భూ కబ్జా కేసులో.. మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ అరెస్టు
భూ కబ్జాకు యత్నించిన భూపాలపల్లి పురపాలక సంఘం మాజీ వైస్ ఛైర్మన్, స్థానిక 12వ వార్డు భారాస కౌన్సిలర్ కొత్త హరిబాబును మంగళవారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
మాజీ మున్సిపల్ వైస్ఛైర్మన్ కొత్త హరిబాబును విచారిస్తున్న సీఐ నరేష్కుమార్
భూపాలపల్లి, న్యూస్టుడే: భూ కబ్జాకు యత్నించిన భూపాలపల్లి పురపాలక సంఘం మాజీ వైస్ ఛైర్మన్, స్థానిక 12వ వార్డు భారాస కౌన్సిలర్ కొత్త హరిబాబును మంగళవారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సీఐ నరేష్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కొత్త హరిబాబు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాశీంపల్లి గ్రామానికి చెందిన నూనె అనిల్కుమార్కు సంబంధించిన జామాయిల్ తోటను ధ్వంసం చేసి, కాపలాదారులపై దాడులు చేయడమే కాకుండా జామాయిల్ తోటలో చెట్లను ధ్వంసం చేస్తూ అందులో నుంచే అక్రమంగా రోడ్డు నిర్మించినట్లు తెలిపారు. పక్కా ప్రణాళిక ప్రకారమే బాధితుడి భూమిని కబ్జా చేయటానికి యత్నించినట్లు పేర్కొన్నారు. అనిల్కుమార్ ఫిర్యాదు మేరకు కొత్త హరిబాబును అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. కేసులో మరో వ్యక్తి దశరథం పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.
ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు : జిల్లా వ్యాప్తంగా పేదలకు సంబంధించిన భూములను అక్రమంగా కబ్జా చేస్తున్న వారిపై కఠినచర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఒక ప్రకటనలో హెచ్చరించారు. కబ్జాకు పాల్పడిన వ్యక్తులు ఎంతటి వారైనా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. భూ కబ్జాలకు గురైన బాధితులు తమ పరిధిలోని పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. సామాన్యులకు, పేదలకు న్యాయం చేయడమే పోలీసుల ప్రధాన కర్తవ్యమని వివరించారు. జిల్లా కేంద్రంలో భూ కబ్జాలకు పాల్పడుతున్న వారి గురించి కూడా పోలీసు శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిందని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బరి గీశారు.. గురి ఎవరిదో..!
[ 30-04-2024]
‘నోటాతో కలిపి ఒక్కో బ్యాలెట్ యూనిట్పై 16 మంది అభ్యర్థుల గుర్తులు కేటాయించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వరంగల్ నియోజకవర్గం పరిధిలో మూడేసి బ్యాలెట్ యూనిట్లు, మహబూబాబాద్ పరిధిలో రెండేసి బ్యాలెట్ యూనిట్లను అధికారులు ఏర్పాటు చేయనున్నారు.’ -
ఓటేయడానికైనా ఎలా రావాలి...!
[ 30-04-2024]
తలపైన గ్రాసం.. సంకలో పసికూన.. మరో చేతిని పట్టుకున్న చిన్నారి. పక్కనే పండు ముసలి తల్లితో వందల మందిని తోసుకుంటూ జనరల్ బోగిలోకి ఎక్కాలంటే ఎంత కష్టామో ఊహించండి. కష్టపడి ఎలాగోలా లోనికి వెళ్లినా కాలు పెట్ట వీలుండదు -
వరంగల్ ప్రధాన న్యాయమూర్తిగా నిర్మలాగీతాంబ
[ 30-04-2024]
వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా వలగూడం బడిగేలి నిర్మలాగీతాంబ సోమవారం బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్లోని సిటీ స్మాల్ కాజెస్ కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న ఈమె బదిలీపై జిల్లాకు వచ్చిన విషయం తెలిసిందే. -
‘భారాస, భాజపాలు తోడు దొంగలు’
[ 30-04-2024]
కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో భారాసలు తోడుదొంగ పార్టీలని, అబద్దపు హామీలతో ప్రజలను మోసం చేస్తున్న రెండు పార్టీలకు ఈ లోక్సభ ఎన్నికల్లో ఓటుతో తగిన గుణపాఠం చెప్పాలని వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు -
‘లోక్సభ ఎన్నికల తర్వాత భారాస దుకాణం మూత’
[ 30-04-2024]
లోక్సభ ఎన్నికల తర్వాత భారాస దుకాణం మూతపడడం ఖాయమని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. -
కొడకండ్లకు మినీ టెక్స్టైల్ పార్క్ తెస్తా
[ 30-04-2024]
చేనేత కార్మికులు అధికంగా ఉన్న కొడకండ్లలో మినీ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసి... పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు వరంగల్ లోక్సభ భాజపా అభ్యర్థి అరూరి రమేశ్ హామీ ఇచ్చారు. కొడకండ్ల, దేవరుప్పుల మండలాల్లో సోమవారం నిర్వహించిన రోడ్షో కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. -
భువనగిరి బరిలో 39 మంది
[ 30-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా భువనగిరి స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఎంత మంది అనేది తేలింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగియడంతో బరిలో ఉన్న అభ్యర్థులు ఎందరో అధికారులు వివరాలు వెల్లడించారు. -
నీటి కుంట.. తీరును తంటా!
[ 30-04-2024]
మానవుడి అవసరాలకు మించి అడవులను నరికివేయడంతో వాతావరణ సమతౌల్యం దెబ్బతిని కరవు పరిస్థితులు ఎదురవుతున్నాయి. -
‘ఈ’ సైకిల్ భళా..!
[ 30-04-2024]
కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమని నిరూపిస్తున్నారు ఇంటర్మీడియట్ విద్యార్థి. మండలంలోని గోపాలపురానికి చెందిన కాముని హరీష్ గార్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూపులో ప్రథమ సంవత్సరం పూర్తిచేశారు. -
రాత్రిపూటా నిప్పుల కుంపటే!
[ 30-04-2024]
ములుగు జిల్లా భానుడి ప్రతాపానికి అట్టుడికిపోతోంది. రాత్రిపూట సాధారణంగా 25-30 డిగ్రీల మధ్య ఉండాల్సిన ఉష్ణోగ్రత 33.7-36.8 డిగ్రీలు నమోదవుతోంది -
రాతియుగం నాటి కంకణ శిల లభ్యం
[ 30-04-2024]
సుమారు ఆరు వేల ఏళ్ల నాటి అపురూపమైన కొత్త రాతియుగం పనిముట్టు కంకణ శిలను ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని భూపతిపురం గ్రామంలో కనుగొన్నట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ రామోజు హరగోపాల్, పరిశోధక సభ్యులు అహోబిలం కరుణాకర్, మహమ్మద్ నసీరుద్దీన్, చిడం రవి తెలిపారు -
మరోసారి మోదీ ప్రభుత్వం ఖాయం
[ 30-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్లో సోమవారం నిర్వహించిన భాజపా జనసభ విజయవంతమైంది. ఎండను సైతం లెక్కచేయకుండా లోక్సభ నియోజకర్గం పరిధిలోని ప్రజలు భారీగా తరలొచ్చారు. -
అయిదుశాతం రాయితీకి చివరి అవకాశం
[ 30-04-2024]
ముందస్తు ఆస్తిపన్ను చెల్లింపులకు వరంగల్ నగర ప్రజల నుంచి స్పందన లభించింది. సోమవారం సాయంత్రం వరకు సుమారు రూ.18 కోట్ల పైన వసూలైనట్లు బల్దియా పన్నుల విభాగం అధికారులు తెలిపారు. -
తాగునీటి ఎద్దడి రాకుండా అప్రమత్తత అవసరం
[ 30-04-2024]
వరంగల్ నగరంలో తాగునీటి ఎద్దడి రావొద్దు, రెండునెలల పాటు అధికారులందరూ అప్రమత్తంగా పనిచేయాలని ఐఏఎస్ అధికారి, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన వరంగల్ ఉమ్మడి జిల్లా నీటి సరఫరా ప్రత్యేకాధికారి బి.గోపి సూచించారు. -
కెప్టెన్ ఇంటి నుంచి ఖమ్మం ప్రచారానికి కేసీఆర్
[ 30-04-2024]
వరంగల్లో ఆదివారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించి హంటర్రోడ్లోని రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు నివాసంలో బస చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సాయంత్రం 4 గంటలకు ఖమ్మంలో ఎన్నికల ప్రచారానికి బయలుదేరి వెళ్లారు
తాజా వార్తలు (Latest News)
-
మీ నాన్న విగ్రహ పనులూ నాసిరకమేనా జగన్!
-
65 ఏళ్లు నిండిన అంగన్వాడీ సిబ్బందికి విశ్రాంతి
-
ఈసారి పింఛనుకు పడవ ప్రయాణం చేయాల్సిందే!
-
మార్కుల విషయమై తల్లీ కుమార్తెల ఘర్షణ.. పరస్పరం కత్తిపోట్లు
-
చంద్రబాబు వాహనంపైకి గుర్తుతెలియని వ్యక్తులు
-
బ్యాంకాక్ ఏషియా అందాల పోటీల్లో విశాఖ నివాసి మూడు టైటిల్స్ కైవసం