నాలాల్లో పూడికతీత పనులు చేపట్టండి
వరదనీరు పారే నాలాలు.. ఇలా ఉంటే ఎలా?, ఎక్కడ చూసినా వ్యర్థాలే కనిపిస్తున్నాయని గ్రేటర్ వరంగల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు.
కార్పొరేషన్, న్యూస్టుడే: వరదనీరు పారే నాలాలు.. ఇలా ఉంటే ఎలా?, ఎక్కడ చూసినా వ్యర్థాలే కనిపిస్తున్నాయని గ్రేటర్ వరంగల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. ఇటీవల ఈనాడులో ‘ఇంకా మేల్కోపోతే ఏమా‘నాలా’ శీర్షికన ప్రచురితమైన కథనానికి కమిషనర్ స్పందించారు. ఇంజినీరింగ్, ప్రజారోగ్య విభాగాల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హంటర్రోడ్ బొందివాగు, న్యూశాయంపేట, సాకరాశికుంట, వరంగల్ రైల్వేగేటు మేదరివాడ, కీర్తిబార్, శివనగర్, మైసయ్యనగర్, కరీమాబాద్ జన్మభూమి జంక్షన్ రోడ్, కాశీకుంట నాలాలు చూశారు. పూడికతీత పనులు మొదలుపెట్టాలని ఇంజినీర్లను కమిషనర్ ఆదేశించారు. బొందివాగు నాలా అత్యంత ప్రమాదకరమైందని, వరదనీరు సాఫీగా వెళ్లేలా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లోని నాలాల్లో పూడికతీత పనులు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో పర్యవేక్షక ఇంజినీర్ ప్రవీణ్చంద్ర, ఈఈ శ్రీనివాస్, ముఖ్య ఆరోగ్యాధికారి డా.రాజేష్, డీఈలు రవికిరణ్, రంగారావు, ఏఈలు, శానిటరీ సూపర్వైజర్, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.
హనుమకొండ పద్మాక్షిగుట్ట స్మార్ట్ రోడ్డు పనులు తిరిగి ప్రారంభించాలని కమిషనర్ ఇంజినీర్లను కోరారు. రంగశాయిపేట గవిచర్ల క్రాస్రోడ్ నుంచి ఉర్సు బొడ్రాయి, కరీమాబాద్ వరకు స్మార్ట్రోడ్డు పనులు తనిఖీ చేశారు. నిర్మాణ పనుల్లో వేగం పెంచాలన్నారు.
మట్టి దందాపై అధికారుల ఆరా
నర్సంపేట, న్యూస్టుడే: ‘గుంతలు పూడుస్తూ.. గుంటల లెక్కన అమ్మకాలు’ శీర్షికతో సోమవారం ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనంతో ప్రభుత్వ అధికారుల్లో కదలిక వచ్చింది. నిఘా వర్గాలు, రెవెన్యూ అధికారులు సోమవారం వివరాలు సేకరించారు. స్పెషల్ బ్రాంచి వరంగల్ తూర్పు డివిజన్ సీఐ రాఘవేందర్ సిబ్బందితో కలిసి సోమవారం మల్లంపల్లి మార్గంలో ప్రైవేటు కుంట, అసైన్డు భూముల్లోని చెరువు మట్టి పోసి పూడ్చిన గుంతలను పరిశీలించారు. ప్రైవేటు కుంట ఎవరిది, ఎంత విస్తీర్ణం, అసైన్డ్ భూమిలో గతంలో జరిపిన తవ్వకాలతో ఏర్పడిన గుంతలను, ప్రస్తుతం దామెర చెరువు మట్టి పోసి చదును చేసిన వాటిని పరిశీలించారు. గతంలో తవ్వకాలు జరిపి మట్టిని విక్రయించిందెవరు? ప్రస్తుతం ఆ గుంతల్లో మట్టి పోయించి పూడ్చింది ఎవరు? ఆ గుంతలు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి తదితర వివరాలను తెలుసుకున్నారు. రెవెన్యూశాఖ గిర్ధావరు ఎక్కడెక్కడ గుంతలు పూడ్చారు? మట్టి కుప్పలు పోసిన ఖాళీ స్థలాలెవరివి, మట్టి, మొరం కుప్పలు పోసుకున్న వారి వివరాలను సేకరించినట్లు తెలిసింది. స్పెషల్ బ్రాంచి అధికారులు సేకరించిన వివరాలతో నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందించనున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటేయడానికైనా ఎలా రావాలి...!
[ 30-04-2024]
తలపైన గ్రాసం.. సంకలో పసికూన.. మరో చేతిని పట్టుకున్న చిన్నారి. పక్కనే పండు ముసలి తల్లితో వందల మందిని తోసుకుంటూ జనరల్ బోగిలోకి ఎక్కాలంటే ఎంత కష్టామో ఊహించండి. కష్టపడి ఎలాగోలా లోనికి వెళ్లినా కాలు పెట్ట వీలుండదు -
వరంగల్ ప్రధాన న్యాయమూర్తిగా నిర్మలాగీతాంబ
[ 30-04-2024]
వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా వలగూడం బడిగేలి నిర్మలాగీతాంబ సోమవారం బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్లోని సిటీ స్మాల్ కాజెస్ కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న ఈమె బదిలీపై జిల్లాకు వచ్చిన విషయం తెలిసిందే. -
‘భారాస, భాజపాలు తోడు దొంగలు’
[ 30-04-2024]
కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో భారాసలు తోడుదొంగ పార్టీలని, అబద్దపు హామీలతో ప్రజలను మోసం చేస్తున్న రెండు పార్టీలకు ఈ లోక్సభ ఎన్నికల్లో ఓటుతో తగిన గుణపాఠం చెప్పాలని వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు -
‘లోక్సభ ఎన్నికల తర్వాత భారాస దుకాణం మూత’
[ 30-04-2024]
లోక్సభ ఎన్నికల తర్వాత భారాస దుకాణం మూతపడడం ఖాయమని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. -
కొడకండ్లకు మినీ టెక్స్టైల్ పార్క్ తెస్తా
[ 30-04-2024]
చేనేత కార్మికులు అధికంగా ఉన్న కొడకండ్లలో మినీ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసి... పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు వరంగల్ లోక్సభ భాజపా అభ్యర్థి అరూరి రమేశ్ హామీ ఇచ్చారు. కొడకండ్ల, దేవరుప్పుల మండలాల్లో సోమవారం నిర్వహించిన రోడ్షో కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. -
భువనగిరి బరిలో 39 మంది
[ 30-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా భువనగిరి స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఎంత మంది అనేది తేలింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగియడంతో బరిలో ఉన్న అభ్యర్థులు ఎందరో అధికారులు వివరాలు వెల్లడించారు. -
నీటి కుంట.. తీరును తంటా!
[ 30-04-2024]
మానవుడి అవసరాలకు మించి అడవులను నరికివేయడంతో వాతావరణ సమతౌల్యం దెబ్బతిని కరవు పరిస్థితులు ఎదురవుతున్నాయి. -
‘ఈ’ సైకిల్ భళా..!
[ 30-04-2024]
కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమని నిరూపిస్తున్నారు ఇంటర్మీడియట్ విద్యార్థి. మండలంలోని గోపాలపురానికి చెందిన కాముని హరీష్ గార్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూపులో ప్రథమ సంవత్సరం పూర్తిచేశారు. -
రాత్రిపూటా నిప్పుల కుంపటే!
[ 30-04-2024]
ములుగు జిల్లా భానుడి ప్రతాపానికి అట్టుడికిపోతోంది. రాత్రిపూట సాధారణంగా 25-30 డిగ్రీల మధ్య ఉండాల్సిన ఉష్ణోగ్రత 33.7-36.8 డిగ్రీలు నమోదవుతోంది -
రాతియుగం నాటి కంకణ శిల లభ్యం
[ 30-04-2024]
సుమారు ఆరు వేల ఏళ్ల నాటి అపురూపమైన కొత్త రాతియుగం పనిముట్టు కంకణ శిలను ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని భూపతిపురం గ్రామంలో కనుగొన్నట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ రామోజు హరగోపాల్, పరిశోధక సభ్యులు అహోబిలం కరుణాకర్, మహమ్మద్ నసీరుద్దీన్, చిడం రవి తెలిపారు -
బరి గీశారు.. గురి ఎవరిదో..!
[ 30-04-2024]
‘నోటాతో కలిపి ఒక్కో బ్యాలెట్ యూనిట్పై 16 మంది అభ్యర్థుల గుర్తులు కేటాయించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వరంగల్ నియోజకవర్గం పరిధిలో మూడేసి బ్యాలెట్ యూనిట్లు, మహబూబాబాద్ పరిధిలో రెండేసి బ్యాలెట్ యూనిట్లను అధికారులు ఏర్పాటు చేయనున్నారు.’ -
మరోసారి మోదీ ప్రభుత్వం ఖాయం
[ 30-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్లో సోమవారం నిర్వహించిన భాజపా జనసభ విజయవంతమైంది. ఎండను సైతం లెక్కచేయకుండా లోక్సభ నియోజకర్గం పరిధిలోని ప్రజలు భారీగా తరలొచ్చారు. -
అయిదుశాతం రాయితీకి చివరి అవకాశం
[ 30-04-2024]
ముందస్తు ఆస్తిపన్ను చెల్లింపులకు వరంగల్ నగర ప్రజల నుంచి స్పందన లభించింది. సోమవారం సాయంత్రం వరకు సుమారు రూ.18 కోట్ల పైన వసూలైనట్లు బల్దియా పన్నుల విభాగం అధికారులు తెలిపారు. -
తాగునీటి ఎద్దడి రాకుండా అప్రమత్తత అవసరం
[ 30-04-2024]
వరంగల్ నగరంలో తాగునీటి ఎద్దడి రావొద్దు, రెండునెలల పాటు అధికారులందరూ అప్రమత్తంగా పనిచేయాలని ఐఏఎస్ అధికారి, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన వరంగల్ ఉమ్మడి జిల్లా నీటి సరఫరా ప్రత్యేకాధికారి బి.గోపి సూచించారు. -
కెప్టెన్ ఇంటి నుంచి ఖమ్మం ప్రచారానికి కేసీఆర్
[ 30-04-2024]
వరంగల్లో ఆదివారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించి హంటర్రోడ్లోని రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు నివాసంలో బస చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సాయంత్రం 4 గంటలకు ఖమ్మంలో ఎన్నికల ప్రచారానికి బయలుదేరి వెళ్లారు
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!