జగన్.. ఇదేనా జాతీయ ప్రమాణాల వైద్యం?
‘పేదలు వైద్యం పొందే ప్రభుత్వ ఆసుపత్రులను జాతీయ ప్రమాణాలకు దీటుగా తీర్చిదిద్దుతాం. నాడు-నేడులో భాగంగా పీహెచ్సీల నుంచి బోధనాసుపత్రుల వరకు అన్నింటినీ మూడేళ్లలో మార్చేస్తాం’ అంటూ నాలుగేళ్ల క్రితం సీఎం జగన్ బాకాలూదారు.
ప్రాంతీయ, సామాజిక ఆసుపత్రుల్లో అరకొర సౌకర్యాలు
సమయపాలన పాటించని వైద్యులు, సిబ్బంది
కానరాని స్కానింగ్, భోజన సదుపాయాలు
అయిదేళ్లుగా పూర్తికాని ఆసుపత్రుల భవనాల నిర్మాణాలు
‘పేదలు వైద్యం పొందే ప్రభుత్వ ఆసుపత్రులను జాతీయ ప్రమాణాలకు దీటుగా తీర్చిదిద్దుతాం. నాడు-నేడులో భాగంగా పీహెచ్సీల నుంచి బోధనాసుపత్రుల వరకు అన్నింటినీ మూడేళ్లలో మార్చేస్తాం’ అంటూ నాలుగేళ్ల క్రితం సీఎం జగన్ బాకాలూదారు. ఏళ్లు గడుస్తున్నా ఆసుపత్రులు బాగుపడకపోగా ప్రమాణాలు మరింత దిగజారిపోయాయి.
ఏలూరు జిల్లాలోని మూడు ప్రాంతీయ, అయిదు సామాజిక ఆరోగ్య కేంద్రాలను బుధవారం ‘న్యూస్టుడే’ బృందం పరిశీలించగా అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయి. వైద్యుల సమయపాలన మొదలు..కొత్త భవనాల నిర్మాణ పురోగతి.. భోజన సదుపాయాలు.. ఇలా ప్రతి అంశంలోనూ వైకాపా ప్రభుత్వ వైఫల్యాలు వెక్కిరిస్తున్నాయి.
ఈనాడు, ఏలూరు, న్యూస్టుడే, బృందం
కైకలూరు నిత్యం ప్రసవ వేదనే..
కైకలూరు సీహెచ్సీకి 150 మంది వరకు గర్భిణులు వస్తుంటారు. ఇక్కడ యంత్రం లేక ఏలూరు, గుడివాడ, భీమవరం, విజయవాడలో ప్రైవేటు ల్యాబుల్లో స్కానింగ్ తీయించాలని రిఫర్ చేస్తున్నారు. దీంతో ఒక్కసారి స్కానింగ్ తీయించాలంటే అన్ని ఖర్చులు కలిపి రూ.2 వేల నుంచి 3వేల వరకు ఖర్చవుతోందని గర్భిణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవిలో గుంతల రోడ్లలో 30 కిమీ వెళ్లి భీమవరంలో స్కానింగ్ తీయించుకోవాలంటే ప్రసవ వేదన అనుభవిస్తున్నామని కైకలూరుకు చెందిన రాజకుమారి అనే గర్భిణి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ మరో ప్రసూతి వైద్యురాలి అవసరం ఉంది. చింతలపూడిలో సైతం గర్భిణులకు స్కానింగ్ అందుబాటులో లేదు. ఏలూరులోని ప్రైవేటు ఆసుపత్రికి వైద్యులు రిఫర్ చేస్తున్నారు.
జంగారెడ్డిగూడెంలో ఉదయం 9.30 గంటలైనా ఖాళీగా ఉన్న వైద్యుల గది
జంగారెడ్డిగూడెం
సమయపాలనతో పని లేదు.. జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రిలో బుధవారం ఉదయం 9కి ఓపీ ప్రారంభం కావాల్సి ఉండగా 9.30 వరకు వైద్యులు సిబ్బంది రాలేదు. 10 గంటల వరకు వస్తూనే ఉన్నారు. రాత్రి డ్యూటీ చేసిన వైద్యులు మరుసటి రోజు ఓపీలో ఉండటం లేదు. రోగులు గంటల తరబడి నిరీక్షించక తప్పడం లేదు. 10 గంటల వరకు ఎక్స్రే కేంద్రం తెరవలేదు. ఇలా ప్రతి ఆసుపత్రిలో సమయపాలన సమస్య ఉంది. వైద్యులు వస్తే సిబ్బంది రారు. సిబ్బంది ఉంటే ఓపీ విభాగం తెరవరు.
అన్నం కూడా పెట్టలేరా..
పోలవరం ఆసుపత్రిలో గుత్తేదారు రెండు పూటలా భోజనం పెడుతున్నా..ఉదయం అల్పాహారం సరఫరా చేయడం లేదు. రోగులు ప్రశ్నిస్తే బయట కొనుక్కోమని ఉచిత సలహా ఇస్తున్నారు. భీమడోలులో భోజనం పెట్టేందుకు అసలు గుత్తేదారు ఎంపికే జరగలేదు. దీంతో ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందే వారు సొంత డబ్బులతో బయట కొనుగోలు చేస్తున్నారు. కైకలూరులో మూడేళ్లుగా రోగులకు ఆహారం అందటం లేదు. గుత్తేదారుకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. గర్భిణులు, సాధారణ ఇన్ పేషంట్లు ఆహారం కోసం అవస్థలు పడుతున్నారు.
పోలవరం
పోలవరంలో రూ.5.16 కోట్లతో నిర్మిస్తున్న 30 పడకల ఆసుపత్రి భవన నిర్మాణం నాలుగేళ్లుగా నత్తనడకన సాగుతోంది. దాంతో పాత భవనంలోని ఒకే గదిలో ముగ్గురు వైద్యులు సేవలు అందిస్తున్నారు. అదే గదిలోనే పలురకాల పరికరాలు, శీతల యంత్రాలు ఉండటంతో రోగులు, వైద్యులు, సిబ్బంది నిత్యం యాతన అనుభవిస్తున్నారు. రోగులందరినీ ఇలా ఒకే గదిలో ఉంచాల్సిన పరిస్థితి.
చింతలపూడి లో ఆసుపత్రి అంబులెన్స్ పరిస్థితి ఇది. రిఫరల్ కేసులకు రూ.వేలు ఖర్చు పెట్టుకుని ప్రైవేటు అంబులెన్స్లను ఆశ్రయించాల్సి వస్తోంది.
‘మంగళవారం ఎక్స్రే తీశారు. రిపోర్టు ఈ రోజు ఇస్తానంటే వచ్చా’అని అంకాలగూడెం గ్రామానికి చెందిన ముప్పిడి నాగరత్నం తెలిపారు. జంగారెడ్డిగూడెంలో ఎక్స్రే గది 10 గంటల వరకు తెరవకపోవడంతో అక్కడే నిరీక్షించారు. ఈ ఆసుపత్రిలో ఎక్స్రే విభాగానికి రెగ్యులర్ సిబ్బంది లేరు. డిప్యుటేషన్లపై నెట్టుకొస్తున్నారు.
నూజివీడు
రంగులపైనే శ్రద్ధ.. నూజివీడు ఆసుపత్రి నిర్మాణం పూర్తి కాకుండానే ఎన్నికల నియమావళి వస్తుందని హడావుడిగా ప్రారంభించారు. ఆసుపత్రి పాత భవనంలోనే కొనసాగుతోంది. ప్రారంభోత్సవాలు చేయడానికి..భవనానికి వైకాపా రంగులు వేయడంలో చూపిస్తున్న శ్రద్ధ నిర్మాణం పూర్తి చేయడటంలో మాత్రం కానరావటం లేదన్న విమర్శలున్నాయి.
కళ్లు చూపించుకోవాలంటే డాక్టర్ లేరు.. కన్ను సరిగా కనిపిచడం లేదు. కళ్ల దురదలు ఎక్కువగా వస్తున్నాయి. ఆసుపత్రిలో చూపించుకుందామని వస్తే డాక్టర్ లేరు. పరీక్షించకుండానే కళ్లల్లో వేసుకునే చుక్కల మందు, బిళ్లలు ఇచ్చారు. ఏలూరు వెళ్లి చూపించుకుందామనుకుంటున్నా.
డీ.వెంకటేశ్వరరావు, పట్టాయిగూడెం
ప్రైవేటుగా చేయిస్తున్నా.. నా భార్య మేరీకి మధుమేహంతో కాలు ఇన్ఫెక్షన్కు గురైంది. బుట్టాయగూడెం ఆసుపత్రిలో రసాయనాలు లేక రక్తపరీక్షలు బయట చేయించాలన్నారు. దీంతో ప్రైవేటుగా వైద్యం చేయిస్తున్నా. పది రోజులకు సుమారు రూ.6 వేలకు పైగా ఖర్చైంది. ఇక్కడ కేవలం కట్టు కట్టిస్తున్నా.
ఉండ్రాజవరపు పెంటయ్య, బుట్టాయగూడెం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. మేమేం చేశాం పాపం?
[ 04-05-2024]
జగన్ సర్కారు అక్కసుతో పింఛనుదారుల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. అగ్నిగుండంలాంటి ఎండలో పింఛను కోసం వారు పడిన వేదన వర్ణనాతీతం. -
మీ గెండెల్లో ధైర్యం నింపడానికి వచ్చా
[ 04-05-2024]
కొల్లేరు సమస్య పరిష్కారానికి కేంద్ర సాయంతో కృషి చేస్తామని జనసేన అధినేత పవన్కల్యాణ్ హామీ ఇచ్చారు. శుక్రవారం కైకలూరులో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. -
ఎగవేత.. లేదంటే కోత
[ 04-05-2024]
రైతే రాజన్నది నానుడి. అయిదేళ్ల కాలంలో జగనన్న వారినీ వదల్లేదు. తన మార్కు చర్యలతో కర్షకులను అన్ని విధాలా కష్టపెట్టారు. అయితే వ్యవసాయ రాయితీల ఎగవేత.. లేదంటే కోతలతో అన్నదాతలకు నష్టాలను మూట కట్టారు. -
హక్కు చట్టంతో.. ఆస్తులకు కాళ్లొస్తాయ్!
[ 04-05-2024]
దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయనివిధంగా... ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కొత్త చట్టాలు తీసుకొస్తున్నారు. తాజాగా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చేందుకు కుట్ర చేస్తున్నారు. -
జగన్ సిద్ధం.. జనానికి నరకం
[ 04-05-2024]
ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి శుక్రవారం నరసాపురంలో నిర్వహించిన సిద్ధం సభ.. జనానికి నరకం చూపింది. -
వైకాపా తెచ్చిన ‘ల్యాండ్ టైటిలింగ్’ అమలైతే సామాన్యులకు తీవ్ర నష్టం
[ 04-05-2024]
భూ హక్కు(ల్యాండ్ టైటిలింగ్) పేరిట వైకాపా సర్కారు తెచ్చిన చట్టం అమలులోకి వస్తే సొంత భూములపై హక్కు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని భీమవరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంవీ రమణరావు స్పష్టం చేశారు. -
పథకాల ఊకదంపుడే.. ప్రగతి ఊసేలేదు
[ 04-05-2024]
ఇరవై నిమిషాల ప్రసంగంలో జిల్లా ప్రగతి గురించి.. అయిదేళ్లలో చేసిన అభివృద్ధిపై..ఒక్క మాట కూడా మాట్లాడలేదు. -
నేడు నూజివీడులో చంద్రబాబు సభ
[ 04-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నూజివీడులో తెదేపా అధినేత చంద్రబాబు నిర్వహించే సభకు ఏర్పాట్లు చేశారు. -
నిర్వాసితుల్ని ఆదుకుంటాం
[ 04-05-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరం నియోజకవర్గాన్ని చిర్రి బాలరాజుతో కలిసి అభివృద్ధి చేస్తామని ఎన్డీయే ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ అన్నారు. -
తపాలా ఓటు వేయనిస్తారా.. లేదా?
[ 04-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు తపాలా బ్యాలెట్ సదుపాయాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. -
కల్యాణం.. రమణీయం
[ 04-05-2024]
ద్వారకాతిరుమల శ్రీవారి ఉపాలయం లక్ష్మీపురం వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం శుక్రవారం రాత్రి కనుల పండువగా నిర్వహించారు. -
వాటా ఇవ్వరు..జమ చేయరు!
[ 04-05-2024]
అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు చేస్తామంటూ ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి ఇచ్చి.... అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచిపోయారు. -
కూటమి ప్రభంజనం తథ్యం
[ 04-05-2024]
వచ్చే ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం తథ్యమని ఉండి శాసనసభ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
కార్మికులకు భరోసా
[ 04-05-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమి గెలుపుతోనే అన్ని సామాజిక వర్గాల అభివృద్ధి సాధ్యమని కూటమి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. -
బాలుడి అనుమానాస్పద మృత
[ 04-05-2024]
ఇటీవల విడుదలైన పది ఫలితాల్లో 549 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచిన ఓ బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన శుక్రవారం నూజివీడులో చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
డబ్బు తీసుకొని ఉద్యోగం ఇవ్వండి.. పని నచ్చకుంటే సొమ్ము మీకే!
-
అఫ్గాన్ దౌత్యవేత్త బంగారం స్మగ్లింగ్.. కేసు నమోదు
-
డేవిడ్ వార్నర్.. 70 శాతం ఇండియన్ - 30 శాతం ఆస్ట్రేలియన్: జేక్ ఫ్రేజర్
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
-
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు