క్షణక్షణం ఉత్కంఠ!
సంచలనం సృష్టించిన డా.బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా వెంకటాయపాలెం శిరోముండనం కేసులో తుది తీర్పు నేపథ్యంలో మంగళవారం విశాఖ కోర్టులో ఉత్కంఠ నెలకొంది.
శిరోముండనం కేసు తీర్పు నేపథ్యంలో..
విశాఖ లీగల్, న్యూస్టుడే: సంచలనం సృష్టించిన డా.బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా వెంకటాయపాలెం శిరోముండనం కేసులో తుది తీర్పు నేపథ్యంలో మంగళవారం విశాఖ కోర్టులో ఉత్కంఠ నెలకొంది. ఉదయం తొమ్మిది గంటల నుంచే న్యాయస్థానానికి పలు ప్రజాసంఘాలు, మహిళా సంఘాల ప్రతినిధులు చేరుకున్నారు. 10 గంటల సమయంలో మొత్తం 9 మంది నిందితులు న్యాయస్థానానికి చేరుకున్నారు. అనంతరం వివిధ వర్గాల ప్రజలు, నిందితుల అనుచరులు రావడంతో కోర్టు వరండాలు కిక్కిరిసిపోయాయి. పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
న్యాయమూర్తి తీర్పునకు ముందు: మంగళవారం ఉదయం 10.30 గంటలకు పదకొండో అదనపు జిల్లా న్యాయస్థానం కమ్ ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల (నిరోధక) న్యాయస్థానం విధులను ప్రారంభించగా, శిరోముండనం కేసు మధ్యాహ్నం 12.30 గంటలకు న్యాయమూర్తి లాలం శ్రీధర్ ముందుకు వచ్చింది. నిందితులందరూ వెంటనే కోర్టులో హాజరయ్యారు. న్యాయమూర్తి... నిందితులను పిలిచి నేరం రుజువైందని శిక్ష గురించి చెప్పుకోవాలని అనుమతించారు. ప్రధాన నిందితుడు, వైకాపా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తాను ఏ తప్పు చేయలేదని, రాజకీయ కక్షతో కేసులో ఇరికించారని, 28ఏళ్లుగా మానసిక క్షోభను అనుభవించానని, అయితే కోర్టు తీర్పును గౌరవిస్తానని విన్నవించుకున్నారు. మిగిలిన నిందితులూ అదే విధంగా న్యాయస్థానానికి తెలిపారు.
పైకోర్టులో అప్పీలుకు సిద్ధం: బాధితుల తరఫున కేసును వాదించిన ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సత్యనారాయణమూర్తి వాదనలు వినిపిస్తూ నిందితులపై పూర్తి స్థాయి విచారణ జరిగిందని, శిక్ష మినహాయింపునకు వారికి ఎటువంటి అర్హత లేదన్నారు. నిందితుల తరఫున సీనియర్ న్యాయవాది కె.వి.రామమూర్తి వాదనలు వినిపిస్తూ నిందితులు 28 ఏళ్లుగా విచారణకు హాజరవుతున్నారని తెలియజేశారు. అనంతరం న్యాయమూర్తి తీర్పు సారాంశాన్ని చదివి వినిపించారు. ప్రధాన నిందితుడు, వైకాపా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల సహా నిందితులందరికి ఒక్కొక్కరికి 18 నెలల చొప్పున సాధారణ జైలు శిక్షతోపాటు ప్రతి ఒక్కరు రూ.42 వేల చొప్పున జరిమానా చెల్లించాలని తీర్పునిచ్చారు. తీర్పు కాపీలను అందుకున్న నిందితులు పైకోర్టులో అప్పీలు చేసుకునే వరకు శిక్ష అమలు నిలిపివేయాలని కోరారు.
కోర్టు బయట హడావుడి: న్యాయస్థానం నుంచి బయటకొచ్చిన నిందితులందరూ ప్రధాన నిందితుడు తోట త్రిమూర్తులను అనుసరించారు. వారి అనుచరుల కూడా రావడంతో కోర్టు బయట హడావుడి నెలకొంది. అనంతరం తోట త్రిమూర్తులు విలేకరులతో మాట్లాడుతూ తాను నిర్దోషినని, పైకోర్టులో అప్పీలు చేసుకుని నిర్దోషిగా తిరిగి వస్తానన్నారు. అనంతరం సుమారు 15 కార్లలో నిందితులు, అనుచరులు వెళ్లిపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మనవడిని కొట్టిందని.. కోడలిని హతమార్చిన మామ
[ 30-04-2024]
కోడలిపై మామ రోకలితో దాడి చేసి హతమార్చిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురంలో చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదంలో ట్రాన్సుపోర్టు వ్యాపారి దుర్మరణం
[ 30-04-2024]
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు పీఎంపాలెం సీఐ వై.రామకృష్ణ తెలిపారు. -
‘కర్కశ జమా’నా!!
[ 30-04-2024]
ఆ వృద్ధులు...కర్రదన్నుగా లేకుంటే నడవలేరు అలా పదడుగులు వేసినా ఆయాసం వచ్చేస్తుంది! చదువురాదు...అక్షరం తెలియదు.. చూపు కనిపించక మరొకరి సాయం తీసుకోవాల్సిందే!! -
పర్యాటక రంగంపై వైకాపా పడగ
[ 30-04-2024]
గమ్య నగరంగా విశాఖకున్న పేరును వైకాపా పాలకులు బంగాళాఖాతంలో కలిపేశారు. జగన్ సర్కారు హయాంలో పర్యాటక రంగం కుదేలైంది. -
అసెంబ్లీ ఎన్నికల బరిలో101 మంది
[ 30-04-2024]
జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల బరిలో 101 మంది నిలిచారు. -
ఎర్రమట్టి దిబ్బలకు గండం
[ 30-04-2024]
విశాఖ నగరం, సమీప ప్రాంతాల్లోని భూములపై కన్నేసిన అధికార వైకాపా నేతల కన్ను భీమిలికి సమీపంలోని భౌగోళిక వారసత్వ ప్రదేశం (జియోహెరిటేజ్ సైట్)గా గుర్తించిన ఎర్రమట్టి దిబ్బలపై పడింది. -
ఏజెంట్ల వివరాలు సమర్పించాలి
[ 30-04-2024]
విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల ఏజెంట్ల వివరాలను మంగళవారం సాయంత్రంలోగా కలెక్టర్ కార్యాలయంలో సమర్పించాలని కలెక్టర్, ఆర్ఓ మల్లికార్జున కోరారు. -
ముస్లింల సమస్యల పరిష్కారానికి కృషి
[ 30-04-2024]
ముస్లిం ఓటర్లు గత ఎన్నికల్లో తనను ఎంతో ప్రోత్సహించారని తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ అన్నారు. -
వలసలతో వైకాపా ఖాళీ: అనిత
[ 30-04-2024]
తెదేపాలోకి వలస వస్తున్న వారితో వైకాపా ఖాళీ అవుతోందని కూటమి ‘పేట’ అభ్యర్థి వంగలపూడి అనిత అన్నారు. -
కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి
[ 30-04-2024]
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. -
పార్టీ కోసం మెట్టు దిగా: పైలా
[ 30-04-2024]
ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి ఓ మెట్టు దిగాల్సి వచ్చిందని తెదేపా నాయకుడు పైలా ప్రసాదరావు పేర్కొన్నారు. -
బ్యాంకాక్ ఏషియా అందాల పోటీల్లో విశాఖ నివాసి మూడు టైటిల్స్ కైవసం
[ 30-04-2024]
బ్యాంకాక్లో జరిగిన ఏషియా అందాల పోటీల్లో విశాఖ నివాసి డాక్టర్ వై.మమతా చౌదరి మూడు టైటిల్స్ కైవసం చేసుకున్నారు. -
విశాఖ లోక్సభ బరిలో 33 మంది అభ్యర్థులు
[ 30-04-2024]
విశాఖ లోక్సభ ఎన్నికల బరిలో 33 మంది అభ్యర్థులు నిలిచారు. 2019 ఎన్నికల్లో కేవలం 14 మంది పోటీ చేశారు. -
ఖాతాల్లో పడకపోతే ఇళ్లకెళ్లి పింఛన్ల పంపిణీ: కలెక్టర్
[ 30-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళికి లోబడి సామాజిక పింఛన్లను పంపిణీ చేస్తామని జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున ఒక ప్రకటనలో తెలిపారు. -
అనకాపల్లి లోక్సభ నుంచి15మంది పోటీ!
[ 30-04-2024]
అనకాపల్లి ఎంపీ స్థానానికి 15 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. -
రైళ్లలో చోరీలకు పాల్పడే ముఠా అరెస్టు
[ 30-04-2024]
రైళ్లలో బంగారు ఆభరణాల చోరీకి పాల్పడుతున్న ముగ్గురు ముఠా సభ్యులను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
ఆ 60వేల ఓట్లు ఎవరివి?.. పాతబస్తీలో ఆచూకీ దొరకని ఓటర్లు
-
అన్నా క్షమించు... ఈ లోకంలో బతకలేకున్నా
-
ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొస్తాం: కర్ణాటక హోంమంత్రి
-
‘కాల్చి పడేస్తా.. ఎవడొస్తాడో రమ్మను’.. సస్పెండైన ఓ ఎస్సై వీరంగం
-
మనవడిని కొట్టిందని.. కోడలిని హతమార్చిన మామ