పాఠశాలల అభివృద్ధికి నిధులు
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పర్యవేక్షణలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు సర్కారు నిర్ణయించింది.
గొర్లవీడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల ముందు లేచిన బండరాళ్లు
భూపాలపల్లి, న్యూస్టుడే: అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పర్యవేక్షణలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు సర్కారు నిర్ణయించింది. పాఠశాల యాజమాన్యాల కమిటీల స్థానంలో ఇప్పటికే కమిటీలను నియమించిన విద్యాశాఖ ఇప్పుడు నిధులు సైతం విడుదల చేసింది. బడులు పునఃప్రారరంభమయ్యే నాటికి మరమ్మతులు పూర్తిచేయాలని ఆదేశించించడంతో క్షేత్రస్థాయిలో ఇంజినీర్లు పాఠశాలలను సందర్శించి ప్రతిపాదనలు తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు.
జిల్లా వ్యాప్తంగా 450 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు ఉండగా 420 బడుల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఎన్నుకున్నారు. ఇందులో 154 బడుల్లో మరమ్మతులు చేయాల్సి ఉందని గుర్తించి వీటిలో అభివృద్ధి, మరమ్మతు పనులకు రూ.5.83 కోట్లు అవసరమని ఇంజినీరింగ్ శాఖ అధికారులు తేల్చారు. ఏటా ప్రధానోపాధ్యాయులు యూడైస్-ప్లస్లో బడికి సంబంధించిన సౌకర్యాలు, అవసరాలపై నమోదు చేసిన వివరాల ఆధారంగా పనులు చేపట్టేందుకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులిచ్చింది.
అంచనాల తయారీలో నిమగ్నం
జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఇటీవలనే విద్యాశాఖ, ఇంజినీరింగ్ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి, యూడైస్ ప్లస్ వివరాలిచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఎన్ని నిధులు అవసరమో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎంపిక చేసిన పాఠశాలల్లో సౌకర్యాలు, మరమ్మతుల అంచనాల తయారీలో సంబంధిత అధికారులు నిమగ్నమయ్యారు. ఆయా పాఠశాలలను సందర్శించి మరుగుదొడ్లు, తాగునీరు, మైనర్, మేజర్ మరమ్మతులు, గదుల్లో విద్యుత్తు దీపాలు, బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్ల నిర్మాణాలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అంచనాలు తయారు చేస్తున్నారు. జూన్ 10 నాటికి ఈ పనులను పూర్తి చేసి రెండో దశలో ‘మన ఊరు మన బడి’ కింద ఎంపికైన పాఠశాలల్లో పెండింగ్ పనులు పూర్తి చేసేలా అదేశాలున్నాయి.
నాణ్యతగా పనులు చేపట్టేలా చర్యలు
- రాంకుమార్, డీఈవో. భూపాలపల్లి
ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతుల కల్పనకు సర్కారు నుంచి నిధులు వచ్చాయి. ఇప్పటికే జిల్లాలో అమ్మ ఆదర్శ కమిటీల నియామకం పూర్తయింది. ప్రస్తుతం మండలాల వారీగా పనులు గుర్తించడం, నిధులు కేటాయింపు పూర్తి కావస్తోంది. నాణ్యత ప్రమాణాలు పాటించేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, గడువులోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సభ విజయవంతం.. పార్టీ శ్రేణుల్లో ఆనందం
[ 01-05-2024]
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలో కాంగ్రెస్ నిర్వహించిన జనజాతర సభ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. భూపాలపల్లి, పరకాల ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, రేవూరి ప్రకాశ్ రెడ్డిలు సభా ఏర్పాట్లను దగ్గరుండి చూశారు. -
‘పది’లో సత్తా చాటారు
[ 01-05-2024]
రాష్ట్ర విద్యాశాఖ మంగళవారం ప్రకటించిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్రంలో గతేడాది 11వ స్థానం రాగా.. ఈసారి జిల్లాను 10వ స్థానంలో నిలిపారు. -
‘సాగునీరు అందించే బాధ్యత నాదే’
[ 01-05-2024]
భీమదేరపల్లి మండలంలోని పొలాలకు సాగునీరు అందించే బాధ్యత తనదని, మీ ఆశీర్వాదంతో కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీగా రాజేందర్రావును గెలిపించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
పదిలో నాలుగో స్థానం..!
[ 01-05-2024]
పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జనగామ జిల్లా మంచి ఫలితాలను సాధించింది. గతేడాదితో పోలిస్తే ఆరడుగులు ముందుకేసి రాష్ట్ర స్థాయిలో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. -
పదిలో 16వ స్థానం
[ 01-05-2024]
రాష్ట్ర విద్యా శాఖ అధికారులు మంగళవారం విడుదల చేసిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా 16వ స్థానాన్ని దక్కించుకుంది. గతేడాది రాష్ట్ర స్థాయిలో ఐదో స్థానం కైవసం చేసుకోగా ఈ ఏడాది గణనీయంగా పడిపోయింది.. -
పది మెట్లు పైకి..
[ 01-05-2024]
పదోతరగతి ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. జిల్లా 94.62 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 12వ స్థానంలో నిలిచింది. ఈ సంవత్సరం మార్చిలో జరిగిన వార్షిక పరీక్షల్లో 8178 మంది బాలబాలికలు పరీక్ష రాయగా 7,738 మంది ఉత్తీర్ణులయ్యారు. -
పదిలో 13వ స్థానం
[ 01-05-2024]
రాష్ట్ర విద్యా శాఖ మంగళవారం విడుదల చేసిన పదో తరగతి పరీక్షల ఫలితాల్లో జిల్లాకు 13వ స్థానం దక్కింది. 94.45 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత నమోదైంది. -
‘జిల్లా తరలింపు మాటలు నమ్మొద్దు’
[ 01-05-2024]
ములుగు జిల్లా తరలిపోతుందని ప్రతిపక్షాలు ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. అలాంటి మాటలు నమ్మకూడదన్నారు. -
ఎంజీఎం ఆసుపత్రి ఏడీ సరెండర్
[ 01-05-2024]
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీ) లక్ష్మిరాజంను మంగళవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ ప్రభుత్వానికి సరెండర్ చేశారు. -
యువతి ఆత్మహత్య.. ఖననం చేసిన ఆరు రోజులకు పోస్టుమార్టం
[ 01-05-2024]
యువతి ఆత్మహత్య చేసుకోగా.. ఆలస్యంగా గుర్తించిన పోలీసులు ఆరు రోజులకు పోసుమార్టం చేయించిన ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకొంది. కాజీపేట ఏసీపీ తిరుమల్ తెలిపిన వివరాల ప్రకారం.. -
రహదారి ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం
[ 01-05-2024]
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన తాడ్వాయి-పస్రా మధ్య మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
‘ఇన్నర్ రింగ్రోడ్డు’ భూ బాధితుల ఆందోళన
[ 01-05-2024]
ఖిలావరంగల్ పరిసర ప్రాంతాల మీదుగా నిర్మిస్తున్న అంతర వలయ రహదారి(ఇన్నర్ రింగ్ రోడ్డు) భూ బాధితులు మంగళవారం ఆందోళనకు దిగారు. -
వ్యాపారి అపహరణ కేసులో ఐదుగురి అరెస్టు
[ 01-05-2024]
హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన వ్యాపారి వలిపిరెడ్డి మధుసూదన్ను అపహరించిన కేసులో మంగళవారం ఐదుగురిని అరెస్టు చేసినట్లు, ఒకరు పరారీలో ఉన్నట్లు సీఐ రవిరాజు తెలిపారు. -
లోక్సభ ఎన్నికలకు భద్రత కట్టుదిట్టం
[ 01-05-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి సంబంధించి పోటీచేసే అభ్యర్థుల పేర్లు ఖరారు చేసి.. వారికి గుర్తులు కేటాయించినట్లు రిటర్నింగ్ అధికారి ప్రావీణ్య వెల్లడించారు. -
దుకాణాల్లో అధికారుల తనిఖీలు.. కేసుల నమోదు
[ 01-05-2024]
వరంగల్, హనుమకొండ జిల్లాల పరిధిలో పలు దుకాణాల్లో మంగళవారం జిల్లా ఇన్స్పెక్టర్ బి.ప్రవీణ్కుమార్ ఆధ్వర్యంలో తూనికలు, కొలతల అధికారులు తనిఖీలు చేపట్టి..
తాజా వార్తలు (Latest News)
-
మద్యం మత్తులో పైలట్.. విమానాన్ని నిలిపివేసిన ఎయిర్ లైన్స్
-
వరల్డ్ కప్ జట్టులోకి ఎంట్రీ.. సంజూ శాంసన్ ‘మలయాళం’ ట్వీట్ వైరల్
-
సల్మాన్ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటన.. కస్టడీలో నిందితుడి ఆత్మహత్య
-
మ్యూచువల్ ఫండ్ల కొత్త రూల్.. జాయింట్ ఖాతాలకు నామినీ తప్పనిసరేం కాదు!
-
బరిలో వాళ్లు.. బయట వీళ్లు... ఐపీఎల్లో ఈ కోచ్లు కి‘రాక్’
-
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10వేల కోట్లు