‘తులం బంగారం ఇచ్చి ఉంటే కాంగ్రెస్కు ఓటేయండి’
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం పెళ్లైన ఆడబిడ్డలకు తులం బంగారం ఇచ్చి ఉంటే ఆ పార్టీకే ఓటేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ సూచించారు.
మాట్లాడుతున్న మాజీ మంత్రి సత్యవతిరాథోడ్
ఇల్లెందు, న్యూస్టుడే: ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం పెళ్లైన ఆడబిడ్డలకు తులం బంగారం ఇచ్చి ఉంటే ఆ పార్టీకే ఓటేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ సూచించారు. అలాకాకుంటే కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేసిన భారాసకు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం మినహా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. భారాస ఇల్లెందు పట్టణ, మండల, టేకులపల్లి, కామేపల్లి మండలాల ప్రజాప్రతినిధులు, ప్రధాన నాయకులతో స్థానిక పాత బస్టాండ్లోని ఐతవారి భవనంలో మంగళవారం పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. రాజకీయ కుట్రల నేపథ్యంలో కేంద్రం ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్టు చేశారని, త్వరలో ఆమె నిర్దోషిగా బయటకు వస్తారన్నారు. ఎంపీగా వందసార్లు మాలోత్ కవిత ఇల్లెందుకు వచ్చి ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్నారన్నారు. మరోసారి ఆమెను గెలిపించాలని కోరారు. భారాస ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత మాట్లాడుతూ రాష్ట్రంలో మొదట గెలిచే ఎంపీ స్థానం తనదేనన్నారు. ఎన్నికల నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఎమ్మెల్సీ రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, జడ్పీ ఛైర్మన్ ఆంగోతు బిందు, పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు రాజేందర్, నాయకులు పి.వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, రమేష్, ఆజాం, కృష్ణప్రసాద్, తదితరులున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హోటళ్లకు వినూత్న పేర్లు.. రుచుల విందు
[ 29-04-2024]
ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే భిన్నంగా ఆలోచించాలి.. రెస్టారెంట్ల వ్యాపారంలో దీనికి మరింత ప్రాధాన్యం ఉంటుంది. -
ఉద్యమ నేతను చూసి ఉప్పొంగిన ఆనందం
[ 29-04-2024]
గులాబీ దళపతి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్ర హనుమకొండ నగరంలో ఆదివారం విజయవంతమైంది. నక్కలగుట్టలో సాయంత్రం 4 గంటల నుంచి వరంగల్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో భారాస నేతలు, కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. -
విపణిలో ధర లేదు.. గిడ్డంగిలో జాగ లేదు!
[ 29-04-2024]
ఉమ్మడి వరంగల్వ్యాప్తంగా ఎర్ర బంగారం పండించిన రైతులు ఈసారి నష్టాల ఘాటులో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. -
ఓరుగల్లు ముద్ర ఉండాల్సిందే..!
[ 29-04-2024]
వారంతా ఇప్పుడు లోక్సభ పోరులో హోరాహోరీగా తలపడుతున్నారు. పార్లమెంటులో అడుగుపెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. -
భాజపాతోనే మాదిగలకు న్యాయం
[ 29-04-2024]
భాజపాతోనే మాదిగలకు న్యాయం జరుగుతుందని వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ పేర్కొన్నారు. -
బడుల మరమ్మతులకు సన్నద్ధం
[ 29-04-2024]
వచ్చే విద్యాసంవత్సరం ఆరంభం నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం సమాయత్తమైంది. -
నిధులు దూరం.. నిర్వహణ భారం
[ 29-04-2024]
జిల్లాలో రైతు వేదికల నిర్వహణ అధికారులకు భారమైంది. కొంత కాలంగా ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు నిలిచిపోయాయి. -
‘హామీల అమలును విస్మరించిన కాంగ్రెస్’
[ 29-04-2024]
అసెంబ్లీ ఎన్నికల్లో అనేక మోసపూరిత హామీలిచ్చి.. ఒకటి రెండే అమలు చేసి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని పెద్దపల్లి భారాస ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. -
నిప్పుల కుంపటి
[ 29-04-2024]
జిల్లాలో ఎండలవేడి నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఏప్రిల్ మొదటి వారం నుంచే ఎండలు తీవ్రమై రోజురోజుకు పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. -
17 నెలలు 17 కి.మీ!
[ 29-04-2024]
జాతీయ రహదారి 353సీˆ మన రాష్ట్రంలో భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం నుంచి మొదలై హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం గుడెప్పాడ్ వరకు 101 కిలోమీటర్లు సాగుతుంది. -
డంపర్లకు టైర్ల కొరత
[ 29-04-2024]
సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి కేంద్రాలైన ఉపరితల గనుల్లో నడిచే డంపర్లకు టైర్ల కొరత ఏర్పడింది. -
అటకెక్కిన ఆధునికీకరణ
[ 29-04-2024]
మంగపేట మండలం నర్సింహసాగర్ సమీపంలో వర్షాధారంగా నిర్మించిన మల్లూరు వాగు ప్రాజెక్ట్ను ఆధునికీకరించాల్సిన అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. -
ఫలితాలు మెరుగుపడాలి..!
[ 29-04-2024]
ఇటీవల వెలువడిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాల్లో జిల్లాలో వివిధ ప్రభుత్వ యాజమాన్య కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం అనుకున్నంతగా ఆశాజనకంగా లేదు. -
తండా ఒక్కటే ‘లోక్సభ’ నియోజకవర్గాలే వేరు
[ 29-04-2024]
ఒక పల్లె ప్రజలంతా పంచాయతీ, అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోవడం సాధారణం.
తాజా వార్తలు (Latest News)
-
ఇసుక అక్రమ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
-
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్