‘ఆసియా’ బరిలో మానుకోట రాకెట్!
మానుకోట బిడ్డ సిక్కిరెడ్డి బ్మాడ్మింటన్లో ఓరుగల్లు పేరు ప్రఖ్యాతలను నిలబెడుతున్నారు. శనివారం చైనాలోని హాంగ్జౌ నగరంలో ప్రారంభవుతున్న ఆసియా క్రీడల్లో దేశం తరఫున పాల్గొంటున్నారు.
ఈనాడు, మహబూబాబాద్: మానుకోట బిడ్డ సిక్కిరెడ్డి బ్మాడ్మింటన్లో ఓరుగల్లు పేరు ప్రఖ్యాతలను నిలబెడుతున్నారు. శనివారం చైనాలోని హాంగ్జౌ నగరంలో ప్రారంభవుతున్న ఆసియా క్రీడల్లో దేశం తరఫున పాల్గొంటున్నారు. ఎడమ చేతి వాటంతో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించే ఆమె గోపిచంద్ అకాడమీలో ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. శనివారం ప్రారంభమయ్యే ఈ ప్రతిష్ఠాత్మక క్రీడా సంగ్రామంలో సత్తా చాటి దేశ పతాకాన్ని రెపరెపలాడించాలని ఉమ్మడి జిల్లావాసులు ఆకాంక్షిస్తున్నారు.
నేపథ్యం ఇది
మహబూబాబాద్ జిల్లా నర్సిహుంలపేట మండలం జయపురం గ్రామానికి చెందిన నెలకుర్తి కృష్ణారెడ్డి, మాధవి దంపతుల ఏకైక కుమార్తె సిక్కిరెడ్డి. బాల్యం నుంచి హైదరాబాద్లో ఉంటున్నారు. పాఠశాల స్థాయిలోనే క్రీడలపై ఆమెకున్న ఆసక్తిని గమనించిన జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారుడైన తండ్రి ఆ దిశగా ప్రోత్సహించారు. ఆమెకు ఇష్టమైన బ్యాడ్మింటన్లో మెలకువలను నేర్పించారు. నాలుగో తరగతిలో రాకెట్ పట్టుకున్న సిక్కిరెడ్డి అనతికాలంలోనే ప్రపంచ స్థాయి క్రీడాకారిణిగా ఎదిగి 2007లో కెరీర్లో తొలి అంతర్జాతీయ స్థాయి జూనియర్ ప్రపంచకప్ పోటీలో పాల్గొన్నారు. తొలుత సింగిల్స్ విభాగం రాణించిన ఆమె ప్రస్తుతం డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగంలో పాల్గొంటున్నారు. సంచలన విజయాలను సాధిస్తుండడంతో ప్రభుత్వం 2018లో అర్డున అవార్డు ప్రదానం చేసింది.
మూడో ఆసియా ఆటలు
సిక్కిరెడ్డికి ఈ ఆసియా క్రీడలు మూడోవి. 2014లో సౌత్ కొరియాలోని ఇంచియాన్లో జరిగిన పోటీలో మొదటిసారిగా పాల్గొని కాంస్య పతకం సాధించారు. 2018లో ఇండోనేషియాలోని జకార్తాలో రెండోసారి పాల్గొన్నారు. ప్రస్తుతం చైనాలోని హాంగ్జౌ నగరంలో జరిగే పోటీలో మూడోసారి పాల్గొంటున్నారు.
మోకాలి గాయాన్ని లెక్క చేయకుండా: ఆటలో ప్రత్యర్థులను ముచ్చెటమలు పట్టిస్తున్న సిక్కిరెడ్డి 2010లో మలేషియాలో జరిగిన పోటీలో కోర్టులో జారి పడింది. మోకాలికి గాయం కావడంతో శస్త్రచికిత్స చేశారు. త్వరగా కోలుకుని ఆత్మస్థైర్యంతో కోర్టులో అడుగుపెట్టారు. 2013లో మరోసారి కిందపడడంతో మళ్లీ శస్త్రచికిత్స చేయించారు. ఆ గాయం బాధించినా లెక్క చేయకుండా ఆటను కొనసాగిస్తున్నారు. పట్టుదలతో పతకాలను కూడా సాధిస్తున్నారు..
పతకం సాధించడమే లక్ష్యంగా: ఆసియా క్రీడలకు ఎంపిక కావడం సంతోషంగా ఉంది. చైనా, జపాన్, మలేషియా, ఇండోనేషియా, సింగపూర్, దక్షిణ కొరియా, హాంకాంగ్ లాంటి దేశాల నుంచి అత్యుత్తమ క్రీడాకారులు పాల్గొంటున్నారు. వారిని ఓడించి పతకం సాధించడమే లక్ష్యంగా వంద శాతం శ్రమిస్తానని సిక్కిరెడ్డి ‘ఈనాడు’కు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఊయల కట్టిన స్టూల్ మీదపడి చిన్నారి మృతి
[ 09-05-2024]
పొట్టకూటి కోసం వందల కిలోమీటర్లు వలస వచ్చిన ఆ కూలీ కుటుంబంలో విషాదం అలుముకుంది. -
ఓరుగల్లులో కాషాయోత్సాహం
[ 09-05-2024]
మోదీ.. మోదీ.. అంటూ నినాదాలు హోరెత్తాయి. ‘మరోమారు మోదీ సర్కారు’ అంటూ యువత కేరింతలు కొట్టింది. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం వింటూ కమలం శ్రేణులు కొత్త ఉత్సాహంతో జేజేలు పలికాయి. -
ఎన్నికలకు పోలీసుల రక్షణ ఛత్రం
[ 09-05-2024]
లోక్సభ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. -
‘ప్రత్యేక త చాటాలి.. ఓటు మురవాలి
[ 09-05-2024]
ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచడానికి భారత ఎన్నికల సంఘం పలు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. పలు ప్రయోగాలు అమలు చేస్తూ సత్ఫలితాలను సాధిస్తోంది. -
చెయ్యెత్తి నినదించూ.. ఓటెత్తి జైకొట్టు
[ 09-05-2024]
‘ఏ ఒక్క ఓటరు ఓటు వేయకుండా మిగిలిపోరాదు’ ఇది ఎన్నికల సంఘం ప్రధాన లక్ష్యం, ఆశయం. -
నిబంధనల మేరకే ఈవీఎంల కమిషనింగ్
[ 09-05-2024]
ఎన్నికల నిబంధనల మేరకు ఈవీఎంల కమిషనింగ్ నిర్వహించినట్లు కేంద్ర ఎన్నికల ప్రత్యేక అధికారి నవీన్ విద్ది తెలిపారు. -
‘కడియం శ్రీహరి రాజకీయ ఊసరవెల్లి’
[ 09-05-2024]
భారాస పదేళ్ల పాలనలో ఎన్నో పదవులు అనుభవించి, స్వలాభం కోసం పార్టీ మారి ద్రోహం చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాజకీయ ఊసరవెల్లి అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధ్వజమెత్తారు. -
భారాసపై అవినీతి మరకలతోనే పార్టీ వీడాను..
[ 09-05-2024]
వరంగల్ లోక్సభ స్థానం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, నా కుమార్తె కడియం కావ్యను మీ బిడ్డగా నిండు మనస్సుతో ఆశీర్వదించి గెలిపించాలని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కోరారు. -
ఆదరించండి.. అభివృద్ధి బాధ్యత నాదే
[ 09-05-2024]
పేదల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు కోరారు. -
నాలుగో రోజు.. 431 మంది పోస్టల్ ఓటు వినియోగం
[ 09-05-2024]
నాలుగో రోజు బుధవారం పోస్టల్ బ్యాలెట్ ద్వారా 431 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.. -
ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కండి
[ 09-05-2024]
ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఈ నెల 13న జరిగే లోక్సభ ఎన్నికల నిర్వహణకు అన్నివిధాలుగా సన్నద్ధమవ్వాలని రిటర్నింగ్ అధికారి ప్రావీణ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. -
ఇండియా కూటమి అభ్యర్థిని గెలిపించండి
[ 09-05-2024]
లోక్సభ ఎన్నికల్లో మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఇండియా కూటమి బలపర్చిన పోరిక బలరాంనాయక్ను గెలిపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్.వీరయ్య పిలుపునిచ్చారు. -
ఐఎఫ్ఎస్లో మెరిసిన పల్లె బిడ్డలు
[ 09-05-2024]
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మారుమూల పల్లెలకు చెందిన ఇద్దరు యువకులు ఐఎఫ్ఎస్ సాధించారు. -
అంతర్గత కలహాలపై కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్
[ 09-05-2024]
లోక్సభ ఎన్నికలకు పోలింగ్ తేదీ సమీపిస్తున్న సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పరస్పర విమర్శలు చేసుకోవడాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్గా తీసుకుంది. -
పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు గడువు పెంపు
[ 09-05-2024]
పోస్టల్ బ్యాలెట్ ఓటు వేయడానికి గడువు ఈ నెల 10 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసినట్లు వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
చిరంజీవికి పద్మవిభూషణ్ పురస్కారం ప్రదానం
-
సంజూ క్యాచ్ ఔట్ వివాదం.. కొత్త వీడియో వైరల్!
-
‘ప్రాజెక్ట్-జెడ్’కు సీక్వెల్.. ఈసారి హైఓల్టేజ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్తో..
-
ఇంధనం కటకట..! రఫా ఆస్పత్రులపై ‘డబ్ల్యూహెచ్వో’ ఆందోళన
-
పారిస్ ఒలింపిక్స్లో ఏదైనా జరగొచ్చు: నీరజ్ చోప్రా
-
రన్వే పై జారిన బోయింగ్ 737 విమానం.. 10మందికి గాయాలు