logo

ఎస్‌.కోట నుంచే 40 వేల మెజార్టీ

ఎస్‌.కోట పట్టణంలో గాయత్రీ ఆలయం వెనుక తెదేపా కార్యాలయాన్ని విశాఖ ఎంపీ అభ్యర్థి ఎం. శ్రీభరత్‌ గురువారం ప్రారంభిచారు. ఎస్‌.కోట ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలితకుమారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన

Published : 29 Mar 2024 04:16 IST

పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్‌

శృంగవరపుకోట, న్యూస్‌టుడే: ఎస్‌.కోట పట్టణంలో గాయత్రీ ఆలయం వెనుక తెదేపా కార్యాలయాన్ని విశాఖ ఎంపీ అభ్యర్థి ఎం. శ్రీభరత్‌ గురువారం ప్రారంభిచారు. ఎస్‌.కోట ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలితకుమారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పార్టీ కష్టపడి పనిచేసే వారికి ప్రాధాన్యం ఇస్తుందన్నారు. సీనియార్టీ కాదు, జనం మెప్పు పొందడమే కొలమానం అన్నారు. 2024లో విజయం సాధించి, నియోజకవర్గంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తానన్నారు. ఇక్కడి నుంచి కనీసం 40 వేల మెజార్టీ వస్తుందని ఆశిస్తున్నామన్నారు. తమ కుటుంబంతో కోళ్ల కుటుంబానికి దశాబ్దాలుగా అనుబంధం ఉందన్నారు. ఇక్కడ వర్గ విభేదాలు సరిచేసి, సమష్టిగా పనిచేసి విజయం సాధిద్దామన్నారు. అనంతరం లలితకుమారి మాట్లాడుతూ అంతా కష్టపడి ఎస్‌.కోట నుంచి భరత్‌కు మంచి మెజార్జీ ఇద్దామన్నారు. జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి వబ్బిన సత్యనారాయణ, వైస్‌ ఎంపీపీ సుధారాజు, కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల రాంప్రసాద్‌ తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని