సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి
ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. ములుగు కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఆయన పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.
ఫిర్యాదులు స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య
ములుగు, న్యూస్టుడే: ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. ములుగు కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఆయన పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి వస్తారని, అధికారులు శాఖల వారీగా దరఖాస్తులు స్వీకరించి సానుకూలంగా వ్యవహరించడంతో పాటు వాటి పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఒకవేళ వాటిని తిరస్కరించిన పక్షంలో అందుకు గల కారణాలను వివరంగా తెలుపుతూ ఫిర్యాదు దారునికి సమాచారం అందించాలని సూచించారు. ప్రజావాణిలో మొత్తం 71 దరఖాస్తులు రాగా అందులో 44 భూ సంబంధిత, 27 ఇతర శాఖలకు సంబంధించిన సమస్యలున్నాయి. సీపీవో ప్రకాష్, డీఎంహెచ్వో డాక్టర్ ఎ.అప్పయ్య, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ తుల రవి, డీపీవో వెంకయ్య, ఎస్సీ సంక్షేమాధికారి భాగ్యలక్ష్మి, బీసీ సంక్షేమాధికారి లక్ష్మణ్, రోడ్లు భవనాల శాఖ ఈఈ వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈవో ప్రసూనారాణి, డీసీవో సర్దార్సింగ్, జిల్లా వ్యవసాయ అధికారి గౌస్ హైదర్ తదితరులు పాల్గొన్నారు.
* వెంకటాపూర్ మండలం బండ్లపాడ్ ఏరియాలో సాగు చేస్తున్న భూములకు రెవెన్యూ, అటవీశాఖల అధికారులు సర్వే చేసి పేదలకు హక్కు పత్రాలు ఇవ్వాలని గ్రామస్థులు అర్జీ ఇచ్చారు.
* ములుగు మండలం కన్నాయిగూడేనికి చెందిన దూడపాక మదనమ్మ పట్టాదారు పాసు పుస్తకం ఇప్పించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.
ఐటీడీఏ కార్యాలయంలో..
ఏటూరునాగారం, న్యూస్టుడే: ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీవో వసంతరావుకు అర్జీలను సమర్పించారు. వివిధ సెక్టార్ల అధికారులు ఏవో రఘు, మేనేజర్ శ్రీనివాస్, ఎస్వో రాజ్కుమార్, పీహెచ్వో రమణ, ఏఏవో సంతోష్, ఈఈ హేమలత తదితరులు పాల్గొన్నారు.
అర్జీలివీ..
* గోవిందరావుపేట మండలం బుస్సాపూర్ గ్రామంలోని గిరిజనేతరులు నిర్వహిస్తున్న రేషన్ డీలర్షిప్ గిరిజనులకు కేటాయించాలని, ఇతరుల స్వాధీనంలో ఉండి, ప్రభుత్వం కొనుగోలు చేసి ఇచ్చిన భూమిని గిరిజనులకే ఇప్పించాలని, పంచాయతీ పరిధిలో కొన్నేళ్లుగా ఖాళీగా ఉంటున్న అంగన్వాడీ పోస్టును ఎస్టీ అభ్యర్థులతో భర్తీ చేయాలని కోరుతూ సర్పంచి సింగం శ్రీలత అర్జీ ఇచ్చారు.
* ఇంటి స్థలాలు, సాగు భూములకు పట్టాలివ్వాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా ఏటూరునాగారంలోని కోడి పుంజుల అంగడి ప్రదేశం, సాగు భూములను సర్వే చేయలేదని, లబ్ధిదారులు దరఖాస్తు పెట్టుకున్నా పట్టించుకోవడం లేదని, వెంటనే సర్వే నిర్వహించి పట్టాలు ఇప్పించాలని కోరుతూ ఏజెన్సీ దళితుల సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తిప్పనపల్లి సుదర్శన్ విన్నవించారు.
* తాడ్వాయి మండలంలోని కొండపర్తి సమీప గొత్తికోయగూడెంలో విద్యుత్తు లైన్ వేయించాలని అదే గ్రామానికి చెందిన మాడవి వెంకయ్య, మాడవి ఉమేష్, కె.దేవా తదితరులు ఏపీవోకు అర్జీ ఇచ్చారు.
* తనకు రావాల్సిన వారసత్వ ఆస్తిని ఇప్పించాలని కోరుతూ మంగపేట మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మద్దెల గౌతమ్ అర్జీని సమర్పించాడు.
* కస్తూర్బా గాంధీ ఉన్నత పాఠశాలలో గదుల నుంచి నీరు కురుస్తోందని వాటికి మరమ్మతులు చేయించాలని ఏటూరునాగారం ఆ పాఠశాల ప్రత్యేకాధికారి పీవై లక్ష్మి కోరారు.
పని ఇప్పించండి...
* వైటీసీలలో లేదా ఏదైనా గిరిజన సంక్షేమ కార్యాలయాలు, వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో దివ్యాంగుడైన తనకు అటెండర్ ఉద్యోగావకాశం కల్పించాలని కోరుతూ ములుగు మండలంలోని జాకారం గ్రామానికి చెందిన కూరాకుల సుధాకర్ అర్జీని సమర్పించాడు.
* వాగుదాటే క్రమంలో తన భర్త ప్రమాదవశాత్తు మృతి చెందాడని తనకు ఇద్దరు ఆడ పిల్లలున్నారని, ఏదైనా జీవనోపాధి కల్పించి తనను ఆదుకోవాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం మెట్ల తిమ్మాపురం గ్రామానికి చెందిన తాటి అన్నపూర్ణ అర్జీ ద్వారా వేడుకున్నారు.
సాయం చేసి ఆదుకోండి..
* తన ఇల్లు విద్యుదాఘాతానికి గురై కాలిపోయిందని, ఇంట్లో ఉన్న సామగ్రి, రూ.1.45 లక్షల డబ్బు, బంగారు, ఇతర ఆభరణాలు పూర్తిగా కాలిపోయాయని తనకు కుటుంబ జీవనం కోసం ఏదైనా ఆర్థిక సాయం ఇప్పించాలని కోరుతూ ములుగు మండలం జగ్గన్నగూడెం గ్రామానికి చెందిన పెనుక వెంకయ్య మొరపెట్టుకున్నారు.
పాసుపుస్తకం ఇప్పించాలి..
- తడ్క రామస్వామి; వెంకటాపూర్
మాది వెంకటాపూర్ మండల కేంద్రం. నాకు 832/ఎ/3 సర్వే నంబర్లో ఎకరం భూమి ఉంది. కానీ పట్టా పాసుపుస్తకం రాలేదు. చాలా రోజులుగా తిరుగుతున్నాను. నా దగ్గర అన్ని రకాల ఆధారాలున్నాయి. వాటిని పరిశీలించి సమస్య పరిష్కరించాలి.
ఫోర్జరీ చేసి పట్టా చేయించుకున్నారు
- నరెడ్ల రాజయ్య, వెంకటాపూర్
నా భూమిని ఇతరులు నా సంతకం ఫోర్జరీ చేసి పట్టా చేయించుకున్నారు. అతనిపై చర్యలు తీసుకుని నా పేరు మీద పట్టా చేయాలని పలు మార్లు కోరినప్పటికీ అధికారులు స్పందించడం లేదు.
పరిహారం తీసుకున్న వారే మళ్లీ అమ్ముకుంటున్నారు
- గోపాల్సింగ్, జవహర్నగర్, వెంకటాపూర్ మండలం
జవహర్నగర్ గ్రామానికి చెందిన గుడి కుంట చెరువు నిర్మాణానికి సంబంధించి భూములు కోల్పోయిన వారు ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం తీసుకున్నారు. అయితే లబ్ధిదారుల పేర్లు రికార్డుల్లో నుంచి తొలగించకుండా అలాగే ఉంచడంతో మళ్లీ ఆ భూములను ఇతరులకు అమ్ముకుంటున్నారు. అధికారులు వారి పేర్లను రికార్డుల్లోంచి తొలగించి వాటిని ప్రభుత్వ భూములుగా ప్రకటించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యువతా.. ఓటు వేస్తే భవిత మీదే!
[ 07-05-2024]
గత శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటముల్లో యువ ఓటర్లు కీలక భూమిక పోషించారు. ఇప్పుడు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాల్లోనూ వారు ఎటు మొగ్గు చూపితే వారి జెండానే ఎగరనుంది. -
మండుటెండలో భాజపా శ్రేణుల్లో జోష్..!
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం వరంగల్ జిల్లా నర్సంపేటలో భాజపా నిర్వహించిన జన సభ విజయవంతమైంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా ప్రజలు భారీగా తరలిరావడం కాషాయ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. -
ప్రశాంత పోలింగ్కు పక్కా ఏర్పాట్లు
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక ఘట్టానికి గడువు దగ్గర పడుతోంది. పోస్టల్ బ్యాలెట్, ఇంటి వద్ద ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోంది. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆధ్వర్యంలో అధికారులు పోలింగ్ ఏర్పాట్లపై దృష్టి సారించారు. -
ఖర్చుల వివరాలు తప్పనిసరిగా చెప్పాలి
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తప్పనిసరిగా ఖర్చుల వివరాలను అందజేయాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు ఎ.ధిలీబన్, ధీరజ్ సింగా పేర్కొన్నారు. -
నగరంలో నేడు సీఎం రేవంత్రెడ్డి రోడ్ షో
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంగళవారం సాయంత్రం వరంగల్ నగరానికి రానున్నారు. -
నాన్నకు భారమై.. అమ్మకు దూరమై!
[ 07-05-2024]
పాపం.. ఆ పిల్లలకేం తెలుసు.. కంటికి రెప్పలా చూసుకునే అమ్మ.. ఆత్మహత్యతో తిరిగి రాలేని లోకాలకు వెళ్లిందని.. బయటకే వెళ్లింది కదా.. కాసేపు అయ్యాక వస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్నారు. -
స్వాతంత్య్రం తెచ్చింది.. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్
[ 07-05-2024]
దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది.. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని లోక్సభ ఎన్నికల్లో గెలిపించాలని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. -
‘కడియం మోసాలు అందరికీ తెలుసు’
[ 07-05-2024]
దళిత ద్రోహి కడియం శ్రీహరి గురించి నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా వివరించి చెప్పనవసరం లేదని, ఆయన మోసాలు మొత్తం ప్రజలకు తెలుసని భాజపా లోక్సభ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. -
తస్మాత్ జాగ్రత్త
[ 07-05-2024]
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎండల తీవ్రతకు వడదెబ్బ మృతుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. -
‘నన్ను, రాజయ్యను జైల్లో పెట్టాలని చూస్తున్నారు’
[ 07-05-2024]
స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో ప్రతి పనికి అడ్డుపడిన అభివృద్ధి నిరోధకుడు కడియం శ్రీహరి అని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆరోపించారు. -
కేంద్రంలోనూ కాంగ్రెస్ ఉంటే మరింత ప్రగతి
[ 07-05-2024]
కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే అభివృద్ధి, సంక్షేమం పరుగులు తీస్తుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. రఘునాథపల్లి, కంచనపల్లి, ఖిలాషాపురం గ్రామాల్లో సోమవారం కార్నర్ సభ నిర్వహించారు. -
బస్తాకు అర కిలో.. ఎకరాకు రూ.250
[ 07-05-2024]
రైతులు నిద్రాహారాలు మాని శ్రమించి పండించిన వరి ధాన్యం దళారులపాలు అవుతోంది. ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల వద్ద గోల్మాల్ చేస్తూ రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. -
బలగాల పాగా.. నలువైపులా నిఘా!
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, అల్లర్లు, ఘర్షణలకు తావులేకుండా ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా కృషి చేస్తున్నారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓటు.. తిరస్కరణకు తావివ్వొద్దు
[ 07-05-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులు, సిబ్బంది, సైనికులు, ఇతర అత్యవసర సేవలకు చెందిన వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ముందస్తుగా ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. -
లోక్సభ ఎన్నికలకు భారీ భద్రత
[ 07-05-2024]
జిల్లాలో అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉంది. మారుమూల ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలున్నాయి. మే 13న జరిగే లోక్సభ ఎన్నికలకు ఈవీఎంలు చేర్చడం అంత సులువు కాదు. -
ఆయుధంతో జాగ్రత్త.. పేలుతుంది!
[ 07-05-2024]
‘అధికారిక లెక్కల ప్రకారం వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 201 లైసెన్స్డ్ ఆయుధాలున్నాయి. ఇప్పటికే 200 మంది ఠాణాల్లో అప్పగించారు. ఒకరు మాత్రం విదేశాలకు వెళ్లారు. ఆయన అనుమతి పొందిన ఆయుధం బ్యాంక్ లాకరులో ఉన్నట్లు పోలీసుల వద్ద సమాచారం ఉంది.’ -
పోటెత్తిన పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు
[ 07-05-2024]
ములుగులోని సంక్షేమ భవన్లో ఏర్పాటు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కు ఓటర్లు రెండో రోజు పోటెత్తారు. బారులుతీరడంతో.. సంక్షేమ భవన్ కిటకిటలాడింది. -
బడుల ప్రారంభం రోజే.. పుస్తకాల పంపిణీ
[ 07-05-2024]
విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పాఠ్య పుస్తకాలు అందజేసేందుకు విద్యాశాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. కొన్నేళ్లుగా సకాలంలో పుస్తకాలు అందకపోవడంతో ఉత్తీర్ణత శాతంపై ప్రభావం పడేది. -
కొత్తగూడ ఏజెన్సీకి గోదావరి జలాలు
[ 07-05-2024]
పాకాల నుంచి గోదావరి జలాలను కొత్తగూడ ఏజెన్సీకి తరలించి రెండు పంటలు సాగయ్యేలా కృషి చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. -
నాలుగు వేల మందితో ర్యాలీ
[ 07-05-2024]
భాజపా ఆధ్వర్యంలో ములుగులో ఈనెల 7న సాయంత్రం నిర్వహించనున్న లోక్సభ ఎన్నికల ర్యాలీని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని మహబూబాబాద్ పార్లమెంటు భాజపా అభ్యర్థి అజ్మీరా సీతారాంనాయక్ కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
-
చైనా ఆసుపత్రిలో దారుణం.. కత్తి దాడిలో పలువురి మృతి
-
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ట్రేడింగ్ సమయం పొడిగింపు ఇప్పట్లో లేనట్లే..!
-
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్కు సుప్రీం సూచన