ganesh chaturthi: మండపం.. మంచి సంకల్పం
గణపతి నవరాత్రి ఉత్సవాలు.. కాలనీల్లో ప్రజల మధ్య ఐక్యతను పెంచుతున్నాయి.. విజయవంతంగా నిర్వహించడానికి అందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తున్నాయి..
సమాజహిత కార్యక్రమాలకు శ్రీకారం
ఆదివారం ప్రత్యేకం
గణపతి నవరాత్రి ఉత్సవాలు.. కాలనీల్లో ప్రజల మధ్య ఐక్యతను పెంచుతున్నాయి.. విజయవంతంగా నిర్వహించడానికి అందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తున్నాయి.. విగ్రహం కొనుగోలు మొదలు నిమజ్జనం వరకు కలిసికట్టుగా నడిపిస్తాయి.. నిత్య పూజలు, అన్నదానాలు చేయిస్తున్నాయి.. ఉదయం, సాయంత్రం మండపాల వద్ద కలుసుకునేలా చేస్తున్నాయి.. ఇదే స్ఫూర్తితో సమాజహితమైన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు నిర్వహకులు. గణేశ్ మండపాల వేదికగా తీర్మానాలు చేస్తున్నారు. మంచి సందేశాలిచ్చే విగ్రహాలను ప్రతిష్ఠించి.. ఆలోచింపజేస్తున్నారు.
ఈనాడు, వరంగల్
తప్పకుండా ఓటేద్దాం
ఓటు వజ్రాయుధం. ఎన్నికల్లో సరైన అభ్యర్థులను ఎంపిక చేసే అధికారం ఉంటుంది. కానీ ఓరుగల్లు నగరంలో చూస్తే ఓటింగ్ శాతం 60 మించడం లేదు. 18 ఏళ్లు నిండిన యువత ఓటు నమోదుచేసుకొని ఎన్నికల్లో కచ్చితంగా ఓటేసి తీరాలి. హనుమకొండ శ్రీనగర్ కాలనీ సౌత్ గణేశ్ ఉత్సవ సమితి 32 ఏళ్లుగా వినాయకుడిని ప్రతిష్ఠిస్తోంది. 12 సంవత్సరాల నుంచి పర్యావరణ హితమైన మట్టి విగ్రహాన్నే పూజించాలని తీర్మానం చేసి అదే కొనసాగిస్తున్నారు. ఈసారి నవరాత్రుల్లో భాగంగా వచ్చే ఎన్నికల్లో కాలనీవారంతా తప్పకుండా ఓటింగ్లో పాల్గొని, సరైన అభ్యర్థిని ఎన్నుకోవాలని, 18 ఏళ్లు నిండిన వారంతా ఓటరుగా నమోదు కావాలని గణేశుడి ముందు ప్రతిజ్ఞ చేశారు. ఇలా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు మండపం వేదిక కావాలి. నగరం, పట్టణాల్లో సైతం ఇదే స్ఫూర్తితో ఓటు వేస్తామని సంకల్పం చేసుకొంటే సత్ఫలితాలు వస్తాయి.
సీసీ కెమెరాల ఏర్పాటుకు తీర్మానం..
ఇటీవల వరంగల్ నగరంలో వరుస దొంగతనాలు జరిగాయి. అనేక నేరాలను రోజూ చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో కాలనీ కమిటీలు సీసీ కెమెరాలు ‘నేను సైతం’ కింద పెట్టుకోవాలని పోలీసులు చెప్పారు. కానీ నగరాలు, గ్రామాల్లో ఎక్కడా సరిగా లేవు. వీటిని ఏర్పాటుచేసుకుంటే ఏదైనా నేరం జరిగినప్పుడు వెంటనే నిందితులను గుర్తించేందుకు వీలుంటుంది. హనుమకొండ సుబేదారి వెంకటేశ్వరకాలనీలో ఏర్పాటుచేసిన వినాయక మండపం నిర్వాహకులు ఈ సంవత్సరం కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తీర్మానించారు. కాలనీలో ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని, మహిళలతో పొదుపు సంఘం ఏర్పాటు చేయాలని సంకల్పించారు.
పొదుపు మంత్రాన్ని పాటిస్తూ
జనగామ నెహ్రూపార్కు కూడలిలో ‘వాస్తు’ గణపతి ఉత్సవ కమిటీ 1989 నుంచి మండపాన్ని ఏర్పాటు చేస్తోంది. పొదుపు చేయాలనే లక్ష్యంతో పరపతి సంఘం ఏర్పాటు చేశారు.. వినాయక ఆలయాన్ని సైతం నిర్మించారు. పర్యావరణ హితం కోసం 2 వేల మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ఆర్థిక క్రమశిక్షణ ఉంటేనే జీవితంలో అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని నిరూపించారు. ఇదే స్ఫూర్తితో స్థానికులు చైతన్యవంతులై పొదుపు అలవర్చుకోవాలి.
జనగామ
చదువు కోసం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమాండ్లసంకీస ఎస్సీ కాలనీలోని యువత అక్షరాస్యతపై స్థానికులను చైతన్య పరచాలనే ఉద్దేశంతో ‘వీణ’తో ఉన్న విఘ్నేశ్వరుడిని ప్రతిష్ఠించారు. రాత్రి పూట సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినప్పుడు ప్రతి ఒక్కరూ చదువుకోవాలని ప్రచారం చేస్తున్నారు. ఈ మిత్రులు ఇతర సమయాల్లో కూడా విద్యావ్యాప్తి కోసం కృషి చేస్తున్నారు. ఇప్పటికీ మన దగ్గర అనేక మంది నిరక్షరాస్యులు ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్షరాస్యత కార్యక్రమాల కోసం సంకల్పం చేయాల్సిన అవసరం ఉంది.
డోర్నకల్
రహదారి భద్రత వివరిస్తూ
ద్విచక్రవాహం నడిపేప్పుడు శిరస్త్రాణం, కారు తోలేప్పుడు సీటు బెల్టు ధరించడం తప్పనిసరి. హనుమకొండ సుధానగర్లో శ్రీనూతన గజానన్ మండలి వారు ఈ సారి రహదారి భద్రతను వివరించే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ‘నాలా ఒక తల పోతే మరో తల పొందలేరని, అందుకు హెల్మెట్ ధరించి తీరాలి’ అనే సందేహాన్ని ఈ గణపతి ఇస్తాడు. గణేశ్ మండపాల వద్ద యువతకు ఇదే విషయం విడమరిచి చెప్పాలి. స్థానిక యువతీ యువకులను పిలిచి ఇక నుంచి తాము తప్పకుండా శిరస్త్రారణం ధరిస్తామని ప్రతిజ్ఞ చేయాలి.
పట్టణాలు, పల్లెల్లో మండపాల వద్ద ప్రజలందరూ రోజూ కలుసుకుంటారు. ఆప్యాయంగా పలకరించుకుంటారు. అలా కలిసినప్పుడు మన శ్రేయస్సుకు కొన్ని అంశాలు చర్చించాలి. వాటి అమలు కోసం తీర్మానాలు చేసుకుంటే వచ్చే ఏడాదంతా హాయిగా ఉండొచ్చు. మండపాల వద్ద అందరూ కలిసి సత్య ప్రమాణం చేస్తే దాన్ని తప్పకుండా పాటిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దివ్యాంగులను ఆప్యాయతతో చేరదీయాలి
[ 05-12-2023]
ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగులను ఆప్యాయతతో చేరదీయాలని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.రాధా దేవి అన్నారు. వరంగల్ న్యాయ సేవా సదన్ భవనంలో సోమవారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. -
ఐఎంఏ కార్యవర్గం ఎన్నిక
[ 05-12-2023]
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) వరంగల్ శాఖ కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవం అయిందని ఎన్నిల రిటర్నింగ్ అధికారులు డా.బైరం బాలాజీ, డా.బందెల మోహన్రావు, డా.ఆనంద్ బోక్రె సోమవారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. -
రుద్రేశ్వరుడికి తులసీ దళార్చన
[ 05-12-2023]
కార్తికమాసోత్సవాల్లో భాగంగా హనుమకొండలోని చారిత్రక రుద్రేశ్వర వేయిస్తంభాల దేవాలయంలో సోమవారం రుద్రేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారు జామున నాలుగు గంటల నుంచే భక్తులు సామూహిక రుద్రాభిషేకాలు చేశారు. -
45 రోజుల వరకు ఈవీఎంలకు పటిష్ఠ భద్రత
[ 05-12-2023]
ఓట్ల లెక్కింపు ముగిసిన అనంతరం ఈవీఎంలు, వీవీప్యాట్ల స్లిప్పులు, ఎన్నికల సామగ్రికి ఎన్నికల పిటిషన్ గడువు ముగిసే వరకు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా పాలనాధికారి ప్రావీణ్య వెల్లడించారు. -
నింగికెగసిన ఉద్యమ కెరటం
[ 05-12-2023]
ప్రతి క్షణం ప్రత్యేక రాష్ట్రం కోసం పరితాపం. అనుక్షణం తెలంగాణ జపం.. మది నిండా అదే ఆలోచన. ‘నాకు ఏ హీరోలు తెల్వరు. నా నిజమైన హీరో కేసీఆర్, ఆయనే నా దైవం’.. -
‘ఆరు గ్యారంటీలతోనే ఆదరించారు’
[ 05-12-2023]
తొమ్మిదిన్నరేళ్ల భారాస పాలనపై ప్రజలు విసిగెత్తిపోయారని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను ప్రజలు నమ్మి, జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించారని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అయిత ప్రకాష్రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో... -
సింగరేణి ఎన్నికల ప్రక్రియ షురూ!
[ 05-12-2023]
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రక్రియ మొదలైంది.. అక్టోబరులో జరగాల్సిన ఎన్నికలను కోర్టు ఆదేశాలతో వాయిదా వేశారు. తిరిగి ఈ నెల 27న నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో సోమవారం అన్ని కార్మిక సంఘాలతో హైదరాబాద్ డిప్యూటీ సీఎల్సీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. -
ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల పరిశీలన
[ 05-12-2023]
వరంగల్ ఎనుమాముల మార్కెట్ యార్డులో ఓట్ల లెక్కింపు తర్వాత ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంలను హనుమకొండ జిల్లా పాలనాధికారి సిక్తా పట్నాయక్ సోమవారం పరిశీలించారు. -
‘వెన్నుపోటుతోనే.. ఓటమి’
[ 05-12-2023]
సొంత పార్టీలోని వారే కొందరు వెన్నుపోటు పొడిచారని.. దీంతో ఓటమి చెందానని భారాస మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. -
రికార్డు స్థాయిలో ధాన్యం ధర
[ 05-12-2023]
కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో సోమవారం ఆర్ఎన్ఆర్ రకం క్వింటాలు ధాన్యం ధర రూ.3359 పలికింది. జిల్లాలోనే ఇది రికార్డు ధర. గతంలో ఎప్పుడు ఇంత ధర రాలేదు. -
కేసీఆర్ కలిసిన మాజీ మంత్రి
[ 05-12-2023]
జిల్లాకు చెందిన మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత సోమవారం గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆయన గృహంలో కలిశారు. -
ప్రజలకు అందుబాటులో ఉంటా..
[ 05-12-2023]
ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను మరచిపోయి కాంగ్రెస్ ఇచ్చిన అమలుకాని హామీలకు ప్రజలు మోసపోయి ఎన్నికల్లో భారాసకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని తాజా మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ అభ్యర్థి బానోతు శంకర్నాయక్ అన్నారు. -
నేత్రపర్వంగా సహస్ర దీపాలంకరణ..!
[ 05-12-2023]
కార్తికమాసం మూడో సోమవారాన్ని పురస్కరించుకొని గోవిందరావుపేట గ్రామంలోని గోవిందరాజ స్వామి ఆయలంలో నేత్రపర్వంగా సహస్ర దీపాలంకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. -
అడుగు దూరంలో గిరిజన విశ్వవిద్యాలయం
[ 05-12-2023]
రాష్ట్ర విభజన హామీల్లో ఒకటైన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం కల సాకారం కానుంది. అక్టోబర్ 1న పాలమూరులో ప్రధాని నరేంద్ర మోదీ గిరిజన యూనివర్సిటీకి ఆదివాసీల ఆరాధ్యదైవం సమ్మక్క,సారక్క పేరిట ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. -
కొత్త ఎమ్మెల్యేలకు అంగరక్షకుల కేటాయింపు
[ 05-12-2023]
అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారికి పోలీసులు రక్షణ కల్పించనున్నారు. నిఘా వర్గాల ఆదేశాల మేరకు అంగరక్షకులను వరంగల్ కమిషనర్ పోలీసులు కేటాయించారు. కమిషనరేట్ పరిధిలో ఎనిమిది నియోజకవర్గాలు ఉన్నాయి. -
స్థానిక సంస్థలపై గెలుపు ప్రభావం
[ 05-12-2023]
వరంగల్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పది శాసనసభ స్థానాల్లో గెలుపొందడం కార్యకర్తల్లో జోష్ నింపింది. గత పదేళ్లుగా పార్టీ అధికారం లేదు. చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు లేకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు డీలా పడ్డాయి. -
‘అధికారం ఉందని అహంకారం వద్దు’
[ 05-12-2023]
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అహంకారంతో ఉంటే భవిష్యత్తులో పాలనాపరంగా ఇబ్బందులు తప్పవని ఎమ్మెల్యేగా గెలుపొందిన కడియం శ్రీహరి హెచ్చరించారు. -
కాంగ్రెస్కే అత్యధిక తపాలా ఓట్లు
[ 05-12-2023]
జనగామ నియోజకవర్గంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో భారాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్రెడ్డిపై 15,733 ఓట్ల ఆధిక్యంతో గెలిచిన విషయం తెలిసిందే. -
106 బూత్లో వెలువడని వివరాలు!
[ 05-12-2023]
నవంబర్ 30న డోర్నకల్ అసెంబ్లీ స్థానానికి అధికారులు పోలింగ్ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో నియోజకవర్గ వ్యాప్తంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.


తాజా వార్తలు (Latest News)
-
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే
-
‘మీరు పావలా.. అర్ధ రూపాయికీ పనికిరారు’
-
Vishal: మేం అలాంటి పరిస్థితిలో లేం..: జీసీసీపై విశాల్ అసహనం
-
Nani: మహేశ్ బాబుతో మల్టీస్టారర్.. నాని ఆన్సర్ ఏంటంటే?
-
Jairam Ramesh: ‘ఆ మూడు బిల్లులు ప్రమాదకరం..! వాటిని వ్యతిరేకిస్తాం’
-
Live Bomb: ఇంటి పెరట్లోనే బాంబు.. దంపతులు షాక్..!