‘కడియం చేసిన ద్రోహం చరిత్రలో నిలుస్తుంది’
ఆదరించి ఎన్నో అవకాశాలు కల్పించిన భారాసకు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన ద్రోహం చరిత్రలో నిలిచిపోతుందని ఆ పార్టీ వరంగల్ లోక్సభ అభ్యర్థి డాక్టర్ మారేపల్లి సుధీర్కుమార్ అన్నారు.
మాట్లాడుతున్న మాజీ మంత్రి దయాకర్రావు, చిత్రంలో భారాస ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్, తదితరులు
దేవరుప్పుల రూరల్, న్యూస్టుడే: ఆదరించి ఎన్నో అవకాశాలు కల్పించిన భారాసకు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన ద్రోహం చరిత్రలో నిలిచిపోతుందని ఆ పార్టీ వరంగల్ లోక్సభ అభ్యర్థి డాక్టర్ మారేపల్లి సుధీర్కుమార్ అన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధ్యక్షతన మంగళవారం దేవరుప్పులలోని ఓ వేడుకల మందిరంలో నిర్వహించిన మండల నాయకుల విస్తృత స్థాయి సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని వీడడం తగదన్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచిన దయాకర్రావు వ్యక్తిత్వం ప్రతి రాజకీయ నాయకుడికి ఆదర్శమన్నారు. అవకాశం ఇచ్చి ఎంపీగా గెలిపిస్తే ఇక్కడి సమస్యలపై పార్లమెంటులో పోరాడుతానన్నారు. అనంతరం దయాకర్రావు మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగుసార్లు ఓడిన కడియంకి తనను విమర్శించే హక్కు లేదని విమర్శించారు. సుధీర్కుమార్ నీతి, నిజాయతీ కలిగిన వ్యక్తిత్వంతో పాటు తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలకంగా పనిచేశారన్నారు. ప్రజల్లో భాజపాకు క్యాడర్ లేదని, కాంగ్రెస్ పార్టీ విశ్వాసం కోల్పోయిందని విమర్శించారు. కేసీఆర్ మీద అభిమానం, కడియం శ్రీహరిపై పెరిగిన కోపం తమ గెలుపునకు దోహదపడుతాయని తెలిపారు. భారాస అభ్యర్థి గెలుపునకు పాటుపడాలని కార్యకర్తలను కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ బస్వ సావిత్రి, పార్టీ మండలాధ్యక్షుడు తీగల దయాకర్, జిల్లా యువజన నాయకులు సుందర్రాంరెడ్డి, ఏఎంసీ మాజీ ఛైర్మన్ కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి చింత రవి, బస్వ మల్లేశం, నరసింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హోటళ్లకు వినూత్న పేర్లు.. రుచుల విందు
[ 29-04-2024]
ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే భిన్నంగా ఆలోచించాలి.. రెస్టారెంట్ల వ్యాపారంలో దీనికి మరింత ప్రాధాన్యం ఉంటుంది. -
ఉద్యమ నేతను చూసి ఉప్పొంగిన ఆనందం
[ 29-04-2024]
గులాబీ దళపతి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్ర హనుమకొండ నగరంలో ఆదివారం విజయవంతమైంది. నక్కలగుట్టలో సాయంత్రం 4 గంటల నుంచి వరంగల్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో భారాస నేతలు, కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. -
విపణిలో ధర లేదు.. గిడ్డంగిలో జాగ లేదు!
[ 29-04-2024]
ఉమ్మడి వరంగల్వ్యాప్తంగా ఎర్ర బంగారం పండించిన రైతులు ఈసారి నష్టాల ఘాటులో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. -
ఓరుగల్లు ముద్ర ఉండాల్సిందే..!
[ 29-04-2024]
వారంతా ఇప్పుడు లోక్సభ పోరులో హోరాహోరీగా తలపడుతున్నారు. పార్లమెంటులో అడుగుపెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. -
భాజపాతోనే మాదిగలకు న్యాయం
[ 29-04-2024]
భాజపాతోనే మాదిగలకు న్యాయం జరుగుతుందని వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ పేర్కొన్నారు. -
బడుల మరమ్మతులకు సన్నద్ధం
[ 29-04-2024]
వచ్చే విద్యాసంవత్సరం ఆరంభం నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం సమాయత్తమైంది. -
నిధులు దూరం.. నిర్వహణ భారం
[ 29-04-2024]
జిల్లాలో రైతు వేదికల నిర్వహణ అధికారులకు భారమైంది. కొంత కాలంగా ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు నిలిచిపోయాయి. -
‘హామీల అమలును విస్మరించిన కాంగ్రెస్’
[ 29-04-2024]
అసెంబ్లీ ఎన్నికల్లో అనేక మోసపూరిత హామీలిచ్చి.. ఒకటి రెండే అమలు చేసి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని పెద్దపల్లి భారాస ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. -
నిప్పుల కుంపటి
[ 29-04-2024]
జిల్లాలో ఎండలవేడి నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఏప్రిల్ మొదటి వారం నుంచే ఎండలు తీవ్రమై రోజురోజుకు పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. -
17 నెలలు 17 కి.మీ!
[ 29-04-2024]
జాతీయ రహదారి 353సీˆ మన రాష్ట్రంలో భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం నుంచి మొదలై హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం గుడెప్పాడ్ వరకు 101 కిలోమీటర్లు సాగుతుంది. -
డంపర్లకు టైర్ల కొరత
[ 29-04-2024]
సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి కేంద్రాలైన ఉపరితల గనుల్లో నడిచే డంపర్లకు టైర్ల కొరత ఏర్పడింది. -
అటకెక్కిన ఆధునికీకరణ
[ 29-04-2024]
మంగపేట మండలం నర్సింహసాగర్ సమీపంలో వర్షాధారంగా నిర్మించిన మల్లూరు వాగు ప్రాజెక్ట్ను ఆధునికీకరించాల్సిన అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. -
ఫలితాలు మెరుగుపడాలి..!
[ 29-04-2024]
ఇటీవల వెలువడిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాల్లో జిల్లాలో వివిధ ప్రభుత్వ యాజమాన్య కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం అనుకున్నంతగా ఆశాజనకంగా లేదు. -
తండా ఒక్కటే ‘లోక్సభ’ నియోజకవర్గాలే వేరు
[ 29-04-2024]
ఒక పల్లె ప్రజలంతా పంచాయతీ, అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోవడం సాధారణం.
తాజా వార్తలు (Latest News)
-
ఇసుక అక్రమ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
-
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్