కమలం.. హస్తం.. కలకలం
కర్రలతో పరస్పరం దాడులు.. హోరెత్తిన నినాదాలు.. నేతల తోపులాటలు.. ఇరువర్గాలను శాంతించేందుకు పోలీసుల ఎడతెగని ప్రయత్నాలు.. వెరసి మధ్యాహ్నం 2.45 గంటలకు మొదలైన కాంగ్రెస్, భాజపా మధ్య ఉద్రిక్తత సాయంత్రం అయిదు గంటల వరకు
న్యూస్టుడే - వరంగల్క్రైం
భాజపా నేతలను అడ్డుకుంటున్న పోలీసులు
కర్రలతో పరస్పరం దాడులు.. హోరెత్తిన నినాదాలు.. నేతల తోపులాటలు.. ఇరువర్గాలను శాంతించేందుకు పోలీసుల ఎడతెగని ప్రయత్నాలు.. వెరసి మధ్యాహ్నం 2.45 గంటలకు మొదలైన కాంగ్రెస్, భాజపా మధ్య ఉద్రిక్తత సాయంత్రం అయిదు గంటల వరకు కొనసాగింది. హనుమకొండ-వరంగల్ ప్రధాన రహదారి కావడంతో ఏం జరుగుతుందో తెలియక పలువురు వాహనాదారులు ఆందోళన చెందారు. కాంగ్రెస్, భాజపా నాయకులు, కార్యకర్తలు శుక్రవారం హంటర్రోడ్డులోని భాజపా కార్యాలయం కేంద్రంగా పరస్పరం దాడులకు పూనుకోవడం నగరంలో కలకలం సృష్టించింది. అగ్నిపథ్ను రద్దు చేయాలంటూ మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి కార్యకర్తలతో కలిసి భాజపా కార్యాలయం ముందు ధర్నా చేసేందుకు వచ్చారు. మేయర్ స్వర్ణతో పాటుగా మరికొందరు మహిళా నాయకులు భాజపా వ్యతిరేక నినాదాలు చేస్తూ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారించారు. ఈ విషయం తెలుసుకుని కమలం నాయకులు, కార్యకర్తలు సమావేశం నుంచి బయటకు వచ్చి ‘జై భారత్ మాతా అంటూ వారు.. ప్రతిగా కాంగ్రెస్ నాయకులు భాజపా, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భాజపా నేతలు కాంగ్రెస్ కార్యకర్తల వద్దకు వెళ్లి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించగా ఎవరూ వినకపోవడంతో భాజపా కార్యకర్త ఒకరు కాంగ్రెస్ నేతలను తోసేందుకు యత్నించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
మొక్కల కర్రలు ఊడదీసి..
మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ వచ్చిన కారు అద్దాలను కొందరు భాజపా నాయకులు, కార్యకర్తలు ధ్వంసం చేయడంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. ఇరువర్గాలు రెచ్చిపోయి కర్రలతో దాడులు చేసుకున్నారు. పలువురు నాయకులు, కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. కొందరు కార్యకర్తలు జెండాలకు ఉన్న కర్రలతో పాటు పక్కనే నాటిన మొక్కలకు పెట్టిన కర్రలను తీసుకొచ్చి మరీ దాడులకు పాల్పడ్డారు.
ఆందోళనకారుడిని అదుపులోకి తీసుకుంటున్న సీఐలు
అదనపు బలగాలను రప్పించి ఉంటే..
రెండు పార్టీల ఘర్షణ నేపథ్యంలో పోలీసుల బందోబస్తు వైఫల్యం కనిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అదనపు బలగాలను ముందే రప్పించి ఉంటే దాడులు చేసుకునే వరకు వెళ్లేది కాదని వ్యాఖ్యానించారు. కేయూ, సుబేదారి ఇన్స్పెక్టర్లు దయాకర్, రాఘవేందర్ ఆధ్వర్యంలో కొంతమంది ఎస్సైలు, కానిస్టేబుళ్లు మాత్రమే ఉన్నారు. ఊహించని దాడుల పర్వంతో పెద్ద సంఖ్యలో ఇరువర్గాలను నిలువరించడం సాధ్యం కాలేదు. పరిస్థితి విషమించడంతో అదనపు పోలీసు బలగాలు రప్పించాకే పరిస్థితి కుదుటపడింది.
‘ప్రధాని దృష్టికి తీసుకెళ్తా..’
తెలంగాణ సంపర్క్ అభియాన్ కార్యక్రమానికి వచ్చిన భాజపా రాజ్యసభ సభ్యుడు ఓం ప్రకాశ్ మాథుర్ షెడ్యూల్లో భాగంగా లష్కర్ సింగారం దళిత బస్తీ కార్యక్రమానికి వెళ్లేందుకు పోలీసులు అడ్డుకున్నారు. కొద్దిసేపు వాగ్వాదం తర్వాత పోలీసులు అనుమతి ఇవ్వడంతో న్యూశాయంపేటలోని దళితవాడకు వెళ్లారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ‘కార్యాలయానికి వచ్చి దాడులు చేయడం ప్రజాస్వామ్యంలో మంచిది కాదు.. రాష్ట్రంలో తెరాస, కాంగ్రెస్ పథకం ప్రకారమే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తమ పార్టీ కార్యాలయంపై దాడి చేశారు.. దీని వెనుక తెరాస కుట్ర ఉంది’ అని ఆరోపించారు. దాడి విషయాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తానన్నారు. పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
గన్మెన్పై హత్యాయత్నం.. కేసు నమోదు
సుబేదారి, న్యూస్టుడే: సుబేదారి సీఐ గన్మెన్ అనిల్పై కాంగ్రెస్ కార్యకర్త పృథ్వీరాజ్ కర్రతో దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు ఇన్స్పెక్టర్ రాఘవేందర్ తెలిపారు. అనిల్ తలకు బలమైన గాయమైంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించి హత్యాయత్నం చేశాడని సుబేదారి ఎస్సై పున్నంచందర్ ఫిర్యాదు మేరకు పృథ్వీరాజ్పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
కాంగ్రెస్ నేతల ఫిర్యాదు..
అమరవీరుల స్తూపం నుంచి హంటర్రోడ్డు మీదుగా ర్యాలీగా వెళ్తున్న క్రమంలో భాజపా జిల్లా అధ్యక్షురాలు రావు పద్మతో పాటు సుమారు 70 మంది కార్యకర్తలు ఆకస్మికంగా మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ కారుపై దాడి చేసి ధ్వంసం చేశారని కాంగ్రెస్ నేతలు సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె చరవాణి ధ్వంసం చేశారన్నారు. రూ.5లక్షల వరకు నష్టం జరిగిందన్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సీఐ రాఘవేందర్ తెలిపారు.
భాజపా కార్యాలయం వైపు దూసుకెళ్తున్న మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు
మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ కారు వద్దకు వెళ్తున్న
భాజపా నేతలను వారిస్తున్న సీఐ దయాకర్
దాడిలో ధ్వంసమైన కారు
పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్రెడ్డి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యువతా.. ఓటు వేస్తే భవిత మీదే!
[ 07-05-2024]
గత శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటముల్లో యువ ఓటర్లు కీలక భూమిక పోషించారు. ఇప్పుడు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాల్లోనూ వారు ఎటు మొగ్గు చూపితే వారి జెండానే ఎగరనుంది. -
మండుటెండలో భాజపా శ్రేణుల్లో జోష్..!
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం వరంగల్ జిల్లా నర్సంపేటలో భాజపా నిర్వహించిన జన సభ విజయవంతమైంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా ప్రజలు భారీగా తరలిరావడం కాషాయ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. -
ప్రశాంత పోలింగ్కు పక్కా ఏర్పాట్లు
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక ఘట్టానికి గడువు దగ్గర పడుతోంది. పోస్టల్ బ్యాలెట్, ఇంటి వద్ద ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోంది. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆధ్వర్యంలో అధికారులు పోలింగ్ ఏర్పాట్లపై దృష్టి సారించారు. -
ఖర్చుల వివరాలు తప్పనిసరిగా చెప్పాలి
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తప్పనిసరిగా ఖర్చుల వివరాలను అందజేయాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు ఎ.ధిలీబన్, ధీరజ్ సింగా పేర్కొన్నారు. -
నగరంలో నేడు సీఎం రేవంత్రెడ్డి రోడ్ షో
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంగళవారం సాయంత్రం వరంగల్ నగరానికి రానున్నారు. -
నాన్నకు భారమై.. అమ్మకు దూరమై!
[ 07-05-2024]
పాపం.. ఆ పిల్లలకేం తెలుసు.. కంటికి రెప్పలా చూసుకునే అమ్మ.. ఆత్మహత్యతో తిరిగి రాలేని లోకాలకు వెళ్లిందని.. బయటకే వెళ్లింది కదా.. కాసేపు అయ్యాక వస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్నారు. -
స్వాతంత్య్రం తెచ్చింది.. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్
[ 07-05-2024]
దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది.. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని లోక్సభ ఎన్నికల్లో గెలిపించాలని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. -
‘కడియం మోసాలు అందరికీ తెలుసు’
[ 07-05-2024]
దళిత ద్రోహి కడియం శ్రీహరి గురించి నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా వివరించి చెప్పనవసరం లేదని, ఆయన మోసాలు మొత్తం ప్రజలకు తెలుసని భాజపా లోక్సభ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. -
తస్మాత్ జాగ్రత్త
[ 07-05-2024]
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎండల తీవ్రతకు వడదెబ్బ మృతుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. -
‘నన్ను, రాజయ్యను జైల్లో పెట్టాలని చూస్తున్నారు’
[ 07-05-2024]
స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో ప్రతి పనికి అడ్డుపడిన అభివృద్ధి నిరోధకుడు కడియం శ్రీహరి అని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆరోపించారు. -
కేంద్రంలోనూ కాంగ్రెస్ ఉంటే మరింత ప్రగతి
[ 07-05-2024]
కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే అభివృద్ధి, సంక్షేమం పరుగులు తీస్తుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. రఘునాథపల్లి, కంచనపల్లి, ఖిలాషాపురం గ్రామాల్లో సోమవారం కార్నర్ సభ నిర్వహించారు. -
బస్తాకు అర కిలో.. ఎకరాకు రూ.250
[ 07-05-2024]
రైతులు నిద్రాహారాలు మాని శ్రమించి పండించిన వరి ధాన్యం దళారులపాలు అవుతోంది. ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల వద్ద గోల్మాల్ చేస్తూ రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. -
బలగాల పాగా.. నలువైపులా నిఘా!
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, అల్లర్లు, ఘర్షణలకు తావులేకుండా ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా కృషి చేస్తున్నారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓటు.. తిరస్కరణకు తావివ్వొద్దు
[ 07-05-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులు, సిబ్బంది, సైనికులు, ఇతర అత్యవసర సేవలకు చెందిన వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ముందస్తుగా ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. -
లోక్సభ ఎన్నికలకు భారీ భద్రత
[ 07-05-2024]
జిల్లాలో అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉంది. మారుమూల ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలున్నాయి. మే 13న జరిగే లోక్సభ ఎన్నికలకు ఈవీఎంలు చేర్చడం అంత సులువు కాదు. -
ఆయుధంతో జాగ్రత్త.. పేలుతుంది!
[ 07-05-2024]
‘అధికారిక లెక్కల ప్రకారం వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 201 లైసెన్స్డ్ ఆయుధాలున్నాయి. ఇప్పటికే 200 మంది ఠాణాల్లో అప్పగించారు. ఒకరు మాత్రం విదేశాలకు వెళ్లారు. ఆయన అనుమతి పొందిన ఆయుధం బ్యాంక్ లాకరులో ఉన్నట్లు పోలీసుల వద్ద సమాచారం ఉంది.’ -
పోటెత్తిన పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు
[ 07-05-2024]
ములుగులోని సంక్షేమ భవన్లో ఏర్పాటు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కు ఓటర్లు రెండో రోజు పోటెత్తారు. బారులుతీరడంతో.. సంక్షేమ భవన్ కిటకిటలాడింది. -
బడుల ప్రారంభం రోజే.. పుస్తకాల పంపిణీ
[ 07-05-2024]
విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పాఠ్య పుస్తకాలు అందజేసేందుకు విద్యాశాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. కొన్నేళ్లుగా సకాలంలో పుస్తకాలు అందకపోవడంతో ఉత్తీర్ణత శాతంపై ప్రభావం పడేది. -
కొత్తగూడ ఏజెన్సీకి గోదావరి జలాలు
[ 07-05-2024]
పాకాల నుంచి గోదావరి జలాలను కొత్తగూడ ఏజెన్సీకి తరలించి రెండు పంటలు సాగయ్యేలా కృషి చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. -
నాలుగు వేల మందితో ర్యాలీ
[ 07-05-2024]
భాజపా ఆధ్వర్యంలో ములుగులో ఈనెల 7న సాయంత్రం నిర్వహించనున్న లోక్సభ ఎన్నికల ర్యాలీని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని మహబూబాబాద్ పార్లమెంటు భాజపా అభ్యర్థి అజ్మీరా సీతారాంనాయక్ కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షం.. పిడుగుపాటుకు ఇద్దరి మృతి
-
టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా జెర్సీ ధరెంతో తెలుసా?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
ఆస్ట్రేలియా హెలికాప్టర్పై నిప్పుల వర్షం.. చైనా దుందుడుకు చర్య
-
Team India: పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమ్ఇండియా వెళ్తుందా? బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..
-
ఒకే ఫ్రేమ్లో ఇద్దరు సీఈఓలు.. సుందర్ పిచాయ్ గ్రాడ్యుయేషన్ ఫొటో వైరల్