అన్నీ గాలి కబుర్లే..
ఏలూరుకు చెందిన వ్యక్తి ఈ పథకం ద్వారా 150 గజాల స్థలం తీసుకున్నారు. దీనికి 10 శాతం అంటే రూ. 1.40 లక్షలు చెల్లించారు. స్థలం అప్పగించకపోగా కట్టిన సొమ్ముకు సమాధానం చెప్పేవారు లేరు. అప్పు తెచ్చి చెల్లించిన సొమ్ముకు వడ్డీ కట్టలేక ఆ వ్యక్తి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు.
జగనన్న స్మార్ట్ టౌన్షిప్ల పేరిట బురిడీ
మధ్యతరగతి ఆశలపై నీళ్లు
- ఏలూరుకు చెందిన వ్యక్తి ఈ పథకం ద్వారా 150 గజాల స్థలం తీసుకున్నారు. దీనికి 10 శాతం అంటే రూ. 1.40 లక్షలు చెల్లించారు. స్థలం అప్పగించకపోగా కట్టిన సొమ్ముకు సమాధానం చెప్పేవారు లేరు. అప్పు తెచ్చి చెల్లించిన సొమ్ముకు వడ్డీ కట్టలేక ఆ వ్యక్తి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. మరో ప్రైవేటు ఉద్యోగి 200 గజాల స్థలానికి 10 శాతం సొమ్ము చెల్లించారు. లేఅవుట్ను సిద్ధం చేసిన తర్వాత జాగా అప్పగిస్తామంటూ అధికారులు కాలం వెళ్లదీశారు.
భీమవరం పట్టణం, ఆకివీడు, ఏలూరు టూటౌన్, న్యూస్Ãటుడే
- భీమవరం, తాడేపల్లిగూడెంలలో వేలాది మంది ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. ఎంఐజీ-1లో 150 గజాలు, ఎంఐజీ-2లో 200 గజాలు, ఎంఐజీ-3లో 240 గజాలు ఇస్తారని.. వీటిలో ఏది కావాలో చెప్పాలంటూ వాలంటీర్లు వివరాలు నమోదు చేసుకున్నారు. అంతటితోనే కథ ముగిసిపోయింది.
మధ్య తరగతి వర్గాల వారికి జగనన్న స్మార్ట్ టౌన్షిప్లలో తక్కువ ధరకే ఇంటి స్థలాలు ఇస్తాం. వీటిని అన్ని హంగులు, రహదారులు, సౌకర్యాలతో ప్రైవేటు లేఅవుట్లకు దీటుగా తీర్చిదిద్దుతాం అంటూ వైకాపా సర్కారు ప్రకటించింది. అసెంబ్లీ నియోజకవర్గానికో స్మార్ట్ టౌన్షిప్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి సంబంధిత వెబ్సైట్ను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో 2022లో సీఎం జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి ప్రారంభించారు. తొలిదశలో ఉమ్మడి జిల్లాలోని ఏలూరులోని లేఅవుట్కు శ్రీకారం చుట్టారు. రాబోయే రోజుల్లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికీ ఈ పథకాన్ని విస్తరిస్తామన్నారు. తర్వాత ఆ ఊసే మరిచారు. దరఖాస్తు చేసుకున్న వేలాది మంది ఆశలపై నీళ్లుచల్లారు.
మధ్య ఆదాయ వర్గాల(ఎంఐజీ) సొంతింటి కలను సాకారం చేసేలా మార్కెట్ ధరకంటే తక్కువకు స్థలం ఇస్తామని సర్కారు ఆర్భాటంగా ప్రకటించడంతో ఉమ్మడి జిల్లాలో 15,176 మంది దరఖాస్తుచేస్తున్నారు. ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో అత్యధికంగా 5,397 దరఖాస్తులు అందాయి. వీటికి 580 ఎకరాలు అవసరమని అధికారులు అంచనా వేయగా 36 ఎకరాలు మాత్రమే దొరికింది. దీనికి సంబంధించి 70 మంది నగదు చెల్లించగా వారికి ఇప్పటికీ స్థలాలు కేటాయించలేదు. మిగిలిన పట్టణాల్లో స్థలాల పరిశీలన తప్ప ఎక్కడా సెంటు భూమి కూడా కొనుగోలు చేయలేదు. ఈ పథకానికి సంబంధించి స్థలం సేకరించిన వెంటనే ప్లాట్లను కేటాయించేలా చర్యలు తీసుకున్నామని ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ ఛైర్మన్ సాయిశ్రీకాంత్ చెప్పారు.
- భీమవరం పట్టణ పరిధిలో 140 ఎకరాలను సేకరించాల్సి ఉండగా నర్సయ్యఅగ్రహారం ప్రాంతంలో 50 ఎకరాలను అధికారులు పరిశీలించారు. ఆ ప్రాంత రైతులను సమావేశపరిచి పథకం వివరాలు చెప్పారు. భూమి విక్రయిస్తే ప్రభుత్వం వెంటనే చెల్లిస్తుందో.. లేదోననే భయంతో రైతులు ముందుకురాలేదు. తణుకు, తాడేపల్లిగూడెంలలో అధికారులు పరిశీలించిన స్థలాలను ఈ పథకానికి కేటాయించవద్దంటూ అధికార పార్టీ నాయకులు ఒత్తిడి తేవడంతో ఆ ప్రక్రియ నిలిచింది. ఆకివీడు, జంగారెడ్డిగూడెం తదితర ప్రాంతాల్లో స్థల సేకరణకు కనీస ప్రయత్నాలు చేయలేదు. ఉమ్మడి జిల్లా పరిధిలో గ్రామీణ ప్రాంతాల్లో ఎకరం భూమి రూ.50 లక్షలపైన ఉంది. పట్టణపరిధిలో అయితే రూ.కోట్ల నుంచే ధర ప్రారంభమవుతుంది. అంత వ్యయం భరించలేమనుకున్న జగన్ సర్కారు ముందుగానే చేతులెత్తేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉద్యోగాలు కావాలంటే తెదేపా రావాలి
[ 06-05-2024]
‘జాబ్ క్యాలెండర్ పేరుచెప్పి జాబ్లెస్ క్యాలెండర్ ఇచ్చి యువతను జగన్ నిండా ముంచారు. వైకాపా పాలనకు యువతే చరమగీతం పాడాలి’ అంటూ తెదేపా నేత నారా లోకేశ్ పిలుపునిచ్చారు. ఏలూరులో ఆదివారం నిర్వహించిన యువగళం సభలో విద్యార్థులు, యువతతో ముఖాముఖీ నిర్వహించారు. -
జగన్ జమానాలో నిధులు దోచేసి... అభివృద్ధి ఆపేసి!
[ 06-05-2024]
దేశానికి పల్లెలు పట్టుగొమ్మలు... వైకాపా అధికారంలోకి వచ్చాక... ఆ పట్టుగొమ్మలపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గొడలిపోటు వేశారు. అయిదేళ్ల జగన్ జమానాలో గ్రామ పంచాయతీలు నిర్వీర్యమయ్యాయి. ఏటా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర సర్కారు దారి మళ్లించింది. -
జాగాలపై జగన్ మూకలు.. అయిదేళ్ల వైకాపా పాలనలో ఊరూరా ఆక్రమణలపర్వం
[ 06-05-2024]
‘జాగా కనిపిస్తే..పాగా వేసేయడమే’ అన్నట్లు జగన్ అనుచరగణం ఊరూరా చెలరేగిపోయింది. అయిదేళ్ల జమానాలో మమ్మల్ని ఎవర్రా ఆపేది అన్నట్లు ఆక్రమణల పర్వం సాగింది. ప్రజల సామూహిక అవసరాలకు వినియోగించాల్సిన స్థలాలు వైకాపా నేతల కబంధ హస్తాల్లోకి వెళ్లిపోయాయి. -
కక్ష సాధింపుల్లో.. అధినేతకు పెద్దన్న
[ 06-05-2024]
జిల్లాలో సంపన్న ప్రాంతంగా గుర్తింపు పొందిన కీలక కేంద్రమది. తొలి నుంచి ప్రశాంత వాతావరణానికి నిలయం. జాతరలైనా, పండుగలైనా లౌకికత గోచరిస్తుంది. ఇలాంటి ప్రాంతం వైకాపా జమానాలో అరాచక పాలనకు, కక్ష సాధింపులకు వేదికైంది. -
బటన్ నొక్కుడు.. వట్టిదేనా జగన్?
[ 06-05-2024]
‘మహిళల సంక్షేమమే నా లక్ష్యం.. అతివల ఆర్థిక స్వావలంబనే నా ధ్యేయం’ అంటూ సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ వేదికలపై ఉపన్యాసాలు ఇస్తుంటారు. అమలు చేసే విషయంలో మాత్రం ఆయనకు చిత్తశుద్ధి కొరవడింది. దీనికి నిదర్శనమే వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం. అగ్రవర్ణ పేద మహిళలకు ఆర్థిక సహాయం అందించేందుకు దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు. -
నీట్కు 43 మంది గైర్హాజరు
[ 06-05-2024]
జిల్లాలో ఆదివారం నిర్వహించిన నీట్ యూజీ ప్రవేశ పరీక్షకు 43 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 1361 మంది హాజరు కావాల్సి ఉండగా 1318 మంది హాజరయ్యారు. -
రంగులు మారలే... ప్రలోభాలు తగ్గలే!
[ 06-05-2024]
నరసాపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు పట్టణంలోని ఎండీయూ ఆపరేటర్. ఆయన నిత్యం ప్రజాప్రతినిధులతో సన్నిహితంగా ఉంటారు. ఎన్నికల ప్రచారంలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. -
చీకటి పాలన నుంచి త్వరలో విముక్తి : నారా రోహిత్
[ 06-05-2024]
అయిదేళ్ల చీకటి పాలన నుంచి త్వరలోనే విముక్తి పొందుతామని సినీ నటుడు నారా రోహిత్ అన్నారు. తెదేపా యువ నాయకుడు ఆరిమిల్లి నిఖిల్రత్న ఆధ్వర్యంలో స్థానిక భోగవల్లి బాపయ్య అన్నపూర్ణమ్మ కమ్మ కల్యాణ మండపంలో ఆదివారం రాత్రి నిర్వహించిన యువ గళం... -
తపాలా బ్యాలెట్ ఓటింగ్లో ఇంకా ఇబ్బందులు
[ 06-05-2024]
తపాలా బ్యాలెట్ వినియోగంలో ఉద్యోగులకు రెండో రోజూ స్వల్ప ఇబ్బందులు ఎదురయ్యాయి. శనివారం ఫెసిలిటేషన్ కేంద్రాలకు వెళ్లిన అనేక మంది ఉద్యోగులకు వారి ఓట్లు లేవని తెలుసుకుని తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. -
అసభ్యకర పోస్టింగులు పెడుతున్న వైకాపా సోషల్ మీడియా ఖాతాదారులపై కేసు
[ 06-05-2024]
ఓ తెదేపా మహిళా నాయకురాలిపై అసభ్యకరంగా పోస్టింగులు పెడుతున్న వైకాపా సోషల్ మీడియా ఖాతాదారులపై ఏలూరు టూటౌన్ పోలీసు స్టేషన్లో ఆదివారం రాత్రి కేసు నమోదైంది. -
తపాలా ఓట్ల కోసం పోటా పోటీ
[ 06-05-2024]
ప్రస్తుత ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకం కానుండటంతో తపాలా ఓట్లను దక్కించుకొనేందుకు రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. జిల్లాలో ఈ నెల 6, 7 తేదీల్లో తపాలా బ్యాలెట్ ఓటింగ్ జరగనుంది. -
ఇటు భోజనాలు... అటు సొమ్ములు
[ 06-05-2024]
పోలింగ్ తేదీ సమీపిస్తున్న తరుణంలో గ్రామాల్లో అధికార పార్టీ ప్రలోభాలకు తెరలేపింది. సామాన్య ప్రజలతోపాటు వివిధ వర్గాలను ప్రభావితం చేసేలా చిరుదోగ్యులపై దృష్టి సారించింది.