ఎన్నికల్లో కేవలం 14 మంది పోటీ చేశారు. -
ఖాతాల్లో పడకపోతే ఇళ్లకెళ్లి పింఛన్ల పంపిణీ: కలెక్టర్
[ 30-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళికి లోబడి సామాజిక పింఛన్లను పంపిణీ చేస్తామని జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున ఒక ప్రకటనలో తెలిపారు. -
అనకాపల్లి లోక్సభ నుంచి15మంది పోటీ!
[ 30-04-2024]
అనకాపల్లి ఎంపీ స్థానానికి 15 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. -
రైళ్లలో చోరీలకు పాల్పడే ముఠా అరెస్టు
[ 30-04-2024]
రైళ్లలో బంగారు ఆభరణాల చోరీకి పాల్పడుతున్న ముగ్గురు ముఠా సభ్యులను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు.