ganesh chaturthi: మండపం.. మంచి సంకల్పం
గణపతి నవరాత్రి ఉత్సవాలు.. కాలనీల్లో ప్రజల మధ్య ఐక్యతను పెంచుతున్నాయి.. విజయవంతంగా నిర్వహించడానికి అందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తున్నాయి..
సమాజహిత కార్యక్రమాలకు శ్రీకారం
ఆదివారం ప్రత్యేకం
గణపతి నవరాత్రి ఉత్సవాలు.. కాలనీల్లో ప్రజల మధ్య ఐక్యతను పెంచుతున్నాయి.. విజయవంతంగా నిర్వహించడానికి అందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తున్నాయి.. విగ్రహం కొనుగోలు మొదలు నిమజ్జనం వరకు కలిసికట్టుగా నడిపిస్తాయి.. నిత్య పూజలు, అన్నదానాలు చేయిస్తున్నాయి.. ఉదయం, సాయంత్రం మండపాల వద్ద కలుసుకునేలా చేస్తున్నాయి.. ఇదే స్ఫూర్తితో సమాజహితమైన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు నిర్వహకులు. గణేశ్ మండపాల వేదికగా తీర్మానాలు చేస్తున్నారు. మంచి సందేశాలిచ్చే విగ్రహాలను ప్రతిష్ఠించి.. ఆలోచింపజేస్తున్నారు.
ఈనాడు, వరంగల్
తప్పకుండా ఓటేద్దాం
ఓటు వజ్రాయుధం. ఎన్నికల్లో సరైన అభ్యర్థులను ఎంపిక చేసే అధికారం ఉంటుంది. కానీ ఓరుగల్లు నగరంలో చూస్తే ఓటింగ్ శాతం 60 మించడం లేదు. 18 ఏళ్లు నిండిన యువత ఓటు నమోదుచేసుకొని ఎన్నికల్లో కచ్చితంగా ఓటేసి తీరాలి. హనుమకొండ శ్రీనగర్ కాలనీ సౌత్ గణేశ్ ఉత్సవ సమితి 32 ఏళ్లుగా వినాయకుడిని ప్రతిష్ఠిస్తోంది. 12 సంవత్సరాల నుంచి పర్యావరణ హితమైన మట్టి విగ్రహాన్నే పూజించాలని తీర్మానం చేసి అదే కొనసాగిస్తున్నారు. ఈసారి నవరాత్రుల్లో భాగంగా వచ్చే ఎన్నికల్లో కాలనీవారంతా తప్పకుండా ఓటింగ్లో పాల్గొని, సరైన అభ్యర్థిని ఎన్నుకోవాలని, 18 ఏళ్లు నిండిన వారంతా ఓటరుగా నమోదు కావాలని గణేశుడి ముందు ప్రతిజ్ఞ చేశారు. ఇలా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు మండపం వేదిక కావాలి. నగరం, పట్టణాల్లో సైతం ఇదే స్ఫూర్తితో ఓటు వేస్తామని సంకల్పం చేసుకొంటే సత్ఫలితాలు వస్తాయి.
సీసీ కెమెరాల ఏర్పాటుకు తీర్మానం..
ఇటీవల వరంగల్ నగరంలో వరుస దొంగతనాలు జరిగాయి. అనేక నేరాలను రోజూ చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో కాలనీ కమిటీలు సీసీ కెమెరాలు ‘నేను సైతం’ కింద పెట్టుకోవాలని పోలీసులు చెప్పారు. కానీ నగరాలు, గ్రామాల్లో ఎక్కడా సరిగా లేవు. వీటిని ఏర్పాటుచేసుకుంటే ఏదైనా నేరం జరిగినప్పుడు వెంటనే నిందితులను గుర్తించేందుకు వీలుంటుంది. హనుమకొండ సుబేదారి వెంకటేశ్వరకాలనీలో ఏర్పాటుచేసిన వినాయక మండపం నిర్వాహకులు ఈ సంవత్సరం కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తీర్మానించారు. కాలనీలో ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని, మహిళలతో పొదుపు సంఘం ఏర్పాటు చేయాలని సంకల్పించారు.
పొదుపు మంత్రాన్ని పాటిస్తూ
జనగామ నెహ్రూపార్కు కూడలిలో ‘వాస్తు’ గణపతి ఉత్సవ కమిటీ 1989 నుంచి మండపాన్ని ఏర్పాటు చేస్తోంది. పొదుపు చేయాలనే లక్ష్యంతో పరపతి సంఘం ఏర్పాటు చేశారు.. వినాయక ఆలయాన్ని సైతం నిర్మించారు. పర్యావరణ హితం కోసం 2 వేల మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ఆర్థిక క్రమశిక్షణ ఉంటేనే జీవితంలో అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని నిరూపించారు. ఇదే స్ఫూర్తితో స్థానికులు చైతన్యవంతులై పొదుపు అలవర్చుకోవాలి.
జనగామ
చదువు కోసం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమాండ్లసంకీస ఎస్సీ కాలనీలోని యువత అక్షరాస్యతపై స్థానికులను చైతన్య పరచాలనే ఉద్దేశంతో ‘వీణ’తో ఉన్న విఘ్నేశ్వరుడిని ప్రతిష్ఠించారు. రాత్రి పూట సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినప్పుడు ప్రతి ఒక్కరూ చదువుకోవాలని ప్రచారం చేస్తున్నారు. ఈ మిత్రులు ఇతర సమయాల్లో కూడా విద్యావ్యాప్తి కోసం కృషి చేస్తున్నారు. ఇప్పటికీ మన దగ్గర అనేక మంది నిరక్షరాస్యులు ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్షరాస్యత కార్యక్రమాల కోసం సంకల్పం చేయాల్సిన అవసరం ఉంది.
డోర్నకల్
రహదారి భద్రత వివరిస్తూ
ద్విచక్రవాహం నడిపేప్పుడు శిరస్త్రాణం, కారు తోలేప్పుడు సీటు బెల్టు ధరించడం తప్పనిసరి. హనుమకొండ సుధానగర్లో శ్రీనూతన గజానన్ మండలి వారు ఈ సారి రహదారి భద్రతను వివరించే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ‘నాలా ఒక తల పోతే మరో తల పొందలేరని, అందుకు హెల్మెట్ ధరించి తీరాలి’ అనే సందేహాన్ని ఈ గణపతి ఇస్తాడు. గణేశ్ మండపాల వద్ద యువతకు ఇదే విషయం విడమరిచి చెప్పాలి. స్థానిక యువతీ యువకులను పిలిచి ఇక నుంచి తాము తప్పకుండా శిరస్త్రారణం ధరిస్తామని ప్రతిజ్ఞ చేయాలి.
పట్టణాలు, పల్లెల్లో మండపాల వద్ద ప్రజలందరూ రోజూ కలుసుకుంటారు. ఆప్యాయంగా పలకరించుకుంటారు. అలా కలిసినప్పుడు మన శ్రేయస్సుకు కొన్ని అంశాలు చర్చించాలి. వాటి అమలు కోసం తీర్మానాలు చేసుకుంటే వచ్చే ఏడాదంతా హాయిగా ఉండొచ్చు. మండపాల వద్ద అందరూ కలిసి సత్య ప్రమాణం చేస్తే దాన్ని తప్పకుండా పాటిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరుగెత్తి.. ఓటు విలువ చాటి..
[ 06-05-2024]
ఓటర్లను చైతన్యవంతం చేసి పోలింగ్శాతాన్ని పెంచాలనే లక్ష్యంతో వరంగల్ నగరంలో ఆదివారం ఏర్పాటు చేసిన 5కె రన్ ఉత్సాహంగా జరిగింది. హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం నుంచి అంబేడ్కర్ కూడలి, కాళోజీ సెంటర్ మీదుగా కలెక్టరేట్ వరకు పరుగు సాగింది. -
హోరెత్తనున్న ప్రచారం
[ 06-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న క్రమంలో రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, భాజపా, భారాస తమ పార్టీల అగ్రనేతలతో ఒకటి రెండు దఫాలు వరంగల్, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో ప్రచారం చేశాయి. -
పరిశ్రమలు రావాలి.. ఓరుగల్లు మురవాలి
[ 06-05-2024]
ఉమ్మడి వరంగల్ విద్యా కేంద్రంగా ఎంతో ప్రసిద్ధి.. పరిశ్రమల్లో మాత్రం వెనుకబాటులో ఉంది. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన ఓరుగల్లులో ఐటీ సంస్థలు ఏర్పాటుచేస్తే ప్రగతి పరుగులు పెడుతుంది. గ్రానైట్, జౌళి, ఉక్కు తదితర రంగాల్లో ఇండస్ట్రీలను ఏర్పాటుచేసే అవకాశం ఉంది. పుష్కలంగా పంటలు పండే ఈ ప్రాంతంలో అనేక ఆహార శుద్ధి యూనిట్లు ప్రారంభించొచ్చు. -
ఎన్నికల వేళ.. మద్యం జోరు
[ 06-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నాయకుల ప్రచారాలు వాడీవేడిగా సాగుతున్నాయి. ఒకవైపు ప్రత్యర్థులపై మాటల యుద్ధం చేస్తూనే మరో వైపు గెలుపుపై అస్త్రాలు సంధిస్తున్నారు. ఇవిగాక ప్రలోభాలనే ప్రధానంగా నమ్ముకుని ప్రచారం చేసే అవకాశం లేకపోలేదు. -
ఓటేశారు.. స్ఫూర్తి రగిలించారు..!
[ 06-05-2024]
అభివృద్ధిలో మన కన్నా దిగువన ఉన్న దేశాల్లో ఓటు హక్కు వినియోగం ఎక్కువ. మన దగ్గర ఓటు హక్కుపై చైతన్య పరిచేందుకు విభిన్న రూపాల్లో కార్యాచరణ చేపడుతున్నా నిర్లిప్తత వీడట్లేదు. సుపరిపాలన కావాలంటే రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. -
భాజపా, భారాసలకు గుణపాఠం తప్పదు
[ 06-05-2024]
కుల, మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధిపొందాలనే కుటిల యత్నాలు చేస్తున్న భాజపా నుంచి దేశ ప్రజలకు రక్షణ కల్పించేందుకు వామపక్ష పార్టీల్లో ఒక్కటైన సీపీఎం ఇండియా కూటమిలో భాగస్వామ్యమైందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. -
చేసింది కొంత.. చేయాల్సింది కొండంత
[ 06-05-2024]
‘2021 ఏప్రిల్లో గ్రేటర్ వరంగల్ పరిధిలోని 66 డివిజన్ల కార్పొరేటర్ల పదవులకు ఎన్నికలు జరిగాయి. 2021 మే 6న మేయర్, ఉప మేయర్, కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు.’ వరంగల్ మహా నగరపాలక సంస్థ పాలకవర్గం కొలువు తీరి (ప్రమాణ స్వీకారం) సోమవారంతో మూడేళ్లు పూర్తవుతుంది. -
కాంగ్రెస్ వచ్చాక పథకాలు ఆగాయి
[ 06-05-2024]
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను విస్మరించిందని, లోక్సభ ఎన్నికల్లో భారాసకు ఓటు వేసి గెలిపిస్తే ప్రభుత్వం మెడలు వంచి హామీలను అమలు చేయిస్తామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. -
‘ప్రధాని మోదీ తెలంగాణకు చేసింది శూన్యం’
[ 06-05-2024]
రాష్ట్ర విభజన చట్టం హామీలను విస్మరించిన భాజపాకు లోక్సభ ఎన్నికల్లో ఓటమి తప్పదని, రాహుల్గాంధీ ప్రధాని కావడం ఖాయమని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు అన్నారు. -
రైతుల దరి చేరని భూసార పరీక్షలు
[ 06-05-2024]
దిగుబడి అధికంగా రావాలని రైతులు మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడుతున్నారు. నేల స్వభావాన్ని బట్టి ఏ పంట వేయాలి, ఏ ఎరువులు ఎంత వరకు వినియోగించాలో తెలియాలంటే కచ్చితంగా భూసార పరీక్ష చేయాల్సిందే. ప్రస్తుతం రసాయన ఎరువుల ధరలు అమాంతం పెరిగాయి. -
ఎట్టకేలకు తారు పడింది..!
[ 06-05-2024]
వెంకటాపురం మండలంలోని రాచపల్లి-మొట్లగూడెం రహదారికి ఎట్టకేలకు తారు పడింది. రూ.1.13 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ మార్గం ఏడాదిగా అసంపూర్తిగానే వెక్కిరించింది. -
వేసవి తాపం.. మారిన షిఫ్టు సమయం
[ 06-05-2024]
ఉపరితల గనుల్లో షిఫ్టు వేళలను సింగరేణి మార్పు చేసింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా యాజమాన్యం ఉదయం, రెండో షిఫ్టు సమయాల్లో మార్పు చేసింది. సాధారణంగా ఉదయం షిఫ్టు 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుంది. -
ముందస్తుగా ఓటేశారు!
[ 06-05-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఓ వైపు అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకుల ప్రచారాలు.. మరో వైపు ఈ నెల 13న పోలింగ్ నిర్వహించేందుకు అధికారుల ఏర్పాట్లు కొనసాగుతుండగానే ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. -
‘భాజపా, భారాసలకు ఓటేస్తే మురిగిపోతుంది’
[ 06-05-2024]
లోక్సభ ఎన్నికల్లో భాజపా, భారాసలకు ప్రజలు ఓటేస్తే మురిగిపోతుందే తప్ప.. పనికిరాదని వరంగల్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య అన్నారు. -
అనారోగ్యంతో ఓటరు.. బాధ్యత మరవలేదు!
[ 06-05-2024]
మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని డోర్నకల్, మహబూబాబాద్లో ఆదివారం నుంచి ‘ఇంటి నుంచి ఓటు’ కార్యక్రమం ప్రారంభమైంది. డోర్నకల్కు చెందిన ఓటరు వెంకటేశ్వరరావు రెండేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్నారు. -
ప్రధాని మోదీ సభకు ఆహ్వాన పత్రిక
[ 06-05-2024]
ప్రధాని మోదీ బహిరంగ సభకు తరలిరావాలంటూ మొదటిసారి ప్రజలకు ఆహ్వాన పత్రికలు అందిస్తూ వినూత్న ప్రచారానికి వరంగల్ భాజపా నాయకులు శ్రీకారం చుట్టారు. -
నీట్కు 13 మంది గైర్హాజరు
[ 06-05-2024]
జిల్లా కేంద్రంలోని రెండు పరీక్ష కేంద్రాల్లో ఆదివారం జరిగిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి జరిగిన పరీక్షకు ఉదయం 11 నుంచే విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతించారు. -
సిరా గుర్తు వేసే వేలు లేకపోతే..?
[ 06-05-2024]
పోలింగ్ రోజు ఓటరు ఓటేసినట్లు తెలిసేందుకు, అదే ఓటరు మళ్లీ ఓటు వేయకుండా ఉండేందుకు సిబ్బంది ఓటరు ఎడమ చేతి చూపుడు వేలికి సిరా గుర్తు పూస్తారు. ఈ సంగతి అందరికీ తెలిసిందే.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
-
ఇరాన్లో వేధింపులు తట్టుకోలేక.. పడవతో సహా భారత్కు చేరుకొన్న మత్స్యకారులు..!
-
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్న్యూస్.. ఆగస్టు నుంచి 4జీ సేవలు
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
రఫాపై ఇజ్రాయెల్ దండయాత్ర.. దాడులు మొదలుపెట్టిన సైన్యం!
-
నన్ను గదిలో బంధించి దాడి చేశారు: రాధికా ఖేడా తీవ్ర ఆరోపణలు